షాకిచ్చిన ఎయిరిండియా

భారతీయ విమానయాన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని, ఒక బ్రాండ్ ను స్వంతం చేసుకుని, విశిష్టమైన సేవలు అందించి ప్రయాణీకుల మన్ననలు పొందిన ఎయిరిండియా విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. ఇప్పటికే దివాళా తీసేందుకు రెడీగా ఉంది ఈ సంస్థ. రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు తెరలేపింది. ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు తమ సేవలను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమకు భారీగా బకాయి పడ్డ సంస్థలకు ఇకపై అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వ బోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 10 లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది.

బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్‌ స్టమ్స్ కమిషనర్‌ ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిరిండియా టికెట్లు కొనుగోలు ద్వారా  వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఎయిరిండియాకు రావాల్సిన  మొత్తం బకాయిల విలువ దాదాపు 268 కోట్లు పైగా రావాల్సి ఉన్నది. గత నెలలోఎయిరిండియా ఆర్థిక విభాగం ప్రభుత్వ సంస్థల బకాయిలపై ఒక డేటాను రూపొందించింది. ఈ నేపథ్యంలో 10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారిని క్యాష్ అండ్ క్యారీ ద్వారా టికెట్లు జారీ చేయాలని డిసిషన్ తీసుకుంది.

లోక్‌సభ సహా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు మాత్రమే కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ క్రమంలో గత కొన్ని వారాల్లో సుమారు 50 కోట్లను రికవరీ చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇంకా కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ నుంచి 5.4 కోట్లు, సీబీఐ 95  లక్షలు, ఈడీ 12.8 లక్షలు, లోక్‌సభ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఎస్‌ఏకు 2.2 కోట్లు మేర ఎయిరిండియాకు బాకీ పడ్డాయి. బకాయీలన్నీ ఒకవేళ వసూలయితే కొంత మేర సంస్థకు వెసులుబాటు కలుగుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!