పోస్ట్‌లు

ఆగస్టు, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రోగుల పాలిట దేవత ..ఎందరికో స్ఫూర్తి ప్రదాత

దేశంలో ఐటి రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రాంతంగా హైదరాబాద్ దూసుకు వెళుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు లాజిస్టిక్ , హెల్త్ , ఈ కామర్స్ , టెలికాం , ఆయిల్ , ట్రాన్స్ పోర్ట్ , నిర్మాణ , రియల్ ఎస్టేట్ , తదితర రంగాలలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటి సెక్టార్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా చితికి పోతున్నారు. తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో సోషల్ , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కు , సైకాలజీ లో అనుభవం కలిగిన వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, బిహేవిరియల్ , టెన్షన్ ఫ్రీగా ఉండేందుకు ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో సలహాదారులుగా, పర్మినెంట్ గా పని చేస్తున్నారు. పలు వ్యక్తిగత సమస్యలతో సతమత మయ్యే వారికి స్వాంతన చేకూరుస్తున్నారు. దైనందిన జీవితంలో వత్తిళ్ల నుండి అధిగమించేందుకు ఆయా ప్రధాన హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా బాధితుల కోసం సెంటర్స్ ను నెలకొల్పారు. హైదరాబాద్ లో చాలా మంది ట్రైనర్స్ వేలాద...

హనుమ విహారం ..అద్భుత శతకం

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న డెసిషన్ తప్పు కాదని తేలిపోయింది. నిన్నటి దాకా ముంబై లేదా కోల్ కత్త వారిదే డామినేషన్ నడిచింది. గత కొంత కాలంగా తెలుగువాడైన ఏపీకి చెందిన ప్రసాద్ అత్యున్నతమైన, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించాడు. ఇది జీర్ణించు కోలేని ముంబై పరివారం అతడిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందులో మొదటి వ్యక్తి మాజీ సారధి సునీల్ గవాస్కర్. అయినా పట్టించు కోవాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేశాడు ప్రసాద్. హనుమ విహారికి ప్రసాద్ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విహారి వమ్ము చేయలేదు.  విండీస్ టూర్ లో హనుమ  అత్యున్నతమైన ప్రతిభ చూపాడు. గతంలో హైదరాబాద్ అంటే పటౌడీ, శివలాల్ యాదవ్ , అజహరుద్దీన్ , లక్ష్మణ్ , అర్షద్ అయూబ్, వెంకట పతి రాజు, అంబటి రాయుడు , ఇలా చాలా మంది ఇండియన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా హనుమ విహారి ఇప్పుడు రాణిస్తున్నాడు. కాగా రాయుడు ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించాడు. తిరిగి మళ్ళీ ఆడుతానంటూ వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి విహారి వైపు మొగ్గు చూపార...

వెంటాడే జ్ఞాపకం..పూసిన మందారం..!

చిత్రం
పిచ్చి వాళ్ళను చూడాలని ఉందా..? అయితే ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే సినిమా రంగం ఉందిగా . అక్కడ చదువుతో పని లేదు. కావాల్సినంత సరుకుంటే చాలు. మీకు మీపై నమ్మకం, క్రియేటివిటీ  ఉంటే చాలు. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతాయి. టెక్నాలజీ పుణ్యమా , డిజిటల్ మీడియా రంగం వచ్చాక సీన్ మారింది. ఇక్కడ ఒక్కరిదే రాజ్యం కాదు..అందరీదీనూ. ఎవరికి వారే కింగ్ లు . తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే ఛాన్స్ ఉంటోంది. ప్రతి రంగంలో ఉన్నట్లే ఇక్కడ కూడా హీరోయిన్లు, ఇతర పాత్రల్లో నటించే మహిళలు వివక్ష ఎదుర్కుంటున్నారన్న విమర్శలున్నాయి. తన వారు సినీ రంగంలో ఉన్నప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది .  వరలక్ష్మి శరత్ కుమార్. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్ళు . ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం అలవాటు. కన్నడ, తమిళ్, మలయాళం లలో నటిస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా ఆమె సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. ట్విట్టర్ లో , ఇంస్టా గ్రామ్ లో వరలక్ష్మికి ఫాలోయింగ్ ఎక్కువ. నటిగా , డ్యాన్సర్ గా ..జంతు ప్రేమికురాలు, ఫెమినిస్ట్. సేవ చేసేందుకు స్వంతంగా సేవ్ శక్తి ని ఏర్పాటు చేశారు. మైక్రోబయోలజీలో డిగ్రీ , ఎడిన్ బ...

కాసులు కురిపిస్తున్న ఐడియా..!

చిత్రం
దునియాలో ఒకప్పుడు బతకాలంటే సవాలక్ష ఇబ్బందులు. ఇప్పుడు అలాంటి కస్టాలు ఏమీ లేవు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ప్రపంచం చిన్నదై పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. రా రమ్మంటూ ఊరిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వేచి చూడటమే మిగిలి ఉన్నది. సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న పెను మార్పుల దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమై పోయాయి. వేలాది మందికి కొలువులు దక్కుతున్నా, ఆశించినంతగా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వేలాదిగా స్టార్ట్ అప్ సంస్థలు పుట్టుకు వచ్చాయి. ప్రారంభంలో చిన్న గదుల్లో స్టార్ట్ అయి..నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే రోజు రోజుకు చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. ఐటి, ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా , టెలికం, ఆయిల్ , జ్యూయలరీ , ట్రాన్స్ పోర్ట్ తదితర రంగాలలో పని చేస్తున్న వారు అభద్రతకు లోనవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో కంపెనీల ఏర్పాటు అన్నది భారీ ఖర్చుతో  కూడుకున్నది. కోట్లాది రూపాయలతో పాటు ఒక్కోసారి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి ఎక్కువ కావడం, ఉద్యోగాల ...

ఇక చాలదా నీ జీవితానికి..!

చిత్రం
మనకో వేదిక కావాలి ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న ప్రచారం కావాలంటే మనకో గ్రూప్ ఉండాలి అందుకు సరిపడినంత లౌక్యం కావాలి  అప్పుడేగా కర్చు లేకుండా అభిమానులు దొరికేది అబ్బో యెంత ఫాలోయింగో అనుకుంటూ మనం ఆక్షర్యానికి గురవుతాం..అంతలోనే మనకెందుకు అనుకుంటూ సాగిపోతాం ..! ఎవరి దారులు వాళ్ళవి ఎవరి లోకంలో వాళ్ళు లోపట ఒకటి ..బయట మరొకటి మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు మరి మనను గుర్తించాలంటే వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే మనకూ ఓ సమూహం కావాలి అది మనతో పాటే సాగేలా మన కనుసన్నలలో ఉండేలా చూసుకోవాలి ...అప్పుడేగా లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు ఇంకాస్తా ముందుకు వెళితే అహో అంటూ కితాబులు ..! నువ్వు కవి కాదల్చుకున్నవా తక్కువ కాలంలో గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో నీ పేరు మారు మోగాలా అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు నీ గురించి పతాక స్తాయిలో గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు కాస్తంత లౌక్యం ఉంటె సరి ఇంకెందుకు ఆలశ్యం రండి ..పైసా ఖర్చు లేకుండా మహా కవి కాదల్చుకున్నవా ..! అయితే వెంటనే ఓ వేదిక చూసుకో నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో నిన్ను ప్రశించే వాళ్ళు లేకుండా చూసుకో ఇక..నీవొ...

బ్యాంకుల విలీనం ..ఉద్యోగులు గరం గరం..!

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ తీరుపై ఇప్పటికే జనం అసంతృప్తితో వున్నారు. పుండు మీద కారం చల్లినట్లు గతంలో మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయింది. కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వృద్ధి రేటు పడి పోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేసుకుంటున్న సర్కార్, ఆచరణలోకి వచ్చే సరికల్లా అమలు కావడం లేదు. ఇప్పటికే చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. తాజాగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులను బదిలీ చేసింది. దీంతో ఇండియన్ ఎకానమీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంకో వైపు తమ అనుమతి, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్ధిక మంత్రి బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయం తీసు కోవడంపై ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల...

అమరావతిపై రాద్ధాంతం ..బాధితులు ఆందోళకరం

చిత్రం
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడైతే సందింటి జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో, ఆనాటి నుంచి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి , మంత్రి బొత్స సత్యనారాయణలు ఇప్పటికే కేపిటల్ సిటీగా అమరావతి సరైనది కాదని, దాని స్థానంలో ఇంకో ప్రాంతాన్ని ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక విజయసాయి రెడ్డి అయితే, ఏకంగా ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా కు తెలిసే జరుగుతోందంటూ కొత్త ట్విస్ట్ కు తెర లేపారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు, బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలిశారు. ఈ విషయంపై పవన్ అమరావతి విషయంలో బొత్స పై ఫైర్ అయ్యారు. దానిని మార్చవద్దంటూ కోరారు. అంతే కాకుండా బాధితులతో సమావేశ మయ్యారు. బొత్స ముందు వెనుకా అలోచించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు సైతం ఎట్టి పరిస్తతుల్లోనూ అమరావతినే కేపిటల్ సిటీగా ఉంచాలని, మార్పులు చేస్తే తీవ...

దుమ్ము రేపుతున్న రాధమ్మ కూతురు టైటిల్ సాంగ్ - రేవంత్ అదుర్స్

చిత్రం
తెలుగు బుల్లితెర మీద జీ తెలుగు కు ఓ ఇమేజ్ ఉన్నది. సీరియల్స్ తో పాటు వినోదాన్ని అందించడంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. తాజగా స్టార్ టీవీ తెలుగులోకి ఎంటర్ అయ్యింది. దీంతో స్టార్ , జీ తెలుగు ఛానల్స్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. స్టార్ గ్రూప్ నకు ఉదయ్ శంకర్ ఎప్పుడైతే సీయీవోగా వచ్చాడో ఇక దాని స్వరూపాన్ని మార్చేశాడు. ఏకంగా రీజినల్ లంగ్యేజ్ లలోకి స్టార్ ను ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రతి ప్రోగ్రాం ను ఆయా ప్రాంతాలకు , నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూశాడు. ఇంకేం తెలుగులో మాటీవీని కొనుగోలు చేశాడు. ఇక్కడ టాప్ రేంజ్ లో ఉన్న జీ తెలుగు కు గట్టి పోటీ ఇప్పుడు మా ఇస్తోంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను తీసుకు వస్తూ జనాన్ని ఎంటర్ టైన్ చేసే పనిలో పడింది. బిగ్ బాస్ , అగ్ని సాక్షి, కార్తీక దీపం స్టార్ మా టీవీని ఆదరించేలా చేస్తున్నాయి. మా టీవీని తట్టుకునేందుకు జీ తెలుగు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. తాజగా నిన్నే పెళ్లాడుతా సీరియల్ స్థానంలో కొత్తగా రాధమ్మ కూతురు సీరియల్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ కోసం రూపొందించిన అందే అందే చేతులే ఆకాశానికి.. అన్న టైటిల్ సాంగ్ రికార్...

ప్రభాస్ భళారే ..సాహో సూపరే..!

చిత్రం
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అంచనాలకు అందకుండా సంచనాలు సృష్టిస్తున్న ఒకే ఒక్క సినిమా సాహో నిన్నటి దాకా రాజమౌళి బాహుబలి రికార్డులు తిరగ రాస్తే , ఇప్పుడు సుజిత్ రెడ్డి తీసిన ఈ మూవీ రికార్డుల సునామీ రేపుతోంది. టాలీవుడ్ లో ఇప్పటి దాకా హాలీవుడ్ రేంజ్ లో ఇలాంటి సినిమాను ఏ డైరెక్టర్ తీయలేక పోయాడు. కంట్రీ అంతటా ఈ మూవీ గురించిన చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినీ జనాలకు, ఫ్యాన్స్ కు జీవితం లో మరిచి పోలేని రీతిలో కిక్ ఇచ్చాడు. తన పేరు మీదున్న రికార్డులను తానే అధిగమించాడు, ఈ పాన్ ఇండియన్ స్టార్. హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్టర్ సుజీత్ రెడ్డి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా చేయని రీతిలో సాహో ను 10 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే వారం రోజుల వరకు అన్ని థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయని అభిమానులు వాపోతున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో సుజీత్ రూపొందించాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ న్యూస్ మేకర్ గా మారి పోయాడు.బాడీ పరంగా  సిల్వర్ స్టోలెన్ ను తలపించే ప్రభాస్ తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా...

సింధు సరే...వీళ్లకేం తక్కువ ..?

చిత్రం
ఈ దేశాన్ని కాషాయ మయం చేయాలని అనుకుంటున్న మోడీ, అమిత్  షా , ఆర్. ఎస్ . ఎస్.  పరివారం సక్సెస్ అయినప్పటికీ, ఇంకా కార్పొరేట్ , బిజినెస్ టైకూన్లు , రిలయన్స్ అంబానీ, ఆదానీలదే  హవా నడుస్తోంది. మన్ కీ బాత్ , స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తున్నంతగా దేశం ఎదగడం లేదు. వీరి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. ఏకంగా వ్యాపారం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్లాది  రూపాయలు  కొల్లగొడుతూ ఆస్తులు సంపాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బడా బాబులకు వంత పాడుతోంది. ఈ బిలియనీర్లు ఇప్పుడు ఆటగాళ్లను స్పాన్సర్ చేస్తున్నారు. వీరిని బ్రాండ్ అంబాసిడర్లు గా వాడుకుంటున్నారు. ఇండియాలో మహిళల విభాగంలో పీవీ సింధు ఏడాదికి 20 కోట్లకు పైగానే సంపాదిస్తోందని అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఒకే ఒక్క ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ అయిదు బంగారు పతకాలు సాధించి పెట్టి , దేశాన్ని , జాతిని  తలెత్తుకునేలా చేసిన చిరుత పులి హిమ దాస్,  బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన మేరీ కోమ్ , ఒకే కాలుతో ప్రతిభ చూపిన జోషి గు...

అరవై ఏళ్ళ నవ మన్మధుడు

చిత్రం
పట్టుమని ముప్పై ఏళ్లకే జవసత్వాలు కోల్పోతున్న ఈ తరుణంలో అతను మాత్రం 60 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా నవ మన్మధుడిగానే అలరిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ను, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నాగార్జున అక్కినేని. నవరసాలను పలికించే అతికొద్ది మంది నటుల్లో నాగ్ ఒకరు. అక్కినేని నాగేశ్వర్ రావు రెండో కుమారుడు ఆయన. నట వారసత్వం పుణికి పుచ్చుకున్నా ఏ రోజు ఎవ్వరిని అనుకరించ లేదు. అటు మహిళలు ఇటు యూత్ అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. యాక్టర్ గా , బిజినెస్ మెన్ గా, యాంకర్ గా ఇలా ప్రతి ఫార్మాట్ లో నాగ్ సక్సెస్ అయ్యారు. డ్రెస్సెస్ ఎంపిక దగ్గరి నుంచి, ప్రతి పనిలో , నటనలో రిచ్ నెస్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఎన్నో సినిమాలు నటించినా చాలా మూవీస్ జనాన్ని ఎంటర్ టైన్ చేసాయి. నాగ్ కెరీర్లో మన్మధుడు అతి పెద్ద హిట్. దానికి సీక్వెన్స్ గా తాజాగా మన్మధుడు -2 విడుదలైంది. ఆ సినిమా కంటే ఈ కొత్త సినిమాలో నాగార్జున మరింత అందంగా, రొమాంటిక్ గా కనిపించారు. ముద్దులు హద్దు మీరినా నాగ్ కోసం మహిళలు వెళ్లడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. పెళ్...

ఈటెల తూటాలు..మాటల మంటలు..!

చిత్రం
తెలంగాణాలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన మాటల తూటాలు పేల్చారు. దీంతో గులాబీ దళంలో మంత్రి చేసిన మాటలు మంటలు రేపాయి. తాజాగా త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు ఉంటాయని, ఉత్తర తెలంగాణలో సీనియర్ నాయకుడిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సీరియస్ గా తీసుకున్న ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సంచలనం కలిగించింది. తాను ఆరిపోయే దీపాన్ని కాదాని, వెలిగే దీపాన్ని అని ఈటెల అన్నారు. తాను ఎవరి నుంచైనా 5 వేల రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే, రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకుంటానని చెప్పారు. తనపై కొన్ని ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. ఉద్యమ సమయం నుంచి తెరాసతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి సాయం చేశానని ఈటెల చెప్పారు.15 ఏళ్లలో తాను ఏ ఒక్కరి నుంచీ డబ్బులు తీసుకోలేదని చెప్పారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదని.. ఆ పదవి కోసం ...

కేజ్రీవాల్ నిర్ణయం..మహిళలకు వరం..ఢిల్లీలో ఉచిత ప్రయాణం..!

చిత్రం
అవనిలోనే కాదు సమాజంలో సగ భాగమైన మహిళలకు మేలు చేకూర్చేలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశంలో ఎక్కడా లేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. మెరుగైన విద్య కోసం నిధులు ఖర్చు చేశారు. అంతే కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత పేరుతో ఒకే ఒక్క రోజును నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదు, కావాల్సింది వారు తమ కాళ్లపై తాము నిలబడాలి. అంతే కాదు మహిళలు, యువతులు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే పలుసార్లు ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా ఆప్ ఆడుతున్న నాటకం అని కొట్టి పారేస్తోంది. తాజాగా కేవలం మహిళల కోసం ఉచితంగా బస్సులో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో మహిళలు కేజ్రీవాల్ కు జేజేలు పలుకుతున్నారు. భాయ్ దూజ్ పండగను పురస్కరించుకొని అక్టోబర్ 29 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది. ఈ మేరకు సమావేశమైన ఆప్ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మహిళలకు సురక్షిత ప్రయాణ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే ...

రిలయన్స్ ఆన్ లైన్ లో బిజినెస్..!

చిత్రం
భారతీయ పారిశ్రామిక రంగంలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న రిలయన్స్  గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరోసారి షాక్ ఇచ్చేనందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దిగ్గజ ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆర్ .ఐ. ఎల్ టెలికాం, లాజిస్టిక్స్, ఈకామర్స్, డిజిటల్ , ఆయిల్, జ్యుయెలరీ రంగాలలోకి అడుగు పెట్టింది. టెలికాం రంగాన్ని సరికొత్త నిర్ణయాలతో మార్కెట్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, బీ ఎస్ ఎన్ ఎల్ , తదితర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. 34 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ తో రికార్డ్ లను తిరగ రాసింది. ఇప్పుడు ఇదే సంస్థ వినోద  రంగంతో పాటు భారతీయ మార్కెట్ లో బిగ్ నెట్ వర్క్ కలిగిన కిరాణా దుకాణాలపై కన్నేసింది. ఇంకేం ఆల్ రెడీ ఆఫ్ లైన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా తాజాగా ఆన్ లైన్ లో కి ఎంటర్ అయ్యేందుకు పావులు కదుపుతోంది. వచ్చే దీపావళి పండుగ నాటికి రిలయన్స్ ఆన్ లైన్ బిజినెస్ పేరుతో రంగంలోకి దిగనుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తన న్యూ కామర్స్ వెంచర్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే దేశంలో భారీ ఎత్తున రిటైల్, డిజిటల్ స్టోర్స్ ను ఏ...

మీ విజయం అపురూపం ..ఎందరికో ఆదర్శం

చిత్రం
ప్రపంచ స్థాయి విజేతలకు భాగ్యనగరం వేదికగా ..కేరాఫ్ గా మారిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుతో పాటు పారా బ్యాడ్మింటన్ జగజ్జేతగా నిలిచిన మానసి జోషిని ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జరగ బోయే ఒలంపిక్స్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించాలని, ఆయా రాష్ట్రాలకు పేరు తీసుకు రావాలని సీఎం కోరారు. ఈ విజయం సాధించడం ద్వారా భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. భవిష్యత్తులో జరిగే పోటీలలో సింధు పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ లేవల్లో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. పీవీ సింధు , ఆమె పేరెంట్స్ , కోచ్ గోపీచంద్ , తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరి నాథ్ ప్రగతి భవన్ లో కలిశారు. వీరితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి , డిజిపి మహేందర్ రెడ్డి , పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్ , సజ్జనార్ , మహేష్ భగవత్ , ఇంటెలిజెన్స్ ఐజి న...

కొలువులు సరే..వయసు మాటేమిటి..?

చిత్రం
బంగారు తెలంగాణ పేరుతో దుమ్ము రేపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ళు కావస్తున్నా నేటికీ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు వరకు స్పష్టం చేయలేదు. పోరాటాలు, బలిదానాలు, ఆత్మహత్యలు, కేసులు, అరెస్టులతో కోరి తెచ్చుకున్న తెలంగాణాలో ఇప్పుడు ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉరే మిగిలేలా చేస్తోంది. ఇప్పటి దాకా 10 లక్షల మందికి పైగా కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎంతటి దుర్భర పరిస్థితి ఉన్నదో. ఇక చిలుక పలుకులు పలుకుతున్న కేంద్రంలో రెండో సారి కొలువు తీరిన మోడీ సర్కార్ ఇందుకేమీ భిన్నంగా లేదు. ఎంత సేపు స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అసలైన శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో  ఇక కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. వేలాది మంది కాట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. విద్య శాఖా నిద్ర పోతుండగా , ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదు. కేజీ టూ పీజీ అంటున్నారే త...

కార్తీక దీపం..బుల్లితెరపై సంచలనం..!

చిత్రం
తెలుగు  వినోదపు రంగంలో స్టార్ టీవీ రికార్డులను షేక్ చేస్తోంది. ఎప్పుడైతే స్టార్ గ్రూప్ కు ఉదయ శంకర్ సి.ఈ.ఓ గా  ఎంటర్ అయ్యాడో ఇక అప్పటి నుంచి ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగమే కాదు డిజిటల్ మీడియా రంగంలో పెను సంచనాలు సృష్టించేలా చేశాడు. ఆసియా ఖండంలో దుమ్ము రేపుతున్న స్టార్  టీవీ ఇప్పుడు ఇండియాను తిప్పేస్తోంది. బుల్లి తెరను స్టార్ టీవీ వాడుకున్నంతగా ఏ టీవీ వాడు కోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సగటు బుల్లితెర ప్రేక్షకులు అంతా స్టార్ చేజిక్కించుకున్న మాటీవీని విడిచి ఉండలేక  పోతున్నారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తూ తెలుగు వినోద రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది స్టార్ మా. ఓ వైపు  మా టివి ఇంకో వైపు హాట్ స్టార్ ..ఓహ్ ..ఉదయ్ శంకర్ సత్తా ఏమిటో ఈ పాటికే తెలిసింది.  మిగతా టీవీ యాజమాన్యాలకు. తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్ సైతం మా టీవీ దెబ్బకు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో ఏం జరుగుతోంది అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అంటే దాని స్టామినా ఏపాటిదో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగు సీరియల్స్ లలో మిగతా ఛానల్స్ ను వెనక్కి నెట్ట...

!..వైకల్యాన్ని అధిగమించి..విజేతగా నిలిచి..! జయహో మానసి..!

చిత్రం
ఓ వైపు పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడా విభాగంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టిస్తే, అదే ఇండియాకు చెందిన క్రీడాకారిణి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రపంచం నివ్వెర పోయేలా విజేతగా నిలిచింది. మువ్వొన్నెల భారతీయ పతాకాన్ని ఎగుర వేసింది. అన్ని అవయవాలు సరిగా ఉన్నా అమెరికా, డాలర్ల జపం చేసే ప్రబుద్దులకు పూర్తిగా వికలత్వం కలిగినా,  మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్ షిప్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఈ ప్లేయర్. ఒకుహరాను ఓడించి సింధు టైటిల్ నెగ్గక ముందే , ఇండియా నుంచి మానసి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నమెంట్ తో పాటే జరుగుతున్న వరల్డ్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పారా షట్లర్ మానసి జోషి మహిళల సింగిల్స్ ఎల్ ఎల్ -3 కేటగిరిలో స్వర్ణభేరి మ్రోగించింది. ఈ అమ్మాయి వర్ధమాన ఆటగాడు పుల్లెల గోపీచంద్ అకాడెమీలో శిక్షణ పొందింది. పరుల పర్మాన్ ను ఓడించి గెలుపొందింది. మహారాష్ట్ర కు చెందిన మానసి జోషి సాఫ్ట్ వెర్ ఇంజనీర్. ముంబైలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. 2011 లో రోడ్డుపై వెళుతుండగా అనుకోకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలును తొడ భాగం వరకు తొలగించారు. చేతి వేళ్ళు కూడా చిట్లి ...

లోకపు వాకిట నెత్తుటి సంతకం ..పాట..!

చిత్రం
మనసు మూగదై పోయినప్పుడు దానికి స్వాంతన చేకూర్చే సాధనాల్లో టానిక్ లాగా పని చేసేది, తక్షణమే రిలీఫ్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే పాట. ఈ లోకంలో  సకల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పాడడం రాక పోయినా కనీసం కూని రాగమైనా తీసి ఉంటారు. అడవుల్లో , పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, జంతువులు కూడా ఆనందానికి లోనైనప్పుడు ఆడుతాయి..ఒక్కోసారి అరుస్తాయి కూడా. భూమి పొరల్లో ఇంకి పోయిన ప్రతిది కూడా ఈ ప్రపంచానికి పనికి వస్తుంది. ఒక్క మానవ దేహం తప్ప. అందుకే ఏనాడో సామాజిక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం చెప్పారు. చిల్లర రాళ్లకు మొక్కడం కంటే చిత్తం మీద మనసు పెట్టు అని బతుకు మర్మం..తత్వాన్ని అర్థమయ్యేలా..జనం భాషలో చెప్పారు. తోలు బొమ్మలాటలైనా , చివరకు నాటకమైనా ..ఏదైనా పాట పరిధిలోకి రావాల్సిందే. తాజాగా బెంగాల్ కు చెందిన యాచకురాలు పాడిన పాట వైరల్ అయ్యింది. ఆమెను తక్కువ చేయడం లేదు..కానీ ప్రపంచానికే పోరాటాలతో కొత్త పాఠాలు నేర్పిన తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా గాయకులు , పాటగాళ్లు వందల కొద్దీ కనిపిస్తారు. వారు నిజమైన మట్టి బిడ్డలు. వాళ్ళ గొంతుల్లో మాధుర్యం ఉండక పోవొచ్చు. కానీ గుండెల్లో గూడు కట్ట...

ఒక్క రూపాయికే సువిధ న్యాప్కిన్స్ - మోడీ సర్కార్ నిర్ణయం..!

చిత్రం
కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది. సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు, యువతులు, బాలికల సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది. ఎక్కువగా పేద మహిళలు, కుటుంబాలు ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం వాడే సానిటరీ ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది బాధిత మహిళలకు తీపి కబురు అందించారు. ఇక నుంచి కేవలం ఒకే ఒక్క రూపాయి ఇస్తే చాలు ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వేలాది జనరిక్ మందుల షాప్స్ లలో ఇవి లభిస్తాయి. ఆ మేరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి న్యాప్కిన్స్ ను అందుబాటులో ఉంచుతోంది. ఇందు కోసం సర్కార్ కోట్లాది నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది మార్కెట్లో అధిక ధరలకు అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేక పోతున్నారు. దీంతో అనుకోని ఇబ్బందులతో పాటు చెప్పుకోలేని రోగాలకు గురవవుతున్నారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మహిళల కోసం ఇప్పటికే రాయితీపై గ్యాస్ సిలిండర్లతో పాటు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్క రూపాయి తో ఇవ్వాలని నిర్ణయించింది. రెండున్నర రూపాయలు ఉన్న దా...

కొలువులు రావు..కడుపులు నిండవు ..అర్ధాకలితో నిరుద్యోగులు

చిత్రం
ఓ వైపు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేలాదిగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని కొలువులున్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు , అభ్యర్థులు వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. పొద్దస్తమానం బంగారు తెలంగాణ భజన తప్ప భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడం లేదంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ , వయసు విషయంలో నిర్దేశించిన ఏజ్ దాటి పోతుండడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. అయినా మానవతా దృక్పథంతో ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టి, సమాజాన్ని బాగు పరిచే క్రమంలో ఉన్నత విద్య దోహద పడుతుంది. చదువు ఒక్కటే కాకుండా జనానికి. లోకానికి మేలు చేకూర్చే పరిశోధనలు అటకెక్కినవి. ఒకప్పుడు యూనివర్సిటీలు చదువులకు కేరాఫ్ గా ఉండేవి. ఇప్పుడు అవి రాజకీయాలకు, పాలకుల బంధువులకు కేరాఫ్ గా మారాయి. వారికి వంత పాడే వాళ్ళు ఉన్నత పదవులలో కొనసాగుతున్నా...

యురేనియం వద్దే వద్దు.. హ్యాట్స్ ఆఫ్ యూ..శేఖర్ కమ్ముల..!

చిత్రం
దర్శకులు కూడా మనుషులే. సినిమా అనే సరికల్లా హీరోలు, హీరోయిన్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఒక్క జాడ్యం మన తెలుగు వాళ్ళకే ఉన్నది. డైరెక్టర్లకు సామాజిక బాధ్యత కూడా ఉన్నదన్న విషయాన్ని మరోసారి గుర్తుకు తీసుకు వచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. జీవితాన్ని మరింత కళాత్మకంగా  తీసే వారిలో ఆయన కూడా ఒకరు. అప్పట్లో కాశీనాథుని విశ్వనాథ్, భారతీ రాజా, వంశీ, గీత కృష్ణ లాంటి వాళ్ళు ఉండే వాళ్ళు. ఇప్పుడు ఆయనతో మరికొందరు లైఫ్ ను, భావోద్వేగాలను వెండితెర మీద పండిస్తున్నారు. అదే తమిళ సినిమాలో అయితే లెక్కలేనంత మంది క్రియేటివ్ డైరెక్టర్లు ఉన్నారు. వారికి ఎన్నో అవకాశాలు తలుపు తడతాయి. ఇక్కడ ఇలా కాదు. హీరో ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా తీస్తారు.  వీళ్ళు తెరపై హీరోలు ..నిజ జీవితంలో జీరోలు. సినిమాల్లో చిలుక పలుకులు ..కానీ ఆదాయంపైనే మక్కువ ఎక్కువ. సామాజిక భాధ్యతను వీరు స్వీకరించేందుకు ఇష్టపడరు. శీతల పానీయాల వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయని పలువురు హెచ్చరిస్తుంటే, యాడ్స్ లలో నటిస్తూనే ఉన్నారు. ఇక తాజా విషయానికి వస్తే దర్శకుడు శేఖర్ కమ్ముల నల్లమల పై సంచలన కామెంట్స్ చేశారు. దయచేసి నల్లమలలో  యురేనియ...

!..పసిడి పండుతోంది..వెండి వెలుగుతోంది..!

చిత్రం
ఇక అందనంటూ బంగారం ధర పైపైకే వెళుతోంది. రికార్డ్ స్థాయిలో ధరలు పెరుగుతూనే ఉన్నా జనం మాత్రం కొనడం ఆపడం లేదు. హైదరాబాద్ నగరంలోని జ్యుయలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా 40 వేల రూపాయలకు చేరుకుంది. మరో వైపు వెండి కూడా సరి లేరు నాకెవ్వరూ అంటోంది. 46 వేలకు చేరుకుంది. దీంతో షేర్ మార్కెట్ రివ్వుమంటూ దూసుకెళుతోంది. ఓ వైపు పసిడి పెరుగుతుంటే , భారతీయ రూపాయి మాత్రం మరింత తగ్గింది. దేశీయ మార్కెట్ లో గోల్డ్ ప్రైజ్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. దేశమంతటా పసిడి ధర అందకుండా వెళుతున్నా, మహిళలు, యువతులు మాత్రం పోటీ పది కొంటున్నారు. రోజు రోజుకు దాని ధర ఇక ఆగలేనంటోంది. వరల్డ్ మార్కెట్ లో ట్రెండ్ పడిపోకుండా ఉండటం, రూపీ బలహీన పడటంతో పసిడి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. తాజాగా 20 నుంచి ధర తగ్గక పోగా, పెరుగుతూనే వెళుతోంది. కిలో వెండి సైతం 14 వందలు పెరిగింది. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుండి డిమాండ్ పెరగడం కూడా ధరల్లో వ్యత్యాసం అగుపిస్తోంది. ఢిల్లీ, ముంబయి మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ లో పసిడి రానంటోంది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార...

ప్రేమ పండాలంటే..రొమాన్స్ వుండాల్సిందే..!

చిత్రం
లోకాన్ని ఆవిష్కరించే దారుల్లో ప్రేమ ఒకటవుతే, మరొకటి రొమాన్స్. రెండూ లేకపోతే జీవితం బోర్ కొడుతుంది.ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడు. రెండు మనస్సుల మధ్య సాగే సంభాషణ. దానితో అనుసంధానమై పోతే హృదయం పిల్ల కాలువై పరుగులు తీస్తుంది. ఆ కళ్ళల్లో మెరుపు. ఆ కనుల కలనుల్లో సాగే కలల కలబోతలు. ఓహ్ చెప్పుకుంటూ పోతే జీవితం సరి పోదు. మరో జన్మ కావాలి. మనుషుల మధ్య ఇంకా బంధం తెగి పోలేదంటే కారణం ప్రేమ. అంతే కాదు గుండెల్ని సున్నితంగా మీటి సరాగాలు సరిగమలు పలికించే రొమాన్స్ కూడా. రెండూ ఒక దానికొకటి పెనవేసుకుని సాగి పోతూనేఉంటాయి . దీనిని ఆపాలని ప్రయత్నం చేసినా, ఒక్కసారి కమిట్ అయ్యాక ఏ మనసు ఒప్పుకోదు. ఇంకే హృదయం ఉండి పోదు. రెండింటి మధ్యన సన్నని పొర.. తెర లాగా కాపాడుకుంటూ వస్తుంది. అది చెరిగి పోకుండా ఉంటే,  లైఫ్ మరింత గొప్పగా అనిపిస్తుంది. ప్రతి క్షణం కళ్ళలోకి చూసు కోవడం, తెలియకుండా తాకడం కూడా ఎనలేని అనుభవం తోడవుతుంది. ఇది మరిచిపోలేని విధంగా నిత్యం కలిపేలా చేస్తుంది. అందుకే జీవితంలో కోల్పోయినవన్న్నీ సినిమాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్యన ప్రేమ అన్నదే లేకపోతే జీవితం నరకమవుతుంది. లోకం నుంచి వెళ్లి పోవాలన...

సాధించిన విజయం అపూర్వం

చిత్రం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పసిడి పతకాన్నిచేజిక్కించుకుని, భారత జాతీయ జెండాను సమున్నతంగా ఎగిరేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు నరేంద్ర మోదీ. పీఎం ను మర్యాద పూర్వకంగా పీవీ సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ సందర్బంగా మరిన్ని విజయాలు సాధించాలని, దేశం గర్వపడేలా కృషి చేయాలని ఉద్భోదించారు. కష్టపడితేనే గెలుపు దక్కుతుందని, ప్రతి ఒక్కరు సింధును స్ఫూర్తిగా తీసు కోవాలని కోరారు. క్రీడాభి వృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. సింధు సాధించిన గెలుపు సామాన్యమైనది కాదన్నారు. ప్రతి రంగంలో ఆటుపోట్లు ఉండడం సహజమే. ప్రతిదీ యుద్ధమే. పోరాటమే బలం కావాలి. దానినే ఊపిరిగా చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ లో ఉన్న మజా అర్థమవుతుంది. ఒక చాయ్ వాలా ఇవ్వాళ ప్రపంచంలోనే,  అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాకు ప్రధానమంత్రి కాగలిగారు.. ఇలాంటి సామాన్యుల చరిత్రను రాబోయే తరం చదువు కోగలిగేలా ఉండాలి. నిరంతరం కష్టపడగలితే విజయం దానంతట అదే దక్కుతుందన్నారు. ఈ దేశం వీరులను కన్నది. గొప్ప వ్యక్తుల, విజేతల జాబితాలోకి ఎక్కడం అదృష్టమే. ఆకాశం...

కొనేటోల్లకు కొనుక్కున్నంత

చిత్రం
ఒకప్పుడు ఏదైనా కొనాలంటే కిరాణా కొట్టుకు పోయే వాళ్ళు. లేదా వేరే దగ్గర్లో ఉన్న మండలానికో లేదా పట్టణానికో , సంతల్లోకి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు లోకం మారి పోయింది. దునియా అంతా చిన్నదై పోయింది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటనే కావాల్సినవన్నీ ఇంటి ముందు వాలి పోతున్నాయి. కావాల్సిందల్లా కొనగలిగే సామర్థ్యం ..చేతినిండా డబ్బులుంటే చాలు. దేనినైనా కొనుగోలు చేసే వీలు ఉన్నది. ఓ వైపు మార్కెట్ రంగం కుదేలవుతున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కారణంగా జనం కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీంతో రిటైల్ వ్యాపారస్తులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. వినియోగదారులు ,కొనుగోలుదారులు ఎక్కువగా వినోద రంగానికి చెందిన వస్తువులనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఆశించినంతగా ఇండియన్ మార్కెట్ అంతగా ఊపు అందుకోలేదు. దీంతో విత్త మంత్రి దిద్దు బాటు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ప్రజలు నిత్యం వాడే వస్తువులపై అధికంగా పన్నులు విధించడం తో కొనుగోళ్లు నిలిచి పోయాయి. సబ్బులు, డైపర్లు, న్యాప్కిన్లు, తదితర ప్రోడక్ట్స్ ధరలపై విధించిన జీఎస్టీని తగ్గిస్తోంది. దీంతో కొను...

జోరుగా సాగు..బతుకంత పోరు..!

చిత్రం
ఓ వైపు అనావృష్టి ..ఇంకో వైపు అతి వృష్టి..చెప్పు కోలేనంతటి దుఃఖం కలుగుతోంది. ఆరుగాలం శ్రమించి, రేయనక పగలనక కస్టపడి పండించిన పంటకు చేతికి రాకుండా పోతే ..ఆ బాధ వర్ణనాతీతం. నిన్నటి దాకా నీళ్ల కోసం వేచి చూసిన రైతన్నలకు భారీగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు , కాలువలు నిండినా అన్నం పెట్టి ఆకలితీర్చే అన్నదాతలకు మాత్రం ఆవేదన మాత్రమే మిగులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినా రైతుల పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. తాజాగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొంత మేరకు ఉపశమనం కలిగినా, పూర్తి స్థాయిలో సాగు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. భూములు సాగు చేయాలంటే , పంటలు పండించాలంటే తడిసి మోపెడవుతోంది. చేసిన రుణాలు తీర్చలేక , అధిక వద్దెలకు అప్పులు తీసుకు వస్తే, చేసిన కష్టం వడ్డీలకే సరి పోతోంది. దీంతో వ్యవసాయం తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తాయని రైతులు సాగు చేసిన పంటలు చేతికి వచ్చేలా లేవు. ఇటీవల పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో , భారీ ఎత్తున సాగు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఎగువన కర్ణాటక , మహారాష్ట్ర ల నుండి కృష్ణా , గోదావరి నదుల్లో...

ఉద్యోగాలు బారెడు..భర్తీ మూరెడు..వయసై పోతున్నా స్పందించని సర్కార్

చిత్రం
బలిదానాలు, పోరాటాలు, ఆత్మహత్యలు చేసుకుని.. లాఠీ దెబ్బలు తిని , జైలు పాలై , కేసులు నమోదై ..కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాడ లేకుండా పోయింది. స్వతంత్ర భారతంలో  ఇంతటి దారుణమైన, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కున్న సందర్భాలు లేనే లేవు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనైనా కొన్ని ఉద్యోగాలు పొందారు. కానీ స్వరాష్ట్రంలో అభ్యర్థులు, నిరుద్యోగులు లక్షలాది మంది కొలువుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అలుపెరుగని పోరాటం చేసింది. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన వెంటనే కొలువులు భర్తీ చేస్తారని అంతా ఆశించారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేకుండా పోయింది. అయితే బంగారు తెలంగాణా లేకుంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఐటి  అంటూ జపం చేస్తోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా వివిధ శాఖలలో ఖాళీలు ఉన్నవి. వాటిని నింపకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. ఇక సమాజాన్ని ప్రభావితం చేసే యూనివర్సిటీల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈరోజు వరకు ప...

మహిళల కోసం ఢిల్లీ ఐఐటియన్స్ ప్యాడ్స్ తయారీ

చిత్రం
ప్రతి నెలనెలా వచ్చే నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించే న్యాప్కిన్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఢిల్లీ ఐఐటి కి చెందిన విద్యార్థులు తయారు చేశారు. మార్కెట్ లో పేరొందిన కంపెనీలు తయారు చేసిన ప్యాడ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్టే ఫ్రీ , కంఫర్ట్, తదితర కంపెనీలు స్త్రీలకు మేలు కలిగించేలా రుమాళ్ళు (ప్యాడ్స్ ) తయారు చేస్తున్నాయి. కోట్లాది మంది మహిళలు, యువతులు, బాలికలు ప్రతి నెలా ఈ  రుతు సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటికి పరిష్కారం చూపేలా ప్రపంచంలో ప్రతి చోటా కంపెనీలు కొత్త రకంగా ప్యాడ్స్ తయారీలో పరిశోధనలు చేస్తున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీటిని వాడడం వల్ల మహిళలు, బాలికలు తీవ్ర రోగాలకు గురవుతున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న దేశంలో సగానికి పైగా మహిళలు, యువతులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం న్యాప్కిన్స్ తప్పని సరి. తన భార్య ప్రతి నెలా పడుతున్న ఇబ్బందిని గుర్తించిన తమిళనాడుకు చెందిన మురుగనాథన్ తక్కువ ధరల్లో, నాణ్యమైన ప్యాడ్స్ ను తయారు చేశాడు. ఆయన చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు దేశ...

దుమ్ము రేపిన రహానే..తలవంచిన విండీస్..!

చిత్రం
ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా జట్టు టెస్ట్ మ్యాచ్ లోను వెస్ట్ ఇండీస్ ను ఓడించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. అజింక్యే రెహానే సెంచరీతో చెలరేగి పోయాడు. మరో వైపు బుమ్రా అద్భుతంగా అయిదు వికెట్లు పడగొట్టాడు. 100 పరుగులకే విండీస్ కుప్ప కూలింది. టెస్ట్ సిరీస్ లోనూ భారత జట్టు శుభారంభం చేసింది. బుమ్రా దెబ్బకు ప్రత్యర్తి  ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా అయిదు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, షమీ కూడా చెలరేగి పోయాడు. దీంతో 419 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ వంద పరుగులకే కుప్ప కూలింది. ఆ జట్టులో కీమర్ రోచ్ ఒక్కడే 38 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది విండీస్. అంతకు ముందు మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసిన ఇండియా జట్టు మరో 158 పరుగులు జోడించింది. ఏడు వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద ఇండియన్ కెప్టెన్ కోహ్లీ ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించాడు.అజింక్య రహానే విండీస్ బౌలర్ల భారతం పట్టగా. ఏకంగా సెంచరీ సాధించి చుక్కలు చూపించాడు. మరో వైపు తెలుగు కుర్ర...

అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!

చిత్రం
ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు. వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీని...