పోస్ట్‌లు

జనవరి 2, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆందోళనలు..అసంతృప్తులు

చిత్రం
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ అసంతృప్తులను ఆగ్రహానికి గురి చేస్తోంది. మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రలుగా అవకాశం లభిస్తుందనుకున్న పలువురు సీనియర్లకు మొండి చేయి ఎదురైంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులైన తరువాత అసంతృప్తులు ఒక్కొకరూ బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతీ షిండేకు స్థానం కల్పించక పోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మద్దతుదారులు షోలాపూర్‌ కాంగ్రెస్‌ భవనం ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, వివిధ రీజియన్‌లకు చెందిన పదాధికారులు పాల్గొన్నారు. సీనియర్ నేత సుశీల్‌ కుమార్‌ షిండే కుమార్తె ప్రణతీ షిండే షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. దీంతో కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని ఆమె భావించారు. ఈ మేరకు మద్దతుదారులకూ భరోసా ఇచ్చారు. మహా వికాస్‌ ఆఘాడి మంత్రి వర్గ విస్తరణలో తనను చిన్న చూపు చూశారని, ఇప్పటికైనా నాయకులు మనసు మార్చుకుని స్థానం కల్పించాలని ఆ...

దిగ్గజ కంపెనీలకు ఝలక్

చిత్రం
భారతీయ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు షాకిస్తూ మరో సంస్థను ప్రారంభించింది. రిలయన్స్‌ జియోతో  దూసుకు పోయిన అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. జియో మార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు. దేశ్ కి నయీ దుకాన్‌ అనే  ట్యాగ్‌లైన్‌ తో జియో మార్ట్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. అంతే కాదు తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగదారులకు ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్‌ ఇపుడు జియో మార్ట్‌ ద్వారా మరోసారి విధ్వంసానికి తెరతీసింది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి 3 వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ పొందవచ్చు. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లో నవీ ముంబై, థానే, కళ్యాణ్‌ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో వుంటాయి. త్వరలోనే దేశ వ్యాప్తంగా విస్తరించనుంద...

మౌలిక రంగానికే ప్రయారిటీ

చిత్రం
కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు అన్ని రంగాలకు ఊతం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్ధిక రంగం పూర్తిగా కునారిల్లి పోయింది. ఈ మేరకు ఆర్తి వెసలుబాటు, తోడ్పాటు కల్పించేందుకు గాను బృహత్తర ప్రణాలికను విత్త మంత్రి విడుదల చేశారు. మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో 102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై, అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి 102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్‌ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు. మరో 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంప...

టీసీఎస్‌కు భారీ షాక్

చిత్రం
ఐటీ సెక్టార్ లో దిగ్గజ కంపెనీగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - టీసీఎస్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా క్యూ - 2 ఫలితాలు అంచనాలు తలకిందులయ్యాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరంభంలో 400 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ టీసీఎస్‌ షేరు టాప్‌ లూజర్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందు కోలేక పోవడంతో టీసీఎస్‌ షేర్లు 4 శాతం క్షీణించాయి. అటు కీలక సూచీలు కూడా ట్రేడర్ల అమ్మకాలతో భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి స్వల్ప లాభాలతో తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందు కోలేక పోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం 7,901 కోట్లు. ఇక జూలై, సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి 36,854 కోట్ల నుంచి 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4 శాతంగా నమోదైంద...

ఆర్ధిక ఇబ్బందుల్లో అవసరమా

చిత్రం
ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. ఈ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమున్నది. కొత్త సచివాలయం ఇప్పుడే నిర్మించాలనే నిర్ణయం తాత్కాలికంగా విరమించుకుంటే కొంత మేరకైనా ప్రజాధనం మిగిల్చిన వాళ్లవుతారు. జనహితం అంటున్నారు. నూతన కట్టడం వల్ల కొన్నేళ్లు పడుతుంది. దీనిపై ఖర్చు పెట్టడంతో ఏమైనా ఆదాయం సమకూరుతుందా, అంటే అదీ లేదు. ఇలాంటప్పుడు ఇప్పటికిప్పుడు కట్టడాన్ని వాయిదా వేస్తేనే బాగుంటుందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలిస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి. ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే, ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా. వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలక ఫైళ్లకు కాళ్లు వస్తే పరిస్థితి ఏమిటి అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఇదే అంశంపై మంత్రివర్గం 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం చూస్తే అంతా గందర గోళంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావి తరాలకు సరిపడేలా ఉన్నత స్థాయి నిర్మాణం చేయడమే కొత్త సచివాలయ ఉద్దేశం అని ఒక చోట ఉంది. పాత సచివాలయాని...

మనలోని మహానుభావుడు చిన్నజీయర్

చిత్రం
జీవితం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడే కావాల్సిన వాళ్ళు, అయినవాళ్లు గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుందని చిన్న ఆశ. ఇదే మనుషుల్ని నడిపిస్తోంది. ఇందుకే ఈ లోకంలో అంతులేని ప్రశ్నలు. జవాబులు దొరకని సన్నివేశాలు..ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లి పోవాలని అనుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ఒక బతుక్కి కావాల్సినంత కరెన్సీ ఉన్నా, అంతులేని సంపద మూలుగుతున్నా, తరాలకు సరిపడా బ్యాంక్ బ్యాలెన్సులున్నా, అంతులేని ఆస్తులు మాటగట్టుకున్నా, చెంతనే చెలిమి తోడున్నా చెప్పుకునేందుకు నా అన్న మనుషులు లేకుండా పోవడం ఎంత బాధాకరం. లోకాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తోందన్న నమ్మకమే, ఆశగా మారి అద్భుతమైన ఆవిష్కరణలకు చోదక శక్తిగా మారింది. కొందరు దానిని ప్రారబ్ధం అంటే మరికొందరు అదృష్టంగా సరిపుచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో నిరంతర శ్రమ తో నే ఈ ప్రపంచం మొత్తం అభివృద్ధి అనే అడుగుల వైపు ప్రయాణం చేస్తోంది. వేలాది మంది ఈ లోకం పోకడ గూర్చి పరిశోధించారు. అంతులేని దారుల్లో ప్రయాణం చేశారు. ఆ అడుగులు కోట్లాది ప్రజలను ఒకే చోటుకు చేర్చేలా చేశాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. విత్తు ముందా లేక చెట్టు ముందా అన్న...

కస్టమర్స్ కోసం కొత్త ప్లాన్

చిత్రం
టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ వినియోగదారులకు వరంగా మారుతోంది. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొట్టిన దెబ్బకు ఠారెత్తాయి. ఇదే క్రమంలో భారత అత్యున్నత న్యాయ స్థానం కోలుకోలేని షాక్ ఇచ్చింది. లక్షన్నర కోట్లకు పైగా చెల్లించాలంటూ సంచలన తీర్పు చెప్పింది. ఈ మొత్తం డబ్బులను మూడు నెలల లోపు క్లోజ్ చేయాలనీ ఆదేశించింది. దీంతో వోడాఫోన్, జియో, ఎయిర్ టెల్ కంపెనీలు పెద్ద ఎత్తున బాకీ పడ్డాయి. ఇప్పటికే టెలికం సెక్టార్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఎయిర్ టెల్ కు జీవిత కాలం గుర్తు పెట్టుకునేలా దెబ్బ కొట్టింది రిలయన్స్ గ్రూప్ కంపెనీ. అపరిమితమైన డేటా, టారిఫ్ ప్లాన్స్ టెలికం కస్టమర్స్ కు అనుగుణంగా ఉండేలా చేసింది. ఇతర టెలికాం కంపెనీల నుండి వినియోగదారులు ఒకే ఒక్క రోజులు రిలయన్స్ జియో కు మారారు. దేశ వ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు జియోకు ఏకంగా 35 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన కంపెనీగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇతర కంపెనీలన్నీ దివాళా అంచున నిలబడ్డాయి. ఇంకో వైపు భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తమ వినియోగదారు...

భగ్గుమన్న విభేదాలు..రాజశేఖర్ రాజీనామా

చిత్రం
మూవీ ఆర్టిస్ట్‌ అసిసోయేషన్‌లో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి, రాజశేఖర్‌ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్‌కు రాజశేఖర్‌ అడ్డుపడ్డటం, రాజశేఖర్‌ తీరును చిరంజీవి, మోహన్‌బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్‌ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్‌ వర్గంతో తమకున్న విభేదాలను తమలో తాము పరిష్కరించు కుంటామని ఆమె చెప్పారు. ప్రతి చోట గొడవలు రావడం సహజ మేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్‌కు చాలా టైమ్‌ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్‌బాబు లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఫీల్‌ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవ ప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని జీవిత స్పష్టం చేశారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కు కానీ వ్యక్తి...

టీమిండియాదే టీ20

చిత్రం
తాను టెస్టు ఫార్మాట్‌లో నెల కొల్పిన 400 పరుగుల రికార్డు ఏదో ఒక రోజు బ్రేక్‌ అవడం ఖాయమని వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత తరంలో పలువురు క్రికెటర్లు దూకుడుగా ఆడుతుండటంతో పాటు నిలకడగా ఆడుతున్న కారణంగా తన రికార్డు బద్ధలు కొడతారన్నాడు. తన రికార్డును బ్రేక్‌ చేసే వారిలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉందన్నాడు. ఇక ఆసీస్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌కు తన రికార్డును బద్ధలు కొట్టే సత్తా ఉందన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన రికార్డును వారి పేరిట లిఖించు కోవడానికి ఎంతో సమయం పట్టదన్నాడు. వీరిలో వార్నర్‌, రోహిత్‌లు ఓపెనర్లే కాకుండా హిట్టర్లు కూడా కావడంతో వారు క్రీజ్‌లో సుదీర్ఘ సమయం నిల దొక్కుకుంటే తన రికార్డును సునాయాసంగానే బద్ధలు కొడతారన్నాడు. కోహ్లి ఎక్కువగా ఫస్ట్‌ డౌన్‌లో రావడంతో అతనికి కూడా చాన్స్‌ ఉందన్నాడు. కాక పోతే స్టీవ్‌ స్మిత్‌కు మాత్రం తన రికార్డును బ్రేక్‌ చేయడం సాధ్యం కాక పోవచ్చన్నాడు. అతను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే కారణంగా 400 పరుగుల్ని చేరు కోవడం కష్టమన్నాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టె...

వాహనాలు అంతంత మాత్రం

చిత్రం
కోట్లాది రూపాయలతో తయారు చేసిన వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగానే అమ్ముడు పోయాయి. మారుతీ కంపెనీకి చెందిన కార్లు సేల్స్ పరంగా కొద్దిగా పెరిగాయి. అయితే హ్యుండాయ్, టయోటా అమ్మకాలు ఆఫర్లను అధికంగా ఇచ్చినప్పటికీ ఆశించినంతగా అమ్ముడు పోలేదు. ఇండియా మార్కెట్‌‌లో అతి పెద్ద కార్ల కంపెనీగా పేరున్న మారుతి సుజుకీ అమ్మకాలు 2.4 శాతం పెరగగా, మహింద్రా అండ్‌‌ మహింద్రా అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. 2019 డిసెంబర్‌‌‌‌లో తమ కార్ల అమ్మకాలు 2.4 శాతం పెరిగాయని మారుతి సుజుకీ ఎక్స్చేంజ్‌‌ ఫైలింగ్‌‌లో తెలిపింది. కంపెనీ 1,24,375 వాహనాలను విక్రయించగా, ఇదే 2018లో కంపెనీ 1,21,479 వెహికిల్స్‌‌ను అమ్మింది. కంపెనీ సేల్స్‌‌ మొత్తంగా 3.9 శాతం పెరిగి 1,33,296 వెహికిల్స్‌‌గా ఉన్నాయి. మారుతి సుజుకీ ఆల్టో సేల్స్‌‌ 13.6 శాతం పడిపోయి 23,883 వాహనాలుగా నమోదయ్యాయి. అయినప్పటికి న్యూ వేగన్‌‌ ఆర్‌‌‌‌, స్విఫ్ట్‌‌, సెలరియో, డిజైర్‌‌‌‌ వంటి కాంపాక్ట్‌‌ కార్ల అమ్మకాలు పెరిగి 65,673 యూనిట్లకు చేరుకున్నాయి. మిడ్‌‌సైజ్ సియాజ్‌‌ సేల్స్ 62.3 శాతం పడిపోయి 1,786 వాహనాలుగా ఉన్నాయి. గతేడాదే ఇండియా మార్కెట్‌‌ లోకి అడుగు పెట్టిన ఎంజీ మోటర్స్...