పోస్ట్‌లు

అక్టోబర్ 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈ కోర్సులు చేస్తే చాలు డబ్బులే డబ్బులు

చిత్రం
కాలం చెల్లిన కోర్సుల వైపు ఇప్పుడు స్టూడెంట్స్ చూడటం లేదు. లైఫ్ లో త్వరగా సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ప్రపంచంలో వేలాదిగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సటీస్ కు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్ లైన్ లో తమకు నచ్చిన కోర్సులు నేర్చుకునే సదుపాయం ఉన్నది. దీంతో విద్యార్థులు, పెద్దలు, ఉద్యోగస్తులు తమకు కావాల్సిన, తమకు నచ్చిన కోర్సులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకునే వీలుంది. దీంతో ప్రభుత్వం కూడా అందుకు తగినట్టు కోర్సులను రూపొందిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న భారీ మార్పులతో ఇప్పుడు చదువుకోవడం చాలా సులభంగా మారింది. ఇటీవల ఐఐటీ లు కూడా అం లైన్ బాట పట్టాయి. వీటి ద్వారా నేర్చుకునే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , బిజినెస్ అనలిటిక్స్ , సైబర్ సెక్యూరిటీ , రోబోమెట్రిక్స్, డిజిటల్ మార్కెటింగ్ , డిజిటల్ టెక్నాలజీ, ఎథికల్ హ్యాకింగ్, తదితర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. వీటిపై కొంచెం కాన్సెన్ట్రేషన్ చేస్తే చాలు లక్షలలో వేతనాలు పొందవచ్చు. ఇక ఇండియాతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, సింగపూర్ , దుబాయ్, సౌ...

వేటు తప్పదు ..సమ్మె ఆగదు

చిత్రం
తెలంగాణాలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు విధుల్లోకి రాక పోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్సితిథి కొలిక్కి రాక పోవడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర పోలీసు శాఖతో పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థ, మెట్రో సర్వీసులను, ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు, రైళ్లు నడిపారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. అయినా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 56 వేల మంది కార్మికులు, సిబ్బంది అంతా మూకుమ్మడిగా సమ్మెలో పాల్గొన్నారు. మొదటి రోజు విధుల్లోకి చేరలేదు. రెండో రోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలతో కలిసి బతుకమ్మలు ఆడారు. సీఎం కేసీఆర్ కరుణించాలని కోరారు. ఆర్టీసీ సంస్థ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డెడ్ లైన్ విధించారు. అయినా కార్మికులు ఒప్పుకోలేదు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే దాకా విధుల్లోకి చేరబోమంటూ స్పష్టం చేశారు. అంతకు ముందు సీఎం ముగ్గురితో కమిటీ వేసినా ఫలితం లేక పోయింది. దానిని కూడా రద్దు చేశారు. కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం మాత్ర...

తెలంగాణం పూలవనం..వెల్లివిరిసిన మహిళా చైతన్యం

చిత్రం
తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ ఉత్సవం సద్దుల బతుకమ్మతో ముగిసింది. తెలంగాణ మొత్తం పూలవనంలా మారి పోయింది. లక్షలాది మంది మహిళలు బతుకమ్మలతో ఈ పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగాయి. భారీగా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్దులు సద్దుల బతుకమ్మలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా పూలతో నిండి పోయాయి. కొన్ని రోజుల పాటు అద్వితీయమైన రీతిలో పండుగను చేసుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలలో అంతటా బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. పోయి రావమ్మా... పోయిరా... వచ్చే సారి మళ్లీ రావమ్మా అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మను సాగ నంపారు. ఆనందోత్సవాలు, భక్తిశ్రద్ధలతో పూజించిన గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. అమావాస్యతో ప్రారంభమై  వైభవంగా సాగిన పండుగలో చివరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వర్షం పలుసార్లు ఆటంకం కల్పించినా మహిళలు తరగని ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొనడం విశేషం. జంటనగరాలు, రాష్ట్రం నలు మూలల నుంచి తరలి వచ్చిన ద...

నో కాంప్రమైజ్ - తేల్చి చెప్పిన కేసీఆర్

చిత్రం
నిన్నటి దాకా డెడ్ లైన్ ముగియడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఎదురు చూసిన ఆర్టీసీ కార్మికులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సిబ్బందిని తీసుకోబోమని స్పష్టం చేశారు. యూనియన్ నాయకులతో, సిబ్బందితో ఎలాంటి చర్చలు ఉండబోవన్నారు. ప్రగతి భావం లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. మిగతా వాహనాలు ఆర్టీసీకి చెందినవారి ఉంటాయి. ఇదే పద్దతిలో బస్సులు నడిపితే కొంత మేరకు నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. తిరిగి సంస్థ నష్టాల నుండి గట్టెక్కే వీలు కుదురుతుంది. బెంగాల్ , కేరళ , భారతీయ జనతా పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాలలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోబోమంటూ తేల్చి చెప్పారు. ఇప్పుడు గొంతు చించుకుంటున్న విపక్ష పార్టీలకు అడిగే హక్కు లేదన్నారు. కార్మికులు సమ్మెకు దిగడం చట్ట విరుద్ధం. పండుగ వేళ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేయడం భావ్యం కాదన్నారు. ప్రజలంతా ఆర్టీసీ సిబ్...

టాలీవుడ్ లో తెలంగాణోళ్ల హల్ చల్

చిత్రం
టాలివుడ్ లో ఒకప్పుడు తెలంగాణ అంటేనే చీదరింపులు ఉండేవి. ఇక్కడి వాళ్లకు నటన రాదనీ, వీళ్లకు ఎలా మాట్లాడాలో తెలీదని, అసలు వీళ్ళు నటనకే పనికి రారంటూ విపరీతమైన కామెంట్స్ తో పాటు వివక్ష, వేధింపులు ఎక్కువగా సాగాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత దాకా ఈ ఆధిపత్య ధోరణి కొనసాగుతూ వచ్చింది. ఇదే కొన్నేళ్లు, కొన్ని తరాల పాటు నడిచింది. ఎప్పుడైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో అప్పటి నుంచి నేటి దాకా ప్రచురణ, ప్రసార మాధ్యమాలు కొంత మేర తగ్గాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో టాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోలు, నిర్మాతలు, ఇతర సినీ టెక్నీషియన్స్ మాటల్లో కొంత మార్పు కనిపించింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన వాళ్ళు దర్శకులుగా, గేయ రచయితలుగా, కమెడియన్లుగా, నటులుగా, సంగీత దర్శకులుగా దుమ్ము రేపుతున్నారు. తమ సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు. మారుతున్న టెక్నలాజిని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. నితిన్, విజయ్ దేవరకొండ హీరోలుగా పాపులర్ కాగా వెన్నెల కోశోర్ ఇప్పటికే టాప్ రేంజ్ లో ఉన్నారు. మల్లేశం సినిమాతో ఖమ్మం జిల్లా సత్త...

సఫారీలపై ఇండియా సవారి

చిత్రం
టీమిండియా సౌత్ ఆఫ్రికాపై మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించింది. వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను మన ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కుప్ప కూలింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధించింది. ప్రపంచ కప్పులో ఘోరంగా వైఫల్యం చెందిన టీమిండియా వెస్ట్ ఇండీస్ టూర్ లో దుమ్ము రేపింది. స్వదేశం లో సఫారీలతో అన్ని ఫార్మాట్ లలో రాణిస్తోంది. ఏడాది తర్వాత ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. వర్షం అడ్డంకి ఏర్పడినా ఎట్టకేలకు గెలుపు ఇండియా వశమైంది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 191 పరుగులకే చేతులెత్తేసింది. 204 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసి మైదానంలోకి దిగిన సఫారీలు టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేక పోయారు. మ్యాచ్ స్టార్ట్ అయిన రెండవ ఓవర్ లోనే దిబ్రుయిన్ ను అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్ లో మహమ్మద్ షమీ బావుమాను పెవిలియన్ కు పంపించాడు. డుప్లెసిస్, డికాక్ లను కూడా షమీ అద్భుతమైన బంతులతో అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కష్ట...

తేజస్ జర్నీ స్టార్ట్ .. సౌకర్యాలు అదుర్స్

చిత్రం
ఇప్పటి దాకా రైల్వే అంటేనే ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించే గొప్ప సంస్థ. లక్షలాది మంది ఈ రైల్వే డిపార్ట్ మెంట్ లో రేయింబవళ్లు అలుపెరుగకుండా విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరాక శరవేగంగా డెసిషన్స్ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. కోట్లాది రూపాయలు ప్రతి రోజు రైల్వేకు సమకూరుతున్నాయి. మెలమెల్లగా రైల్వేలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే రైల్వే కార్మిక సంఘాల నేతలు, కార్మికులు అభ్యంతరం చెప్పారు. వారి డిమాండ్లను పట్టించుకోలేదు. ప్రయివేట్ ట్రైన్స్ 150 ని ప్రవేశ పెట్టాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా 2400 ప్రైవేట్ రైళ్లలో కోచులు ఉండబోతున్నాయి. ఒకవేళ తిరిగే ట్రైన్స్ టైంకు రాకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. తాజాగా దేశం లోనే మొదటి సారిగా ఉత్తర ప్రదేశ్ లో తేజస్ ప్రైవేట్ రైలును ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ప్రారంభించారు. సీఎం జెండా ఊపి స్టార్ట్ చేశారు. కేవలం ఆరు గంటల్లోనే లక్నో నుంచి ఢిల్లీ నగరానికి ఈ రైలు ద్వార...

ఎట్టకేలకు రవిప్రకాష్ అరెస్ట్

చిత్రం
చట్టం ముందు అందరూ సమానులే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఉప్పెనలా, సునామీలా దూసుకు వచ్చిన రవిప్రకాష్ ఇప్పుడు అనూహ్యంగా చంచలగూడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జర్నలిస్ట్ గా, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ గా, సీఇఓ గా ఇలా ప్రతి ఫార్మాట్ లో సక్సెస్ అయ్యారు. టీవీ-9 అంటేనే రవిప్రకాష్ . రవిప్రకాష్ అంటేనే టీవీ 9 అనే స్థాయికి తీసుకు వచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో ఈ ఛానల్ ను సక్సెస్ చేశాడు. ఈ 24 న్యూస్ ఛానల్ ఎలా నడుస్తుందని అనుకున్నారు అప్పట్లో. అంతా విస్తు పోయారు కూడా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ టీవీ -9 కొద్దీ కాలంలోనే టాప్ వన్ పొజిషన్ లోకి చేరుకుంది. న్యూస్ ప్రజెంటేషన్ లో ..స్టోరీస్ మేకింగ్ లోను ..టీవీ క్లారిటీ, క్వాలిటీ లో కూడా టీవీ -9 తన దరిదాపుల్లోకి రాకుండా చేసుకుంది. మెలమెల్లగా మిగతా న్యూస్ ఛానల్స్ కూడా వచ్చి చేరాయి. ఈటివి, ఏబీఎన్, టీవీ 5 , సాక్షి, ఎన్ టీవీ , 10 టీవీ , ఎక్స్ ప్రెస్ టీవీ, ఐ న్యూస్ , 99 టీవీ , టీ న్యూస్ , జీ 24 గంటలు తదితర ఛానల్స్ పుట్టుకు వచ్చాయి. దీనికంతటికి రవిప్రకాష్ స్ఫూర్తి. ఎవరు కాదన్నా ఇది నిజం. ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా దోపిడీకి , వ...