అంతటా ఆధారమే..లేదంటే భారమే

కేంద్రంలో బిజెపి కొలువు తీరాకా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి పనికి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. అది లేకుంటే బతకలేమనే స్థితికి తీసుకు వచ్చారు మోడీ అండ్ అమిత్ చంద్ర షా. దీంతో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆధార్ నమోదును తమ భుజానికి ఎత్తుకున్నాయి. ఇదో ప్రహసనంగా మారింది. తాజాగా 30 మంది లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే ఆధార్ కోసం వెయిట్ చేస్తే, ఈ విషయాన్ని పోస్టల్ అధికారులకు తెలియ పరిస్తే నేరుగా సిబ్బందిని మన ఇళ్ల వద్దకే పంపిస్తారు. ఇదో వినూత్న ప్రయత్నం. పోస్టల్ శాఖ ఇతర శాఖలతో పోటీ పడుతోంది. సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టు కార్డులు చేర వేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్ సేవలూ అందిస్తోంది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు..డోర్ వద్దకు వచ్చి సేవలందించనుంది. రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్తో అ...