ఎడిటర్స్ ఛాయిస్ - మారణహోమాన్ని ఆపలేమా ..?
మానవత్వం తల్లడిల్లిన సమయం ఇది. సభ్య సమాజం తలొంచు కోవాల్సిన పరిస్థితి. అత్యంత దారుణమైన సంఘటన ఇది. కన్నీళ్లు ఉబికి వస్తున్న వేళ..ఎన్ని శాంతి ప్రవచనాలు పలికినా జరగాల్సిన దారుణం జరిగి పోయింది. ఘోరమే మిగిలింది. ఉగ్రవాదం పెచ్చరిల్లి పోయినా..ఆయా దేశాల మధ్య సరిహద్దులు చెరిగి పోయినా ఇంకా ఉగ్ర మూకలు తమ దాడులు ఆపడం లేదు. ఇది ముమ్మాటికి ఏలిన వారు..ప్రస్తుత పాలకులే బాధ్యత వహించాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని అనుకోవడానికి వీలు లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర మూకలు ప్రతి చోటా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిని గుర్తించడం అన్నది కష్టంగా మారింది. కోట్లాది రూపాయలు శాంతి భద్రతల కోసం ఖర్చు చేస్తున్నాయి ఆయా దేశాలు . అయినా ఉగ్రవాదం సమసి పోవడం లేదు. ఎక్కడ చూసినా ఏదో రూపకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి ఆయా దేశాల పోలీసులు.
ఓ వైపు బాంబుల మోత..ఇంకో వైపు రాకెట్ల దాడులు..ఇంకో వైపు అణుబాంబుల ప్రయోగాలు..ఇలా ఎక్కడికక్కడ ఆధిపత్యం కోసం అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. కోట్లాది ప్రజలు సగానికి పైగా తిండి దొరక్క నానా తంటాలు పడుతుంటే..తాగేందు నీళ్లు లేక అవస్థలు పడుతుంటే..ఆక్టోపస్ లాగా ఉగ్ర వాదులు పేట్రేగి పోతున్నారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. శాంతికి ప్రతిరూపంగా భావించే గౌతమ బుద్ధుడు నడయాడిన నేల..శ్రీలంకలో ఇపుడు దారుణ మారణ హోమం చోటు చేసుకున్నది. చర్చీలు, హోటళ్లను టార్గెట్ చేశారు. అదీ ఈస్టర్ ..పవిత్రమైన రోజుగా భావించే సమయంలో అదును చూసి దెబ్బ కొట్టారు. ఎల్టీటీఈ సాగించిన మారణ కాండ ప్రపంచాన్ని హడలెత్తించింది. ప్రభాకరన్ తమిళ దేశం కావాలంటూ గెరిల్లా పోరాటం చేశాడు. ఆ సమయంలో శ్రీలంక ఏదో ఒకరోజు దాడులకు గురైంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
యువతీ యువకులు విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. చివరకు ప్రభాకరన్కు మద్ధతుగా వైగో తమిళనాడులో భారీ ప్రదర్శన చేపట్టారు. నార్వే లంక..ప్రభాకరన్ ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేసింది. అయినా మార్పు రాలేదు. శ్రీలంక ప్రభాకరన్ను ఇండియా పోలీసుల సాయంతో మట్టుబెట్టింది. ఏకంగా ఇపుడు ఎల్ టిటి ఇ ఒక జ్ఞాపకంగా మిగిలి పోయింది. కానీ ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ ప్రభాకరన్ అంటే గొప్ప నాయకుడిగానే తమిళులు భావిస్తారు..ఆరాధిస్తారు. బాల్యంలోనే మార్స్, చేగువేరా..లను ఆరాధించాడు. పుస్తకాలను చదివాడు. జ్ఞానం సంపాదించాడు. కానీ తుపాకికి తుపాకితోనే సమాధానం చెప్పాలన్నాడు. ప్రపంచంలో చేగువేరా తర్వాత ప్యారలల్గా ఓ ప్రభుత్వాన్నే నడిపించాడు ప్రభాకరన్. చావుకు వెనుకాడలేదు. వెను తిరగలేదు. ఎప్పుడూ భయపడలేదు. ఆత్మాహుతి దళాలను ..లెక్కలేనంత ఆయుధ సంపత్తిని పోగు చేసి..తనకంటూ ఓ భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత అతడిదే.
ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ప్రభాకరన్ను స్మరించుకుంటూనే ఉంటారు. అంతలా ప్రభావితం చేశాడు..ఈ గెరిల్లా యోధుడు. తీవ్రవాదం సమసి పోయిందని అనుకున్న సమయంలో శ్రీలంక ఒక్కసారిగా ఉలికి పడింది. 200 మందికి పైగా కొలంబో కేంద్రంగా ఉగ్రవాదులు సాగించిన మారణకాండ సభ్య సమాజం తలొంచుకునేలా చేసింది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు, దేశాలు, అధినేతలు, మానవతావాదులు తీవ్రంగా ఖండించారు. నగరం రక్తమోడింది. కోట్లాది ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. క్షతగాత్రులు ఎక్కువయ్యారు. ఇదంతా పాలకులదే పాపం. ప్రజలు మేలుకోవాలి. వాళ్లు మేలుకోక పోతే..ఈ ప్రపంచం మారదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి