హనుమ విహారం ..అద్భుత శతకం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న డెసిషన్ తప్పు కాదని తేలిపోయింది. నిన్నటి దాకా ముంబై లేదా కోల్ కత్త వారిదే డామినేషన్ నడిచింది. గత కొంత కాలంగా తెలుగువాడైన ఏపీకి చెందిన ప్రసాద్ అత్యున్నతమైన, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించాడు. ఇది జీర్ణించు కోలేని ముంబై పరివారం అతడిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందులో మొదటి వ్యక్తి మాజీ సారధి సునీల్ గవాస్కర్. అయినా పట్టించు కోవాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేశాడు ప్రసాద్. హనుమ విహారికి ప్రసాద్ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విహారి వమ్ము చేయలేదు. 

విండీస్ టూర్ లో హనుమ  అత్యున్నతమైన ప్రతిభ చూపాడు. గతంలో హైదరాబాద్ అంటే పటౌడీ, శివలాల్ యాదవ్ , అజహరుద్దీన్ , లక్ష్మణ్ , అర్షద్ అయూబ్, వెంకట పతి రాజు, అంబటి రాయుడు , ఇలా చాలా మంది ఇండియన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా హనుమ విహారి ఇప్పుడు రాణిస్తున్నాడు. కాగా రాయుడు ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించాడు. తిరిగి మళ్ళీ ఆడుతానంటూ వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి విహారి వైపు మొగ్గు చూపారు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే చాలా ఓపిక ఉండాలి. 

పూజారా, రహానే లాంటి వాళ్ళు రాణిస్తున్నారు. జట్టు మాత్రం ఆడే ప్లేస్ లో ధోని స్థానంలో మరో ఆటగాడిని తీసుకు రావాలని అనుకుంటోంది. కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం విండీస్ టూర్ లో ఉన్న భారత జట్టులో కి అనుకోకుండా వచ్చాడు విహారి. మొదటి టెస్ట్ లో బాగా ఆడాడు.ఈ  టెస్టులో ఇండియా టీమ్ భారీ తేడాతో గెలుపొందింది. రెండో టెస్ట్ లో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజు లోకి వచ్చిన హనుమ విహారి ..సారధి కోహ్లీ కి తోడుగా నిలిచాడు . కోహ్లీ 163 పరుగులు చేస్తే విహారి సెంచరీ తో దుమ్ము రేపాడు. టీమ్ తో పాటు సెలెక్షన్ కమిటీ కూడా ఇప్పుడు ఆనందంలో ఉంది. మొత్తం మీద మన తెలుగు వాడు ప్రతిభ చూపడం మనందరికీ గర్వకారణం కదూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!