నష్టాలు లెక్క కాదంటున్న ఇండిగో
భారత ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిడుకులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా విమానయన రంగాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉండగా చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో 652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు 1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి 428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, 319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా తెలిపారు.
మొత్తం ఆదాయం 6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో 8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో 1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచ్చిన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి 9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికల పైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధిగమిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉండడం కూడా మరో కారణమన్నారు.
మొత్తం ఆదాయం 6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో 8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో 1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచ్చిన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి 9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికల పైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధిగమిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉండడం కూడా మరో కారణమన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి