మహా రగడ..షాపై రౌత్ ఫైర్

మహారాష్ట్రలో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కానేలేదు. అప్పుడే ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పటికే బీజేపీ సర్కారులో మంత్రి పదవికి శివ సేన పార్టీ వైదొలిగింది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య జరిగిన ఒప్పందంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అసత్యాలు చెబుతున్నారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచు కోవాలనే శివసేన డిమాండ్‌ పట్ల అమిత్‌ షా అవాస్తవాలు మాట్లాడు తున్నారని దుయ్య బట్టారు.

రొటేషనల్‌ సీఎం అంశంపై అమిత్‌ షా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియ కుండా దాగుడు మూతలు ఆడారని మండి పడ్డారు రౌత్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని చెప్పడం ప్రస్తావిస్తూ..జన బాహుళ్యంలో మోదీకి ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఆ సమయంలో తాము ఆక్షేపించ లేదని స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివ సైనికుడేనని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సైతం పలు సభల్లో ప్రస్తావించారని గుర్తు చేశారు.

రొటేషనల్‌ సీఎం ప్రతిపాదన తమ ఒప్పందంలో లేదని అమిత్‌ షా ఇప్పుడెలా చెబుతారని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ ఇరు పార్టీల మధ్య సజావుగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా ఎందుకు దిగ జారాయని నిలదీశారు. కాగా, శివసేనతో ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో సీఎం పదవిని చెరు రెండున్న రేళ్లు పంచుకునే అంశం రాలేదంటూ ట్రబుల్ షూటర్ అమిత్‌ షా పేర్కొన్నారు. దీనిపైనే ఇరు పార్టీల మధ్య నెలకొన్న మైత్రీ బంధం వీగి పోయింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!