టెలికం కంపెనీలకు ఊరట
ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపి వేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు. టెలికం నష్టాలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు టెలికం సంక్షోభాన్ని ప్రభుత్వం పట్టించు కోకుంటే భారత్లో పెట్టుబడుల పెట్టే విషయంలో పునరాలోచిస్తామని వొడాఫోన్ సీఈఓ నిక్ రెడ్ స్పష్టం చేశారు.
ఏజీఆర్పై సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెను భారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా 50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ 23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఏజీఆర్లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారు 74,000 కోట్లకు చేరింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి