పోస్ట్‌లు

డిసెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బుట్టబొమ్మ..ముద్దు గుమ్మ

చిత్రం
మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..రైజింగ్ స్టార్ అల్లు అర్జున్..అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే తో తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్, ట్రైలర్స్ విడుదల చేశింది చిత్ర యూనిట్. ఇక మూవీకి చెందిన పాటలు యూట్యూబ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. తాజాగా రామజోగయ్య శాస్త్రి రాసిన బుట్టబొమ్మ పాటను లక్షలాది మంది వీక్షించారు. ఈ పాట కూడా రికార్డ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారి పోయారు ఈ ముద్దుగుమ్మ. అల..వైకుంఠపురములో చిత్రంలో ఈ బుట్టబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డైరెక్టర్ తీర్చి దిద్దినట్లు సమాచారం.  తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటోంది. అయితే  బుట్టబొమ్మ సాంగ్‌తో పూజా హెగ్డే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేసింది. అయితే ఈ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీ...

పాపులర్ యాప్స్ ఇవే

చిత్రం
నిన్నటి దాకా ఎవరి ప్రపంచం వారిదే. ఎవరి లోకం వాళ్లదే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక వరల్డ్ పూర్తిగా మారి పోయింది. ఈ లోక మంతటా ఇప్పుడు చిన్నదై పోయింది. ఎంతలా అంటే వదిలి ఉండ లేనంత. అంతలా అల్లుకు పోయింది సోషల్ మీడియా. ప్రతి రోజు ఉదయాన్ని చూసే వాళ్ళు కొందరే ఉంటారేమో కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం నిత్యం గడుపుతున్నారు. దానిని వాడక పోతే మాత్రం చచ్చి పోయే స్థితికి చేరుకున్నారు. అంతలా అడిక్ట్ అయి పోయారు. అన్నిటి కంటే టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ వచ్చాక ప్రపంచం ప్రతి ఒక్కరి దరికి వచ్చేసింది. తాజాగా ఈ సోషల్ మీడియాలో ఏది పాపులర్ దిగ్గజ కంపెనీనో తెలుసు కోవాలని ఉత్కంఠ ఉండడం మామూలే. ఈ సరి మరోసారి ముఖ పుస్తకం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఫేస్‌బుక్‌ మరో మైలు రాయిని అందుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్, ఎఫ్ బి మెసెంజర్లు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్‌ హవాను ఏమాత్రం నిలువరించ లేక పోయాయి. యాప్‌ యానీ అనే యాప్‌ సంస్థ ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న య...

జూపల్లి ఇక కింగ్ మేకర్

చిత్రం
జూపల్లి అంటే ఒకప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో. ఎప్పుడైతే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువు తీరారో ఇక అప్పటి నుంచి మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పేరు ప్రతిరోజు వినిపిస్తోంది. అంతే కాదు జగత్ గురు గా వినుతి కెక్కిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీ హవా కొన సాగుతున్నదో, దాని వెనుక అదృశ్య శక్తిగా రామేశ్వర్ రావు మరింత పాపులర్ అయి పోయారు. ఎంతగా అంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంతులతో కలిసి మాట్లాడేంత సాన్నిహిత్యం పెరిగి పోయింది. ఆయన ఇప్పుడు ఒకరకంగా తెలంగాణ ముకేశ్ అంబానీ. అనకొండలా అన్ని రంగాల్లో విస్తరించింది మై హోమ్ కంపెనీ. దీనికి కర్త కర్మ క్రియ అంతా రామేశ్వర్ రావు తమ్ముడు జూపల్లి జగపతి రావు. నిన్నటి దాకా నిర్మాణ రంగంలో ఉన్న జూపల్లి కుటుంబం మీడియా లోకి కూడా ఎంటర్ అయ్యింది. కాగా ఇప్పటి దాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌హెచ్‌ ఇండియాతో కలిసి, ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హె...

ప్రేమికులం కాదు స్నేహితులం

చిత్రం
 ఇటీవల తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ - 3 కంటెస్టెంట్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సినిమా నటీనటులకు ఉన్నంత క్రేజ్ వీరికి వచ్చింది. ఈ రియాల్టీ షో ఇండియాలో టాప్ వన్ లో కొనసాగింది. కోట్లాది మంది ఈ ప్రోగ్రాం ను వీక్షించారు. పాల్గొన్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వర్ధమాన నటి పునర్నవి లు మరింత పాపులర్ అయ్యారు. వీరు ఏది మాట్లాడినా లేదా ఎక్కడైనా ఈవెంట్స్ కు హాజరైనా క్షణాల్లో వైరల్ అవుతున్నారు. తాజాగా రాహుల్‌, పునర్నవితో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్న వారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా, వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రంగమార్తాండ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్‌ ...

కామెంట్స్ కలకలం..ఆగని వైనం

చిత్రం
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపాయి. తాను క్రికెట్‌ ఆడిన సమయంలో   కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకేం పాక్ ఆటగాళ్లు షోయబ్ పై విరుచుకు పడ్డారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదే అంశంపై ఇండియన్ క్రికెటర్లు మద్దతు పలికారు. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. మియాందాద్‌,ఇంజమాముల్‌ , మహ్మద్‌ యూసఫ్‌, షాహిద్‌ అఫ్రిదిలు అక్తర్‌ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను ప్రశ్నించారు. కామెంట్స్ చిలికి చిలికి గాలి వానగా మారాయి. దీంతో అక్తర్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందు కోసం అన్నానో ముందు తెలుసు కోవాలన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని,  కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్న చూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్‌ తెల...

ఈ పురస్కారం సావిత్రికి అంకితం

చిత్రం
జీవితంలో మరిచిపోలేని సన్నివేశం ఇది. సినీ రంగంలో సావిత్రి లాంటి నటీమణి పుట్టరు. ఆమె లోని నటన అమోఘం. అలాంటి గొప్ప నటి పాత్రకు నన్ను ఎంపిక చేయడం, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇలాంటి అదృష్టం ఎందరికి వస్తుంది. అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె పై నుంచి నన్ను దీవించారు. అందుకే నేను ఆ మహానటి పాత్రలో లీనమయ్యా. నన్ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసినప్పుడు చాలా మంది పలు రకాలుగా విమర్శలు చేశారు. కానీ నేను వాటిని ఏవీ పట్టించు కోలేదు. కేవలం పాత్రలో జీవించేందుకు కష్టపడ్డా. ఇందులో నా పాత్రంటూ ఏమీ లేదు. ఇదంతా ఆ మహానుభావురాలుకు మాత్రమే దక్కుతుంది. అంతకంటే ఎక్కువగా ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ నాగ్ దేనంటూ స్పష్టం చేసింది ప్రముఖ నటి కీర్తి సురేష్. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని సినిమాలు ఒక ఎట్టు. ఈ మహానటి సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్‌. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వ...

పెరిగిన ఆర్ఆర్ వాల్యూ

చిత్రం
భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాలపై పట్టు సాధిస్తూ, తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ వెళుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఆయిల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ , టాయిస్, డిజిటల్, ఆర్నమెంట్స్, తదితర రంగాలకు విస్తరించిన రిలయన్స్ మరోసారి రిటైల్ రంగంలో కూడా దుమ్ము రేపుతోంది. తాజాగా మార్కెట్ అంచనాల ప్రకారం చూస్తే గనుక రిలయన్స్‌ రిటైల్‌ విలువ 2.4 లక్షల కోట్లు గా ఉంది. రిటైల్‌ వాటాదారుల కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా చూస్తే ఈ విలువ మరింత పెరిగింది. ఇండియాలో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్ గా రిలయన్స్ ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసింది. మరో వైపు డిమార్ట్ కూడా రిలయన్స్ రిటైల్ కు గట్టి పోటీదారుగా ఉంటోంది. దీని అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 1.20 లక్షల కోట్లు గా ఉంది. డిమార్ట్ కంటే రిలయన్స్ మార్కెట్ వాల్యూ రెట్టింపుగా ఉంది. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ టెస్కో విలువ 3,200 కోట్ల డాలర్లు కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్‌ రిటైల్‌ ...

కుర్రాళ్ళ ఆట అదుర్స్

చిత్రం
ఈసారి మన క్రికెట్ ఆట మెరిసింది. ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ లో చతికిల పడిన టీమిండియా ఆ తర్వాత జతన ఆట తీరును మరింత మెరుగు పరుచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ బ్యాటింగ్ తో దుమ్ము రేపారు. టీమిండియా తన జైత్ర యాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటింది. ఇతర జట్లను మట్టి కరిపించింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌లో భాగంగా పలు సిరీస్‌లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూడ లేదు. వెస్టిండీస్‌ టూర్ లో టీమిండియా కరీబియన్లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌..ఆపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్‌లో కూడా కొనసాగించింది. 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను గెలుపొందింది. హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. మ్యాచ్‌కు 40 పాయింట్లు చొప్పున భారత్‌ మరో 120 పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ ...

హక్కుల నేత అరెస్ట్

చిత్రం
పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ చట్ట సవరణ భారత రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదంటూ విద్యార్థులు, పౌర సమాజం, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని హోమ్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇండియాలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, అస్సోమ్ రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా గువాహటి లో ప్రముఖ సమాచార హక్కు కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌ ఇంట్లో  జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌ టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్‌ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్‌ కార్డు, ఎస్బీఐ డెబిట్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ...

ఆర్థికం ఆందోళనకరం

చిత్రం
ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు భారత మాజీ ప్రధాని, జగమెరిగిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. దేశ వృద్ధి రేటు క్షీణత ప్రమాదాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే చాలా సార్లు దేశ స్థూల జాతీయోత్పత్తి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఆర్థిక మంత్రి కూడా అయిన మన్మోహన్‌ మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడి పోవడంపై స్పందించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో జీడీపీ 4.5 శాతానికి పడి పోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు.   వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సి ఉండగా 4.5 శాతానికి పడి పోవడం విచారించ దగ్గ విషయమన్నారు. ఆర్థిక విధానాల మార్పు ఏ విధంగాను సానుకూల ఫలితాలు ఇవ్వ లేదన్నారు. అంతే కాదు ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలంటే 8 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సిన అవస...

వారెవ్వా..తలైవా

చిత్రం
తమిళనాడులో సూపర్ స్టార్, ఇండియాలో రైజింగ్ స్టార్ గా ఇప్పటికే తనకంటూ ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్న ఎదురైనా హీరో రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులు ఈ నటుడిని ప్రేమగా తలైవా అని పిలుచుకుంటారు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రజనీకాంత్, నయనతార కలిసి దర్బార్ సినిమా తీశారు. ఇప్పటికే సినిమా పూర్తయింది. సినిమాకు సంబంధించి మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకు వెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందిచగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. డుమ్ డుమ్ అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియ జేశారు. పెళ్లి ...

ఆండర్సన్ వరల్డ్ రికార్డ్

చిత్రం
ప్రపంచ క్రికెట్ కప్ గెలిచాక ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మరింత దూకుడు పెంచింది. ఓ వైపు ప్రధాన పేసర్ గా ఉన్న బ్రాడ్ 400 వికెట్ల క్లబ్ లో చేరితే, ఇదే కంట్రీకి చెందిన మరో క్రికెట్ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ క్రికెట్‌ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఇప్పటి వరకూ ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. ఒక బౌలర్‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగడమే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ కాలం ఆడాలంటే పూర్తి ఫిట్ నెస్ తో ఉండాల్సిందే. ఇక అరుదైన ఘనతను సాధించడం చిరస్మరణీయంగా మిగిలి పోతుంది. ఇప్పటి దాకా కేవలం బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే ఉన్న ఈ జాబితాలో మొదటిసారిగా అండర్సన్‌ స్థానం సంపాదించాడు. టెస్టు కెరీర్‌లో 150 అంతకంటే మ్యాచ్‌లు ఆడిన జాబితాలో ఈ క్రికెటర్ దక్కించు కోవడం విశేషం. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో ఆరంభమైన తొలి టెస్టు ద్వారా అండర్సన్‌ ఈ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌ను చేరుకున్నాడు. ఫలితంగా 150 టెస్టు మ్యాచ్‌లు ఆడి తొలి బౌలర్‌గా నయా రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. అండర్సన్‌ కంటే ముందు 150, అంత కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ 200 మ్యాచులు ఆ...

బ్రాడ్ బ్యాండ్ బాజా

చిత్రం
వరల్డ్ క్రికెట్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేక పోవడంతో ఇదే ఆటలో టాప్ రేంజ్ లో ప్రతిభ చూపే ఆటగాళ్ల పంట పండుతోంది. ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోతున్నారు. ఇటీవలే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ తన దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నాడు. మరో వైపు ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తాజాగా సెన్సేషనల్‌ రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సహచర బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ వికెట్‌ను తీసిన తర్వాత బ్రాడ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్‌ 428 వికెట్లతో టాప్‌లో నిలవగా, ఆ తర్వాత బ్రాడ్‌ నిలిచాడు. ఓవరాల్‌గా తమ టెస్టు  కెరీర్‌లో అండర్సన్‌ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, బ్రాడ్‌ 473 వికెట్లు తీశాడు. కాగా, అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో అండర్సన్‌, బ్రాడ్‌ల తర్వాత స్థాన...

షాకిచ్చిన ఎయిరిండియా

చిత్రం
భారతీయ విమానయాన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని, ఒక బ్రాండ్ ను స్వంతం చేసుకుని, విశిష్టమైన సేవలు అందించి ప్రయాణీకుల మన్ననలు పొందిన ఎయిరిండియా విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. ఇప్పటికే దివాళా తీసేందుకు రెడీగా ఉంది ఈ సంస్థ. రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు తెరలేపింది. ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు తమ సేవలను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమకు భారీగా బకాయి పడ్డ సంస్థలకు ఇకపై అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వ బోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 10 లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది. బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్‌ స్టమ్స్ కమిషనర్‌ ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిరిండియా టికెట్లు కొనుగోలు ద్వారా  వివిధ ప్రభుత్వ సంస్థ...

బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ - పౌర సమాజానికి పూర్తి మద్దతు

చిత్రం
ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా పేరుతో దేశ ప్రజల మధ్య మరింత విద్వేషాలు పెంచేలా చేస్తోందంటూ ఆరోపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెజారిటీ జనమంతా కుల, మతాలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసింది. తాజాగా బీజేపీ ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసినా, అధికారం కోల్పోయిందన్న విషయాన్నీ గుర్తించాలని హెచ్చరించింది. ప్రతి చోటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. పాలన కూడా. దేశంలోని ప్రజలను మభ్య పెట్టేందుకే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది...

పసిడి ధరతో పరేషాన్

చిత్రం
కొనుగోలుదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది బంగారం. మార్కెట్ లో బంగారం ధరలు అమాంతం పెరుతున్నాయే తప్పా తగ్గడం లేదు. ధరాభారం మోయలేకున్నా జనం మాత్రం కొనుగోలు చేయడం మాత్రం మానడం లేదు. ఇటీవల కాస్త నెమ్మదించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లు వెత్తడంతో బులియన్‌ మార్కెట్లో బంగారం ధర మళ్లీ  39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహ పరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య అంతరం పెరగడం కూడా మరో కారణం. దీంతో ఫ్యూచర్‌ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. వరల్డ్ మార్కెట్లో పసిడి ధరలు 7 వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగా ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం 191 పెరిగి 10 గ్రాముల ధర 39,239 పలికింది. అటు వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది.  ఒక్క రోజే 943 పెరగడంతో కేజీ వెండి ధర 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్లు పెరిగి 1,495 స్థాయికి చేరింది. పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు ర...

మనోడు..అపర కుబేరుడు

చిత్రం
ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీకి బాగా కలిసొచ్చింది. మిగతా కంపెనీలకు షాక్ ఇస్తూ..తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో ఆయన అందరికంటే ముందు వరుసలో నిలిచారు. ఇది కూడా ఇండియన్ బిజినెస్ లో ఓ చరిత్రే. ముకేశ్ సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్‌ డాలర్ల మేర అంటే దాదాపు 1.2 లక్షల కోట్లు పెరిగింది. 60.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఈ వాస్తవ విషయాలు వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్‌ డాలర్ల నికర విలువతో దాదాపు 4.3 లక్షల కోట్లు గా పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. వ్యాపార పరంగా కొన్ని సార్లు హెచ్చు తగ్గులకు లోనైనప్పటికీ గణనీయమైన ఆదాయాన్ని గడించింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలో షేర్స్ తీసుకున్న వారికి పెద్ద ఎత్తున ప్రాఫిట్ లభించింది. ఇదిలా ఉండగా గహంలో 10 రూపాయలతో ఒక్క షేర్ విలువ ఉండగా ఇప్పుడు అది ఏకంగా 10 వేల రూపాయలకు చేరింది. గతంలో కంటే ఈ సంవత్సరం మదుపుదారులకు భారీగా లాభాలు అందేలా కంపెనీ ప్రయత్నం చేసింది. ఊహించని రీతిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దూసుకెళ్లడం కూడా ...

కోట్లు కురిపిస్తున్న ఏఐ

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ టాలెంట్ ఉన్నోళ్ల కోసం దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ పరంగా చూస్తే ఇండియన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంటోంది. తాజాగా ఇదే రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విభిన్నమైన కోర్సులు చేసే వారి పంట పండుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , ఎంఎల్, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిస్ట్, తదిర కోర్సులు చేసిన వారంతా కోట్లు సంపాదిస్తున్నారు. ఓ వైపు ఆర్ధిక మందగమనం ఉన్నా ఐటీ రంగం మాత్రం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పలు వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగు పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరకడం లేదు. దీంతో చాలా సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది 1,000 దాకా ఉండగా ఈ ఏడాది 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర...

టీఎస్ సీఎస్ పై ఉత్కంఠ

చిత్రం
పాలనా పరంగా కీలక పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ సీనియర్ ఐఏఎస్ లలో నెలకొంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు లోపాయికారీగా ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు కేంద్రం స్థాయిలో ఇంకొందరు రాష్ట్ర స్థాయిలో పెద్దఎత్తున ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఎందరు రేసులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న శైలేంద్ర కుమార్‌ జోషి త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మరో కొన్ని రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్‌ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్‌ ఎంపికపై సీఎం డిసిషన్ తీసుకోనున్నారు. సీఎస్‌ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. కాగా సీనియారిటీ పరంగా చూస్తే సీఎస్‌ రేసులో తెలంగ...

ప్రక్షాళనతోనే పరిష్కారం

చిత్రం
నిన్నటి దాకా ఆందోళనలతో అట్టుడికిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో మునిగి పోయింది. ఎలాగైనా సరే ఆర్టీసీని ఆదాయ బాటలు నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో సీఎం ఎప్పటికప్పుడు ఆర్టీసీపై సమీక్షలు చేస్తున్నారు. మంత్రి, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గండం నుంచి గట్టెక్కించాలని, ఇందు కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగారు. అంతే కాకుండా ఆర్టీసీ కార్గో సర్వీసెస్ రంగం లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. తాజాగా టీఎస్‌ఆర్టీసీలో ప్రక్షాళన చేయడం మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేతనానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటి వరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్‌ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా, మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ...

ఆర్ధిక రంగం ప్రమాదకరం

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన బీజేపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ నీటి మూటలేనని తేలి పోయింది. ఇప్పటికే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతోంది, దీనికి వెంటనే కాయకల్ప చికిత్స అవసరమని ఆర్థికరంగ నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్లు సుబ్బారావు, రంగ రాజన్ లు హెచ్చరించారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే దివాళా తీసే ప్రమాదం పొంచి ఉందంటూ ముందస్తు జాగ్రత్తలు సూచించారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పట్టించు కోలేదు. వీరిని ఆయన నమ్మలేదు. ఏకంగా నోట్లను రద్దు చేశారు. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయ పడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ డైరెక్టర్స్‌ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్‌ శాఖలో భారత్‌ వ్యవహారాల చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో వెల్లడించారు. అయితే ఇండియా ఇటీవల ఆర్ధిక రంగంలో కొంత ముందడుగు వేసింది. లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారు. 2019 సంవత్సరం న...

రాహుల్ కు పీకే ప్రశంస

చిత్రం
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ సిటిజన్ షిప్ చట్ట సవరణపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఎటు చూసినా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటి దాకా ఆరు మందికి పైగా మృతి చెందారు. బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లో ధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ ఉప నేత ప్రశాంత్ కిషోర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అంతే కాదు విపక్షాలు ఏకంగా కావాలని, పొరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. అయితే సిటిజన్ షిప్ చాట సవరణ వద్దంటూ ఉద్యమ బాట పట్టిన రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం  , జాతీయ పౌరుల జాబితాలకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై హర్షం వ్యక్తం చ...

లారాను పొగిడిన కోవింద్

చిత్రం
ఇద్దరు వేర్వేరు రంగాలకు చెందిన అద్భుతమైన వ్యక్తులు. వారిద్దరూ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాలలో కొనసాగుతున్న వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ దిగ్గజాలే. వారెవరో కాదు ఒకరు ప్రపంచ క్రికెట్ లో ఎందరికో స్ఫూర్తి దాయకంగా ఉంటూ వచ్చిన విండీస్ కు చెందిన బ్రయాన్ లారా అయితే మరొకరు భారత దేశ ప్రెసిడెంట్ రాంనాథ్ కోవింద్. వీరిద్దరూ దేశ రాజధానిలో కలుసుకున్నారు. ఇదో అరుదైన సన్నివేశం. దేశ చరిత్రలో మరిచి పోలేని రోజు కూడా. ఎందుకంటే లారా, కోవింద్ లు కస్టపడి పైకి వచ్చిన వారే. తమ స్వశక్తితో అత్యున్నతమైన పదవులను అధిరోహించిన వారే. ఎన్నో కష్టాలు దాటుకుని జీవితంలో విజయాలు సాధించారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు. ఆయన దళిత జాతికి చెందిన వ్యక్తి అని. ఇప్పుడు భారత దేశానికి మొదటి పౌరుడు. మరొకరు లారా. ఈ క్రికెట్ దిగ్గజం అద్భుతమని చెప్పక తప్పదు. క్రికెట్ లెజెండ్స్ లలో లారాను ఒకడిగా పేర్కొంటారు. ఆయన ఆటలోనే కాదు వ్యక్తిగతంగా కూడా ఎంతో సౌమ్యుడు. ప్రస్తుతం క్రికెట్ రంగం నుంచి రిటైర్ అయినా స్టార్ టీవీ లో కామెంటేటర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ సందర్బంగా లారా ఇండియాకు వచ్చాడు. భారత కెప్టెన్‌ విరాట్...

జార్ఖండ్ డైనమెట్..క్రికెట్ లెజెండ్

చిత్రం
మిస్టర్ కూల్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లోకి ఎంటరై 15 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ అద్భుతమైన ఆటగాడు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడడు. కేవలం ఆట మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఇతడి నైజం. ఇంటర్ నేషనల్ క్రికెట్ లో ఎమ్మెస్ ధోని అంటే ఓ క్రేజ్. ఇండియాలో అతడంటే కోట్లాది అభిమానులు చెవి కోసుకుంటారు. అంతలా పాపులర్ అయ్యాడు ఈ ఝార్ఖండ్ డైనమెట్. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. 2004, డిసెంబర్‌ 23 న బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ ధోనికి ఒక చేదు జ్ఞాపకాల్ని మిగల్చగా ఆ తర్వాత కాలంలో అతని కెరీర్‌ ఒక గొప్ప దశను చూసింది.  భారత క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌గా ధోని ఘనత సాధించాడు. అతని సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీని సాధించి పెట్టిన ఘనత కూడా ధోనిదే.  ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్‌ టోర్నీలను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని ఖ్యాతి గడించాడు. ఇక భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌ మార్క్‌ ధోని సొంతం. సౌరవ్‌ గంగూలీ ...

హస్తం పుర పోరుకు సిద్ధం

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తన సుముఖతను వ్యక్తం చేసింది. ఏ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. దీంతో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం , టీడీపీ, బిఎస్ పి, తదితర పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి. అన్ని పార్టీలు తాడో పేడో తేల్చు కోవాలని పావులు కదుపుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం పురపాలిక ఎన్నికల్లో తమదే ఆధిపత్యమని, మమ్మల్ని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదంటోంది టిఆర్ ఎస్. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఎన్నడూ లేని రీతిలో పవర్ కోల్పోయిన ఈ పార్టీ నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్ ను ఢీకొనే దమ్ము కలిగిన నాయకుడు ఏ పార్టీలో లేకుండా పోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి అన్ని పార్టీలు. ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా సరే తమ సత్తా ఏమిటో చూపించాలని, కనీసం సగం మున్సిపాల్టీల్లో తమ ప్రతాపాన్ని చూపించాలని డిసై...

ఇక ఎన్నికల నగారా

చిత్రం
ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు తెరలేచింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పట్టును మరింత పెంచు కోవాలనే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది. మరో వైపు విపక్షాలు సైతం తమ సత్తా ఏమిటో సర్కార్ కు తెలియ చెప్పాలని రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల పేరుతో నాన్చుతూ వస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరో ఎన్నికల ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఏ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మున్సి పల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ కమిషనర్‌ నాగిరెడ్డి విడుదల చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టులో పాత కేసు పెండింగ్‌లో ఉండటంతో జహీరాబాద్‌ మున్సి పాలిటీకి ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫి...

జార్ఖండ్ లో సంకీర్ణం..కాంగ్రెస్ కు బలం

చిత్రం
ఒంటెత్తు పోకడలతో, దేశంలోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి జార్ఖండ్ రాష్ట్రంలో వెల్లడైన ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు లాంటిదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం సాక్షిగా ఆయా రాష్ట్రాలలో ఏర్పాటైన విపక్షాలు కొలువుతీరిన ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడంలో ప్రధానమంత్రి మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా లు సిద్ద హస్తులని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ను అప్రజాస్వామిక పద్దతిలో పవర్ కోల్పోయేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయినా, జనం దృష్టిలో మాత్రం విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక రంగాన్ని శాసించే మహారాష్ట్ర లో ధర్మబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు అధికారం లోకి రాకుండా అడ్డుకున్నారని, చివరకు ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని బేషరతుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ కొన్నేళ్లుగా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన శివసేన సైతం కమలానికి, మోదీ, అమిత్ చంద్ర షా లకు కోలుకో...

హేమంత్ హవా..జనం ఫిదా

చిత్రం
ఎవరీ హేమంత్ అనుకుంటున్నారా. అతను ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. జాతి యావత్తు అతడి వైపు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. అటు మీడియాలో, సామాజిక మాధ్యమాలలో టాప్ రేంజ్ లో వార్తల్లో ఉంటూ వచ్చిన అతను ఎవరో కాదు జార్ఖండ్ ముక్తీ మోర్చా పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శిబూ సొరేన్ కుమారుడు, జనం మెచ్చిన ప్రజా నాయకుడు హేమంత్ సొరేన్. ప్రస్తుతం బీజేపీకి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు ఈ లీడర్. కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. విస్తృతంగా రాష్ట్రం అంతటా పర్యటించారు. ప్రజల మధ్యనే ఉంటూ కలిసి పోయారు. అత్యంత సాధారణమైన జీవితం గడుపుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. 10 ఆగష్టు 1975 లో పుట్టారు హేమంత్ సొరేన్. జార్ఖండ్ రాష్ట్రానికి ఈ యువ నాయకుడు అయిదవ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తండ్రి పేరు మోసిన రాజకీయ పోరాట యోధుడు. అతడే జగమెరిగిన శిబూ సొరేన్. ఆయన ఇదే రాష్ట్రానికి సీఎం గా కూడా పని చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవేవి నిలవలేదు. దేశంలో హవా చెలాయిస్తున్న బీజేపీకి, మోదీ, అమిత్ షాల హవాకు అడ్డుకట్ట వేశారు హేమంత్ సొరేన్. హేమంత్ కు ఒక చెల్లెలు, ఇద్దరు బ్...

జార్ఖండ్ లో బీజేపీకి షాక్

చిత్రం
దేశాన్ని తమ కనుసన్నలతో శాసిస్తున్న మోదీ, అమిత్ చంద్ర షా పాచికలు పారడం లేదు. నిన్నటి దాకా కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ను కూలదోసిన బీజేపీకి ఇటీవలి కాలం లలిసి రావడం లేదు. అన్నిటా చక్రం తిప్పుతున్న ట్రబుల్ షూటర్ అమిత్ షాకు మహారాష్ట్రలో కోలుకోలేని రీతిలో దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది శివసేన పార్టీ. ఇదే క్రమంలో జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విస్తు పోయేలా ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్‌, జేఎంఎం కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొత్తం మీద అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయి. సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా చివరకు చాలా చోట్ల జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఒక వేళ మెజార్టీకి ఒకటీ, రెండు సీట్ల దూరంలో నిలిచినా..ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాల...

విండీస్ కు అతడే దిక్సూచి

చిత్రం
ఒకప్పుడు క్రికెట్ ఆటలో రారాజుగా వెలుగొందిన విండీస్ క్రికెట్ జట్టు రాను రాను తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. రిచర్డ్స్, రిచర్డ్ సన్, వాల్ష్, బ్రయాన్ లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లున్న ఈ జట్టు కనీస విజయాలకు కూడా ఇబ్బంది పడింది. ఈ పరిస్థితుల్లో విండీస్ జట్టులోని ఆటగాళ్ళను రాటు దేలేలా చేసే బాధ్యతను మాజీ విండీస్ ఆటగాడు సిమ్మన్స్ కు అప్పగించింది. దీంతో జట్టులో ఉన్న బలాలు, బలహీనతల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న ఈ క్రికెట్ కోచ్ గాడిలో పెట్టే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఒక డైరెక్షన్‌లో ముందుకు వెళ్లేలా చేశాడు. ప్రస్తుతం ఆయా జట్ల ఆటగాళ్లకు కఠిన పరీక్షలు పెడుతూ మరింత అద్భుతంగా ఆడేలా ట్రై చేస్తున్నాడు సిమ్మన్స్. టాప్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్న టీమిండియా ఆటగాళ్లను ఎదుర్కొనేలా విండీస్ క్రికెటర్లను తీర్చి దిద్దుతున్నాడు. అన్ని ఫార్మాట్ లలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న టీమిండియా జట్టును రెండో వన్డేలో ఓడి పోయేలా చేశాడు కోచ్. ఏ జట్టుకైనా కోచ్ కీలకం. జట్టుని తీర్చి దిద్దడం. వారి బలాలు, బలహీనతలను గుర్తించడం ఆ దిశగా కృషి చేసే పని కోచ్ దే. టాస్ వేయడం దగ్గరి నుంచి ఏ సమయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో జట్...

అంతిమ పోరులో అద్భుతం

చిత్రం
విండీస్ పై అసాధారణ రీతిలో టీమిండియా విజయం సాధించినా అంతిమంగా ఇరు జట్లు సమ ఉజ్జీగా గెలుపు కోసం చివరి వరకు పోరాడాయి. నువ్వా నేనా అన్న రీతిలో గెలుపు దోబూచులాడింది. ఈ ఉత్కంఠ పోరులో ఇండియా తమ ముందు ఉంచిన బిగ్ టార్గెట్ ను ఈజీగా ఛేదించింది. ప్రత్యర్థి జట్టు కూడా తానేమీ తీసి పోనంటూ అద్భుతమైన రీతిలో ప్రదర్శించింది. ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. చివరి మూడో వన్డే మాత్రం మరింత పోటీని పెంచింది. చివరకు ఇండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 316 పరుగులు చేసింది. బరిలోకి దిగిన ఇండియా 48.4 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 89 బంతుల్లో 77 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టక మైదానం లోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.   కేవలం 81 బంతుల్లో 85 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఉన్నట్టుండి కోహ్లీ అవుటయ్యాడు. ఈ సమయంలో ఫాస్ట్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశ...

జయహో సుందర్ పిచాయ్

చిత్రం
ప్రపంచం ఇప్పుడు గూగుల్ జపం చేస్తోంది. అది లేకుండా ఈ లోకాన్ని చూడలేం. వినలేం. మనల్ని మనం పరిచయం చేసుకోవాలన్నా, ఏ విషయమైనా సరే నిమిషాల్లో కావాలంటే వెంటనే కోట్లాది మందిని ప్రభావితం చేసేది ఈ సెర్చింగ్ దిగ్గజ కంపెనీదే. ఈ అమెరికా ఐటీ కంపెనీ ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ టాప్ వన్ గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దీనిని దాటి వెళ్లేందుకు మిగతా దిగ్గజ కంపెనీలు సైతం ప్రయత్నం చేస్తున్నాయి. అయినా గూగుల్ తో పోటీపడలేక పోతున్నాయి. ఎందుకంటే గూగుల్ ప్రపంచం కంటే ముందు వరుసలో ఉంటోంది. ఏ కంపెనీ తన దరిదాపుల్లోకి అల్లంత దూరంలో నిలిచి ఉన్నది. దీనిని అందు కోవాలంటే ఇప్పుడు కష్ట సాధ్యమైన పని. గూగుల్ కంపెనీకి ఇండియాకు చెందిన చెన్నై కుర్రాడు సుందర్ పిచాయ్ సిఇఓ గా ఉన్నారు. ఇప్పటికే సుందర్ వరల్డ్ లోనే అత్యంత ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు వేతన జీవుల్లో టాప్ వన్ గా నిలిచి అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గూగుల్ కె కాకుండా సుందర్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీకి సైతం సిఇఓగా కొనసాగనున్నాడు. అత్యంత శక్తి మంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్‌ ఇపుడు అతి పెద్ద స్టాక్...

మళ్ళీ మెరిసిన మహానటి

చిత్రం
పాలమూరు కుర్రాడు నాగ్ అశ్విన్ ఎంతో మనసు పెట్టి అలనాటి నటీమణి సావిత్రి కోసం తీసిన మహానటి మళ్ళీ మెరిసింది. సినీ రంగానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతి అవార్డు, పురస్కారం కోసం ఎంతో వేచి చూస్తారు. ప్రతి సినీ టెక్నీషియన్ కోరిక కూడా ఇదే. ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌ సీమ‌కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుల‌లో ఫిలిం ఫేర్ ఒక‌టి. ఎంతో ఉన్నతంగా భావించే ఈ అవార్డుల కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. నటీ నటులు సందీప్‌ కిష‌న్‌, రెజీనా ఈ వేడుక‌కి వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. 2018లో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ప‌లు సినిమాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ అవార్డుల‌ను అందించారు. తెలుగులో 2018 ఏడాదికి గానూ మ‌హాన‌టి ఉత్త‌మ‌ చిత్రంగా ఎన్నికైంది. ఇక నటుడు రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా భావించే సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం అద్భుత ప్రదర్శనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా అవార్డుల పరంగా చూస్తే, బెస్ట్ సినిమా కేటగిరీలో మహానటి సినిమాను ఎంపిక చేసింది అవార్డుల ఎంపిక కమిటీ. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటి గా మహానటి సినిమాలో నటించి మనసు దోచుకున్న కీర్తి సురేష్ ను అవార్డు...