పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

వారేవా..తలైవా

చిత్రం
తమిళుల ఆరాధ్య దైవంగా భావించే అరుదైన నటుడు రజనీకాంత్ నటించిన దర్బార్ ఊహించని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. పాన్ ఇండియన్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఏకంగా ఈ సినిమా అంచనాలకు మించి 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగులో దర్బార్, అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరూ, ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదలయ్యాయి. ఇవ్వన్నీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా రజనీకాంత్‌ దర్బార్‌ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్‌ కలెక్షన్ల సునామీతో మరో రికార్డు సొంతం చేసుకుంది. విడుదలైన పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దర్బార్‌ అతధిక వసూళ్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్‌ విశ్లేషకుడు త్రినాథ్‌ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టిన రజనీకాంత్‌ ఐదో సినిమా ‘దర్బార్‌’ కావడం విశేషం. గతంలో తలైవా నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధిక భాగం తమిళనాడు నుంచి సుమారు 80 కోట్లు వచ్చాయి....

లెండింగ్ సెక్టార్ లోకి రియల్ మి

చిత్రం
చైనా మొబైల్‌ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్‌  మేకర్‌ ఒప్పో రంగం సిద్ధం చేసింది.  భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పు లిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్‌‌‌‌’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్‌ చేసింది. రియల్‌ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేత్‌ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని  క్రమంగా ఇతర పట్టణాలకు విస‍్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్‌ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించి...

ధోనీకి రిటైర్మెంట్ లేదు

చిత్రం
దేశం గర్వించే అద్భుతమైన ఆటగాళ్లలో ఝార్ఖండ్ కు చెందిన మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఇప్పటికే ఎన్నో అపురూపమైన విజయాలను భరత్ కు అందించిన ఈ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండగా ఇటీవల ధోనీ ఇక తాను ఆడే క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కోట్లాది క్రికెట్ అభిమానులు బిసిసిఐ మీద నిప్పులు కురిపిస్తున్నారు. చాలా కాలంగా భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పైనే. మళ్లీ భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడతాడా..లేదా అనే విషయంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటే ఇటీవల ధోనిని ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాను తొలగించారు.  2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ధోని పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేక పోవడం విస్మయానికి గురి చేసింది. ధోని శకం ముగిసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ధోనికి సమాచారం ఇచ్చిన తర్వాత అతన్ని తొలగించినట్లు బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకర...

పింక్ స్లీప్పులు రెడీ

చిత్రం
నిన్నటి దాకా బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా కంపెనీలు, స్టార్ట్ అప్ లు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు నష్టాలను అదుపులో ఉంచుకునేందుకు గాను ఇప్పటి నుంచే కాస్ట్ కట్టింగ్ అమలు చేస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున ఉద్యోగాలకు కొత్త పెడుతున్నాయి. ఇంకో వైపు ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చేసిన పలు స్టార్టప్‌ కంపెనీలు మూత పడుతుండగా, మరో వైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి. వాటిల్లో శ్యామ్‌సంగ్‌ ఇండియా లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీల నుంచి పేటీఎం లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ఉన్నాయి. రిటేల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియా గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌కు చెందిన వారున్నారు. శ్యామ్‌సంగ్‌ ఇండియా 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమా...

మెరిసిన భాగ్యనగరం

చిత్రం
సమున్నతమైన చారిత్రిక సంపదత్వంతో అలరారుతున్న భాగ్యనగరం మరోసారి తన చరిత్రను తానే అధిగమించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’ ఈ మేరకు రూపొందించిన సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌–2020ను విడుదల చేసింది.ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ పవర్ ఫుల్ సిటీగా హైదరాబాద్‌ ప్రథమ  స్థానంలో నిలవడం పట్ల ఐటీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలోని మొదటి 20 స్థానాల్లో మనదేశానికి చెందిన 7 నగరాలు చోటు సంపాదించాయి. వరుసగా 2, 5, 7, 12, 16, 20 స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, ముంబై నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌ నగరం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014లో హైదరాబాద్‌ టాప్‌–20 నగరాల జాబితాలో సైతం చోటు సంపాదించలేక పోయిందన్నారు. 2015లో 28, 2016లో 5, 2017లో 3వ స్థానం సంపాదించిన హైదరాబాద్‌ 2018లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2019లో బెంగ...

పాక్ కు మళ్ళీ భంగపాటు

చిత్రం
మరోసారి పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నం చేసింది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్‌ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలి పోయింది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక మైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్‌ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదే పదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. పాక్‌ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు అని ఆయన వివరించారు. దురుద్దేశ పూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా...

ధోని..మిథాలీలకు బిసిసిఐ షాక్

చిత్రం
సుదీర్ఘ కాలం పాటు దేశానికి తమ ఆట ద్వారా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన మాజీ సారధులు మహేంద్ర సింగ్ ధోని, మిథాలీ రాజ్ లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఘోరంగా అవమానించింది. వారి గెలుపుల్ని పరిగణలోకి తీసుకోలేదు. రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్‌ వర్తిస్తుంది. టాప్‌ గ్రేడ్‌ అయిన ‘ఎ ప్లస్‌’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని ‘బి’ గ్రేడ్‌ నుంచి ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోట్‌ చేశారు. టెస్టు ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్‌ అగర్వాల్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్, ఖలీల్...

టెలికం కంపెనీలకు షాక్

చిత్రం
భారత సర్వోన్నత న్యాయస్థానం టెలికాం కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. స్థూల రాబడి సర్దుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిందిగా కోరుతూ టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్లలో పసలేదని తేల్చి వాటిని కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై భారతీ ఎయిర్‌టెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. టెలికం కంపెనీలు ప్రభుత్వానికి1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లైసెన్స్ ఫీజు , స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలుల కింద టెలికం కంపెనీలు దాదాపు 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని గతేడాది టెలికం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. టెలికం కంపెనీలు జూలై 2019 నాటికి లైసెన్స్ ఫీజు కింద 92,642 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఎస్‌యూసీ కింద అక్టోబరు 2019 నాటికి 55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయ...

జెఫ్ కు గోయెల్ ఝలక్

చిత్రం
ఇండియా టూర్ లో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ తమ వ్యాపారాల్ని నాశనం చేస్తోందంటూ చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఇక భారత్‌లోని వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకోవాలని భావించిన బెజోస్‌కు ఇప్పటి వరకూ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు. దీనికి తోడు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భరత చట్టాలను ఈ కామర్స్ సంస్థలు కచ్చితంగా పాటించాలంటూ స్పష్టం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామన్న అమెజాన్ ప్రకటనపై కూడా స్పందించారు. పెట్టుబడిదారులు భారత్‌లోని చట్టాలకు లోబడి వ్యవహరించాలి. భారత్‌లో ఓ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్న అమెజాన్ ఈ దేశానికి ఉపకారం చేసినట్లు అవ్వదు. ఇక్కడ ప్రతిఏటా బిలియన్ డాలర్ల నష్టం వస్తోందని వారు భావించినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి నిధులు తేక తప్పదు కదా అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో గోయల్-జెఫ్‌ బెజోస్‌ల సమావేశం జరగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వస్తువులపై అమెజాన్ ఆఫర్ చేసే భారీ డిస్కౌంట్లపై ఇప్పటికే అనేక దేశాల్లో అనుమ...

మాలిక్ పునరాగమనం

చిత్రం
అదృష్టం అంటే ఇదేనేమో. అది ఏ రూపంలో ఎప్పుడు పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పాకిస్తాన్‌ మాజీ సారథి, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ అనూహ్యంగా పాకిస్తాన్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతే కాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న మాలిక్‌ పాక్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాలిక్‌ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు. తామి ఆడిన చివరి 9 టీ20 సిరీస్‌ల్లో 8 ఓడి పోయామని గుర...

అబ్బా టిక్ టాక్ దెబ్బ

చిత్రం
సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ లో గత కొంత కాలంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తున్న ముఖ పుస్తకం కు షాక్ ఇచ్చింది చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ టిక్ టాక్. ఇప్పటికే కోట్లాది మందిని కలిగిన పేస్ బుక్ ను టిక్ టాక్ నెట్టేసింది. సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ ఎంతో పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఇది మరోసారి రుజువైంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా టిక్‌ టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింగ్ సంస్థ సెన్సార్‌ టవర్‌   వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను వెనక్కి నెట్టి వేసిందని పేర్కొంది. 2018లో డౌల్‌లోడ్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్‌.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మేసెంజర్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను అధిగమించి రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. టిక్‌టాక్‌ యాప్‌ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధాన కారణమని తెలిపింది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 45 శాతం భారత్‌ నుంచే ఉన్నట్టు పేర్కొంది. అయితే డౌన్‌లోడ్స్‌ పరంగా వాట్సాప్‌ యాప్‌ను టిక్‌టాక్‌ క్రాస్‌ చేయలేక పోయింది. దా...

ప్రిన్స్.. సరిలేరు నీకెవ్వరు

చిత్రం
మిల్క్ బాయ్ గా ఇప్పటికే పేరున్న మినిమమ్ గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఈ సినిమా డైరెక్టర్ ముందే చెప్పినట్టు బొమ్మ అదుర్ది అన్న డైలాగ్ నిజం చేసింది ఈ సినిమా. తాజాగా చిత్ర యూనిట్ తో పాటు సినీ నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు లు సైతం విస్తు పోతున్నారు ఈ సినిమా వసూళ్లను చూసి. దీంతో చిత్ర బృందం మొత్తం న్యూ వేవ్ ను క్రియేట్ చేస్తూ హల్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెర కెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. తొలిరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండో రోజు సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు చేరువగా వచ్చిందని సమాచారం. అధికారిక లెక్కలు వస్తే..ఈ సిన...

కేకేఆర్ పై గంభీర్ గరం గరం

చిత్రం
సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా వుండే భారతీయ క్రికెట్ ఆటగాళ్లలో మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఒకడు. మరొకరు తన మాటలతో, డిఫరెంట్ మేనరిజం తో దేశాన్ని ఊపేసే మరో మాజీ ఆటగాడు, పాకిస్తాన్ దేశాధినేత ఇమ్రాన్ స్నేహితుడు సిద్దు ఒకరు. వీరు ఏదో రకంగా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచు కోవడం అలవాటు. తాజాగా గౌతమ్ గంభీర్ కేకేఆర్ పై ఘాటు కామెంట్స్ చేశాడు. పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని గంభీర్‌ తప్పు బట్టాడు. ఓ బౌలర్‌ కోసం భారీ మొత్తం చెల్లించడం సరికాదని అభిప్రాయ పడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 కోసం జరిగిన వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ కమిన్స్‌ను ఏకంగా 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్‌ రికార్డు కెక్కాడు. కాగా కేకేఆర్‌ జట్టును రెండు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిపిన గంభీర్‌ ఈ విషయంపై స్పందించాడు. బౌలర్‌కు అత్యధిక ధర చెల్లించి బ్యాకప్‌ బ్యాట్స్‌మెన్‌ లేకుండా చేసుకు...

వన్నె తగ్గని కొలువులు

చిత్రం
ప్రపంచం కొత్త దానం కోరుకుంటోంది. అదే సమయంలో భిన్నమైన సాంకేతికతను వాడుతోంది. దీంతో ఇప్పటిదాకా రాజ్యమేలిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, తదితర కోర్సులు నిన్నటి దాకా ప్రభావితం చేసాయి. అంతే కాకుండా మిగతా సామాజిక అంశాలను బోధించే కోర్సులు ఉన్నట్టుండి పడిపోయాయి. అయితే ఇదే స్థానంలో కొత్త కోర్సులకు భలే గిరాకీ పెరిగింది. వీటిలో అట్రిఫీషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్న్ ఇంగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ మార్కెట్ ను ఊపేస్తున్నాయి. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా దేశ వ్యాప్తంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్‌ పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్‌ కోర్సులు చేసిన వారికి 2016 నవంబరు నుంచి 2019 నవంబరు వర​కు 44 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయని పేర్కొంది. ఇండియాలో  స్టెమ్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా క...

విమెన్స్ టీ20 టీమ్ ఇదే

చిత్రం
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టును ఇండియన్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన భారత జట్టుకు ఆల్ రౌండర్ హర్మన్‌ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూర్కీ బ్యాట్స్‌ విమెన్ రిచా ఘోష్‌కు జట్టులో చోటు దక్కింది. వచ్చే నెల 21న సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్‌-ఎలో భారత జట్టుతోపాటు ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు కూడా హేమలత కళా సారథ్యంలోని మహిళా సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ పోరు జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 31న కాన్‌బెర్రాలో ఇండియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 12న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇలా ఉంది. హర...

సరిలేరు కలెక్షన్స్ అదుర్స్

చిత్రం
అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, నాచురల్ బ్యూటీ రష్మిక మందన్న, డైనమిక్ లేడీ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, తదితరులు కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా వసూళ్ళలో దూసుకు పోతోంది. అటు ఓవర్సీస్ లో సైతం బొమ్మ రఫ్ఫాడిస్తోంది. ఈ మేరకు సినిమా బృదం సక్సెస్ మీట్ కూడా పెట్టారు. ఇదిలా ఉండగా ఒకే ఒక్క రోజులోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ప్రిన్స్ మహేష్ బాబు నటన పీక్ లో ఉండటం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. నైజాంలో 8.66 కోట్లు, సీడెడ్‌లో 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.4 కోట్లు, కృష్ణాలో 3.07 కోట్లు, గుంట...

ప్రియాంకపై పీకే ప్రశంస

చిత్రం
భారతీయ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య స్వరం మారుతోంది. తన గొంతును సవరించుకుంటున్నారు. బీజేపీతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తోంది జేడీయూ. ఇదే సమయంలో నితీష్ కుమార్ మోడీతో చెలిమి చేస్తుండగా విచిత్రంగా అదే పార్టీకి చెందిన ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. దీంతో ఇరు పాటీలు మధ్య మరింత దూరం పెరుగుతోంది. మరో వైపు ప్రశాంత్ కిషోర్ తాజాగా రాహుల్ గాంధీపై, ప్రియాంకా గాంధీపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన హస్తం పార్టీ నేతలను పొగడ్తతల్లో ముంచెత్తారు. ఈ ఆందోళనకు సారథ్యం వహించిన ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయమని అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు. కాగా బిహార్‌లో స...

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజీనామా

చిత్రం
ప్రముఖ నటుడు, వైసీపీ హార్డ్ కోర్ లీడర్, వైఎస్ జగన్ ఫాలోయర్..ప్రస్తుత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీ  రాజ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఛానల్ లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడంటూ ఆడియో టేపులో సంభాషణలు బయట పడ్డాయి. దీంతో వెంటనే పృథ్వీ పై విచారణ జరిపించాలంటూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ కూడా జరిపారు. నివేదికను చైర్మన్ కు సమర్పించారు. అయితే దీనిపై పృథ్వీ రాజ్ తీవ్రంగా స్పందించారు. తనపై అంతా కుమ్మక్కై కుట్ర పన్నారని ఆరోపించారు. తాను తాగానని అంటున్నారని, తన బ్లడ్ తీసుకోవచ్చని చెప్పారు. ఆయన కొన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. పృథ్వీ వీడియో విడుదల చేశారు. నా మీద లేని పోనివి ప్రచారం చేశారని అధిష్టానానికి చెప్పాను. ఒక వేళ వాయిస్‌ నాదైతే ఆఫీసులో అలా ప్రవర్తించాడా, అవుట్‌ సైడ్‌ అలా మాట్లాడుకున్నారా అని ఆలోచిస్తారు. విచారణలో పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రైతు కష్టాల గురించి నాకు తెలుసు. నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా. పోస...

ఢిల్లీలో త్రిముఖ పోటీ

చిత్రం
దేశ రాజధానిలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయి. ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని కమలం సీరియస్ గా రంగంలోకి దిగింది. పోయిన పరువును కాపాడు కోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఆయా ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల వాగ్ధానాలు, ప్రత్యర్థులపై విమర్శలు, ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార ఆమ్‌ ఆద్మీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నీ తానై, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లకు మరింత దగ్గరగా చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ఆప్‌ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ‘లగే రహో కేజ్రీవాల్‌’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్...

అయ్యప్ప భారీ విగ్రహం..త్వరలో నిర్మాణం

చిత్రం
                        ప్రపంచంలోని అయ్యప్ప భక్తులకు శుభ సూచకం. వేలాది మంది అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్త జన బాంధవులు నిత్యం పూజా కైంకర్యాలతో పాటు శాశ్వతంగా, వసతి సౌకర్యాలు ఉండే విధంగా ఆ భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రం నిర్మించాలని అయ్యప్ప ఆలయ సమితి నిర్ణయించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అహోరాత్రులు శ్రమిస్తోంది. అయ్యప్ప స్వామిని నిత్యం కొలిచే వారే ఈ సమితిని ఎర్పాటు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మహబూబ్ నగర్  రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 184 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి పేరుతో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడం..ఆ దిశగా స్వామి వారి ఆశీస్సులతో, దాతలు, అభిమానులు, భక్తులు, కులమతాలకు అతీతంగా తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో అన్నదాన కోసం ఎందరినో భక్త బాంధవులను సంప్రదించడం జరిగింది. చాలా మంది తమకు తోచిన రీతిలో స్పందించారు. ఆర్ధిక, హార్థిక పరంగా చేయూతను అందించా...

దీపికకు కంగనా సపోర్ట్

చిత్రం
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకు మరో నటి కంగనా రనౌత్ బాసటగా నిలిచారు. ఆమె నగరానికి వచ్చారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌ సహా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అదే క్రమంలో సిటీకి చెందిన ఫిక్కీ లేడీస్‌ క్లబ్‌ దిపార్క్‌ హోటల్‌లో నిర్వహించిన ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన రీతిలో స్పందించారు. జేఎన్‌యూ యూనిర్సిటీలో ఇటీవల జరిగిన దాడిలో గాయపడ్డ బాధితులను దీపిక పరామర్శించడాన్ని ఎందుకు తప్పుపట్టాలి. తనకు నచ్చిన చోటుకి వెళ్లడం ఆమె ప్రాథమిక హక్కు కదా. తనకేది మంచిదో తనకి బాగా తెలుసు. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడులకు రాజకీయ రంగు పులిమి జాతీయ సమస్యగా చేయవద్దని నేను కోరుతున్నా. హైదరాబాద్‌ సిటీతో పాటు ఇక్కడ లభించే ముత్యాలంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి పెరల్స్‌ నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడకు వచ్చినప్పుడల్లా బిర్యానీ, ఆంధ్రా రసం, బగారా బైగాన్, కొబ్బరి పాయసం..వంటివి రుచి చూడకుండా వెళ్లను. నేను రచనలో శిక్షణ పొంది ఉన్నప్పటికీ దర్శకత్వం అంటేనే నాకిష్టం. డైరెక్టర్‌కి ఆల్‌ రౌండ్‌ లీడర్‌ షిప్‌ లక్షణాలు కావాలి. అది చాలా ఛాలెంజింగ్‌ రోల్‌. ఐ లవ్‌ డైరెక్టర్‌ జాబ్‌. టైటానిక్, జురాస...

పల్లె బాట పట్టిన నగరం

చిత్రం
సంక్రాంతి పండుగ దెబ్బకు మహానగరం పల్లె బాట పట్టింది. రైళ్లు, బస్సులు, విమానాలు, వాహనాలు ప్రయాణీకులతో నిండి పోయాయి. రహదారులపై వాహనాలు నిలిచి పోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ కోసం రెండు రోజులు ముందుగానే బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌  ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్‌ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్‌ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు. ఇక ప్రైవేట్‌ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. ...

మోడీకి సుప్రీం ఝలక్

చిత్రం
బీజేపీకి కొత్త ఏడాది అంతగా వర్కవుట్ అవుతున్నట్టు లేదు. ఓ వైపు దేశమంతటా మెలమెల్లగా ప్రతికూల వాతావరణం చోటు చేసుకుంటోంది. కన్నడ నాట సక్సెస్ అయినప్పటికీ మరాఠాలో మాత్రం చిరకాల మిత్రుణ్ణి కోల్పోయింది. అంతే కాదు ఏకంగా శరద్ పవార్ చాణక్యం ముందు మోడీ, అమిత్ షాల పాచికలు పారలేదు. తాజాగా మరో షాక్ తగిలింది సుప్రీం కోర్టు ద్వారా. ఇంటర్నెట్‌ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం ఇంటర్నెట్‌ ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ బిజినెస్‌ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపి వేయ కూడదని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారం లోగా సమీక్షించాలని కశ్మీర్‌ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్‌ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అది ఒక వైభవోజ్వల మహా యు...

కంపెనీలు భళా..అమ్మకాలు డీలా

చిత్రం
ఒక్కో కంపెనీకి ఘనమైన చరిత్ర ఉంది. కానీ వాహనాల అమ్మకాల్లో మాత్రం ఆశించినంతగా వాహనం ప్రియులు, కొనుగోలుదారులను ఆకట్టుకోలేక పోయాయి. దేశీయంగా చూస్తే ఆర్ధిక రంగం పూర్తిగా గాడి తప్పింది. దీనిని ఓ క్రమ పద్ధతిలోకి తీసుకు వచ్చేందుకు దేశ ఆర్థిక శాఖా మంత్రి సీతారామన్ నానా తంటాలు పదుహానది. అయినా ఈ రంగం దిగి రానంటోంది. జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా అన్ని రంగాలు దిగాలు పడ్డాయి. దిక్కు తోచని స్థితిలోకి వెళ్లి పోయాయి. ఇదిలా ఉండగా వాహనాల రంగం కూడా పూర్తిగా కుదేలైంది. ఎన్ని ఆఫర్లు, గిఫ్టులు ప్రకటించినా అమ్ముడు పోలేదు. ఎన్ని డిజైన్లు రూపొందించినా అమ్మకాలు మాత్రం పెరగలేదు. దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు గత మాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది. దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్...

ఇక యుద్ధం తప్పదా

చిత్రం
ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను కలవర పరుస్తోంది. ఇప్పటికే ఇరాన్ పై క్షిపణులతో దాడులకు పాల్పడిన అమెరికాకు అదే రీతిలో జవాబు ఇచ్చింది ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరుకున్నాయి. తమ జనరల్‌ ఖాసిం సులేమానీని హత మార్చినందుకు గానూ ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పన్నెండు బాలిస్టిక్‌ క్షిపణులతో అమెరికా వైమానిక స్థావరాలపై విరుచుకు పడింది. కాగా ఇరాన్‌ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. అంతే గాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు జారీ చేశారు. ఈ మేరకు..అంతా బాగుంది..ఇరాక్‌లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది. రేపు నేను కూడా ఓ ప్రకటన చేస్తాను అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు...

ఖాకీలపై కన్హయ్య కన్నెర్ర

చిత్రం
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ స్పష్టం చేశారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడి చేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తల పగిలి తీవ్ర రక్తస్రావమైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్‌ సహా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ మాట్లాడారు.  మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తి పోతున్నారో నేను అర్థం చ...

ఇండియాకు ఇరాన్ స్వాగతం

చిత్రం
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు నిలిపి వేయాలని కోరుతోంది. ఇప్పటికే శాంతి కోసం కృషి చేస్తున్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అంతే కాక ఇరాన్, ఇండియాల మధ్య మంచి స్నేహం కూడా ఉన్నది. మరో వైపు యుఎస్ , ఇరాన్‌ ల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం భారత్‌ ప్రయత్నిస్తే స్వాగతిస్తామని అలీ చెగేనీ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసే దేశాలలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చర్చల కోసం భారత్‌ చొరవ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. ఢిల్లీలో ఇరాన్‌ ఎంబసీ నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న అలీ చెగేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మధ్య వర్తిత్వం చేయాలని కోరారు. ఇరాన్‌ అమెరికాల మధ్య శాంతికి ఏ దేశం ప్రయత్నించినా స్వాగతిస్తామని, అలాగే భారత్‌, ఇరాన్‌ మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా భారత్‌ మరింత చొరవ తీసుకోవాలని కోరారు. కాగా ఇరాన్‌ మిలటరీ జనరల్‌ ఖా...

బైజూస్‌లో గ్లోబల్ భరోసా

చిత్రం
ఇండియన్ అంకురాలు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షితున్నాయి. ఇప్పటికే చాలా స్టార్ట్ అప్స్ కోట్లు కొల్లగొట్టాయి. తాజాగా ఇండియాకు చెందిన బైజూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 4 కోట్ల రికార్డు డౌన్‌లోడ్లతో దూసుకు పోతున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బైజూస్‌ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్  నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా  ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్  ప్రకటించారు. దీంతో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బైజూస్‌ వాల్యూ 8 బిలియన్ల డాలర్లు మించి పోతుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో  2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్‌ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలు మార్పులు తీసుకు రావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు తెలిపారు. టైర్ 2, 3 నగర...

మేజావా మజాకా

చిత్రం
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం మరీ చిన్నదై పోయింది. క్షణాల్లో ఏదైనా వైరల్ అవుతోంది. ఇది కూడా ఓ సంచలనమే. ప్రతి రోజూ ఏదో ఒకటి సెన్సేషనల్ అవుతోంది. తాజాగా లోకంలో ఓ అద్భుతమైన వార్తకు తెర తీశాడు జపాన్ కు చెందిన అపార కుబురుడుగా ఇప్పటికే పేరొందిన యుసాకు మేజావా. మనోడు ఉన్నట్టుండి అమెరికా సైతం విస్తు పోయేలా చేశాడు.సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్‌ ఇండస్ట్రీ దిగ్గజం మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా 64.36 కోట్లు పంచి పెట్టడం హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్‌లో అనుచరులు వెయ్యి మందికి ఈ నగదును పంచి పెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యి మంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి సుమారు రూ .64.36 కోట్లు అంద జేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్‌  రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించింది. 9 లక్షలకు పైగా లై...

దీపికకు అనురాగ్ అండ

చిత్రం
ఇది పబ్లిసిటీ స్టంట్‌ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతవు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు అంటూ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌..బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండి పడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేక పోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్‌ ప్రమోషన్‌ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్‌ చేస్తూ.. సినిమాకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు.  ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్‌ మాట్లాడుతూ..ఆయిషీ ఘోష్‌ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు. నీ బాధను నే...