ఢిల్లీలో త్రిముఖ పోటీ
దేశ రాజధానిలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయి. ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని కమలం సీరియస్ గా రంగంలోకి దిగింది. పోయిన పరువును కాపాడు కోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఆయా ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల వాగ్ధానాలు, ప్రత్యర్థులపై విమర్శలు, ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార ఆమ్ ఆద్మీ ప్రచారంలో దూసుకుపోతోంది.
ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానై, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లకు మరింత దగ్గరగా చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్పై ఆప్ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ‘లగే రహో కేజ్రీవాల్’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. దీనిని ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్, మంత్రులు కలిసి విడుదల చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు త్వరలో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగే ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నా..ప్రధాన పోటీ మాత్రం ఆమ్, బీజేపీ మధ్య మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు దక్కించుకోగా.. బీజేపీ మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించ లేదు. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ త్వరలో తేలనుంది.
ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానై, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లకు మరింత దగ్గరగా చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్పై ఆప్ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ‘లగే రహో కేజ్రీవాల్’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. దీనిని ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్, మంత్రులు కలిసి విడుదల చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు త్వరలో పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగే ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నా..ప్రధాన పోటీ మాత్రం ఆమ్, బీజేపీ మధ్య మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు దక్కించుకోగా.. బీజేపీ మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించ లేదు. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ త్వరలో తేలనుంది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి