ఎస్పీజీ సేవలకు సోనియా థ్యాంక్స్

సోనియా గాంధీ తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకు గానూ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. 28 ఏళ్లుగా ప్రతి రోజూ తాము సురక్షితంగా ఉండటంలో ఎస్పీజీ సభ్యులు చేసిన కృషి మరువ లేనిదన్నారు. ఈ మేరకు అరుణ్‌ కుమార్‌కు సోనియా లేఖ రాశారు. ఎస్పీజీ ప్రతిభా వంతమైన దళం. ఇందులోని సభ్యులు ఎంతో ధైర్యవంతులు. వారు చేసే ప్రతి పనిలోనూ దేశభక్తి కన్పిస్తుంది.

మా కుటుంబ రక్షణను ఎస్పీజీ చేతుల్లో పెట్టిన నాటి నుంచి సురక్షితంగా ఉంటామనే ధీమా కలిగింది. గత 28 ఏళ్లుగా ఎస్పీజీ సభ్యుల అంకితభావం, విధుల పట్ల వారి నిబద్ధత కారణంగా ప్రతీ రోజు మేము క్షేమంగా ఉన్నాం. ఇన్నేళ్ల పాటు మాకు రక్షణగా నిలిచినందుకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల అందరి తరఫున ఎస్పీజీ గ్రూపు సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ అభినందనలు అని సోనియా లేఖలో పేర్కొన్నారు. కాగా దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం తాజాగా తొలగించింది.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కారదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలను ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాల సంరక్షణలోని జడ్‌ ప్లస్‌ కేటగిరీకి మార్చింది. అదే విధంగా ఎస్పీజీలోని దాదాపు 3 వేల మంది సైనికులు ఇకపై దేశ ప్రధాని భద్రతకై సేవలు అందించనున్నారు. ఇక తమకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎస్పీజీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!