గెలుపు ముంగిట టీమిండియా
ముచ్చటగా టీమిండియా సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపునకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నది. కేవలం ఇంకో ఇంకో రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం సాధిస్తుంది. రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి సేన విజయం దాదాపు ఖాయమైంది. మూడు టెస్టుల సిరీస్లో సపారీ జట్టుకు వైట్వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే విశాఖ, పుణే టెస్టుల్లో ఘన విజయాలు అందుకుంది టీమిండియా. ఆటను మూడో రోజు ముగించాలని చేసిన టీమిండియా, అంపైర్ల ప్రయత్నాలకు సఫారీ ఆటగాళ్లు డి బ్రూయిన్, నోర్ట్జేలు అడ్డు పడ్డారు. ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 203 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లు కేవలం ఒక్క రోజులోనే 16 వికెట్లు పడగొట్టి దకిణాఫ్రికా జట్టు పతనాన్ని శాసించారు.
కాగా ఓవర్ నైట్ స్కోర్ 9/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. డుప్లెసిస్ ను బౌల్డ్ చేశాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా, బావుమాలు వెంట వెంటనే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పతనం తిరిగి ప్రారంభమైంది. క్లాసెన్ , పీయడ్త్, రబడా లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. లిండే తొమ్మిదో వికెట్గా ఔటైన తర్వాత నోర్ట్జే చివరి వికెట్గా ఔటయ్యాడు. దీంతో 162 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ కావడంతో ఆ జట్టును టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఫాలోఆన్కు ఆహ్వానించాడు. కాగా టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు.
సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డికాక్ ను ఉమేశ్ ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్ భారత బౌలర్ల జోరుకు పెవిలియన్కు క్యూ కట్టారు. వరుసగా హమ్జా , డుప్లెసిస్ , బవుమా , క్లాసెన్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. లిండే , పీట్ , రబడ లు కాసేపు మెరుపులు మెరిపించి నప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కు కోలేదు. దీంతో ఆట మూడో రోజు ముగస్తుందని అందరూ భావించారు. అయితే డిబ్రూయిన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విజయాన్ని నాలుగో రోజుకు వాయిదా వేయించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ రెండు, రవీంద్ర జడేజా, అశ్విన్లు తలో వికెట్ పడగొట్టారు.
కాగా ఓవర్ నైట్ స్కోర్ 9/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. డుప్లెసిస్ ను బౌల్డ్ చేశాడు. ఆపై హమ్జా-బావుమాల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జా, బావుమాలు వెంట వెంటనే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పతనం తిరిగి ప్రారంభమైంది. క్లాసెన్ , పీయడ్త్, రబడా లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. లిండే తొమ్మిదో వికెట్గా ఔటైన తర్వాత నోర్ట్జే చివరి వికెట్గా ఔటయ్యాడు. దీంతో 162 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ కావడంతో ఆ జట్టును టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఫాలోఆన్కు ఆహ్వానించాడు. కాగా టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు.
సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డికాక్ ను ఉమేశ్ ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్మెన్ భారత బౌలర్ల జోరుకు పెవిలియన్కు క్యూ కట్టారు. వరుసగా హమ్జా , డుప్లెసిస్ , బవుమా , క్లాసెన్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో 36 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. లిండే , పీట్ , రబడ లు కాసేపు మెరుపులు మెరిపించి నప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కు కోలేదు. దీంతో ఆట మూడో రోజు ముగస్తుందని అందరూ భావించారు. అయితే డిబ్రూయిన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విజయాన్ని నాలుగో రోజుకు వాయిదా వేయించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ రెండు, రవీంద్ర జడేజా, అశ్విన్లు తలో వికెట్ పడగొట్టారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి