పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పాకిస్తాన్ కు ఇండియా షాక్

చిత్రం
ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేస్‌, జీవన్‌ నెడుంజెళియన్‌ జోడీ 6-1, 6-3 అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌, షోయబ్‌ మొహమ్మద్‌ తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్‌ పేస్‌ జంట​ అద్భుతమైన స్మాష్‌లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్‌ను 6-3 తేడాతో గెలుచు కోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్‌ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్‌ టెన్నిస్‌ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. గతేడాది డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్‌ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్‌ పేస్‌ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్‌ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్‌ ...

చంపుతా..జైలుకు వెళతా

చిత్రం
వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా హత్య చేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై  సినీ నటి పూనమ్‌కౌర్‌ స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడాని కైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకు వెళతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతి భయంకరంగా, జంతువుల కంటే ఘోరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని కూడా పోస్ట్‌ చేశారు. కాగా నిందితులను షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగి పోయారు. వారిని తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకా రె...

ఐసీఐసీఐపై కోర్టులో కొచర్ దావా

చిత్రం
ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచర్‌  తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ, ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు నిర్ణయంపై ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రంజిత్‌, జస్టిస్‌ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్‌బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడం పైనే, ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్‌ తరుపున విక్రమ్‌ నన్‌కాని, సుజయ్‌ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్‌ తరపున డారియస్‌ కమ్‌ బాటా వినిపించనున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందా కొచర్‌పై వీడియోకాన్‌ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై  కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చందా కొచర్‌, భర్త దీపక్‌ కొచర్‌తో పాటు ఇతర బంధువులను కూడా చార్జ్‌ షీటులో చేర్చింది. అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను బోర్డు వెనకేసుకు వచ్చింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి బీఎన్‌ క...

అగ్ని పరీక్షలో నెగ్గిన సంకీర్ణం

చిత్రం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బల పరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్‌ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువు తీరినట్లైంది. సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌‌ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని, ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ స్పీకర...

తగ్గనున్న సిటీ బస్సులు..సిటీవాసులకు కష్టాలు

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం  సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మెలమెల్లగా ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఎక్కువగా బస్సు పాసులు కలిగిన వారే అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం భాగ్యనగర వాసులపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ నష్టాల్లో సగం సిటీ నుంచే వస్తుండటంతో సిటీ సర్వీసులను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో భర్తీ చేయాలని భావించినా, తాజా సమ్మె సమయంలో అది సాధ్యం కాదని స్వయంగా సర్కారే తేల్చేసింది. హైకోర్టుకు సమర్పించిన వివరాల్లోనూ దీన్ని స్పష్టం చేసింది. దీంతో నష్టాలను తగ్గించు కునేందుకు సిటీ సర్వీసులను కుదించాలన్న దిశగా అధికారులు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా సర్వీసులు తగ్గించకున్నా, సిటీ రీజియన్‌లో పదవీ విమరణ చేసే సిబ్బంది స్థానంలో కొత్త వారిని ఇక నియమించరు. దీంతో  బస్సుల సంఖ్యను కూడా కుదించేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 3,500 బస్సుల సంఖ్య క్రమంగా తగ్గనుంది. హైదరాబాద్‌లో బస్సు పాస్‌లతోన...

వెల్లువెత్తిన ప్రజాగ్రహం..నిరసన మధ్య తరలింపు

చిత్రం
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచార, హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్షే ఖరారు చేయాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఎవరినీ స్టేషన్ దరిదాపుల్లోకి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ ఠాణాకు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. డీజీపీ నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండడం, సమస్య సున్నితమైనది కావడంతో ఎలాంటి లాఠీ ఛార్జి చేయలేదు. కొన్ని గంటల పాటు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. మెజిస్ట్రేట్ నిందితులకు14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను మహబూబ్ నగర్ జైలుకు తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రియాంకను దారుణంగా చంపిన నిందితులను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. మరికొందరు జైలుకు కాకుండా ఉరి తీయాలని కోరితే, ఇంక...

చిందేసిన చిరు..సందడి చేసిన ఖుష్బూ

చిత్రం
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఏది చేసినా సంచలనమే. అయన మాట్లాడినా లేదా డ్యాన్స్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అయన తెలంగాణకు చెందిన డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన సైరా నరసింహ్మ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో చిరంజీవి శక్తికి మించి నటించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. తన సినీ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా సైరా సినిమానే అంటూ స్పష్టం చేశారు ఈ మెగాస్టార్. ఇదిలా ఉండగా 1980 లో తెలుగు, తమిళ్, కన్నడ సినీ రంగానికి చెందిన నటీనటులు ఒకే చోట ప్రతి ఏడాది సమావేశం కావడం జరుగుతూ వస్తోంది. ఈ సారి స్పెషల్ గా మాంచి ఊపు మీదున్న చిరంజీవి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. మరిచిపోని జ్ఞాపకాలను మిగిల్చారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లి పోయారు. క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌ రీ యూనియన్‌ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫుల్ గా ఎంజాయ్‌ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మ...

సుధా మూర్తి..నిత్య స్ఫూర్తి

చిత్రం
బుల్లితెర మీద సంచలనం సృష్టించిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి 11 వ సీజన్ ముగిసింది. ప్రముఖ నట దిగ్గజం, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. దేశాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. వ్యక్తి నుంచి వ్యవస్థగా మారడమే కాక ఏకంగా యూనివర్సిటీని స్థాపించిన సామంతను కూడా బిగ్ బి పరిచయం చేశారు. షో చివరి ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి పాల్గొన్నారు. సుధామూర్తిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానించిన బిగ్‌బీ.. వయసులో చిన్నదైనా, ఆమె కాళ్లకి నమస్కరించాడు. ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ సుధామూర్తి 60 వేల లైబ్రెరీలు, వందల స్కూళ్లు, 16 వేలకు మించిన టాయిలెట్లు కట్టించారని తెలిపారు. అనంతరం సుధామూర్తి తన నేపథ్యాన్ని వివరించారు. స్ఫూర్తిదాయకంగా,ఆదర్శ వంతంగా సాగిన ఆమె జర్నీ గురించి స్వయంగా వివరించారు. నేను ఇంజనీరింగ్‌ చదవాలని అనుకున్నప్పుడు మా తండ్రి తిరస్కరించారు. అలా చేస్తే మన కమ్యూనీటీలో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరని హెచ్చరించారు. అయినప్పటికీ నేను ఇంజనీరింగ్‌ చదివేందుకే మొగ్గు చూపాను. కర్ణా...

ప్రియాంక మరణం..సినీలోకం ఆగ్రహం

చిత్రం
వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో స్పందించారు. ఆమె హత్య తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. అల్లరి నరేశ్‌, అల్లు శిరీశ్‌, సుధీర్‌బాబు, వివి వినాయక్‌, కీర్తి సురేశ్‌, మెహ్రీన్ పిర్జాదా‌, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్‌ ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయని  , ప్రియాంక రెడ్డి హత్య తెలియ గానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పేర్కొన్నారు. తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు. ఏ సమయంలో నైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగి వచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్య చేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్ల వేళలా పని చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశార...

పని చేయని సర్కార్ మంత్రం

చిత్రం
దేశ ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన నోట్ల రద్దు మంత్రం ఏకంగా మోడీకి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీని వెలుగులోకి తీసుకు వస్తామని చేసిన ప్రకటనలు ఆచరణలోకి రాలేదు. నగదు లావా దేవీలు జరపడంలో బ్లాక్ మనీ ఎక్కువగా వాడుతున్నారని, వీటిని చెక్ పెట్టాలకునున్న పీఎం ఆలోచన వర్కవుట్ కాలేదు. నగదు లావాదేవీల్లో బ్లాక్‌ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన 1,000, 500 నోట్ల రద్దు  పూర్తి స్థాయిలో పట్టా లెక్క లేదు. ఈ నిర్ణయం తీసుకుని మూడేళ్లు గడిచినా, నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి.  రియల్‌ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్‌సీఆర్‌. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్‌ ప్రాపర్టీలల్లో మాత్రం క్యాషే కింగ్‌. మొత్తం ప్రాపర్టీ విలువలో 20 నుంచి 25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. బెంగళూరు, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో రీసేల్‌ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్‌ గృహాల మార్కెట్లలో బ్లాక్‌ మనీ ద్వారానే ల...

చిన్న జీయర్ ఆశీర్వాదం..జన్మ ధన్యం

చిత్రం
ఎక్కడికో వెళ్లడం దేని కోసం. ఉన్న చోటును గుర్తించం. లేనిదాని కోసం ఆరాట పడతాం. అంతులేనిది ఏదో ఉందన్న భ్రమల్లో బతుకుతాం. ఇదే మానవుల్ని ఇబ్బందులకు లోను చేస్తోంది. అందని దాని కోసం అర్రులు చాచడం. ఎదుటి వారి పట్ల ప్రేమను కలిగి ఉండక పోవడం, ఈర్ష్య విద్వేషాలతో అద్భుతమైన, దేవుడు ప్రసాదించిన ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఇది కాదు మన ప్రయాణం. ఇది కాదు మన సంస్కృతి. వేదాలు, ఇతిహాసాలు మనం ఎలా ఉండాలో, ఏది ఎప్పుడు చేయాలో..సమాజంలో మన బాధ్యత ఏమిటో గుర్తు చేస్తాయి. నీతి, నిబద్దత, ధర్మాన్ని గతి తప్పకుండా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇది కాదనలేని సత్యం. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎలా ప్రవహిస్తూ  వుంటాయో మీ అందరి మనస్సులో కోరికలు, ఆలోచనలు అలాగే కదులుతూ ఉంటాయి. దీనిని నిలువరించి అడ్డుకట్ట వేసే మార్గాన్ని భక్తి అనే సాధనం చేస్తుంది. దీనిని గుర్తించి సాధన చేయగలిగితే మీకు మీరుగా ఏ ఒక్కరి సహాయమూ లేకుండా మీ అంతటా మీరే గొప్ప సాధకులుగా మారే అవకాశం ఉన్నది. ఇదంతా నిరంతరం సాగే దైనందిన ప్రక్రియ. జీవన యానంలో ప్రతిదీ మనల్ని పలకరిస్తుంది. పరవశించేలా చేస్తుంది. ఇదంతా బాహ్య రూపకంగా అగుపించే సన్నివేశం. కానీ లోపట ఉండ...

దిగ్గజాల సరసన థాక్రే

చిత్రం
ఉద్దవ్ థాక్రే ఈ పేరు దేశంలో సంచలనం కలిగించింది. ఎక్కువగా వైరల్ అయిన ఒకే ఒక్క నాయకుడు ఇతడు. మోడీ, అమిత్ శాలను కాదని ఉద్దవ్ ఇప్పుడు అందివచ్చిన నాయకుడిగా, తిరుగులేని శివసేన సానికుడిగా అవతరించాడు. బాల్ థాక్రే లాగా దుందుడుకు స్వభావం లేకపోయినా ఉద్దవ్ ఠాక్రే తానేమిటో నిరూపించుకున్నాడు. కాగా విధాన్‌ సభ, విధాన పరిషత్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఎనిమిదో వ్యక్తి. ఇది వరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌ దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌ నిలంగేకర్, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, షిండే, పృథ్వీరాజ్‌ చవాన్, తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు.  నియమాల ప్రకారం ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాల వ్యవధిలో విధాన సభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్ట వశాత్తు ఇంత వరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ...

ఫోర్బ్స్‌ టాప్‌10లో మనోడు

చిత్రం
రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. అంతులేని సంపదతో రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 4.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌ పేర్కొంది. తాజాగా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10,01,555 కోట్లకు చేరి..ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే. కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో 1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్‌ సంపద అమాంతం పెరిగి పోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ, ఈసారి ఏకంగా టాప్‌10లోకి చేరి ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్‌ ఫౌండర్, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్‌ డాల...

మరాఠా యోధుడికి పరీక్ష

చిత్రం
మరాఠా పీఠంపై కొలువు తీరిన శివ సైనికుడికి అగ్ని పరీక్ష నెలకొంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం  అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడి’ గా సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బల నిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు   గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మెజారిటీని నిరూపించు కునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సిద్ధమయ్యారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్‌ కాళిదాసు కొలాంబ్కర్‌ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్‌ పాటిల్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే  లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజ...

జగన్ కు జేజేలు..జనం నీరాజనాలు

చిత్రం
సందింటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు దేశం అంతా తన వైపు చూసుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న యువ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. మాట ఇవ్వడం దానిని అమలు చేసేంత దాకా నిద్రపోని తత్వం కలిగిన ఈ దిగ్గజ నేత ఏది చేసినా అది జనం కోసమే. ప్రస్తతం ఏపీలో ఆయన హవా నడుస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకు వస్తున్నారు. ఆ మేరకు అధికారులను, తన మంత్రివర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారు. ఆరు నెలల్లో అందరితో శెభాష్ ఆనిపించు కుంటానని ఆయన సవాల్ విసిరారు. దానిని తూచ తప్పకుండా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీలో ఖాళీ ఖజానా.. గాడిలో లేని పాలన.. అన్ని రంగాల్లోనూ అవినీతి విశృంఖలత..రాజ్యం ఏలుతోంది. దానిని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకు వచ్చాడు. తొలి అడుగే సంక్షేమ సంతకం చేశారు. అన్ని వర్గాలకు ఆలంబనగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ఏ ఒక్క పథకానికీ దూరం కాకూడదన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి తరచూ చెబుతున్న...

ఏమిటీ ఘోరం..ప్రియాంకా క్షమించు

చిత్రం
సభ్య సమాజం ఇవ్వాళ దోషిగా నిలబడింది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆపై నామ రూపాలు లేకుండా శవమయ్యారు. చివరకు ఆధారాలు సైతం దక్కని రీతిలో కాల్చబడ్డారు. ఇదేదో మర్డర్ సినిమా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ లో జరిగిన దారుణమైన, అమానవీయమైన సంఘటన. నిన్న కళ్లెదుటే రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో ను కాల్చిన దుర్ఘటన మరిచి పోక ముందే, మరో దారుణం కళ్ళముందే జరగడం బాధాకరం. టెక్నాలజీ పెరిగినా, చట్టాలు ఉన్నా, లెక్కలేనంతగా పోలీసులు రక్షణగా ఉన్నా ..వేలాది వాహనాలు, భారీగా జనం నిత్యం ప్రయాణం సాగించే శంషాబాద్ ప్రాంతం ఈ మొత్తం ఘటనకు సాక్షీ భూతంగా నిలిచింది. ప్రభుత్వ పనితీరుకు ఇది అడ్డం పడుతోందని బాధిత కుటుంబం అంటోంది. కాలనీ వాసులు ప్రియాంకా రెడ్డికి నివాళులు అర్పించారు. నిందింతులంతా 20 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండడం కూడా మరింత ఆందోళన కలిగించే అంశం. బాధితురాలు ఆందోళన చెందడం, అప్పుడే ఆమె చెల్లెలితో మాట్లాడిన సమయంలో పోలీసులు రెస్పాండ్ అయి ఉనింటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం పడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ప్ర...

స్లీపింగ్ లవర్స్ కు లక్కీ ఛాన్స్

చిత్రం
ఎప్పుడూ ఇంట్లో నిద్ర పోయే వాళ్ళుంటే వాళ్ళను తిట్టడం మామూలే. కానీ హాయిగా నిద్ర పోయే వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తోంది ఓ స్టార్ట్ అప్ కంపెనీ. తాము తయారు చేయబోయే పరుపుల కోసం సదరు కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎంత కంఫర్ట్ గా ఉంటే ఆ పరుపులు అంత డిమాండ్ ఉండేలా చేయడం దీని ప్రత్యేకత. నిద్ర ఎలా పడుతుంది. నిద్ర పట్టేందుకు పరుపు ఏ విధంగా తోడ్పడుతుంది. ఎలాంటి కలర్స్ వాడితే ఎంత సౌకర్య వంతంగా ఉంటుందో నని రీసెర్చ్ చేస్తోంది ఈ కంపెనీ. అయితే బంపర్ ఆఫర్ దక్కాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. ఇందు కోసం కంపెనీ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎంపికైన వారు రోజూ రాత్రి తప్పనిసరిగా 9 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. మంచిగా నిద్ర పోయే వాళ్లకు బెంగళూర్ కు చెందిన వేక్ ఫిట్ కంపెనీ అరుదైన అవకాశం ఇస్తోంది. అయితే మీరు మామూలుగా చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటల పాటు ఫుల్లుగ నిద్ర పోతే చాలు లక్ష రూపాయల జీతం ఇస్తామంటోంది ఈ కంపెనీ. అయితే 100 రోజుల పాటు ఈ డ్యూటీ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటు పడినట్లే. పప్పులో కాలు వేసినట్లే. ఇంకెక్కడో కా...

రండి..మాట్లాడుకుందాం

చిత్రం
నిన్నటి దాకా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 48 వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. 52 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, విద్యార్ధి, యువజన సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కార్మికులు చేసిన ఈ పోరాటం చిరస్థాయిగా నిలిచి పోయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్రసింగ్ చౌహన్ కార్మికుల వైపు నిలబడ్డారు. ఓ రకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసు కోవాలని సూచించారు. మరో వైపు విపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, కేంద్ర మంత్రి గడ్కరీ సైతం వెంటనే విధుల్లోకి తీసు కోవాలని కోరారు. తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడింది. దీంతో సీఎం కేసీఆర్ ఓ మెట్టు దిగారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి చర్యలు తీసుకుని ఉన్నట్లయితే కార్మికులు చనిపోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఇదే సమయంలో సీఎం లేటైనా లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి షరతులు పెట్టకు...

జీల్ కు మరిన్ని కష్టాలు

చిత్రం
ఒకప్పుడు ఇండియాలో ఒక వెలుగు వెలిగిన పలు కంపెనీలు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్ధిక భారం మోయ లేనంతగా ఉండడం, ప్రపంచ ఆర్థిక మంద గమనం తిరో గమనం వైపు సాగుతుండడంతో పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా అగుపించడం లేదు. తాజాగా ప్రమోటర్‌‌ సుభాష్‌‌ చంద్ర రాజీనామా అనంతరం వార్తల్లోకి వచ్చిన జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌ - జీల్‌‌ కు కొత్త సమస్యలు ఎదురు కానున్నాయి. తాజాగా సుబోధ్‌‌ కుమార్‌‌, నిహారికా వోహ్రా ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లు రాజీనామా చేయడం, ఆరోపణలు లేవ నెత్తడం వల్ల కంపెనీకి సమస్యలు తలెత్తనున్నాయి. కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ నిధులను సొంత అసోసియేషన్‌‌ కోసం ఖర్చు చేయడం సహా, కంపెనీలో పలు అక్రమాలు జరిగాయని వీరు ఆరోపించారు. దీంతో సెబీతో పాటు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి. సీఎస్‌‌ఆర్‌‌ నిధుల అక్రమాలపై ఎంసీఏ విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఆర్‌‌ఎస్‌‌ నిధులను జీ తన సొంత అసోసియేషన్‌‌ కోసం వాడినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని, ఇదే నిజమని తేలితే కంపెనీపై చర్యలు తప్పవని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. మాజీ డైరెక్టర్ల ఆరోపణలపై జీ స్ప...

అజ్జూకు అరుదైన గౌరవం

చిత్రం
భారత మాజీ క్రికెట్ సారధి, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు మహమ్మద్ అజహరుద్దీన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే ఈ అతగాడికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. ఇండియా జట్టుకు ఎనలేని విజయాలు నమోదు చేసిన ఆటగాడిగా పేరుంది. ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  అజహరుద్దీన్‌ పేరిట ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్‌ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒక దానిని అజహర్‌ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతి రాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్‌ పెవిలియన్‌ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్‌.దయానంద్‌ పేరు కూడా పెట్టనున్నారు. టి20 మ్యాచ్‌ కోసం నేటి నుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ...

ఫ్రాంచైజీలపై రాహుల్ ఫైర్

చిత్రం
మాజీ భారత జట్టు సారధి, ప్రస్తుత క్రికెట్ అకాడెమీ బాధ్యుడు రాహుల్ ద్రవిడ్ ఫ్రాంచైజీలపై నిప్పులు చెరిగారు. సామాన్యంగా తనపని తాను చేసుకుని పోయే స్వభావం ఉన్న వ్యక్తి. ఉన్నట్టుండి తన మనసులోని అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కంపనీలు దీనిపై కన్నేశాయి. అంతే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే ఫ్రాంచైజీలు మాత్రం భారత సీనియర్ ఆటగాళ్లను అస్సలు పరిగణలోకి తీసు కోవడం లేదు. దీనిపై ది వాల్ తీవ్రంగా స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారత క్రికెట్ కోచ్ లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసు కోవడంలో ఇండియన్ కోచ్ లే ముందుంటారని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రతిభా వంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని, హెడ్‌ కోచ్‌గా పెట్టుకునే అవకాశం∙లేకపోతే కనీసం, అసిస్టెంట్‌ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఈ దిగ్గజ ద్రవిడ్‌ సూచించాడు. ...

బంధాలే కీలకం..కథకు ప్రాణం

చిత్రం
దేనికైనా కుటుంబమే ముఖ్యం. కథైనా లేదా పాటలైనా, మాటలైనా అన్నీ ఇందులోంచి వచ్చినవే. అందుకే బంధాల అనుబంధాలను, వాటిలోని భావోద్వేగాలను తెరమీద చూపించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారు వర్ధమాన దర్శకుడు సుందర్ సూర్య. ఆప్యాయతలు.. అనుబంధాలంటే ఆయనకు చాలా ఇష్టం. పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా అంటున్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ ఆధారంగానే అమ్మమ్మగారి ఇల్లు సినిమా తీశా అంటున్నారు సూర్య. కథా చర్చల కోసం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే దీనినే ఎంచుకున్నారు. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. ఆమెకు చాలా రుణపడి ఉన్నా. మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కు కోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు ఈ యంగ్ డైరెక్టర్. అమ్మమ్మ గారి ఇల్లు చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను ...

హబ్బీకీ ప్రియాంక లవ్లీ గిఫ్ట్

చిత్రం
‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్‌ స్టార్‌ మొదటి పెళ్లి రోజును జరుపు కోబోతున్నారు.  2018 డిసెంబర్‌ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్‌ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్‌ప్రైజ్‌ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇ​క దీనిపై స్పందించిన నిక్‌..ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్‌ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ...

సర్కార్ తీస్తానంటున్న వర్మ

చిత్రం
సంచలనాలకు కేరాఫ్ గా మారిన దమ్మున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది తీసినా అది వివాదాస్పదం అవుతోంది. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ మూవీ తీశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పలు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఇంకా ఈ సినిమాకు సెన్సార్ సెర్టిఫికెట్ రాలేదు. అయినా తాను మాత్రం ఆగనంటున్నాడు ఈ డైనమిక్ దర్శకుడు. మరాఠాలో బాల థాక్రే ఏర్పాటు చేసిన శివ సేన మొదటి సారిగా అధికారంలోకి వచ్చింది. గతంలో రామ్ గోపాల్ వర్మ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సర్కార్ సినిమా తీశారు. ఇది బాల్ థాక్రే కు చెందిన మూవీ. అది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే తన మనసులోని మాట బయట పెట్టారు వర్మ. సర్కార్ సినిమాను మరోసారి తీయాలని ఉందన్నారు. బయట, సోషల్‌ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించు కోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్‌ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది అంటున్నారు ఈ డైరెక్టర్. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల చే...

ఓటమిని ఒప్పుకోను..గెలిచేదాకా నిద్రపోను

చిత్రం
ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా నేను పట్టించుకోను. నేను చేసిన సినిమాలు సక్సెస్ కావొచ్చు. కాక పోవచ్చు. వాటిపై నిజాయితీగా కామెంట్స్ చేస్తే ఒప్పుకుంటా. కానీ నా మూవీస్ చూడకుండా అర్థం లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఓటమిని తేలిగ్గా తీసుకోను. అయితే గెలిచేదాకా నిద్ర పోను అని స్పష్టం చేశారు ప్రముఖ యంగ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆడినా.. ఆడక పోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటున్నాడు అర్జున్‌ రెడ్డి. ఇటీవల విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేక పోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా, ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవారని వెల్లడించారు. విజయ్‌ గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమంలో పాల్గొన్నాడు. డియర్‌ కామ్రేడ్‌ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయ...

రౌడీపై పార్వతి ఫైర్

చిత్రం
అర్జున్‌ రెడ్డి సినిమా విడుదలై రెండేళ్లు అయినా ఇంకా ఆ సినిమాపై వివాదాలు మాత్రం రాజు కుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీ లోనూ తెర కెక్కించడంతో విమర్శకులు మండి పడిన విషయం తెలిసిందే.  ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించే దాన్నే కాదంటూ కుండ బద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్‌ ఫెస్ట్‌వల్‌ వేదికలో విజయ్‌ దేవరకొండ ఎదురు పడగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వది లేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంప దెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను, కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్‌ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్‌ వ్యాఖ్యలపై హీరో విజయ్‌ రెస్పాండ్ అయ్యారు. ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడు...

ఆర్టీసీకి సీఎం ఆక్సిజన్..ఇదే లాస్ట్ ఛాన్స్

చిత్రం
ఎట్టకేలకు పెద్దాయన దయ తలిచిండు. 52 రోజులుగా సమ్మె చేసి ఇటీవలే విరమించిన కార్మికులకు తీపి కబురు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులారా వెంటనే సంతోషంగా జాయిన్ కండి. మీరంతా నా బిడ్డలే. ఎప్పుడో చెప్పిన. నా మాటలు పట్టించుకోలేదు. యూనియన్ నేతల మాటలు విన్నారు, రోడ్డున పడ్డారు. సంస్థ మీది. నా వెంట ఉన్నారు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నానని చెప్పారు కేసీఆర్. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి  లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలని కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న. మీకు ఏ యూనియన్‌ సహాయ పడదు. యూనియన్‌ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది.  యాజమాన్యం వేధింపులు భరించాలా అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా పెడతా. సమ్మె ప్రక్రియలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడు కుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. తెలంగాణ ...

నిత్య..ఆనందమే

చిత్రం
ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క నిత్యా మీనన్ కే చెల్లుతుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఏది చెప్పినా లేదా మాట్లాడినా హాటుగా, ఘాటుగా ఉంటాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించడానికి తానే పర్ఫెక్ట్‌ అని చెప్పి చర్చల్లో నిలిచింది. ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టించడం పరిపాటిగా మారింది. బాల నటి గానే సినీ రంగ ప్రవేశం చేసిన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే 31 ఏళ్ల నిత్యాకు ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. కాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె అక్కడ జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ సినిమాకు అసలు సెట్‌ కాదని తెలిపారు. అడవులలో మృగాలను కెమెరాలో బంధించాలన్నది తన ఆశ అని తెలిపారు. పరిస్థితుల ప్రభావంతో అనుకోకుండా నటినయ్యాను అని చెప్పారు. అయితే సమీప కాలంగా తాను సినిమాను చాలా ప్రేమించడం మొదలెట్టానని తెలిపారు .ఇదో అందమైన రంగం అని, దీని ద్వారా తాను ప్రజల మనసుల్ని మార్చ గలుగుతున్...

ఓన్లీ రిలయన్స్ అదుర్స్

చిత్రం
భారతీయ వ్యాపారాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరో అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక ఇండియన్ కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, 1,584ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ చివరకు 0.6 శాతం లాభంతో 1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ సంపద 4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీలోని 250 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాప్‌గా వ్యవహరిస్తారు. అతి తక్కువ కాలంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని సాధించడం విశేషమని చెప్పక తప్పదు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్‌ ఈ ఫలితాన్ని పొందింది. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడ...

సోని ప్లాన్ అమలయ్యేనా

చిత్రం
ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కు చెందిన ముకేశ్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించి నెట్‌వర్క్‌18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరక పోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెట్‌వర్క్‌18లో వాటా  కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చు కోవాలి అనే అంశంపై సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం మరింత పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ తదితర పోటీ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వ గలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సం...

సోని ప్లాన్ అమలయ్యేనా

ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కు చెందిన ముకేశ్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించి నెట్‌వర్క్‌18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరక పోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెట్‌వర్క్‌18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చు కోవాలి అనే అంశంపై సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం మరింత పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ తదితర పోటీ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వ గలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత...