పోస్ట్‌లు

జులై, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రిలయన్స్ సరుకులు ఇక దుకాణాల్లో..!

చిత్రం
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో కొత్త ఇండియాకు శ్రీకారం చుట్టింది . ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటూ వెళుతున్నారు. ఆయిల్ , టెలికాం , రిటైల్ , ఈ కామర్స్ , డిజిటల్ టెక్నాలజీ , ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్రతో ..ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ట్రెండ్స్ ద్వారా దుస్తులు ..కిడ్స్ వస్తువులు ..ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచుతోంది . రిలయన్స్ ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ పేరుతో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వస్తువులను విక్రయిస్తోంది . ఇందులో ప్రతి ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఇందులో లభించేలా రిలయన్స్ గ్రూప్ పక్కాగా ప్లాన్ చేసింది . అందరికంటే భిన్నంగా వెళుతోంది . టెలికం రంగంలో ఇప్పటికే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది . ఆసియా లో అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ..తన కంపెనీ కి చెందిన సరుకులను ఇప్పటి దాకా తన రిటైల్ స్టోర్స్ లలోనే అమ్మేవారు . ఇప్పుడు తన మార్కెట్ స్ట్రాటజీని మార్చుకుంది ఈ కంపెనీ . ఆయా సరుకులను ఇండియాలోని కిరాణా దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా రిలయన్స్ స్మార్ట్ , ఫ్రెష్ , మార్కెట్ స్టోర్స్ లలో మాత్రమే లభిస్తున...

బంధాలు చెరిపేస్తున్న టిక్ టాక్

చిత్రం
ఊహించని రీతిలో టిక్ టాక్ యాప్ టాప్ రేంజ్ కు వెళ్ళింది . రోజు రోజుకు ఈ యాప్ ను వాడుతున్న వారు లక్షలకు చేరుకున్నారు . కేవలం కొన్ని నిమిషాల లోపే తమకు తాము వీడియో లను తయారు చేసుకునే వీలు కలుగుతుంది దీని ద్వార. దీంతో ప్రతి ఒక్కరు ఈ యాప్ ను వాడకుండా ఉండలేక పోతున్నారు . అంతలా టిక్ టాక్ కు అడిక్ట్ అవుతున్నారు . యువతీ యువకులు , వృద్దులు , మహిళలు , ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పది విలువైన టైం ను కోల్పోతున్నారు . ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన పని లేదు . టెక్నాలజీ పుణ్యమా అంటూ ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ..జనాన్ని ..యూత్ ను మెస్మరైజ్ చేస్తోంది .  ఆఫీస్ లలో విధులు ఎగ్గొట్టి టిక్ టాక్ యాప్ లో మునిగి పోతున్నారు . చాలా మంది పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వీరు జవాబుదారీగా ఉండటం లేదు . ఇటీవల జాబ్ లు కూడా పోగోట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు . చిన్నా పెద్ద తేడా అంటూ లేకుండా అందరిని బానిసలుగా మార్చేస్తోంది ఈ యాప్ . సరదాగా ఉంది కదా అని మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వదలలేక ..బంధాలను తెంచేసుకుంటున్నారు . ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తూ ..ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను మరింత ఇబ్బంది కరంగా మార్చ...

చ‌రిత్ర సృష్టించిన మోదీ స‌ర్కార్ ..ప‌క్కా ప్లాన్..బిల్లులు పాస్ ..!

చిత్రం
ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డ‌మంటే వంట చేసినంత ఈజీ కాదు. ఎన్నో స‌వాళ్లు..ఇంకెన్నో ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు. విప‌క్షాల అడ్డంకుల‌ను త‌ట్టుకుని ..జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో వ‌చ్చే వ‌త్తిళ్ల‌ను దాటుకుంటూ స‌ర్కార్‌ను న‌డ‌పాలంటే చాలా ఓపిక క‌లిగి ఉండాలి. బీజేపికి చెందిన న‌రేంద్ర మోదీ ఎప్పుడైతే కేంద్రంలో కొలువు తీరారో అప్ప‌టి నుంచి ఇండియాలో మోదీ జ‌పం వినిపిస్తోంది. ఓ వైపు రాం దేవ్ బాబా..మ‌రో వైపు మోదీ..అమిత్ షాలు ఒక్క‌సారి ప్లాన్ గీశారంటే ఇక వ‌ర్క‌వుట్ కావాల్సిందే. తాజాగా క‌ర్ణాట‌క‌లో కొలువుతీరిన కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్ర‌భుత్వానికి చెక్ పెట్టారు. మోదీ కాలు మోప‌డం, ఆ త‌ర్వాత అమిత్ షా ఎంట‌ర్ కావ‌డం..దాని వెనుక ప‌రిణామాలు చ‌కా చ‌కా మారి పోవ‌డం ష‌రా మామూలై పోయింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలలో ఉన్న వారికి తెర వెనుక జ‌రిగే మంత్రాంగం గురించి తెలిసే వుంటుంది. రాబోయే 2020 నాటికి బీజేపీ మాత్ర‌మే ఉండాల‌న్న‌ది వీరిద్ద‌రి ప్లాన్. అందులో భాగంగానే అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని త‌మ‌కు , పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు మోదీ అండ్ షా. బిల్లులు ఆమోదం పొందాలంటే అధికార ప‌క్షం ఉంటే స‌రిపోదు, దానికి కా...

బ‌ల నిరూప‌ణ స‌క్సెస్..ర‌మేష్ కుమార్ రాజీనామా..!

చిత్రం
క‌న్న‌డ నాట నిన్న‌టి దాకా ఉన్న ఉత్కంఠకు ఒకే ఒక్క బ‌ల నిరూప‌ణ‌లో స‌క్సెస్ కావ‌డంతో తెర ప‌డింది. ప్ర‌జా వేదిక‌గా విశ్వాస ప‌రీక్షకు రెడీ కావాల‌ని, త‌మకున్న బ‌లం ఏమిటో విధాన‌స‌భ‌లో నిరూపించు కోవాల‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. త‌న‌కు విశేష‌మైన అధికారాలు ఉన్నాయ‌ని, తాను రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నికైన వ్య‌క్తినంటూ ఆయ‌న సుదీర్ఘ‌మైన ప్ర‌సంగం చేశారు. దీంతో రెబ‌ల్ ఎమ్మెల్యేలు కొంద‌రు ముంబ‌యికి వెళ్ల‌డం, అక్క‌డ హోట‌ళ్ల‌లో గ‌డ‌ప‌డం, కొంద‌రు ఉన్న‌ట్టుండి ఆరోగ్యం స‌రిగా లేదంటూ చిలుక ప‌లుకులు ప‌ల‌క‌డం, చివ‌ర‌కు ఇదేమీ వ‌ర్క‌వుట్ కాక పోవ‌డంతో తాము చేసిన రాజీనామాలు ఆమోదింప చేసేలా ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ చివ‌రి వ‌ర‌కు వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభించింది. ఓ వైపు కుమార స్వామి, మ‌రో వైపు సిద్దిరామ‌య్య‌తో పాటు ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన డీకే శివ‌కుమార్ సైతం ఆఖ‌రి వ‌ర‌కు విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా ఫ‌లితం లేక పోయింది. దేశ వ్యాప్తంగా క‌ర్నాట‌క విధాన స‌భ‌లో జ‌రుగుతున్న బ‌ల‌ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌తి స‌న్నివేశాన్ని టెలికాస్ట్ చేసేలా స్ప...

అనాధ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న న‌టీన‌టులు..!

చిత్రం
వాళ్లు మ‌న‌లాంటి మ‌నుషులే. కాక పోతే వాళ్ల‌కు కూడా మ‌న‌లాగే హృదయం ఉంటుంద‌ని నిరూపిస్తున్నారు బాలీవుడ్‌కు చెందిన సినీ న‌టీన‌టులు. ఎక్క‌డికి వెళ్లినా వీళ్లు సెల‌బ్రెటీలు. చిటికేస్తే కోట్ల రూపాయ‌లు వాలిపోతాయి. అంతలా స్టార్‌డ‌మ్‌తో పాటు పాపుల‌ర్ కావ‌డంతో మ‌న‌కు ఓ అభిప్రాయం ఉంటుంది. వీరు ఉన్న‌త స్థాయిలో ఉంటారని, ఇత‌రుల గురించి ఆలోచించ‌ర‌ని, వాళ్ల‌కు డ‌బ్బులు ఎక్కువ‌ని..మ‌నం క‌నిపించ‌మంటూ ఓ రాంగ్ ఒపినియ‌న్ ఉంటుంది. ఒక్కో న‌టుడు..న‌టికి ఎక్క‌డలేని పేరు సంపాదించుకున్న వారే. తెర‌పై అన్ని పాత్ర‌లు పోషించే వీరంతా ..వృత్తిప‌రంగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ..పేవ్ మెంట్‌ల‌పై ఉన్న పిల్ల‌ల‌ను చేర‌దీశారు. అంతేకాకుండా అనాధ ఆశ్ర‌మంలో సేద తీరుతున్న వారిని కూడా వీరు ద‌త్త‌త తీసుకున్నారు. సో..స‌మాజం ప‌ట్ల‌, మ‌నుషుల ప‌ట్ల త‌మ‌కు క‌న్‌స‌ర్న్ ఉంద‌ని నిరూపించారు. వీరిలో 10 మంది టాప్ లో నిలిచిన వారున్నారు. ఒక‌ప్పుడు ఒక ఊపు ఊపిన న‌టీమ‌ణి సుస్మితా సేన్ ..రేణే, అలీషా అనే బాలిక‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు ఆమె. టాప్ రేంజ్‌లో ఉంటూ స‌క్స‌స్ ఫుల్ న‌టిగా పేరు తెచ్చుకున్న ర‌వీనా టాండ‌న్ కూడా ఇత‌ర న‌టీన‌టుల‌కు తీసిపోని...

బిగ్ బాస్ నుండి హేమ అవుట్..సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ జాఫ‌ర్

చిత్రం
తెలుగు టెలివిజ‌న్ రంగంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న మా టీవీ ప్ర‌సారం చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాంకు అనూహ్య‌మైన రీతిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి రేటింగ్ పెరుగుతోంది. దీంతో ఈ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్‌ను భారీగా ఆఫ‌ర్ ఇచ్చి కొనుగోలు చేసిన స్టార్ టీవీ గ్రూప్ సంస్థ‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతోంది. బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇత‌ర ఛాన‌ళ్ల కంటే భిన్నంగా ఉంటోంది. యువ‌తీ యువ‌కుల‌తో పాటు మ‌హిళ‌ల‌ను కుటుంబాల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చి దిద్దేందుకు యాజ‌మాన్యం ప్లాన్ చేసింది. ఇది మూడో సీజ‌న్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ ప్రారంభ‌మై 8 రోజులవుతోంది. ప్ర‌తి వారానికి ఎవ‌రో ఒక‌రు ఈ ప్రోగ్రాం నుండి ఎలిమినేట్ కావ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. మొత్తం ఈ కార్య‌క్ర‌మం 100 రోజులు సాగుతుంది. ఎక్క‌డ‌లేని ట్విస్టుల‌తో ..డిఫ‌రెంట్ మాడ్యూలేష‌న్స్‌తో ప్ర‌తి రోజు ఉత్కంఠ‌ను రేపుతోంది బిగ్ బాస్. ప్ర‌తి ర‌న్నింగ్ టైం 90 నిమిషాలు నిడివి ఉంటుంది. దేశ వ్యాప్తంగా స్టార్ ప్రారంభించిన బిగ్ బాస్ ప్రోగ్రాంకు ఎన‌లేని డిమాండ్ రావ‌డంతో..ఇత‌ర రీజిన‌ల్ లాంగ్వేజ్‌ల‌లో కూడా ప్ర‌సారం చ...

క‌ర్నాట‌క స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం .. 14 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై వేటు

చిత్రం
క‌న్న‌డ నాట ప‌వ‌ర్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతూనే వున్నాయి. నిన్న‌టి దాకా 15 రోజుల పాటు ఉత్కంఠ కొన‌సాగింది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ స‌ర్కార్ కూలి పోవ‌డం, బీజేపీ స‌ర్కార్ కొలువు తీర‌డం, ఆ పార్టీ తర‌పున యెడ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా హుటా హుటిన ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం జ‌రిగి పోయింది. ప్ర‌భుత్వానికి కావాల్సిన బ‌లాన్ని తిరిగి నిరూపించు కోవాల్సిన ప‌రిస్థితి బీజేపీపై ఉంది. ఇందు కోసం ఇప్ప‌టికే ముగ్గురు రెబ‌ల్ ఎమ్మ్యేల్య‌పై అన‌ర్హ‌త వేటు వేశారు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్. దీంతో కేంద్రంలోని క‌మ‌ల స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. ఎలాగైనా స‌రే క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని పూర్తి కాలం న‌డిపించాల‌నే కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నికైన స్పీక‌ర్ ఇపుడు కీల‌కంగా మారడంతో వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. స్పీక‌ర్‌గా ఎన్నికైన ర‌మేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి. ఎలాగైనా స‌రే సంకీర్ణ స‌ర్కార్‌ను గ‌ట్టెక్కించేందుకు ఆయ‌న ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. చివ‌రి వ‌ర‌కు దానిని నిల‌బెట్టాల‌ని చూశారు. తీరా క‌మ‌ల‌నాథులు రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌భావితం చేయడం, తాయిలాలు ఎర చూప‌డంతో క‌థ మొద‌టికొచ్చింది....

ముంబ‌యిని ముంచెత్తిన వాన‌లు..త‌ల్ల‌డిల్లుతున్న జ‌నాలు..!

చిత్రం
దక్షిణాదిన వ‌ర్షాలు లేక త‌ల్ల‌డిల్లి పోతుంటే..సాగు నీరు దేవుడెరుగు క‌నీసం తాగేందుకు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంటే.. మ‌రో వైపు ముంబ‌యిలో మాత్రం ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. దేశ ఆర్థిక రంగానికి ఆయువు ప‌ట్టుగా ఉన్న ఈ న‌గ‌రం ఇపుడు జ‌నం హాహాకార‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోతోంది.  రాక‌పోక‌లు స్తంభించి పోయాయి. ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. ఎక్క‌డ చూసినా వ‌ర‌ద‌లే..నీళ్లే..న‌గ‌ర వాసుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. విమానాశ్ర‌యం నీళ్ల‌తో నిండి పోయింది. రైళ్లు , బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచి పోయాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ అర్దాంత‌రంగా ఆగి పోయింది. వ‌ర‌ద ప్ర‌వాహాం దెబ్బ‌కు ఏకంగా మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి పోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న వారిని నావికా, ర‌క్షక ద‌ళాలు ర‌క్షించాయి. ల‌క్ష‌లాది మందికి ప‌ర‌క్షోంగా ఉపాధి క‌ల్పించిన ఈ న‌గ‌రం ఇపుడు బేల చూపులు చూస్తోంది.  ఈ రైలులో 17 గంట‌ల‌కు పైగా బిక్కు బిక్కు మంటూ గ‌డిపారు. 1050 మందికి పైగా ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించారు. రెస...

వీఆర్ఎస్‌కు ఐఏఎస్ ముర‌ళి ద‌ర‌ఖాస్తు ప‌త్రం - గులాబీ స‌ర్కార్‌పై సంధించిన అస్త్రం..!

చిత్రం
ఇక నేనుండ‌లేను. ప‌ని లేకుండా ఊరికే ఉండ‌లేను. చేతులు క‌ట్టేసి ప‌ని చేయ‌మంటే ఎలా..నాకు వెళ్లేందుకు కారు కూడా  ఏర్పాటు చేయ‌లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ముర‌ళి. సోష‌ల్ రిఫార్మ్స్  కోసం త‌ప‌న ప‌డే ఈ ఉన్న‌తాధికారికి ఏ.ఆర్. శంక‌రన్ అంటే అభిమానం.  కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్ర‌భుత్వంపై వీఆర్ ఎస్ అస్త్రాన్ని సంధించారు. ఇక నేను ఈ కొలువు చేయ‌లేనంటూ ప్ర‌క‌టించారు. ఈ విష‌యం తెలంగాణ‌లో సంచ‌ల‌నం క‌లిగించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆయ‌న ప్ర‌ధానంగా ఈ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. ప్ర‌చారానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న దాంట్లో క‌నీసం 20 శాతం ఖ‌ర్చు చేయ‌గ‌లిగితే విద్యా వ్య‌వ‌స్థ గాడిన ప‌డేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మైన ఆరోప‌ణ లేదా ఆవేద‌న మొత్తం భ్ర‌ష్టు ప‌ట్టి పోయిన విద్యా రంగం గురించే. వ్య‌క్తిగ‌తంగా కొంత విభేదించిన‌ప్ప‌టికీ ..ఆయ‌న చెప్పిన దాంట్లో 100 శాతం వాస్త‌వమే. ఈరోజు వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లోని పాఠ‌శాల‌ల్లో ఎంత మంది టీచ‌ర్లుగా ప‌నిచ...

దివికేగిన దిగ్గ‌జ నేత - పెద్ద‌దిక్కును కోల్పోయిన తెలంగాణ - పాల‌మూరు బిడ్డ మ‌రువ‌దు ఈ గ‌డ్డ..!

చిత్రం
సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు ఇక‌లేడు..ఇక రాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చ‌ర్యంతో మీరే అంటూ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మాడ్గుల‌కు చెందిన సూదిని జైపాల్ రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌తో హైద‌రాబాద్ లో క‌ను మూశారు. అద్భుత‌మైన మేధావిగా, రాజ‌కీయ దురంధరుడిగా, అప‌ర చాణుక్యుడిగా, ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా, న‌డిచే ఎన్‌సైక్లోపేడియాగా, ప‌దాల‌కు అర్థాలు వెతుక్కునే డిక్ష‌న‌రీ ఆయ‌న‌. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆయ‌న ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు. లోతైన ప‌రిశీల‌న‌, తార్కిక ప‌రిజ్ఞానం, దేశ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప‌ర‌మైన అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. అన్నిటికంటే ఆయ‌న గొప్ప భావుకుడు, మాన‌వ‌తావాది, ర‌చ‌యిత‌, చివ‌రి వ‌ర‌కు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న వ్య‌క్తి. జైపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న‌తో సంభాషించాల‌న్నా లేక ఇంట‌ర్వ్యూ చేయాలంటే చాలా మంది జ‌ర్న‌లిస్టులు జ‌డుసుకున్న సంద‌ర్భాలు ఎన్నో. 24 ఏళ్ల సుదీర్ఘ‌మైన పాత్రికేయ అనుభ‌వంలో క‌ర‌వుకు కొండ‌గుర్తుగా ఉన్న ఈ జిల్లాకు చెందిన నాకు ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశం ఓ దిన‌ప‌త్రిక ద్వారా ద‌క...

న్యూ బిజినెస్‌లోకి ప్రిన్స్ ఎంట‌ర్..!

చిత్రం
అంద‌గాడు..ఆడ‌పిల్ల‌ల క‌ల‌ల రాకుమారుడిగా పేరున్న ఒకే ఒక్క న‌టుడు ఎవ‌ర‌న్నా ఉన్నారంటే..ఎవ‌రైనా ఠ‌క్కున సమాధానం చెప్పేది మ‌హేష్ బాబు అని. టాలీవుడ్‌, కోలివుడ్, బాలీవుడ్..ఇండియా వ్యాప్తంగా ఈ న‌టుడికి లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. సింప్లిసిటీని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే మహేష్ బాబు డైలాగ్ డెలివ‌రీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయ‌న త‌ప‌న ప‌డ‌తారు. జ‌యాప‌జ‌యాల‌ను మ‌హేష్ ప‌ట్టించుకోరు. అదీ ఆయ‌న స్పెషాలిటీ. న‌టుడిగా ఆయ‌న ప్రూవ్ చేసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా త‌ను, త‌న కుటుంబం ఇంతే. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. ఎవ‌రి ప‌ట్ల జోక్యం చేసుకోరు. ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ తో చేసిన సినిమా ఆడ‌క పోయినా..స‌ద‌రు డైరెక్ట‌ర్ ఒకే ఒక్క మాట చెప్పారు ప్రిన్స్ గురించి. మ‌హేష్ బాబు ..డైరెక్ట‌ర్స్ ఛాయిస్ అంతే కాదు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన న‌టుడు. షూటింగ్ కు వ‌చ్చిన‌ప్పుడు ఎలా వుంటారో..పూర్త‌య్యాక ఇంటికి వెళ్లేట‌ప్పుడు అలాగే ఉంటారు. ఇలాంటి న‌టులు అరుదుగా ఉంటార‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రం ఓ సంద‌ర్భంలో తెలిపారు. ఇప్ప‌టికే...

ఇక చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ ఎంట‌ర్

చిత్రం
డిజిట‌లైజేష‌న్ పుణ్య‌మా అంటూ ఇండియాలో ఆన్ లైన్‌లో పేమెంట్స్ కు సంబంధించిన లావాదేవీలకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. ప్ర‌భుత్వ , ప్రైవేట్ బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లు అందించ‌డంలో పోటీ ప‌డినా చివ‌ర‌కు అవి కూడా  అస‌లైన టైంలో చేతులెత్తేశాయి. ఎప్పుడైతో కేంద్రంలో బీజేపీ స‌ర్కార్ కొలువు తీరిందో అప్ప‌టి నుంచి జ‌నానికి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. అన్నింటికి మించి ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్ష‌న్స్ పెరుగ‌గా , ఇంకా స‌గానికి పైగా సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు. ఏ ఒక్క లావాదేవీ జ‌రిపినా లేదా నిర్వ‌హించినా ..చెల్లింపులు జ‌రిపినందుకు అడ్డ‌గోలుగా క‌మీష‌న్ వ‌సూలు చేస్తున్నారు. ఈ దందా మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతోంది ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో. ఆయా బ్యాంకుల‌కు సంబంధించిన ఎనీ టైం మిష‌న్ అంటే ఏటీఎంలు నో క్యాష్ అన్న బోర్డులు త‌గిలించి ..ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏదైనా అవ‌స‌రం ఉందంటే క‌మీష‌న్ దారుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీయాల్సి వ‌స్తోంది. ఇంత జ‌రుగుతున్నా ఆర్బీఐ కానీ లీడ్ బ్యాంకు కానీ, జిల్లా స్థాయిలలో ఉన్న ఉన్న‌తాధికారులు కానీ ఎవ‌రూ స్పందించ‌డం లేదు. చెల్లింపులు అనేవి ఆన్‌లైన్ ...

మ‌హిళ‌లు అసాధార‌ణ విజ‌యాలు స్ఫూర్తికి సంకేతాలు

చిత్రం
ఆకాశంలో స‌గమే కాదు అభివృద్ధిలో ..అన్ని రంగాల్లో మ‌హిళ‌లు లేకుండా విజ‌యాలు సాధించ‌డం క‌ష్టం. ఇటీవ‌ల మ‌హిళ‌లు రాజ‌కీయ‌, క్రీడా, ఆర్థిక‌, వ్యాపార‌, శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో పాలుపంచుకంటూ త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర వివ‌క్ష‌కు లోనైన మ‌హిళలు ఇపుడు మారుతున్న ప్ర‌పంచంలో త‌మ వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. తాజాగా 19 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన హిమ‌దాస్ అద్భుత‌మైన గెలుపును సాధించింది. అసాధార‌ణ‌మైన విజ‌యాల‌ను న‌మోదు చేసింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేసే దాకా ఆమె సాధించిన స‌క్సెస్ గురించి ఈ దేశ వాసులకు తెలియ‌లేదు. అయిన దానికి కాని దానికి చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా చేసి 24 గంట‌లు ప్ర‌సారం చేసే జాతీయ మీడియా హిమ‌దాస్ గురించి అస్స‌లు ప‌ట్టించు కోలేదు.  ఇక నేష‌న‌ల్, స్టేట్ ప్రింట్ మీడియా కూడా కావాల్సినంత స్పేస్ ఇవ్వ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హిమ‌దాస్ గురించి భారీ ఎత్తున నెటిజ‌న్లు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆమె సాధించిన విజ‌యానికి జేజేలు ప‌లికారు. త‌ర్వాత ప్రింట్, మీడియాలు ఆమె గురించి రాశాయి. గోల్డెన్ గ‌ర్ల్‌గా ఇపుడు కీర్తిస్తున్నారు. మేరీ కోమ్ కు పె...

తెల్లొళ్ల కోట‌లో పాగా వేసిన న‌ల్ల సూరీలు

చిత్రం
రాజ్యాలు కూలి పోయినా ..టెక్నాల‌జీ మారినా..మ‌నుషులు అంత‌రిక్షంలోకి వెళ్లినా ఇంకా కుల వ్య‌వ‌స్థతో పాటు జాతుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికాలో ఆఫ్రిక‌న్స్ అన్నా..న‌ల్ల జాతీయులంటే చుల‌క‌న భావ‌న‌. ఇప్ప‌టికింకా తెల్ల‌వాళ్ల డామినేష‌న్ కంటిన్యూ అవుతోంది. న‌లుగురు బ్లాక్ మెన్స్ స్టార్ట‌ప్ తో ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యారు. జాన్ హెన్రీ, హెన్రీ పియ‌రీ జాక్వెస్, బ్రాండ‌న్ బ్రియాంట్ , జారిడ్ టింగ‌ల్ కో ఫౌండ‌ర్స్ గా హ‌ర్లెమ్ కేపిటల్ ను స్థాపించారు. ఫైనాన్సియ‌ల్ ప‌రంగా ఈ స్టార్ట‌ప్ ప్రాఫిట్‌ను సాధించింది స్వ‌ల్ప కాలంలోనే. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగంలో వీరు న‌లుగురు సూప‌ర్ స్టార్స్‌గా పేరు గ‌డించారు. అమెరికాలో అక్క‌డి వారిదే హ‌వా. వారిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టం.  ఐటీ, ఫార్మా, టెలికాం, త‌దిత‌ర రంగాలైతే ఓకే. కానీ బిజినెస్ రంగంలో వీరే ఎక్కువ‌గా ఉంటారు. వీరి ఆధిప‌త్యాన్ని త‌ట్టుకుని ఫైనాన్షియ‌ల్ సెక్టార్‌లో టాప్ రేంజ్‌లోకి రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. న‌లుగురు బ్లాక్ మెన్స్‌తో పాటు ఓ వైట్ మెన్ అంటే ఓ అమెరిక‌న్ కూ...

సామాజిక మాధ్య‌మాలు..ప్ర‌జా చైత‌న్యానికి ప్ర‌తీక‌లు..!

చిత్రం
ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు అనేవి లేక‌పోతే ప్ర‌పంచం ఎప్పుడో జ‌నాన్ని న‌ట్టేట ముంచి వుండేది. ప్ర‌శ్నించే హ‌క్కుల్ని కోల్పోతే ఎన్ని వున్నా ఏం లాభం. జీవితం వ్య‌ర్థ‌మే. ప్ర‌తి చోటా ఎక్క‌డో ఒక చోట ఈ లోకంలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, పోరాటాలు, నిల‌దీయ‌డాలు, శాంతియుతంగా ధ‌ర్నాలు, రాస్తారోకోలు, స‌మ్మెలు..కొన‌సాగుతూనే ఉన్న‌వి. నిత్యం వాటికి ఎక్క‌డో ఒక చోట స్పేస్ దొరుకుతోంది. యుద్ధం అనివార్య‌మైన చోట‌..శాంతికి తావుండ‌దు..ఇక పోరాటం మాత్ర‌మే మిగిలి ఉంటుంది. మౌనంగా చూస్తూ భ‌రించ‌డం కూడా నేర‌మే అంటాడు దాస్తోవ‌స్కీ ఓ సంద‌ర్భంలో. ప్రపంచాన్ని అత్యంత ప్ర‌భావితం చేసిన మార్పుల్లో..మొద‌ట మాగ్నాకార్టనే. ఆ త‌ర్వాత ఎన్నో పోరాటాలు చోటు చేసుకున్నాయి. లక్ష‌లాది మంది జ‌నం ఆధిప‌త్య పోరులో అంత‌మై పోయారు. నామ రూపాలు లేకుండా ..చ‌రిత్ర ద‌రిదాపుల్లోకి రాకుండా పోయారు. ఇది విషాద‌క‌ర‌మైన స‌న్నివేశం. ఎంత చెప్పినా త‌క్కువే. బ‌లిదానాలు చేసిన వాళ్లు, త్యాగాలు చేసిన వాళ్లు మ‌రెంద‌రో. వీరికి చ‌రిత్ర పుటల్లో చోటు ద‌క్క‌లేదు. మ‌హాక‌వి శ్రీ‌శ్రీ అన‌లేదా..న‌ర‌జాతి చ‌రిత్ర స‌మ‌స్తం ప‌రపీడ‌న ప‌రాయ‌ణ‌త్వం అని. అందుకేగా కార...

ఓయో బంప‌ర్ ఆఫ‌ర్..హోట‌ల్ ఓన‌ర్స్‌కు ల‌క్కీ ఛాన్స్

చిత్రం
రితేష్ అగ‌ర్వాల్ పేరు విన్నారా. అతడు సృష్టించిన సునామీకి ప్రపంచాన్ని హోట‌ల్ రంగంలో శాసిస్తున్న దిగ్గ‌జ కంపెనీల‌న్నీ జ‌డుసుకుంటున్నాయి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంద‌న‌డానికి రితేష్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఎక్క‌డ ఢిల్లీ..ఎక్క‌డ ఇండియా..ఎక్క‌డ వ‌ర‌ల్డ్..ఓహ్..అత‌డు సాధించిన అపూర్వ‌మైన విజ‌యం కోట్లాది మందికి స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. త‌క్కువ పెట్టుబ‌డితో స్టార్ట్ చేసిన ఓయో ఇపుడు సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. ఇండియాలో ఏ మూల‌కు వెళ్లినా..ఏ హోట‌ల్ ను సంద‌ర్శించినా ఓయో బోర్డు క‌నిపిస్తుంది. ప్ర‌తి హోట‌ల్ య‌జ‌మానికి ఓయో వెన్ను ద‌న్నుగా నిలుస్తోంది. 2013లో ఢిల్లీలో ఓయో అంకుర సంస్థ‌ను ప్రారంభించాడు రితేష్ అగ‌ర్వాల్. ఆయా హొట‌ల్స్ ఓన‌ర్స్‌తో ఓయో ఎంఓయు చేసుకుంటుంది. ఎవ‌రైనా ప్ర‌యాణికులు లేదా క‌స్ట‌మ‌ర్లు అక్క‌డికి వెళ్లినా ముందుగానే స‌మాచారాన్ని ఆయా హోట‌ల్స్‌కు స‌మాచారం చేరుతుందిక క్ష‌ణాల్లో. అందివ‌చ్చిన టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని మొత్తం ప్ర‌పంచ‌లోని ప్ర‌తి హోట‌ల్‌తో అనుసంధానం అయ్యేలా చేశాడు రితీష్. అత‌డి దెబ్బ‌కు ఇపుడు త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌న్నీ ఓయో స‌క్సెస్‌ను చూసి షాక్‌కు గుర‌వు...

బాల్‌రెడ్డి సాధించిన విజ‌యం..అన్న‌దాత‌ల‌కు ఆద‌ర్శం..!

చిత్రం
ఎవ‌ర‌న్నారు వ్య‌వ‌సాయం దండుగ అని..అది పండుగ అంటూ చేసి చూపించాడు..బాల్‌రెడ్డి. పొలం నుంచి పంట‌ల్ని వంట గ‌దిలోకి వ‌చ్చేలా చేశాడు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌న వ్యాపారాన్ని విస్త‌రించేలా చేశాడు. క‌ళ్ల ముందు జ‌రిగిన స‌క్సెస్ స్టోరీ. ఈ ఏడాది నెలాఖ‌రు నాటికి ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నది అత‌డి టార్గెట్. రైతులు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించే పంట‌ల ఉత్ప‌త్తుల‌ను నేరుగా వినియోగ‌దారుల‌కు చేర్చాలంటే ఎన్నో ఇబ్బందులు. మ‌రెన్నో క‌ష్టాలు. చూస్తే పెద్ద త‌తంగం మిళిత‌మై ఉంటుంది. ఇక్క‌డంతా మ‌ధ్య‌ద‌ళారీ వ్య‌వ‌స్థ బ‌లంగా వేళ్లూనుకుని పోయింది. పంట చేతిలోకి రావాలంటే మిల్ల‌ర్ల ద‌గ్గ‌ర‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లు, రిటైల‌ర్లు ..ఇలా మూడంచెల వ్య‌వ‌స్థ‌ను దాటుకుని రావాల్సి ఉంటుంది. అంతా చేరుకున్నాక‌..క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భిస్తుందో తెలియ‌దు. చేసిన అప్పులు భార‌మై పోతాయి. ఉన్న ధాన్యాన్ని త‌క్కువ ధ‌ర‌కే అమ్ము కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీంతో రైతులు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన బాల్ రెడ్డి త‌ను కూడా ఫీల్ అయ్య...

ఇండియ‌న్ టెలికాం సెక్టార్‌లో జియోనే టాప్

చిత్రం
భార‌త దేశంలోని టెలికాం రంగంలో రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన జియో రిల‌య‌న్స్ కంపెనీ టెలికాం ఆప‌రేట‌ర్ల‌ను తోసిరాజ‌ని నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. ముఖేష్ అంబానీకి చెందిన 4జీ సేవ‌ల కంపెనీ రిల‌య‌న్స్ జియో..ఇండియాలో అతి పెద్ద టెలికాం కంపెనీగా అవ‌త‌రించింది. గ‌త నెల చివ‌రి నాటికి స‌ద‌రు కంపెనీ వినియోగ‌దారుల సంఖ్య ఏకంగా 33 కోట్ల 13 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇప్ప‌టి దాకా టాప్ రేంజ్‌లో కొన‌సాగుతూ వ‌చ్చిన వొడాఫోన్, ఐడియా క‌స్ట‌మ‌ర్లు 32 కోట్ల‌కు త‌గ్గారు. దీంతో జియో టాప్ రేంజ్‌లోకి చేరుకుంది. ప్ర‌తి రోజూ కొత్త క‌ష్ట‌మ‌ర్ల‌తో పాటు ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్ల నుంచి వినియోగ‌దారులు జియో కంపెనీని ఎంచుకుంటున్నారు. 4జీ సేవ‌ల్లో భాగంగా డేటా, వీడియో కాల్స్, అప‌రిమిత‌మైన సేవ‌లు అందించ‌డం, దేశ వ్యాప్తంగా విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ క‌లిగి ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు జియోను ఎంపిక చేసుకుంటున్నారు.  మొద‌ట్లో లైట్‌గా తీసుకున్న ఇత‌ర టెలికాం కంపెనీలు ఇపుడు చింతిస్తున్నాయి. ఎటూ పాలుపోక ప‌క్క చూపులు చూస్తున్నాయి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ వ‌చ్చిన ట్యాగ్ లైన్ ..ఐడియా కంపెనీది...

ఐఏఎస్ టాపర్..నాలుగుసార్లు ఫెయిల్

చిత్రం
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు యుపీఎస్సీ ప‌రీక్ష త‌ప్పాడు ఆ యువ‌కుడు. కానీ అంద‌రిలాగా నిరాశ‌కు గురి కాలేదు. ప‌ట్టుద‌లని విక్ర‌మార్కుడిలా క‌ష్ట‌ప‌డ్డాడు. అనుకున్న‌ది సాధించాడు. ఏకంగా ఇండియాలో టాప‌ర్‌గా నిలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. అత‌డెవ‌రో కాదు కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుర్రాడు..దురిశెట్టి అనుదీప్. జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ప‌రీక్ష‌కు వేలాది మంది పోటీ ప‌డ‌తారు. ఈ కాంపిటిష‌న్‌ను త‌ట్టుకుని ప‌రీక్ష పాస్ కావ‌డం చాలా క‌ష్టం. ప్ర‌తి ఒక్క‌రి క‌ల అమెరికా డాల‌ర్లు సంపాదించ‌డం ఒక ఎత్తైతే..ఇండియాలో గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్ర‌తి యువ‌తీ యువ‌కుల క‌ల ఒక్క‌టే ఐఏఎస్‌కు ఎంపిక కావ‌డం. అయిదు సార్లు మాత్ర‌మే రాసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏ మాత్రం త‌ప్పినా ఇక మ‌రోసారి ఎగ్జామ్ రాసేందుకు అర్హులు కారు. కానీ మ‌నోడు నాలుగు పర్యాయాలు త‌ప్పాడు..చివ‌ర‌కు ఐదో సారికి ఎంపిక‌య్యాడు. ఏకంగా ఇండియాలో టాప్‌లో నిలిచాడు అనుదీప్.  సాధించాల‌న్న క‌సి, ప‌ట్టుద‌ల ఉంటే చాలు ఎంత‌టి క‌ష్ట‌మైనా ఈజీ అవుతుంద‌ని, విజ‌యం త‌ప్ప‌కుండా వ‌రిస్తుంద‌ని అంటున్నారు ఈ యువ‌కుడు. జాతీయ స్థాయిలో టాప...

క్రికెట్ లెజెండ్‌కే టీమిండియా కోచ్ ఎంపిక అప్ప‌గింత‌

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ క‌థ ముగిసింది. విండీస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛైర్మ‌న్ ఎం.ఎస్.కె. ప్ర‌సాద్ ఇప్ప‌టికే మూడు ఫార్మాట్‌ల‌లో ఆడే టీమిండియా క్రికెట్ జ‌ట్టు స‌భ్యుల‌ను, కెప్టెన్‌ను ప్ర‌క‌టించారు. ఈ ఎంపిక కార్య‌క్ర‌మం తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఎంపిక చేశారు. అస‌లైన జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌ని, కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య విభేదాలు పొడ సూపాయ‌ని, అందుకే ఇండియా పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింద‌ని క్రికెట్ ఫ్యాన్స్ మండిప‌డ్డారు. క‌మాన్ ఇండియా అంటూ వ‌ర‌ల్డ్ క‌ప్ ను తీసుకు రావాల‌ని కోరిన కోట్లాది అభిమానుల‌కు తీర‌ని నిరాశ మిగిల్చారు క్రికెట‌ర్స్. కోట్లు ఎలా సంపాదించాలి, ఏయే కంపెనీల‌తో టై అప్ చేసుకోవాలో అనే దానిపై ఉన్నంత శ్ర‌ద్ధ క్రికెట్‌ను శ్వాస‌గా మ‌ల్చుకుని , గెలవాల‌న్న కసి లేకుండా పోయింది. అంతులేని రాజ‌కీయాలు చోటు చేసుకోవ‌డం, ఆధిప‌త్య పోరుకు తెర తీయ‌డం బీసీసీఐ పాలిట శాపంగా మారింది. భార‌త ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేని స్థితికి చేరుకుందంటే అర్థం చేసుకోవ‌చ్చు ..దీని వెనుక ఎన్ని కార్పొరేట్ , దిగ్గ‌జ కంపెనీలు ప‌నిచేస్తున్నాయో..బ‌డా బాబుల హ‌స...

ఏపీలో కొలువుల పండుగ..నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు..!

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ఆర్‌సీపీ అధినేత  సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ల‌క్షా 20 వేల‌కు పైగా వివిధ కేట‌గిరీల‌లో ఖాళీగా వున్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు ఇటీవ‌ల‌. తాజాగా ఆ రాష్ట్ర స‌ర్కార్ ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేసేందుకు గాను నియామ‌ప‌క ప్ర‌క్రియ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ల‌ను జారీ చేసింది. ఇక ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసిన ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువ‌తీ యువ‌కులు, వ‌య‌స్సు మ‌ళ్లిన వారికి జ‌గ‌న్ తీపి క‌బురు అందించారు. దీంతో ఆయా ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంట‌ర్ల‌కు విప‌రీత‌మైన గిరాకీ ఏర్ప‌డింది. అయితే, ముందుగానే అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. క‌ష్ట‌ప‌డిన వారికే ఉద్యోగులు వస్తాయ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోను మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని, ఎవ్వ‌రికీ డ‌బ్బులు ఇవ్వ‌కండ‌ని కోరారు. గ‌త హ‌యాంలో ఏర్పాటైన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం కేవ‌లం మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంద‌ని, కానీ ఎన్...

ద‌ర్బార్ అదుర్స్..త‌లైవా పోస్ట‌ర్ సూప‌ర్బ్..!

చిత్రం
కోట్లాది అభిమానులను సంపాదించుకున్న త‌మిళ సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ డిఫ‌రెంట్ మూడ్‌తో దుమ్ము రేపిన పోస్ట‌ర్‌తో ప్ర‌పంచాన్ని షేక్ చేసేశారు. కోట్లాది మంది ఆ పోస్ట‌ర్‌ను చూసి నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఇండియ‌న్ మోస్ట వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన ఏ.ఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌లైవా కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభ‌మైంది. జ‌యాప‌జయాల‌ను ప‌ట్టించు కోకుండా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్లే ఈ డైరెక్ట‌ర్ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే. క్రియేటివిటీతో పాటు సామాజిక ప‌ర‌మైన మార్పుల‌ను కోరుకునే అంశాలతో పాటు స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ర‌జ‌నీకాంత్ తో సినిమా తీయాలంటే ద‌మ్ముండాలి. ఆయ‌న మేన‌రిజంతో పాటు ఆయ‌నుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అంచ‌నా వేయాలి. అంతే కాదు ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇక ఆ టెక్నిషియ‌న్ కెరీర్ ముగిసి పోయిన‌ట్టే. తీవ్ర‌మైన వ‌త్తిళ్ల మ‌ధ్య త‌లైవాతో సినిమా తీయాల్సి ఉంటుంది. బ‌డ్జెట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అది ఏనాడో 100 కోట్ల‌ను దాటి పోయింది. అంచ‌నాలు భారీగా ఉంటాయి.  త‌లైవా అంటేనే ఇండియాలో ఓ బ్రాండ్. ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన ఈ సూప‌ర్ స్టార్ గుర...

రుచి సోయ‌గం..ప‌తంజ‌లి ప‌రం..!

చిత్రం
ప్ర‌పంచ మార్కెట్ నివ్వెర పోయేలా రాందేవ్ బాబా సార‌థ్యంలోని ప‌తంజ‌లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్..సోయా ప్రొడ‌క్ట్స్‌లో రారాజుగా వెలుగొందుతున్న రుచి సోయా కంపెనీని చేజిక్కించుకుంది. ఇప్ప‌టికే దిగ్గ‌జ కంపెనీలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది పతంజ‌లి. ఏ ముహూర్తాన బాబా ప్రారంభించాడో కానీ కార్పొరేట్ కంపెనీలు తెల్ల‌మొహం వేశాయి. త‌క్కువ ఖ‌ర్చుతో పాటు నాణ్య‌వంత‌మైన అన్ని వ‌స్తువులు, తినేందుకు కావాల్సిన ఐట‌మ్స్‌ను పతంజ‌లి అంద‌జేస్తోంది. భార‌త‌దేశంలోని ప్ర‌తి గ్రామానికి ప‌తంజ‌లి విస్త‌రించింది. ఏ ఊరుకు వెళ్లినా..ఏ కిరాణకొట్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లినా..ప‌తంజ‌లి బోర్డు ..రాందేవ్ బాబా న‌వ్వుతూ ఉన్న ఫోటో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఒక దేశీయ కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుంద‌ని ఏ విదేశీ కంపెనీ ఊహించ‌లేదు. ప‌తంజ‌లి కొట్టిన దెబ్బ‌కు ఆయా కంపెనీలు చేష్ట‌లుడిగి పోయాయి. తినే తిండి, క‌ట్టుకునే బ‌ట్ట‌లు, రోజూ వాడే వ‌స్తువులు, ప్ర‌తి ఒక్క‌టి ప్ర‌తి చోటా ల‌భిస్తున్నాయి. క్వాంటిటి, క్వాలిటీతో పాటు చౌక ధ‌ర‌ల్లో, సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌రల‌లో అన్నీ అందుబాటులో ఉంటు...