పంతం నెగ్గించుకున్న దుష్యంత్
ఊహించని రీతిలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుకు మాహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా ప్రకటించాయి విపక్ష పార్టీలు. బీజేపీకి ఊహించని రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు ఓటర్లు. పూర్తి మెజారిటీ వస్తుందని నమ్మకంతో ఉన్న మోదీ, అమిత్ షా లకు మిశ్రమ ఫలితాలు రావడం పునరాలోచనలో పడేశాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇతర పార్టీలపై ఆధారపడి పవర్ లోకి వచ్చేలా చివరకు అమిత్ షా పావులు కదిపారు. హంగ్ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది.
ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ కొన సాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఫలితాల్లో అసెంబ్లీ లోని 90 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేక పోయింది. బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజా తీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. బీజేపీకి చెందిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
తనతో పాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అంద జేశారు. చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ ముని మనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భారీ భద్రతను పెంచారు.
ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ కొన సాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఫలితాల్లో అసెంబ్లీ లోని 90 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేక పోయింది. బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజా తీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. బీజేపీకి చెందిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
తనతో పాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అంద జేశారు. చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ ముని మనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భారీ భద్రతను పెంచారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి