మరాఠాపై మగధీరుడు ఎవ్వరో
మరాఠాలో రాజకీయాలు వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నా..సీఎం పీఠం దగ్గర మాత్రం పీఠముడి ఇంకా తొలగి పోలేదు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును విజయవంతంగా దాట గలిగింది. కానీ భారీగా స్థానాలు సాధించలేక పోయింది. కాషాయ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గగా..దాని మిత్ర పక్షం శివసేన తన స్థానాలను మెరుగు పరుచుకొని.. రియల్ కింగ్ మేకర్గా అవతరించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరంగా ఏమీ ఓడి పోలేదు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ గతంలో కంటే గణనీయంగా తన స్థానాలను పెంచుకుంది.
ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో శివసేన అధికారాన్ని పంచు కోవచ్చునని ఊహాగానాలు గుప్పు మన్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పిన ఆయన..అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో లాగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో రెండున్న రేళ్లు పంచు కోవాలని ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఆ ప్రకారంగానే ప్రభుత్వం ఉండ బోతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అటు థాక్రేల వారసుడు ఆదిత్యా థాక్రే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మహారాష్ట్రలో థాక్రేల పాలన రావాల్సిందేనని శివసేన గట్టిగా పట్టు బడుతోంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా అందుకు సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. దీంతో మరాఠా కోటపై ఎవరు జెండా ఎగుర వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో శివసేన అధికారాన్ని పంచు కోవచ్చునని ఊహాగానాలు గుప్పు మన్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పిన ఆయన..అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో లాగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో రెండున్న రేళ్లు పంచు కోవాలని ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఆ ప్రకారంగానే ప్రభుత్వం ఉండ బోతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అటు థాక్రేల వారసుడు ఆదిత్యా థాక్రే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మహారాష్ట్రలో థాక్రేల పాలన రావాల్సిందేనని శివసేన గట్టిగా పట్టు బడుతోంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా అందుకు సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. దీంతో మరాఠా కోటపై ఎవరు జెండా ఎగుర వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి