పోస్ట్‌లు

సెప్టెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పూరీ..పడి లేచిన కెరటం

చిత్రం
తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్. ఓ సెన్సేషన్. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఆయన టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కిందకు జారారు. సంపాదించుకున్న కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో తాను ఒంటరివాడై పోయాడు. కానీ కష్ట కాలంలో ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నీ కోల్పోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరో బ్లాక్ బ్లస్టర్ మూవీతో తిరిగి తన పవర్ ఏమిటో రుచి చూపించాడు. స్మూత్ కేరక్టర్ కే పరిమితమై పోయిన రామ్ పోతినేనిని ఈ సినిమాలో డిఫరెంట్ గా పూర్తి భిన్నంగా చూపించాడు. పూరీ అంటేనే మినిమమ్ గ్యారెంటీ వున్న డైరెక్టర్ గా పేరుంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఐడెంటిటీ ఉంటుంది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో త...

స్మార్ట్ మొబైల్స్ లో షాన్ దార్ షావోమి

చిత్రం
భారతీయ మార్కెట్ ను చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీల ఫోన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ హవాను లెనోవా, వివో, ఒప్పో , షావోమి మొబైల్స్ డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రోజుకో కొత్త ఫీచర్స్ , డిజైన్స్ తో ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కొనుగోలుదారులను, మొబైల్స్ ప్రియులతో పాటు యువతీ యువకులను ఎక్కువగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా షావోమి స్టోర్స్ అగుపిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువగా బిజినెస్ అంతా మిడిల్ క్లాస్ కు చెందిన వారిపైనే నడుస్తుంది. 130 కోట్ల భారతీయ జనాభాలో దాదాపు 70 శాతానికి మించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మిగతా 30 శాతం జనం నగరాల్లో ఉంటున్నారు. ఇప్పటికే అత్యంత చౌకగా ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందుతున్నాయి. భారతీయ టెలికాం సెక్టార్ లో కంపెనీల మధ్య వ్యాపార యుద్ధం మొదలైంది. ఇంతకు ముందు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ అయితే , ప్రయివేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ గ్రూప్ నకు చెందిన జియో ఉండగా ఎయిర్ టెల్ , ఐడియా , వోడా ఫోన్ , టాటా టెలికాంలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్ నష్టాల్లో కొనసాగుతుండగ...

ఓ మహాత్మా ..ఓ మహర్షి..బాపూ మనందరికీ వెలుగు

చిత్రం
నా జీవితమే నా సందేశం..అంటూ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన జాతిపిత. మహోన్నత మానవుడు. అహింసపై శాంతి అనే ఆయుధంతో కొన్ని తరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో ఉన్న భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడు. మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ..బారిస్టర్ కోసం లండన్ కు వెళ్లిన ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. హింసకు తావులేకుండా లక్షలాది మందిని ఏకం చేశాడు. తాను ఏది చెప్పాడో అదే ఆచరించి చూపాడు. తన పని తాను స్వంతంగా చేసు కోవడం, చని పోయేంత వరకు అబద్దం ఆడక పోవడం, సత్యాన్నే పలకడం, పెద్దలను, గురువులను గౌరవించడం. ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం. మంచి పుస్తకాలు చదవడం మహాత్ముని దినచర్య. ఈ దేశం ..ఈ జాతి ఆ మహాత్ముడిని ప్రతి రోజు తల్చుకుంటూనే ఉంటుంది. ఆయన పుట్టిన రోజును మనందరం పండుగలా జరుపుకుంటాము. 20 వ శతాబ్దంలో గాంధీజీ తప్ప ఇంకే నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. ప్రతి దేశంలో ఆ గాంధీజీ విగ్రహం ఉండే ఉంటుంది. ఆయన బతికినంత కాలం హింస ను వ్యతిరేకించాడు. తోటి వారిని ప్రేమించాలని, కష్టాలలో ఉన్న వారిని ఆదు కోవాలని కోరారు. గాంధీజీని ఎక్క...

దుమ్ము రేపుతున్న సిద్ శ్రీరామ్ సాంగ్

చిత్రం
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న బన్నీ నటించిన అల వైకుంఠపురంలో సినిమా లోని సాంగ్ విడుదలైన కొద్దీ సేపు లోపే మిలియన్స్ వ్యూస్ దాటేసింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సామజవరగమణ పేరుతో పాటను రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ దీనికి మ్యూజిక్ అందించాడు. అంతకు ముందు థమన్ జూనియర్ ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సామెత సినిమాకు కూడా క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు కసితో బన్నీతో మూడో సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హై పీచ్ లో సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. వేలాది మంది దీనిని చూస్తున్నారు. వింటున్నారు. తెలుగు సినీవాలిలో వేలాది పాటలు రాసిన చరిత్ర సిరివెన్నెలకు ఉన్నది. మరోసారి అయన కలం జూలు విదిల్చింది. దుమ్ము రేపుతోంది. అత్యంత భావోద్వేగంతో సాగిన ఈ సాంగ్ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. దీనికి సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు. 19 మే 1990 లో చెన్నైలో శ్రీరామ్ పుట్టాడు. కంపోసర్ గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, పాటల రచయిత గా ఇప్పటికే పేరు తెచ్...

తెలంగాణకే తలమానికం..బతుకమ్మ సంబురం..!

చిత్రం
ఎనలేని దోపిడీకి, తరతరాల వివక్ష నుండి విముక్తం పొందిన తెలంగాణ మాగాణం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని నిటారుగా నిలబడ్డది. ఒకే గొంతుకై ఆడుతున్నది, పాడుతున్నది. కోట్లాది గొంతుకలు ఇప్పుడు బతుకంతా సంబురాలను జరుపుకునే అరుదైన సన్నివేశం బతుకమ్మ పండుగ కు ముస్తాబవుతోంది. పూల జాతరను తలపించేలా లక్షలాది ఆడబిడ్డలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ అన్నది కొందరికి మాత్రం అదో పండుగగా భావిస్తారు. కానీ అదో మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఇక బతుకమ్మ విషయానికి వస్తే, ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మను తెలంగాణాలో సద్దుల పండుగ  అని కూడా పిలుస్తారు. ఈ బతుకమ్మ దసరా పండుగకు రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు  నెలలలో రెండు పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటు వైపు, ఇటు వైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండి పోతుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి విజయ దశమి పండుగ. అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్ర...

ఇమ్రాన్ ఖాన్ కు అమెరికా ఝలక్

చిత్రం
ఇప్పటికే ప్రపంచ వేదికపై ఒంటరిగా మిగిలి పోయిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు గట్టి దెబ్బ తగిలింది. పనిగట్టుకుని కాశ్మీర్ అంశంపైనే ఎక్కువగా ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సభలో ఫోకస్ చేసిన ఇమ్రాన్ కు చురకలు అంటించింది అగ్రరాజ్యం అమెరికా. ఇదే అంశం గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు, ప్రతి చోటా ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. కానీ ముందు మీ పాకిస్తాన్ లో పాతుకు పోయిన ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని రూపు మాపేందుకు చర్యలు చేపట్టాలని అమెరికా సూచించింది. భారత్‌తో శాంతి చర్చలు కోరుకుంటున్న విషయం వాస్త వమే, అయితే అందుకు తగ్గట్టుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సెషన్‌లో భాగంగా అమెరికా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ విషయంలో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ లు సామరస్య పూర్వకంగా చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అణ్వాయుధాలు ఇరు దేశాలు కలిగి ఉన్నాయని, ప్రస్తుతం చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలికితే బాగుంటుంని ఆమె హితవు పలికారు. జమ్మూ , కశ్మీర్‌ విషయం...

తీరు మారని పాకిస్తాన్..రెచ్చి పోయిన ఇమ్రాన్ ఖాన్

చిత్రం
కుక్క తోక వంకర అన్నట్లు దాయాది పాకిస్థాన్ తన తీరును మార్చుకోలేదు. ఐక్య రాజ్య సమితి వేదికపై ఇండియా, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర దామోదర దాస్ మోదీ, ఇమ్రాన్ ఖాన్ లు ప్రసంగించారు. మోదీ మాహాత్మా గాంధీని ఉటంకిస్తూ ప్రపంచానికి శాంతి కావాలని, ఉగ్రవాదం, తీవ్రవాదం మానవజాతికి అత్యంత ప్రమాదకరంగా మారిందని అన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ప్రతి దేశమూ ఉగ్ర మూకల నుండి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, కానీ ముస్లిం సమాజంలో ఏ మాత్రం మార్పు రాలేదు. వాళ్ళు ఎప్పటిలాగే ఉన్నారు. జిహాద్ పేరుతో యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దాయాది పాకిస్తాన్ ఇండియాలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతి నిమిషం పావులు కదుపుతోందని ధ్వజమెత్తారు. ప్రపంచం శాంతిని కోరుకుంటోంది..కానీ మారణ హోమాన్ని కాదన్నారు. శాంతి కోసం, మానవజాతి సంక్షేమం కోసం పాటుపడాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్థిరపరిచే శక్తులను చూస్తూ ఊరుకోబోమన్నారు. మోదీ ప్రసంగించిన తర్వాత పాకి...

హెచ్‌సీఏ ఎన్నికల్లో అజ్జూ ప్యానల్ దే హవా

చిత్రం
టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా నలుగురు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మొదటి నుంచి హెచ్‌సీఏ పై యెనలేని ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి కేరాఫ్ గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఎప్పటి నుంచో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్‌ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసి భంగపడ్డారు. ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హె...

వారెవ్వా..అజ్జూ భాయ్..ఆగాయా..!

చిత్రం
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కళ్ళ ముందు ఓ సంపూర్ణ విజయం సాక్షాత్కారమైంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్న సినీ కవి రాసిన పాట మదిలో మెదిలింది. కభీ కభీ మేరే దిల్ మే అంటూ ముఖేష్, లతా ఆలాపిస్తూ ఉంటే అమితాబ్ భావోద్వేగంతో అలవోకగా చెబుతూ వుంటే ఆ ఆనందమే వేరు. ఏంటీ ఓ ప్రపంచాన్ని మరో సారి చుట్టి వచ్చినంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఎవరెస్టు శిఖరం ఎక్కిన వాడు. ఎత్తు పల్లాలను చవి చూసిన వాడు. భారత జట్టులో బాంబే ఆధిపత్యాన్ని అడ్డుకున్నవాడు. టీమిండియాలో దేశంలోని నలుమూల నుండి ప్రాతినిధ్యం వహించేలా చేసిన వాడు. క్రికెట్లో అసాధ్యమనుకున్న మూడు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన వాడు. ఏకంగా ప్రపంచంలోనే భారత దేశపు జాతీయ పతాకాన్ని ప్రతి స్టేడియంలో ఎగిరేసేలా చేసిన అరుదైన ఆటగాడు..ఒకే ఒక్కడు..మణికట్టు మాయాజాలంతో ఇప్పటికే ఎప్పటికీ తన లాగా ఆడే ఆటగాల్లో కోసం వేచి చూస్తూ ఉన్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్. మ్యాచ్ ఫిక్సింగ్ భూతం అతడిని కమ్ముకోక పోయి వుంటే ఇవ్వాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు చైర్మన్ అయ్యేవాడు. ఎన్ని వైఫల్యాలు ..ఎన్ని కుట్రలు..ఎన్ని అవమానాలు ..లోకం అతడిని వేలి వేసింది. తనవారు అ...

అంచనాలు పెంచుతున్న అల వైకుంఠపురంలో..!

చిత్రం
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న అల వైకుంఠపురంలో..సినిమా విడుదల కాకుండానే హీటెక్కిస్తోంది. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ గా త్రివిక్రం కు పేరుంది. టేకింగ్, స్క్రీన్ ప్లే , మ్యూజిక్, సాహిత్యం, కథ, పాత్రల ఎంపిక, డైలాగ్స్..ఇలా సినిమాకు కావాల్సిన వన్నీ జనానికి వండి వడ్డించడంలో ఆయనను మించిన దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదేమో. మొదట మాటల రచయితగా ప్రారంభమైన ప్రస్థానం కోట్లాది రూపాయలు వసూళ్లు చేసే సక్సెస్ ఫుల్ సినిమాలు తీసే దమ్మున్న దర్శకుడిగా త్రివిక్రం తనను తాను నిరూపించుకున్నాడు. కేవలం ఆయన తాను రాసే మాటల కోసం వేలాది మంది అభిమానులు, లెక్కకు మించి మహిళలు వేచి చూడటం మామూలే. ఈ సినీవాకిట ఓ రచయితకు గౌరవాన్ని, గుర్తింపును, ఓ స్టార్ ఇమేజ్ ను తీసుకు వచ్చిన ఘనత త్రివిక్రం కే చెల్లింది. త్రివిక్రంలో రైటర్ కాదు భావుకుడు, కవి, మెంటార్, ట్రైనర్, అధ్యాపకుడు, పంతులు, సినీ ప్రేమికుడు, సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు ఉన్నాడు. అందుకే అతడు ఓ సంచలనం. అతడు , అత్తారింటికి దారేది ఓ ప్రభంజనం. డైరెక్టర్ అన్నాక సక్సెస్.. తో పాటు ఫెయి...

దార్శనికుడు..తెలంగాణ యోధుడు..బాపూజీ వర్ధిల్లు

చిత్రం
ప్రపంచానికే పాఠం నేర్పిన తెలంగాణ మాగాణంలో ఎందరో వీరులున్నారు. మహోన్నతమైన మానవులను, మార్గదర్శకులను కన్నది తెలంగాణ తల్లి. పోరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, ఆత్మతగాలకు నిలువెత్తు రూపం ఈ ప్రాంతం. ఉద్విగ్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కరడు గట్టిన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అన్ని రంగాల్లో దోపిడీకి లోనైన ఈ ప్రాంతపు విముక్తి కోసం జరిగిన ప్రతి సందర్భంలోను కొండా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల్లో బాపూజీ కీలకంగా వ్యవహరించారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పుట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో నిలుచున్నారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసు వేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి గెలిచారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంల...

నో పాలిటిక్స్..మూవీస్ బెటర్..తలైవా, కమల్ లకు మెగా హితబోధ..!

చిత్రం
భారతీయ సినిమా రంగంలో ఆయనకు ఓ చరిత్ర ఉంది. తెలుగు సినిమా రంగాన్ని ఆయన కొన్నేళ్ల పాటు తన ప్రభావాన్ని చూపిస్తున్న ఒకే ఒక్క నటుడు. వన్ అండ్ ఓన్లీ హీరో, లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు తన మనసులో ఉన్న దానిని ఇన్నాళ్లకు బయట పెట్టారు. ఏకంగా తన తోటి నటులు ఇండియాలో పేరున్న తమిళ్ తలైవా రజనీకాంత్, విలక్షణమైన యాక్టర్ కమల్ హాసన్ లకు పాలిటిక్స్ వద్దే వద్దంటూ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ రంగం పూర్తిగా కలుషితమై పోయిందని, దానిలో మనలాంటి నటులు నెగ్గుకు రావడం కష్టమన్నారు. ఇప్పటికే కమల్ హాసన్ తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మరో వైపు కోట్లాది ఫ్యాన్స్ కలిగిన రజనీకాంత్ కూడా పార్టీని స్థాపించాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్ తో ఆయన సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీజేపీ హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా కూడా తలైవాను బీజేపీలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు కనిపించారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్ ...

అభాగ్యనగరం..అతలాకుతలం..!

చిత్రం
విశ్వ నగరంగా, ఐటీ హబ్ గా, సైబరాబాద్ గా ఎంతో పేరున్న హైదరాబాద్ ఉరఫ్ భాగ్యనగరం ఇప్పుడు దిక్కులేనిదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఈ నగరం పూర్తిగా అతలాకుతలమైంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడ చూసినా నీళ్ళే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం నగరవాసుల పాలిట శాపంగా మారింది. ఇక మెట్రో రైళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పెచ్చులు ఊడి పడిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఇటీవలే పెచ్చులు ఊడిపడి మౌనిక అనే వివాహిత చని పోయింది. మెట్రో రైల్ గురించి గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ పై కఠిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. 20 లక్షలు సాయం ప్రకటించినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాని పరిస్థితి. నాణ్యతను పరిశీలించే అధికారులు ఎలా క్లియరెన్స్ సెర్టిఫికెట్ ఇచ్చారో వారికే తెలియాలి. హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఇప్పుడు వర్షాలు పెను సవాల్ గా మారాయి. చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడై పోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. గతంలో ఎప...

ఒప్పుకోని ఫ్యాన్స్ - ఆలీకి తిరిగి ఛాన్స్

చిత్రం
తెలుగు బుల్లి తెరమీద బిగ్ రియాల్టీ షో గా ఇప్పటికే పేరు పొందిన స్టార్ మా టీవీ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అప్పూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ పై కొంత వ్యతిరేకత వ్యక్తమైనా ప్రోగ్రాంకు రేటింగ్ పెరుగుతోంది. దీంతో స్టార్ టీవీ యాజమాన్యం రీజినల్ సెక్టార్స్ లలో దీనిని ఆయా ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినకుండా ప్లాన్ చేసింది. కన్నడలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో స్టార్ టీవీ మా టీవీని కొనుగోలు చేశాక వినోద రంగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మొదటగా బిగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న సెలెబ్రెటీస్ ను ఎంపిక చేసింది. అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ను టెలికాస్ట్ చేసింది. ఇది హిందీలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి మాతృక. దీనిని మొదటగా తెలుగు నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం కు విపరీతమైన రీతిలో ఆదరణ లభించింది. మా టీవీకి భారీ ఆదాయం కూడా సమకూరింది. మరో వైపు తెలుగు బుల్లి తెరమీద ఇప్పటికే జీ తెలుగు, ఈటీవి, జెమిని, తది...

మోదీ ఫస్ట్..ధోనీ బెస్ట్..బిల్ గేట్స్ టాప్ నెంబర్ వన్

చిత్రం
భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ హవా రోజు రోజుకు  పెరుగుతూనే ఉన్నది. తాజాగా యుగోవ్ అనే సంస్థ మోస్ట్ పాపులర్ పెర్సనాలిటీస్ ఎవరనే దానిపై ప్రతి ఏటా జాబితా వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పటికే టీమిండియా సారధ్యం నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా 42  వేల మందితో నిర్వహించిన సర్వేలో 8.58 శాతం మంది ధోనీనే ఇష్టపడ్డారు. మోడీ 15.66 శాతం ఓట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. ఇండియా స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌  కేటగిరీలో ధోనీ తర్వాత సచిన్‌‌ రెండో స్థానంలో నిలవగా.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మూడో స్థానం దక్కించు కున్నాడు. కాగా మహిళల విభాగంలో లెజెండరీ బాక్సర్‌‌‌‌ మేరీ కోమ్‌‌ 10.36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక పోతే వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్స్ పర్సన్స్ లో బిల్ గేట్స్ మొదటి స్థానం దక్కించుకున్నారు. మాజీ అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో జాకీ చాన్, నాలుగో ప్లేస్ లో జిన్ పింగ్, ఐదో స్థానంలో చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకులు జాక్ మా నిలిచారు. నరేంద్ర మోడీ...

మనోడు అపర కుబేరుడు..!

చిత్రం
ధీరుభాయి అంబానీ పుత్ర రత్నం ముఖేష్ అంబానీ ఇండియాలో అపర కుబేరుడిగా మరోసారి వినుతికెక్కారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చైర్మన్ గా వున్న ముఖేష్ మరోసారి వైరల్ గా మారారు. నిన్నటి దాకా జియో తో సెన్సేషనల్ సృష్టించిన ఈ వ్యాపార దిగ్గజం దెబ్బకు ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ టెలికాం రంగాన్ని షేక్ చేశారు ధీరుభాయి సుపుత్రులు. తండ్రి స్థాపించిన రిలయన్స్ ను ఇవ్వాళ  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా తీర్చిదిద్దారు. వేలాది మంది దీనిని నమ్ముకుని ఉన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒకే ఒక్క ప్రకటనతో ఇండియాలో షేర్స్ అమాంతం పైకి ఎగ బాకాయి. ప్రత్యర్థి కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. జియో లో నమోదైన కస్టమర్లు ఏకంగా 34 కోట్లకు చేరుకున్నారు. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా అపర కుబేరులు ఎవరో జాబితా విడుదలైంది. మొత్తం కుబేరుల్లో 3,80,700 కోట్ల తో అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో నిలిచి చరిత్ర సృష్టించారు. రెండవ స్థానంలో హిందూజా, మూడో ప్లేస్ లో అజీమ్ ప్రేమ్ జి ఉన్నారు. మొత్తం 25 మంది కుబేరుల లిస్టును ప్రక...

మోస్ట్ పవర్ ఫుల్ మెన్ - ఇమ్రాన్ నోట మోడీ మాట

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి మాట మార్చాడు. ఇండియాతో ప్రతి క్షణం యుద్దానికి కాలు దువ్వుతోంది పాక్. ఎప్పుడైతే జమ్మూ, కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మరింత రెచ్చి పోయాడు. భారత్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూనే బురద జల్లడం ప్రారంభించారు. మరో వైపు ఉగ్రవాదులకు తమ ప్రాంతం అడ్డాగా ఉందని ఒప్పుకుంటూనే ఇండియాను ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ వేదికపై జరిగిన సమావేశంలో ఇండియాపై పాకిస్థాన్ ప్రతినిధి నిప్పులు చెరిగారు. జమ్మూ, కాశ్మీర్ తమదేనంటూ చెప్పుకొచ్చారు. అక్కడ పాల్గొన్న దేశాలలో ఒక్క చైనా దేశం తప్పా పాకిస్థాన్ కు ఏ ఒక్క దేశమూ మద్దతు పలకలేదు. సరి కదా పాకిస్తాన్ ను ఉగ్రస్తాన్ అంటూ పేర్కొన్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో మీట్ అయ్యాడు. పాకిస్తాన్, ఇండియా దేశాలు చర్చలు జరిపి ఆసియాలో ఉద్రిక్త వాతావరణం లేకుండా చేయాలని, ఇందు కోసం తాను మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీగా ఉన్నానంటూ ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని భ...

న్వవ్వుల రేడు ఇక రాడు..!

చిత్రం
తెలుగు సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయింది. హాస్య నటుడిగా పేరున్న తెలంగాణకు చెందిన వేణు మాధవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. మొన్నటికి మొన్న ఎమ్మెస్ ను కోల్పోయింది. జనానికి వినోదం పంచుతున్న వాళ్లంతా ఒక్కరొక్కరుగా ఉండలేమంటూ వెళ్లి పోతున్నారు. మొదట మిమిక్రి ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన జీవితం ఉన్నట్టుండి నటుడిగా సక్సెస్ అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 1969 సెప్టెంబరు 28 లో పుట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకునే వారు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించే వాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సు లేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. వేణు మాధవ్ కు వెంట్రిలాక్విజ...

బ్లూ స్మార్ట్ లో దీపికా పదుకొనే పెట్టుబడి

చిత్రం
ఇండియాను స్టార్ట్ అప్స్ ఏలుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. డిఫరెంట్ ఐడియాస్ తో అంకురాలను ఏర్పాటు చేసే వారికి కంపెనీలు, బ్యాంకులే కాదు క్రీడా, సినిమా రంగాలకు చెందిన వారు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్ట్ అప్ బ్లూ స్మార్ట్ లో ప్రముఖ నటి దీపికా పదుకొనే మూడు మిలియన్స్ ను పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా దీపికకు పేరుంది. కాగా ఇప్పటి దాకా డ్రమ్స్ ఫుడ్ , బెల్లట్రిక్స్ ఎయిరోస్పెస్, మైంత్ర స్టార్ట్ అప్ లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను ఈ ముద్దుగుమ్మ ఆచరిస్తోంది. సినిమా రంగం అన్నది జూదం లాంటిది. ఎప్పుడు స్టార్ డం ఉంటుందో తెలియదు. అందుకే సంపాదించిన డబ్బులను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చని దీపికా పదుకొనే ఆశ. ఆమె ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టార్ట్ అప్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్లూ స్మార్ట్ వ్యాపారం కూడా గాడిలో పడింది. తమ వ్యాపారాన్ని మరింత గా విస్తరించేందుకు...

అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీలు మనవే

చిత్రం
అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీల జాబితాను వెల్లడించింది. ఇందులో మన భారత్ కు చెందిన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గతంలో లిస్టులో వెనుకబడిన ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. తన సత్తాను చాటింది. అంతే కాకుండా ఈసారి ప్రకటించిన జాబితాలో 16 భారతీయ కంపెనీలకు చోటు దక్కడం విశేషం. గత ఏడాది 2018 లో ఇన్ఫోసిస్ ప్లేస్ 31 ఉండగా.. ఈసారి 3 లో నిలిచి విస్తు పోయేలా చేసింది. ఫోర్బ్స్ మొత్తం 250 కంపెనీలతో జాబితా రూపొందించింది. టీసీఎస్ , టాటా మోటార్స్, హెచ్ డి ఎఫ్ సి సహా ఇతర కంపెనీలు గతంలో కంటే మరింత మెరుగైన రాంక్ లు పొందాయి. ఉన్న వాటిలో టాటా గ్రూప్ కంపెనీస్ కు చెందినవి మూడు కంపెనీలకు చోటు దక్కింది. వరల్డ్ వైడ్ గా చూస్తే సాంకేతికంగా సేవలు అందిస్తున్న వీసా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కంపెనీ మూడో ప్లేస్ లో ఉండగా ఈసారి ఏకంగా ప్రథమ స్థానానికి ఎగబాకింది. మరో వైపు కిందటి ఏడాదిలో మొదట ఉన్న అమెరికాకు చెందిన వాల్ డిస్ని కంపెనీ ఏకంగా ఏడో ప్లేస్ కు పడి పోయింది. ఇక ఇండియాకు సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీతో పాటు టాటా మోటార్స్ ...

అమితాబ్ కు అరుదైన గౌరవం..అత్యున్నత పురస్కారం..!

చిత్రం
భారత దేశంలో గొప్ప నటుడిగా పేరున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించింది. సినీ ప్రస్థానంలో దీనిని గొప్పగా భావిస్తారు. అమితాబ్ బచ్చన్ ను ఏకగ్రీవంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. నటుడిగా, ప్రయోక్తగా, గాయకుడిగా, నిర్మాతగా అమితాబ్ బచ్చన్ ఎక్కని మెట్లు లేవు. ఒకప్పుడు నటనకు పనికి రావంటూ హేళనకు, అవమానాలకు గురైన ఈ అరుదైన వ్యక్తి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎల్లప్పటికిని గుర్తుంచుకునేలా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు.  ఎక్కడైతే తనను వద్దన్నారో వాళ్ళే తనతో సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. ఏ గొంతు పూర్తిగా పనికే రాదని హేళన చేసిన వాళ్ళు సిగ్గు పడేలా అదే గొంతుతో అలవోకగా, అత్యంత గాంభీర్యంతో కవితలు చదువుతూ ఉంటే కోట్లాది మంది ఫిదా అయి పోయారు. ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నాయి. బిగ్ బి గా పేరున్న అమితాబ్ చేయని పాత్ర అంటూ లేదు. ఏది ఇచ్చినా దానికి న్యాయం చేశారు. తాజాగా తెలుగులో చిరంజీవితో కలిసి సైరా సినిమాలో కూడా నటించారు. అమ...

ఐటీ హబ్ లో స్టార్ట్ అప్స్ హవా..!

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇన్నోవేటివ్ హబ్ గా ఇప్పటికే పేరొందిన సైబరాబాద్ పలు స్టార్ట్ అప్ లకు వేదికవుతోంది. సరికొత్త ఐడియాస్ , డిఫ్ఫరెంట్ వే లో ఇప్పటికే వందలాదిగా ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా సక్సెస్ అయితే, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. టెక్నాలజీ, హెల్త్, ఇన్నోవేషన్, ఈ కామర్స్, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ, ట్రావెల్ టూరిజం తదితర వాటిపై అంకుర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటు అయ్యాయి. చిన్న గదుల్లో స్టార్ట్ అయిన ఈ స్టార్ట్ అప్స్ ఇప్పుడు కొన్ని వందలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీలుగా మారాయి. ఇక్కడ ఏర్పాటైన ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తోంది. కొత్త ఐడియాస్ ను ప్రోత్సహించేందుకు గాను ఏకంగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దిగ్గజ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ట్రైనింగ్ ఇస్తోంది. మెంటార్స్, ట్రైనర్స్, వెంచర్ కేపిటల్ , ఇన్వెస్ట్ మెంట్స్ , కంపెనీస్ సపోర్ట్ అందజేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా స్టార్ట్ అప్ ఫండ్ ను ఐటి హబ్ లో ఇటీవలే ఏర్పాటు చేసింది. కొన్ని బడా కంపెనీలు ఎదుగుతున్న అంకుర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా...

మధురమైన రాత్రులు .. మెత్తనైన వేక్ ఫిట్ పరుపులు

చిత్రం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని పాడుకోవాలన్నా, మనసైన వాళ్ళతో ప్రేమానుభూతులను నెమరు వేసు కోవాలన్నా, రొమాంటిక్ ఫీలింగ్స్ రావాలన్నా, కోరుకున్న కలలు మరింత రిచ్ గా ఉండాలన్నా ఎవ్వరూ లేని, నిశ్శబ్డం అల్లుకున్న ఓ గది ఉండాల్సిందే. అందులో ఆలోచనలు చెదిరి పోకుండా వుండాలంటే మెత్తనైన పరుపులు ఉండాల్సిందే. పడుకుంటే చాలు బాడీ మొత్తం అలసట లేకుండా అయి పోవాలి. అలాంటి పరుపులు, దుప్పట్లు, కుషన్స్, పిల్లోస్ కావాల్సిందే. వీటికి ఉన్నంత డిమాండ్ ఇంకే ఉత్పత్తులకు లేదంటే నమ్మలేం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పెను మార్పులు చోటు చేసు పోవడం వరల్డ్ వైడ్ గా లెక్కలేనన్ని అవకాశాలు రావడంతో మన వాళ్ళు యువతీ యువకులు, పెద్దలు లక్షాధికారులు అయిపోతున్నారు. దీంతో వాళ్ళ కోరికలు, అభిరుచుల్లో చెప్పలేనంత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వంత ఇల్లు, విల్లాస్, ఫ్లాట్స్ అన్నీ తమకు అనుగుణంగా ఉండేలా ఇంటీరియర్ డెకొరేషన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు. అన్నిటికంటే ఎక్కువగా స్లీపింగ్ ఉత్పత్తులకు ఎనలేని డిమాండ్ ఉంటోంది ఇండియన్ మార్కెట్ లో. స్లీప్ వెల్ లాంటి కంపెనీలు మార్కెట్ ను శాసిస్తున్నాయి. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న...

ఆస్కార్ బరిలో గల్లీ బాయ్ - జయహో జోయా అక్తర్

చిత్రం
ప్రపంచంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకునే కల ఆస్కార్. ఒక్కసారి వస్తే చాలు ప్రపంచమంతటా గుర్తింపు లభిస్తుంది. ఓ అరుదైన ఇమేజ్ తో పాటు బ్రాండ్ ఏర్పడుతుంది. అలాంటి ఆస్కార్ సినీ అవార్డుల కోసం మన దేశం నుంచి గల్లీ బాయ్ సినిమా ఎంపికైంది. 26 మంది కలిగిన ఫిలిం జ్యురీ పలు సినిమాలను పరిశీలించింది. చివరకు రణ్ వీర్ , ఆలియా భట్ కలిసి నటించిన గల్లీ బాయ్ నామినేట్ అయ్యింది. ఈ మూవీని జోయా అక్తర్ తీశారు. ఓ గల్లీలో ఉన్న కుర్రాడు తన సంగీతం, పాటలతో ప్రపంచ విజేతగా ఎలా నిలిచాడో అన్నదే ఈ సినిమా కథ. రితేష్ సిద్వానీ , జోయా అక్తర్ , ఫర్హాన్ అక్తర్ లు నిర్మించారు. మొత్తం సినిమాకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా విడుదలయ్యాక దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఏకంగా 238 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియన్ సినిమాలో ఓ మహిళ తీసిన ఈ మూవీ వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. విజయ్ మయూర దీనికి కథను సమకూర్చాడు. రణ్వీర్ ,ఆలియా తో పాటు సిద్దాంత్ చతుర్వేది అద్భుతంగా నటించారు..మెప్పించారు. సినిమాటోగ్రఫీ జె ఓజా అందించారు. ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ , టైగర్ బేబీ ప్రొడక్షన్స్ ద్వారా గల్లీ బాయ్ ని రిలీజ్ చేసింది. ఏయే ఫిల...

అబ్బా కోలుకోలేని దెబ్బ..దిగ్గజ సంస్థ దివాళా..!

చిత్రం
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్రిటన్ కు చెందిన థామస్ కుక్ సంస్థ దివాళా తీసినట్తు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మందగమనం నెలకొన్నది. నిన్నటి దాకా ఇండియా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇప్పుడు ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. దాదాపు 178 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది థామస్ కుక్ కంపెనీకి. బెయిల్ అవుట్ ఇవ్వడానికి  ఇంగ్లాండ్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపక పోవడం గమనార్హం. ఈ ఒక్క డెసిషన్ తో 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. వారికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తుందో వేచి చూడాలి. 1841 లో థామస్ కుక్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల పౌండ్లు ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే మెట్రావల్ కంపెనీని  కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి థామస్ కుక్ కోలుకోలేని స్థితికి దిగజారింది. పర్యాటక రంగంలో ఈ కంపెనీ తర్వాతనే ఏదైనా. సర్వీస్ ఇవ్వడంలోనూ, సౌకర్యాలను కల్పించడం లోను ఈ సంస్థ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. కాగా ఆన్‌లైన్‌ పోటీ, బ్రెగ్...