పోస్ట్‌లు

నవంబర్ 27, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కన్నీటి పర్యంతమైన కుమార

చిత్రం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమార స్వామి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తన దుఃఖాన్ని ఆపు కోలేక పోయారు. తన భావోద్వేగాలను ఆపుకోలేక పోవడం ఇదే మొదటిసారి కాదు. చాలా సార్లు ఆయన ఏడుపును నిలువరించలేక పోతున్నారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కన్నడ నాట వైరల్ గా మారారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.  వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి బీఎల్‌ దేవరాజ్‌ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడి పోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపు కోలేక పోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లే...

పదవుల పంపకం షురూ

చిత్రం
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహారాష్ట్ర వికాస్‌ అఘాడి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవుల పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్‌ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర వికాస్‌ అఘాడి శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా శివాజీ పార్క్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కే...

సుప్రియా..వారెవ్వా

చిత్రం
మరాఠాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వచ్చిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. నెలకొన్న అనిశ్చితి తొలగి పోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా మహా పొలిటికల్‌ ఎపిసోడ్‌ థిల్లర్‌ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్‌ పవార్‌ సెంటిమెంట్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో మహా వికాస్‌ కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్‌ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మహా పర్వంలో పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. ఎన్సీపీని చీల్చడానికి సోదరుడు అజిత్‌ పవార్‌ ప్రయత్నించినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల కంటే బంధాలే ముఖ్యమని నచ్చ జెప్పి అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకు రావడంతో సుప్రియ చూపిన చాక చాక్యాన్ని మెచ్చు కోక తప్పదు. అంతే కాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా చూసు కోవడంలోనూ ఆమె ప్రదర్శించిన హుందాతనం ప్రశంసనీయం. ఎమ్మెల్యే లందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఐక్యతను నూరి పోశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రత్...

అజిత్ కు అమిత్ ఝలక్

చిత్రం
ఎన్సీపీలో తిరుగుబాటు తెచ్చి బీజేపీతో జట్టు కట్టి.. ఆదరా బాదరాగా ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అజిత్‌ పవార్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను సాకుగా చూపి బీజేపీ అజిత్‌ను తమ వైపు తిప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. అజిత్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఈ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 70  వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్‌ కేసులో అజిత్‌ పవార్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీకి మద్దతు నిచ్చినందుకు ప్రతిఫలంగా ఆయనను కేసుల నుంచి విముక్తి కల్పించినట్టు ఆరోపణలు కూడా గుప్పు మన్నాయి. అజిత్‌పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, శరద్‌ పవార్‌ చాణక్యం ముందు ఫడ్నవిస్‌ ప్రభుత్వం, నిలదొక్కు కోలేక పోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేక పోవడం, పవార్‌ కుటుంబ సభ్యులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేయడం...

ఫ్యాన్స్ కోసం సంగీతోత్సవం

చిత్రం
బిగ్ బాస్ - 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ సరికొత్త ప్రోగ్రాం కు తెరతీశారు. మాటీవీలో బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరొందిన బిగ్ బాస్ ను సక్సెస్ చేయడమే కాకుండా తనకు మంచి పాపులారిటీ వచ్చేలా చేసినందుకు, వారికి గుర్తుగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ వెల్లడించారు. కొండాపూర్‌లోని సౌండ్‌ గార్డెన్‌ కేఫ్‌లో ‘లైవ్‌ కన్సర్ట్‌’ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. 29న పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్‌ బాస్‌–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్‌ మ్యాన్‌ను అన్నారు. సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక, 2013 నుంచి మ్యూజిక్ వీడియోస్‌ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్న మొన్న గుర్తింపు వచ్చిందన్నారు. సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్‌కు చెందిన ఓ సింగర్‌ సొంత పాటలు సోలోగా పాడ బోతున్నాడని తెలిపారు. టాలెంట్‌ సిం...