మోదీ అద్భుతం..ఆలోచనలు ఆచరణీయం
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై ప్రపంచ మంతటా ప్రసంశలు కురుస్తున్నాయి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు పలు అంశాలు, సమస్యలపై చర్చించారు. మోదీ ఆలోచనలు అద్భుతం అని అభిజిత్ ప్రసంశలతో ముంచెత్తారు.ప్రధాన మంత్రి భారత దేశం గురించి ఆలోచిస్తున్న తీరు అద్వితీయమని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. మోదీతో సమావేశ మైనందుకు చాలా సంతోషంగా ఉందని అభిజిత్ పేర్కొన్నారు.
పీఎం తనతో మాట్లాడటానికి చాలా సమయం కేటాయించారన్నారు. అపూర్వమైన భారత దేశం గురించి తన ఆలోచనా తీరును ఆయన వివరించారని చెప్పారు. విధానాల గురించి వినేవాళ్ళు ఉంటారని, కానీ వాటి వెనుక ఉన్న ఆలోచనల గురించి వినేవాళ్ళు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ప్రధానంగా పరిపాలన గురించి మాట్లాడారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఉండే అపనమ్మకం పరిపాలనపై ఎలా పడుతుందో వివరించారని తెలిపారు. కాబట్టి పరిపాలన ప్రక్రియపై ఉన్నత వర్గాల నియంత్రణ వ్యవస్థలను సృష్టిస్తుందని, బాధ్యతా యుతమైన ప్రభుత్వాన్ని కాదని తెలిపారు.
ఈ ప్రక్రియలో తాను బ్యూరోక్రసీని ఏ విధంగా సంస్కరించేందుకు, మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదీ మోదీ వివరించారని వెల్లడించారు. అనంతరం మోదీ ఓ ట్వీట్లో బెనర్జీతో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బెనర్జీ సాధించిన విజయాలపట్ల భారత దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆర్థికవేత్తలు సైతం విస్తుపోయేలా చేస్తున్నారు ప్రధాని మోదీ. ఎంతైనా మోడీనా మజాకా. ఇతరులు విస్తు పోయేలా చేయడంలో మోదీ తర్వాతే ఎవ్వరైనా కదూ.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి