నిత్య..ఆనందమే

ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క నిత్యా మీనన్ కే చెల్లుతుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఏది చెప్పినా లేదా మాట్లాడినా హాటుగా, ఘాటుగా ఉంటాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించడానికి తానే పర్ఫెక్ట్‌ అని చెప్పి చర్చల్లో నిలిచింది. ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టించడం పరిపాటిగా మారింది. బాల నటి గానే సినీ రంగ ప్రవేశం చేసిన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే 31 ఏళ్ల నిత్యాకు ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. కాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె అక్కడ జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ సినిమాకు అసలు సెట్‌ కాదని తెలిపారు. అడవులలో మృగాలను కెమెరాలో బంధించాలన్నది తన ఆశ అని తెలిపారు. పరిస్థితుల ప్రభావంతో అనుకోకుండా నటినయ్యాను అని చెప్పారు. అయితే సమీప కాలంగా తాను సినిమాను చాలా ప్రేమించడం మొదలెట్టానని తెలిపారు .ఇదో అందమైన రంగం అని, దీని ద్వారా తాను ప్రజల మనసుల్ని మార్చ గలుగుతున్నాను. నా సినిమా జీవితం పెద్దలు నిశ్చయించిన పెళ్లి లాంటిది. ప్రేమ వివాహంలా వెంటనే భార్య భర్తల మధ్య అన్యోన్యత కలగదని వ్యాఖ్యానించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో పోను పోను అందమైన ప్రేమానురాగాలు కలుగుతాయని అన్నారు.

అలాంటిదే తనకిప్పుడు సినిమాపై కలుగుతున్న ప్రేమ అని వెల్లడించారు. మరో విషయం ఏమింటే తనకు మెథడ్‌ యాక్టింగ్‌ తెలియదని, అదే విధంగా తనతో ఎవరూ అధికంగా పని చేయించలేరని చెప్పారు. సన్నివేశాలను చదివి, అర్థం చేసుకునే తారగానే నటిస్తానని తెలిపారు. అలా నటన వచ్చేస్తుందని నిత్యామీనన్‌ పేర‍్కొన్నారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌కు తెలుగులో ప్రస్తుతం ఒక చిత్రం కూడా లేదు. ఇకపోతే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన సైకో చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాతృభాష మలయాళంలో మాత్రం రెండు చిత్రాల్లోతో పాటు, తమిళంలో జయలలిత పాత్రలో ది ఐరన్‌ లేడీగా మారడానికి సిద్ధం అవుతున్నారు ఈ ముద్దుగుమ్మ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!