పోస్ట్‌లు

అక్టోబర్ 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జగన్ ను కలిసిన వంశీ

చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారి పోతున్నాయి. ఏపీలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి హవాను తట్టుకుని నిలబడిన తెలుగుదేశం పార్టీ నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. గతంలో తాను దివంగత పరిటాల రవీంద్ర అనుచరుడినని పలుమార్లు చెప్పారు కూడా. కృష్ణా జిల్లాలో వంశీ పంచాయితీలు చేస్తారని, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తుంటారని, అవసరమైతే బెదిరింపులకు దిగుతారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన పార్టీ వీడుతారన్న ప్రచారం జరిగింది. తాజాగా వల్లభనేని వంశీ ఇటీవల బీజేపీలో చేరిన సుజనా చౌదరిని కలిశారు. అనంతరమే ఆయన నేరుగా జగన్ వద్దకు వెళ్లారు. అక్కడ మంత్రులు పేర్ని నాని, కోడలి నానీలతో కలిసి జగన్ తో భేటీ అయ్యారు. అయితే వ్యక్తిగతంగా దాదాపు అరగంట కు పైగా చర్చించారు. తన నియోజక వర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయమని మాత్రమే అడిగానని ఈ సందర్బంగా వంశీ చెప్పారు. కాగా వంశీ పార్టీ మారుతారన్న పుకార్లు షికారు చేసాయి. ఇటీవల టీడీపీకీ వంశీ దూరంగా ఉన్నారు. అంతకు ముందు వైసీపీ నేతలు తమ ఓటమిని తట్టుకోలేక వంశీపై కేసులు నమోదు చేయించారు. దీనిపై వల్లభనేని వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారితేనే భవిష్యత్...

పర్యాటకుల కోసం దుబాయి సన్నద్ధం

చిత్రం
ప్రపంచంలో దుబాయికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసింది అక్కడి  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం. అంతే కాకుండా పర్యాటకుల కోసం వసతి, సౌకర్యాలను కల్పిస్తోంది. అంతే కాకుండా తాజాగా దుబాయి ఫెస్టివల్ ను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ట్రావెలర్స్ కు దుబాయి స్వర్గ ధామంగా ఉంటోంది. ఇటీవల పర్యాటకులు ఎక్కువగా ఈ అందమైన సిటీని ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో అరబ్ కంట్రీకి గణనీయమైన రీతిలో ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు అక్కడి సర్కార్ బంపర్ ఆఫర్స్ కూడా ఇస్తోంది. దీంతో ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున దుబాయి ఫెస్టివల్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. మరో వైపు పర్యాటకులు పెరగడంతో అక్కడి విమానయాన రంగానికి కూడా ఆదాయం సమకూరుతోంది. ఈసారి 24వ దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. 29న దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనుంది. గ్లోబల్‌ విలేజ్‌ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పర్యాటకులను ఆకర్షించడానికి 3,500 షాపింగ్‌ ఔట్‌ లెట్స్‌ను ఏర్పాటు చేశారు. కేవలం ట్రావెలర్స్ కోసం ప్రతి ఏటా దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. పర్...

పండుగ వేళ జియో బంపర్ అఫర్

చిత్రం
దీపావళి పండుగ వేళ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో సారి కస్టమర్లును ఆకర్షించే పనిలో పడ్డది. నిన్నటి దాకా ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించింది. రీఛార్జ్ చేసుకునే  వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కల్పించే పనిలో పడ్డది. ఇందులో భాగంగా రీఛార్జ్ తో పాటు ఆల్‌ వన్‌ ప్లాన్‌ పేరుతో ఇప్పటికే అమలు చేసింది. ఆ తర్వాత దానిని నిలిపి వేశారు. తిరిగి ఇదే ప్లాన్ ను జియో రిలయన్స్ కంపెనీ పునరుద్ధరించింది. కస్టమర్లను ఆకట్టు కునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇదే వ్యూహాన్ని జియో స్మార్ట్ ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది. తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ జియో ఫోన్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. 75  రూపాయలు,125,185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో వరుసగా నెలకు త్రీ జీబీ  రోజుకు 0.1 జీబీ, 14జీబీ, రోజుకు 0.5 జీబీ, 28 జీబీ రోజుకు 1 జీబీ, 56 జీబీ రోజుకు 2జీబీ డేటాలను అందిస్తుంది. అంతే కాదు ఉచిత 500 నిమిషాల నాన్ జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది. అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్...

అనైతిక విజయం ఇది - కేసీఆర్ పై దాసుజు ఫైర్

చిత్రం
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన, తెలంగాణ సమాజం మొత్తం ఆమోదించినట్టు కాదని గుర్తు పెట్టు కోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సముద్రంలో అలలు ఉన్నట్టు ఆటుపోట్లు సహజం. ఓటమిని స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అపజయాన్ని స్వీకరిస్తోందని చెప్పారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు బాగున్నట్టు కాదు. నిన్న ముఖ్యమంత్రి చాలా అహంకార పూరితంగా, అప్రజస్వామికంగా మాట్లాడారు. హుజూర్ నగర్ గెలుపుపై మాట్లాడుతున్నాని చెప్పిన సీఎం 90 శాతానికి పైగా ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, విపక్షాలపై నోరు పారేసుకున్నారు. హక్కులు కాలరాస్తామని, ప్రతిపక్షాలు తమ పంథా మార్చు కోవాలని అన్నారు. సంతలో గొడ్లను కొనుగోలు చేసినట్లు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేశారు. ప్రజలను ప్రభావితం చేశారు. అత్యంత భాద్యతా రాహిత్యంతో, గెలుపు అహంభావంతో కేసీఆర్ మాట్లాడారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కా...

ఓటర్లకు వందనం..ప్రజా తీర్పు శిరోధార్యం

చిత్రం
తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను అని డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన అన్న డీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. దీంతో డీఎంకేలో కొంత నిరాశ అలుముకుంది. దీనిని పటాపంచలు చేస్తూ స్టాలిన్ కార్యకర్తలు, నాయకుల్లో స్తైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రజా తీర్పును మేం గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మామూలే. గెలుపు ఓటములు సహజమే. అయితే ఇదే ఫలితం 2021లో వుండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు జరిగిన నాంగునేరి, విక్రవాండి నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఓటేసిన ఓటర్లు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అధికారపార్టీ ధనబలం, అధికార దుష్ప్రయోగం వల్లే గెలిచింది. పలు ఆటంకాలు ఎదురైనా వాటిని చేధించి డీఎంకే కూటమికి ప్రజలు ఓటేశారు. ప్రజా తీర్పు భగవంతుడి తీర్పు అని అన్నాదురై చెప్పే వారు. ఆ క్రమంలో ప్రస్తుతం ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాం. గెలిస్తే ఉప్పొంగి పోవడం, ఓడితే నిరాశ చె...

కేసీఆర్‌కు మేధావుల లేఖాస్త్రం

చిత్రం
తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. వీరి న్యాయపరమైన డిమాండ్లను సానుభూతితో పరిష్కారించాలని అన్ని విపక్షాలు, విద్యార్ధి, మహిళా సంఘాలతో పాటు సకల జనులు మద్దతు పలికారు. ఈ విషయంపై రాష్ట్ర ధర్మాసనం స్పందించింది. వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, యుద్ధ ప్రాతిపదికన సమస్య మరింత జఠిలం కాకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆదేశించింది. అంతే కాకుండా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ప్రజాగ్రహం వస్తే ప్రమాదమని గ్రహించాలని, ఎంత పెద్ద సమస్య అయినా కూర్చుని చర్చలు జరిపితే పరిష్కారం అవుతాయని తెలిపింది. కార్మికులు చేస్తున్న సమ్మె ధర్మ బద్దమైనదే. కాక పోతే పండుగ సమయంలో చేయడం భావ్యం కాదంటూ పేర్కొంది. కార్మికుల సమ్మెకు తాజాగా మేధావులు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు తమ సంతకాలతో కూడిన లేఖను విడుదల చేశారు.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, సమ్మె విరమింప జేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యవర్తిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ఎవరూ చొరవ ప్రదర్శించక పోవడమే కారణంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవ...

సాల్వ్ చేయడంలో దాదా దిట్ట

చిత్రం
బిసిసిఐ ప్రెసిడెంట్ గా బెంగాలీ దాదా సౌరబ్ గంగూలీ ఛార్జ్ తీసుకున్నాక మార్పులు మొదలయ్యాయి. బిసిసిఐకి పాలక వర్గం కూడా కొలువు తీరింది. బంగ్లాదేశ్ తో జరిగే తీ 20 , టెస్టు మ్యాచులకు సంబంధించి టీమిండియా జట్లను క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తో కలిసి ప్రకటించాడు దాదా. ఇందులో ప్రసాద్ తో పాటు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. మరో వైపు మాజీ క్రికెటర్స్ గంగూలీని పొగిడితే, తాజగా వారి జాబితాలోకి చేరి పోయాడు సీఓఏ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌. రెండేళ్ల కిందట..అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కోహ్లీ మధ్య విభేదాలు భారత క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపాయి. అయితే 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం జంబో తన పదవికి రాజీనామా చేయడంతో వివాదం సమసింది. కుంబ్లే, కోహ్లీ విభేదాలను నాటి క్రికెట్‌ పాలక కమిటీ సైతం పరిష్కరించ లేక పోయింది. అయితే సౌరవ్‌ గంగూలీ కనుక అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి వుంటే ఆ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించే వాడని రద్దయిన సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. కుంబ్లే, కోహ్లీ మధ్య వివాదాన్ని సరిగ్గా పరిష్కరించ లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ వివాదం కనుక నేడు...

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ప్రిన్స్ యాడ్

చిత్రం
తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు ఏది చేసినా, ఏది మాట్లాడినా అది క్షణాల్లోపే వైరల్ అవుతోంది. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చురుకుగా ఉంటున్నారు. ప్రతి దానిపై స్పందిస్తున్నారు. తెర మీద హీరోగా చెలామణి అవుతున్న ఈ హీరో రియల్ లైఫ్ లో కూడా తాను అసలైన హీరో నని ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తో అటు తెలంగాణాలో ఇటు ఆంధ్రాలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడ ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఆర్ధిక సహాయం చేస్తున్నారు ప్రిన్స్. అయితే ఒక్కో సినిమాకు భారీ ఎత్తున ఫీజు వసూలు చేసే ఈ హీరో ఇప్పుడున్న నటుల కంటే ఎక్కువగా యాడ్స్ లలో కూడా నటిస్తున్నాడు. ఎప్పుడైనా దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే నానుడిని మహేష్ అండ్ ఆయన భార్య నమ్రతలు వర్కవుట్ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు ప్రయివేట్ యాడ్స్ తో చేతినిండా వెనకేసుకుంటున్నాడు మహేష్ బాబు. బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరిచాయి. కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ దుమ్ము రేపాయి. భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ శివకు ఊహించని రీతిలో కారు గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రిన్స్...