లోకల్ పాలనకే పవర్స్ .. అధికారాల బదలాయింపు..త్వరలో ఖాళీల భర్తీ..!

పల్లెల్లో పాలనకు పూర్తి పవర్స్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . అంతే కాకుండా అధికారాల బదలాయింపు పూర్తిగా అప్పగిస్తామని పేర్కొన్నారు . నిధులు మంజూరు, పోస్టుల కుదింపు , విధులు , బాధ్యతలు కూడా తేల్చుతామని స్పష్టం చేసారు . గ్రామ పంచాయతీలు , జిల్లా పరిషత్ లు , మండల పరిషత్ లు నామ్ కె వాస్తేగా ఉన్నాయని, , వాటిని ప్రక్షాళన చేస్తే  కానీ పాలన గాడిన పడదని అందుకే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏయే పోస్టుల్లో ఎవరెవరు ఉండాలి , వారికి ఎలాంటి భాద్యతలు ఉండాలో కూడా నిర్ణయమిస్తామని తెలిపారు . 

కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ చట్టం వల్ల గ్రామాలు , మండలాలు , జిల్లా పరిషత్ లు మరింత బలోపేతం అవుతాయని కేసీఆర్ చెప్పారు .దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తి పారదర్శకత ఉండటం వల్ల పని చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేవో చూసేందుకు మానిటరింగ్ వ్యవస్థ  చూసుకుంటుందన్నారు. ఈ మేరకు 60 రోజుల పాటు కొత్తగా కార్యాచరణ ప్రణాలికను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల ఆయా గ్రామాలలో దశల వారీగా వీటి అమలుకు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అమలు పర్యేక్షణ ఉంటుందని దీని వల్ల ఎలాంటి అక్రమాలకు తావుండదన్నారు . 

దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు ముందు గానే దిశా నిర్దేశం చేస్తామన్నారు. పంచాతీరాజ్ శాఖలో ఇప్పటి దాకా భర్తీ కానీ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని వెల్లడించారు . త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు . ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది . అధికారాల బదిలీ అనేది త్వరలోనే జరుగుతుంది . సహాయ మంత్రి హోదా కలిగిన జీడీపీ చైర్మన్ పనీ పాటా లేకుండా ఉండటం సరికాదు . త్వరలోనే కేంద్రం నుండి ఆర్ధిక నిధులు వస్తాయి . ఇప్పటికైనా ఎలాంటి ఖాళీలు ఉండొద్దని , ఇక ఆనకట్టలు, పంపు హౌస్ లకు దేవతల పేర్లు పెడతామన్నారు . మొత్తం మీద పవర్స్ తో పాటు నిధులు కూడా రానుండడంతో భవిష్యత్తు బాగుంటుందని స్థానిక సంస్థల నేతలు ఊహల్లో తేలిపోతున్నారు . 

కామెంట్‌లు