బంగారానికి భలే గిరాకీ ..పసిడి పైపైకి ..!

బంగారాన్ని ఇండియాలో భలే కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఎక్కడలేని డిమాండ్ పసిడికి ఉంటోంది . మహిళలు లెక్కకు మించి కొనుగోలు చేస్తున్నారు . ధరలు అమాంతం పెరిగి పోయాయి . బ్యాంకు లు సైతం లాకర్లలో బంగారంతో నిండు కుంటున్నాయి . జనంతో పాటు బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి . కొనుగోలు శాతం 13 కు పైగా చేరుకోవడం మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది . పవిత్రమైన రోజులు రావడం తో పాటు ఆషాడం కారణంగా నగల దుకాణాదారులు భారీగా ఆఫర్స్ ఇవ్వడం తో కొనుగోలుదారులు , మహిళలు , వ్యాపారులు ఎక్కువగా బంగారాన్ని కొంటున్నారు. దీంతో భలే ఛాన్స్ లే అనుకుంటూ మా ఇల్లు బంగారం కావాలని తెగ కొనేస్తున్నారు .

ఇంకొన్ని షాపులలో అయితే లెక్కకు మించి కొనుగోలు చేస్తుండటం కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి . ఇప్పుడు పసిడి ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముకునేలా చేస్తున్నాయి . ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో గోల్డ్ 213.2 టన్నులకు చేరుకున్నట్టు డబ్ల్యూజీసీ ప్రకటించింది. 2018 రెండో క్వార్టర్‌‌‌‌లో ఈ డిమాండ్ కేవలం 189.2 టన్నులుగా మాత్రమే ఉండేది. వాల్యు టర్మ్స్‌‌లో చూస్తే గోల్డ్ డిమాండ్ 17 శాతం పెరిగి రూ.62,422 కోట్లకు చేరుకుంది. జుయల్లరీ డిమాండ్ గతేడాది 149.9 టన్నులు ఉండగా, జుయల్లరీ డిమాండ్ కూడా రూ.42,200 కోట్ల నుంచి రూ.49,380 కోట్లకు చేరుకుంది . గోల్డ్ ఇన్వెస్ట్‌‌మెంట్లు కూడా అలానే పెరిగాయి. గతేడాది గోల్డ్ ఇన్వెస్ట్‌‌మెంట్ డిమాండ్ రూ.11,060 కోట్లు ఉంటే, ఈ ఏడాది అది 18 శాతం పెరిగి రూ.13,040 కోట్లకు చేరుకున్నట్టు డబ్ల్యూజీసీ వెల్లడించింది.

అంచనాలకు మించి బంగారానికి డిమాండ్ పెరగడం కూడా ధరలు అమాంతం పెరిగేలా చేశాయి. ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 9 శాతం పెరిగి 372.2 టన్నులకు చేరుకుంది . ఎన్నికల కాలంలో నగదు కొరత, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ గతేడాది కంటే ఈ ఏడాది కొనుగోళ్లు పెరిగాయి . అక్షయ తృతీయ కొనుగోళ్లు, అనుకూలమైన ధరలు ఉండటం వల్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఓ వైపు జీఎస్టీ పెంచినా అవేవి బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపించ లేక పోయాయి . ఇది కూడా మార్కెట్ వర్గాలను విస్మయ పరిచేలా చేశాయి. మొత్తం మీద గోల్డ్ డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరుకుని, 2,181.7 టన్నులుగా నమోదైంది. ఎంతైనా పసిడి కదూ . !

కామెంట్‌లు