ఇక ఎన్నికల నగారా
ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు తెరలేచింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పట్టును మరింత పెంచు కోవాలనే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది. మరో వైపు విపక్షాలు సైతం తమ సత్తా ఏమిటో సర్కార్ కు తెలియ చెప్పాలని రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల పేరుతో నాన్చుతూ వస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరో ఎన్నికల ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఏ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నగారా మోగించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
మున్సి పల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టులో పాత కేసు పెండింగ్లో ఉండటంతో జహీరాబాద్ మున్సి పాలిటీకి ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు ఇస్తారు. ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
మరో వారం పది రోజుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావొచ్చని సమాచారం. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితాలు సిద్ధం కాగా, బీసీ జాబితా దాదాపు రెండు నెలల క్రితమే రూపొందించారు. కాగా కొత్త ఓటర్లు నమోదు కావడంతో మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేసి మిగిలిన శాతం రిజర్వేషన్లను బీసీ వర్గాలకు కేటాయిస్తారు.
పది మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, 120 మున్సిపాలిటీలకు చైర్మన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం, జనరల్ కేటగిరీ కింద 50 శాతం కేటాయిస్తారు. అదే విధంగా మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 కార్పొరేషన్లలోని 385 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 800 ఓటర్ల చొప్పున వార్డుల్లో ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను వెల్లడించనున్నారు. మొత్తం మీద మరో ఎన్నికల పోరు షురూ కావడంతో ఇక అభ్యర్థులు జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మున్సి పల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టులో పాత కేసు పెండింగ్లో ఉండటంతో జహీరాబాద్ మున్సి పాలిటీకి ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు ఇస్తారు. ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
మరో వారం పది రోజుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావొచ్చని సమాచారం. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితాలు సిద్ధం కాగా, బీసీ జాబితా దాదాపు రెండు నెలల క్రితమే రూపొందించారు. కాగా కొత్త ఓటర్లు నమోదు కావడంతో మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేసి మిగిలిన శాతం రిజర్వేషన్లను బీసీ వర్గాలకు కేటాయిస్తారు.
పది మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, 120 మున్సిపాలిటీలకు చైర్మన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం, జనరల్ కేటగిరీ కింద 50 శాతం కేటాయిస్తారు. అదే విధంగా మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 కార్పొరేషన్లలోని 385 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 800 ఓటర్ల చొప్పున వార్డుల్లో ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను వెల్లడించనున్నారు. మొత్తం మీద మరో ఎన్నికల పోరు షురూ కావడంతో ఇక అభ్యర్థులు జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి