ఈ దారుణం..అధికారుల వైఫల్యం

దిశ అత్యాచారం, హత్య ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని సమాజ్వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ ఆరోపించారు. ఈ ఘటన జరిగిన సమీప ప్రాంతంలోనే మరో ఘటన కూడా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వాలే కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై రాజ్యసభ చర్చ జరిగింది. ఈ క్రమంలో చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడారు. ఈ కేసులోని నిందితులను ప్రజల్లోకి తీసుకువచ్చి, మూక దాడి చేసి చంపేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నేరస్తులకు విదేశాల్లో ప్రజలే శిక్ష వేస్తారు అని పేర్కొన్నారు. నిర్భయ, కథువా, హైదరాబాద్ వంటి ఘటనల్లో ప్రభుత్వాలు ఎలా విచారణ జరిపాయి. బాధితులకు ఏం న్యాయం చేశాయో చెప్పాలి. ఇక హైదరాబాద్లో దిశ ఘటనకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అధికారులు ఏం చేస్తున్నారు. నిందితులతో పాటు వైఫల్యం చెందిన అధికారుల పేర్లు బహిర్గతం చేయాలి. పరువు తీయాలి. ఈ ఘటనతో మొత్తం పరువు పోయింది అని మండిపడ్డారు. కాగా తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కేసులో ఏ-1 ముద్దాయిగా మహమ్మద్...