పోస్ట్‌లు

జూన్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌త్తుల క‌ర‌చాల‌నం - ప్ర‌పంచం విస్మ‌యం..చిన్న‌న్న‌తో పెద్ద‌న్న‌..!

చిత్రం
ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొద‌టిసారిగా ఉత్త‌ర కొరియా మైదానంలోకి అడుగు పెట్టారు. అత్యంత భారీ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ఆయ‌న కాలు మోపారు. ఇప్ప‌టికే యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో ట్రంప్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న టూర్ ..వైర‌ల్‌గా మారింది. తొలి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌గా ఓ రికార్డు కూడా సృష్టించారు. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్‌తో క‌ర‌చాల‌నం చేశారు. వాషింగ్ట‌న్ కు రావాల‌ని ట్రంప్ కోరారు. ఇద్ద‌రు చిరున‌వ్వులు చిందించారు. చిలుక ప‌లుకులు ప‌లికారు. నిన్న‌టి దాకా వీరిద్ద‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ట్రంప్ దాడులు చేస్తాన‌ని, దేశాన్ని తుద ముట్టిస్తాన‌ని బీరాలు ప‌లికాడు. ఒకే ఒక్క హెచ్చ‌రిక‌తో మిన్న‌కుండి పోయారు. నీవు దాడి చేసిన క్ష‌ణ‌మే నీ అమెరికా ప్ర‌పంచ ప‌టంలో ఉండ‌ద‌ని కిమ్ చెప్పేశాడు. నీదగ్గ‌ర ఉన్న ఆయుధాల కంటే రెట్టింపు అణ్వాయుధాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయంటూ కిమ్ చెప్పేస‌రిక‌ల్లా ..యుఎస్ ప్రెసిడెంట్ మౌనం దాల్చారు. ఈ స‌మ‌యంలో ట్రంప్...

`చేతులెత్తేశారు..చ‌తికిల ప‌డ్డారు..అబ్బా తొలి దెబ్బ..!

చిత్రం
నిన్న‌టి దాకా ఓట‌మి ఎరుగ‌కుండా గెలుపొందుతూ వ‌స్తున్న విరాట్ కోహ్లి సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్ర‌పంచ్ క‌ప్ టోర్నీ ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న భార‌త ఆట‌గాళ్లు అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను ఫెయిల‌య్యారు. ఇప్ప‌టి దాకా టోర్నీ ఫెవ‌రేట్‌గా ఉన్న ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం మీద దృష్టి పెట్టాడే కానీ జ‌ట్టు విజ‌యం కోసం దృష్టి పెట్ట‌లేక పోయాడు. ఈ అప‌జ‌యంతో నైనా ఇండియా జ‌ట్టు కోలుకుంటే మంచిది లేక‌పోతే క‌ప్ మాటేమిటో కానీ ఉన్న ప‌రువు పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇక ఆట విష‌యానికొస్తే, ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌న విజయాన్ని న‌మోదు చేసుకుని సెమీ ఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా వుంచుకుంది. ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించి, ఆస్ట్రేలియా దిగ్గ‌జ జ‌ట్టును ఓడించి..పాకిస్తాన్‌ను మ‌ట్టి క‌రిపించి..విండీస్‌ను ఇంటికి పంపించేలా చేసిన భార‌త జ‌ట్టు చివ‌ర‌కు ఇంగ్లండ్ ముందు చేతులెత్తేసింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ల ధాటికి మ‌న ఆట‌గాళ్లు విల‌విల‌లాడి పోయారు. సెమీస్‌కు క‌చ్చితంగా చేరా...

ఓపెన్ స్టార్ట‌ప్‌కు బంప‌ర్ ఛాన్స్ ..భారీ ఇన్వెస్ట్

చిత్రం
ఫైనాన్షియ‌ల్ రంగంలో స‌క్సెస్ ఫుల్‌గా ఆదాయాన్ని గ‌డిస్తున్న స్టార్ట‌ప్ కంపెనీ ఓపెన్ అంకుర సంస్థ జాక్ పాట్ కొట్టేసింది. టైగ‌ర్ గ్లోబ‌ల్ సంస్థ ఏకంగా 210 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఇది ఇండియ‌న్ స్టార్ట‌ప్‌ల‌లో ఓ రికార్డు. బ్యాంకింగ్ స‌ర్వీసెస్ , ఎస్ఎంఇ, స్టార్ట‌ప్స్‌, లోన్స్, త‌దిత‌ర వాటికి ఈ సంస్థ ఆర్థిక స‌హ‌కారం అంద‌జేస్తుంది. టాంగ్లిన్ వెంఛ‌ర్ పార్ట్‌న‌ర్స్ అడ్వ‌యిజ‌ర్స్, 3 ఒన్ 4 కేపిట‌ల్, స్పీడ్ ఇన్వెస్ట్ అండ్ బెట‌ర్ కేపిట‌ల్ , సిండికేట్ కంపెనీలు కూడా ఇందులో పెట్టుబ‌డులు పెట్టాయి. మోర్ ప్రాడ‌క్ట్స్‌, వాల్యూ యాడెడె స‌ర్వీసెస్ రంగాల‌లో సేవ‌లందిస్తుంది. ఒకే ఒక్క ఏడాదిలో ఒన్ మిలియ‌న్ ఎస్ఎంఇల‌కు ఫండింగ్ స‌మ‌కూర్చి పెట్టింది ఓపెన్. బిజినెస్ బ్యాంకింగ్ రంగాన్ని మ‌రింత విస్త‌రించేందుకు కొత్త ప్రొడక్ట్స్ ను రూపొందించే ప‌నిలో ప‌డింది. యుద్ధ ప్రాతిప‌దిక‌న రెండు కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంఛింగ్ చేసే ప‌నిలో ప‌డింది. ఓపెన్ ప్ల‌స్ కార్డు, బిజినెస్ క్రెడిట్ కార్డు ల‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. 30 రోజుల పాటు ఎంత డ‌బ్బు తీసుకున్నా ఎలాంటి వ‌డ్డీ క‌ట్టాల్సిన ప‌నిలేదు. ఈ వెసులుబాటు ఓపెన్‌లో మా...

స్విస్ బ్యాంకులో ఇంగ్లండ్ నెంబ‌ర్ వ‌న్

చిత్రం
ప్రపంచంలో ఎక్క‌డ వున్నా స‌రే తాము అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును దాచుకునే ఏకైక మార్గం ఏదైనా వుందంటే అది స్విస్ బ్యాంక్ ఒక్క‌టే. అక్క‌డ ఇన్వెస్ట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు. దాచుకున్న వారికి పూర్తి సెక్యూరిటీ ఇస్తుంది. అందుకే బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, అక్ర‌మార్కులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు, బిజినెస్ టైకూన్స్‌, సెల‌బ్రెటీలు, సినీ రంగానికి చెందిన వారు, క్రీడాకారులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఇందులో త‌మ డ‌బ్బుల‌న్ని దాచుకున్నారు. ప్ర‌తి ఏటా ఏయే దేశాల‌కు చెందిన వారు ఎంతెంత ఇన్వెస్ట్ చేశార‌న్న వివ‌రాలు వెల్ల‌డించ‌దు ఈ బ్యాంక్. కానీ ఏ కంట్రీ ..ఏ స్థానంలో ఉందో మాత్రం ప్ర‌క‌టిస్తుంది. ఇక్క‌డే ఆయా దేశాల లావాదేవీలు, వ్యాపార వ్య‌వ‌హారాలు కొంత మేర‌కైనా ఆయా దేశాల ప్ర‌జ‌ల‌కు తెలిసే అవ‌కాశం ఉంటుంది. తాజాగా స్విట్జ‌ర్ లాండ్ లోని జ్యూరిచ్ లో కొలువు తీరిన స్విస్ బ్యాంక్ నిర్వాహ‌కులు ..న‌గ‌దును జ‌మ చేసే దేశాల జాబితా వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఇండియా ఒక స్థానానికి ప‌డి పోయింది. గ‌తంలో 75వ స్థానంలో వుంటే ఈసారి 74 ర్యాంకుతో స‌రిపెట్టుకుంది. ఏడాది కాలంలో ఇండియ‌న్ సిటిజ‌న్స్ , బి...

ముంబ‌యిలో అధికారిక యాపిల్ స్టోర్

చిత్రం
ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ న‌మ్మ‌క‌మైన కంపెనీ ఏదంటే ..ఎవ‌రైనా ఠ‌క్కున స‌మాధానం చెప్పేది యాపిల్ కంపెనీనే. కోట్లాది జ‌నం గుండెల్ని మీటిన ఈ సంస్థ నుంచి ఏ ప్రొడ‌క్ట్ వ‌చ్చినా..ఏ యాక్స‌స‌రీస్ వ‌చ్చినా స‌రే లైన్‌లో నిల్చుని తీసుకుంటారు. యాపిల్ బ్రాండ్ నేమ్ ఉన్న‌ది ఏదైనా చేతిలో ఉంటే దాని లుక్, గెట‌ప్‌, దాని స్టేట‌స్ వేరంటారు ఫ్యాన్స్. ధ‌ర ఎంతున్నా కొనేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఐటీ సెక్టార్‌లో వేగంగా దూసుకు వ‌చ్చింది ఈ కంపెనీ. ఆయా దేశాధినేత‌ల నుంచి సామాన్యుల దాకా ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఏదంటే యాపిల్‌నే. త‌ర్వాతి స్థానం శాంసంగ్‌ది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చినా యాపిల్ కంపెనీతో పోటీ ప‌డ‌లేక పోయాయి. గ‌త కొన్నేళ్ల నుంచి యాపిల్ ప్రాడ‌క్ట్స్ టాప్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంటున్నాయి. యాపిల్ ఫోన్ త‌యారు గురించి స్టీవ్ జాబ్స్ ఒకానొక స‌మ‌యంలో మీడియా అడిగిన ..అస‌లు యాపిల్ స‌క్సెస్ సీక్రెట్ ఏమిటి అని..ఇలా జ‌వాబిచ్చారు. మ‌నం త‌యారు చేసే ఏ వ‌స్తువు కానివ్వండి ..అమ్ముడు పోతుందా లేదా అన్న‌ది కాదు ముఖ్యం..ప‌ది కాలాల పాటు నాణ్య‌వంతంగా , స‌మ‌ర్థ‌వంత...

బ‌తికిపోయిన పాకిస్తాన్ ..బెంబేలెత్తించిన ఆఫ్గ‌నిస్తాన్

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో ఈజీగా గెలుస్తుంద‌ని భావించిన పాకిస్తాన్ జ‌ట్టు చావు త‌ప్పి క‌న్ను లొట్ట ప‌డింద‌న్న చందంగా ఆఫ్గ‌నిస్తాన్ పై అతి క‌ష్టం మీద విజ‌యం సాధించింది. ఆఖ‌రు వ‌ర‌కు ఆఫ్గాన్ క్రికెట‌ర్స్ చుక్క‌లు చూపించారు. గెలుపు అంచుల దాకా వ‌చ్చి ఆ జ‌ట్టు చ‌తికిల ప‌డడంతో పాక్ ఆట‌గాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విజ‌యంతో పాకిస్తాన్ సెమీఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. పెను సంచ‌ల‌నం తృటిలో త‌ప్పిపోయింది లేకుంటే ఆఫ్గాన్ రికార్డు సృష్టించేదే. ఆఫ్గ‌న్ ఆఖ‌రు వ‌ర‌కు పాక్‌పై ఆధిప‌త్యం సాధించింది. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ల దెబ్బ‌కు పాక్ క్రికెట‌ర్లు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఓట‌మి అంచుల్లో చిక్కుకున్న పాకిస్తాన్ జ‌ట్టును ఇమాద్ వ‌సీం ఒక్క‌డే అడ్డుగోడ‌లా నిలిచాడు. విరోచిత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జ‌ట్టు క‌ష్టం మీద గెలుపొందింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు వ‌రుస‌గా ఇది మూడో విజ‌యం. ఇమాద్ వ‌సీం 54 బంతులు ఆడి 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగింది. ఏడు వికెట్లు కోల్పోయి మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ష‌హీన్ ఆఫ్రిది 47 ప‌...

ఘ‌నంగా రౌండ్ టేబుల్ ఇండియా పుర‌స్కారాలు

చిత్రం
చెన్నై కేంద్రంగా స్వ‌చ్ఛంధ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న రౌండ్ టేబుల్ ఇండియా ఎన్‌జిఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో వివిధ రంగాల‌లో విశిష్ట సేవలందించిన వారికి పుర‌స్కారాలు హైద‌రాబాద్‌లో అంద‌జేశారు. మాదాపూర్‌లోని హెచ్ఐసిసీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ , జీవీకే గ్రూప్ సంస్థ‌ల డైరెక్ట‌ర్ పింకీ రెడ్డి, ఏఐజీ హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ జి.వి.రావులు హాజ‌ర‌య్యారు. విజేత‌ల‌కు అవార్డులు అంద‌జేశారు. మొత్తం 12 కేట‌గిరీల‌లో అఛీవ‌ర్ అవార్డు, ఎమ‌ర్జింగ్ పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ ద్వారా వ‌చ్చిన విరాళాల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు వినియోగించ‌నున్న‌ట్లు ఆర్‌.టి.ఐ సంస్థ బాధ్యులు తెలిపారు. ఇక పుర‌స్కారాలు అందుకున్న వారిలో స్వ‌చ్ఛంధ సేవా సంస్థ‌ల విభాగంలో విశిష్ట సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన డాక్ట‌ర్ రెడ్డీస్ ఫౌండేష‌న్‌కు అవార్డు ద‌క్కింది. ఎస్ఎంఈ కేట‌గిరీలో సువెన్ లైఫ్ సైన్సెస్ ఎంపిక కాగా, విద్యా విభాగంలో చిర‌క్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ నిర్వాహ‌కురాలు ర‌త్నారెడ్డి పుర‌స్కారా...

అంద‌రి చూపు క‌రీంన‌గ‌ర్ వైపు - క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌కు స‌లాం..!

చిత్రం
మ‌న రాష్ట్ర‌మే కాదు ..జాతి యావ‌త్తు క‌రీంన‌గ‌ర్ వైపు చూస్తోంది. ఆ ప‌ట్ట‌ణ మేయ‌ర్ అధికార పార్టీకి చెందిన వ్య‌క్తి ర‌వీంద‌ర్ సింగ్. ఆయ‌న అంద‌రి లాగా హంగు, ఆర్భాటాల‌కు, అధికార ద‌ర్పానికి చోటివ్వ‌రు. ప్ర‌జల‌కు ఏం కావాలో , వారికున్న స‌మ‌స్య‌లు ఏమిటో ..వాటిని ఎలా ప‌రిష్క‌రించాలోన‌ని నిత్యం ఆలోచిస్తుంటారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే వుంటారు. వారికి క‌నీస వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ర‌వీంద‌ర్ సింగ్ పేరు దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. ఎందుకంటే ఆయ‌న తీసుకున్న సాహోసోపేత‌మైన నిర్ణ‌యం ల‌క్ష‌లాది మంది జ‌నాన్ని ఆలోచింప చేసేలా చేసింది. ఏ ప్ర‌భుత్వం , ఏ ప్ర‌జాప్ర‌తినిధి, ఎమ్మెల్యే, ఎంపీలు , ఐఏఎస్‌లు చేయ‌ని ప‌నిని ఈ మేయ‌ర్ చేశారు. అదేమిటంటే కేవ‌లం ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ..కార్పొరేష‌నే ద‌గ్గ‌రుండి ఎవ‌రైనా చ‌నిపోతే..ఏ కులానికి చెందిన వారైనా, ఏ మ‌తానికి చెందిన వారైనా సరే అంతిమ యాత్ర నిర్వ‌హించ‌డంతో పాటు అంత్య‌క్రియ‌లు చేస్తుంది. ర‌వీంద‌ర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి వేలాది మంది జేజేలు ప‌లికారు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుని మ‌రికొన్ని మున్సిపాలిటీల‌లో దీనిని అమ‌లు చేసేందుకు చ‌ర...

ఫీజుల మోత‌.. దోచుకున్నోళ్ల‌కు దోచుకున్నంత - కాలేజీల దందా..!

చిత్రం
బంగారు తెలంగాణ‌లో బ‌తుకు బ‌రువై పోతోంది. చ‌దువు ఉన్న‌త వ‌ర్గాల‌కే ద‌క్కుతోంది. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల పిల్ల‌ల‌కు ఇంజ‌నీరింగ్, మెడిసిన్, అగ్రిక‌ల్చ‌ర్ , ఫార్మ‌సీ కోర్సులు చ‌ద‌వాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కేజీ టూ పీజీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న స‌ర్కార్ ..విద్యా వ్య‌వ‌స్థ‌ను గాలికి వ‌దిలివేసింది. ఓ వైపు టీచ‌ర్లు లేక పాఠ‌శాల‌లు కునారిల్లిపోతుంటే మ‌రో వైపు క‌నీస వ‌స‌తులు లేక విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల గురుకులాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారే త‌ప్పా టీచింగ్, నాన్ టీచింగ్ భ‌ర్తీ విష‌యంపై శ్ర‌ద్ద చూపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇవాళ తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ కోర్సులతో పాటు మెడిసిన్, హోమియోప‌తి, డెంట‌ల్, ఆయుర్వేద కోర్సులు చ‌ద‌వాలంటే ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పులైనా చేయాల్సిందే. లేక‌పోతే చ‌దువుకు దూరంగా ఉండాల్సిందే.  చ‌దువు కోవ‌డం కంటే చ‌దువును కొనాల్సిన ప‌రిస్థితి దాపురించింది. క‌ష్ట‌ప‌డి ర్యాంకులు సంపాదించినా ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య...

కేసీఆర్, జ‌గ‌న్ ల దోస్తానా - ప్ర‌గ‌తికి ఫ‌ర్మానా

చిత్రం
కాలం విచిత్ర‌మైంది. అది ఎంత‌టి వారినైనా కట్టి ప‌డేస్తుంది. పైనున్న వాళ్ల‌ను కింద‌కు తోసేస్తుంది. అట్ట‌డుగున ఉన్న వాళ్ల‌ను అంద‌లం ఎక్కిస్తుంది. ఏపీ ఉమ్మడి రాష్టం నుండి విడి పోయాక ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఏర్పాట‌య్యాక‌..చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. పంప‌కాల విష‌యంలో పంతాలు, పట్టింపుల‌కు పోవ‌డంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అటు వైపు టీడీపీ కొలువు తీరిన చంద్ర‌బాబు నాయుడుకు ఇక్క‌డ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య‌న అంత‌రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య న‌ర‌సింహ‌న్ స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకున్నారు. టీడీపీ కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేస్తే..టీఆర్ఎస్‌, ఎంఐఎంలు క‌లిసి పోటీ చేశాయి. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఆ మేర‌కు ఆయ‌న కొన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆయా సీఎంల‌ను క‌లిశారు. మ‌రో వైపు చంద్ర‌బాబు సైతం బీజేపీ యేత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఏపీలో ఎట్టి ప‌రిస్థితుల్లోన...

ముంబ‌యి..మోస్ట్ కాస్ట్‌లీ సిటీ

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత కాస్ట్‌లీ న‌గ‌రాల‌లో ఇండియాలోని ముంబ‌యి న‌గ‌రం చోటు ద‌క్కించుకుంది. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చి ఇండియాలో నివ‌సించాలంటే అత్యంత సేఫెస్ట్, ఖ‌రీదైన ప్రాంతంగా ముంబ‌యి చేరింది. మెర్స‌ర్ అధ్య‌య‌న నివేదికలో ఈ విష‌యం వెల్ల‌డించింది. ఆసియా ఖండంలో 20 అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల‌లో ఒక‌ట‌ని తెలిపింది. గ్లోబ‌ల్ క‌న్స‌ల్టింగ్ సంస్థ మెర్స‌ర్ ప్ర‌తి ఏటా స‌ర్వే చేస్తుంది. జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఈసారి ప్ర‌పంచ వ్యాప్తంగా 209 దేశాల్లో జీవ‌న వ్య‌యంపై విస్తృతంగా అధ్య‌య‌నం చేసింది. ఈ కంపెనీ 25వ వార్షిక జాబితాలో ముంబై మ‌హా న‌గ‌రం 67వ స్థానంలో నిలిచింది. గ‌త ఏడాదితో పోలిస్తే 12 స్థానానికి దిగ జారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మ‌రింత ఖ‌రీదైన‌దిగా మారిందిని పేర్కొంది. క‌నీసం బ‌య‌ట భోజ‌నం చేసేందుకు అయ్యే ఖ‌ర్చులు , ఇత‌ర సేవ‌ల వ్య‌యాలు త‌గ్గు ముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ప్ర‌పంచంలో గృహాలు అత్య‌ధిక రేటు ప‌లుకుతున్న న‌గ‌రాల్లో ఇది ఒక‌టిగా మెర్స‌ర్ తెలిపింది.  ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచిందని స‌మ‌గ్ర రిపోర్టులో నివేదించింది. వ‌ర‌ల్డ్ వైడ్ లిస్ట్‌లో ఢిల్లీ న‌గ‌రం 118వ స్థానంలో నిల...

జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్ - జ‌నంతో ముఖాముఖి

చిత్రం
ఏ ముహూర్తాన ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారో కానీ ..సందింటి జ‌గన్మోహ‌న్ రెడ్డి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి భ‌ద్రమైన జీవితం వుంటుంద‌ని స్ప‌ష్టం చేస్తూనే మ‌రో వైపు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, మ‌రింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఏ మాత్రం తేడా వ‌స్తే ఉపేక్షించ‌బోనంటూ ప్ర‌క‌టించారు. దేశంలోనే పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందిస్తామ‌ని, ఈ రాష్ట్రం మిగ‌తా రాష్ట్రాల‌కు ఆద‌ర్శవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతాన‌ని చెప్పారు జ‌గ‌న్. ఏ రోజు ఏ ప‌థ‌కం ప్ర‌క‌టిస్తారో, ఏ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తారో తెలియ‌క హ‌య్య‌ర్ అఫీసియ‌ల్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొన్నేళ్ల‌పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్రను చేప‌ట్టిన ఈ యువ నాయ‌కుడు వారి బాధ‌ల‌ను, స‌మ‌స్య‌ల‌ను విన్నారు..చూశారు. అవినీతి, అక్రమాల‌కు తావు ఉండ‌రాద‌ని, ఎవ‌రైనా అడిగినా లేదా డిమాండ్ చేసినా త‌క్ష‌ణ‌మే త‌నకు నేరుగా ఫోన్ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆ మేర‌కు వెంట‌నే త‌న నెంబ‌ర్ ఇవ్వాల‌ని ఆదేశించారు. మ‌రో వైపు కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. జ...

తెలుగు వాకిట నిలువెత్తు సంత‌కం - సినారే ..భ‌ళారే

చిత్రం
భార‌తీయ సాహితీ జ‌గ‌త్తులో మ‌రిచిపోని వ‌సంత మేఘం సినారే. అపూర్వ‌మైన విజ్ఞానం క‌లిగిన వ్య‌క్తిగా..తెలుగు సాహిత్యానికి ఎన‌లేని కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను తీసుకు వ‌చ్చిన సాహితీవేత్త‌గా పేరు గ‌డించారు. ఆయ‌న స్పృశించ‌ని ప్ర‌క్రియ లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. కొన్ని ద‌శాబ్దాల‌పాటు శాసించారు. త‌ను లేకుండా ఏ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌ని స్థాయికి చేరుకున్నారు. తెలంగాణలో ఎంద‌రో గొప్ప వ్య‌క్తులు జ‌న్మించారు. త‌నువు చాలించారు. వారిలో సినారే, దాశ‌ర‌థి, కాళోజీ, వేదం జీవ‌న నాదం ..దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య , సామ‌ల సదాశివ లాంటి వారెంద‌రో లెక్కించ‌లేనంత మంది త‌మ శ‌క్తిని ధార‌పోశారు. సాహిత్యానికి జీవం పోశారు. కొన్ని త‌రాల‌కు స‌రిప‌డా సాహిత్య‌పు విలువ‌ల‌ను కాపాడుతూ అవి చెరిగి పోకుండా త‌మ క‌లాల‌కు ప‌దును పెట్టారు. డాక్ట‌ర్ సింగిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి గురించి చెప్పాలంటే ..నాలుగు ద‌శాబ్ధాలను తిర‌గ తోడాల్సి ఉంటుంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆయ‌న స్మారకార్థం గ్రంధాల‌యాన్ని ప్రారంభించారు. ఆయ‌న మ‌న‌మ‌ధ్య నుంచి వెళ్లిపోయి రెండేళ్ల‌యింది.  క‌విగా, ర‌చ‌యిత‌గా, వ‌క్త‌గా, సినీ గేయ ర‌చ‌యిత‌గా, అనువాద‌కుడిగా, ఆచార్యుడిగా, వీసీగా, ప్ర‌భ...

చ‌దువు కోసం ఏపీ స‌ర్కార్ చేయూత

చిత్రం
ఏ ఒక్క‌రు పేద‌రికం కార‌ణంగా చ‌దువు కోకుండా వుండడానికి వీలు లేదు. ప్ర‌తి ఒక్క‌రు అక్షరాలు నేర్వాలి. విద్య లేక పోతే జీవితానికి అర్థం అంటూ ఏమీ ఉండ‌దు. తాము చ‌దువుకుంటూ ఇత‌రుల‌కు నేర్పేలా ఎద‌గాలి. అప్పుడే ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న డ‌బ్బుల‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. ఇందు కోసం స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికైనా సిద్ధంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, యువ నాయ‌కుడు జ‌గ‌న్మ్‌హ‌న్ రెడ్డి. విద్యా శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం ..కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. పేద‌ల‌కు అండ‌గా ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే వారికి అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ కాలేజీల‌తో పాటు ప్రైవేట్ క‌ళాశాల‌ల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు మ‌రింత ల‌బ్ధి చేకూరుతుంది. అర‌కులో గిరిజ‌న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా గిరిజ‌న విశ్వ విద్యాల‌యం, వైద్య క‌ళాశాలను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. వృత్తి విద్య‌ల‌కు సంబంధించి ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పాఠ‌శాల‌ల‌ల నిర్మాణంలో గ‌త స‌ర్కార్ తీసుక...

కాఫీపై క‌న్నేసిన కోలా..!

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా అతి పెద్ద పానీయాల సంస్థ‌ల‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న కోకాకోలా కంపెనీ తాజాగా కాఫీ రంగంలోకి ఎంట‌ర్ అయ్యేందుకు పావులు క‌దుపుతోంది. ఈ మేర‌కు ఆయా దేశాల‌లోని ఏయే ప్రాంతాల్లో కాఫీ పంట‌, సాగు, మార్కెటింగ్ అవుతుందో దృష్టి సారించింది. త‌న అనుచ‌ర వ‌ర్గంతో జ‌ల్లెడ ప‌డుతోంది. లోక‌మంత‌టా నీళ్లు దొర‌క‌వేమో కానీ కోలా, పెప్సీ కంపెనీల‌కు చెందిన కూల్ డ్రింక్స్ దొరక‌డం స‌హ‌జం. అంత‌లా వ‌ర‌ల్డ్ మార్కెట్‌పై త‌మ ప‌ట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నాయి. గ‌త 10 నెల‌ల కింద‌ట బ్రిట‌న్‌కు చెందిన కోస్టా కాఫీని 5.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో స్వంతం చేసుకుంది కొకో కోలా కంపెనీ. తాజాగా ఇండియాలో అత్యంత పేరొందిన ఫ్లేవ‌ర్‌గా కేఫ్ కాఫీ డేలో వాటా చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  బెంగ‌ళూరు కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ యాజ‌మాన్యంతో ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ప్రారంభంలో మైండ్ ట్రీలో త‌న‌కున్న వాటాను కేఫ్ కాఫీ డే వ్య‌వ‌స్థాప‌కుడు వీజీ సిద్ధార్థ విక్ర‌యించారు. కొకో కోలా సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ టి. కృష్ణ కుమార్ ప్ర‌స్తుతం అట్లాంటాలో వుంటూ ఈ చ‌...

బౌల‌ర్ల ప్ర‌తాపం - భార‌త్ విజ‌యం - ఇంటిదారి ప‌ట్టిన విండీస్..

చిత్రం
స‌మిష్టిగా ఆడితే ఏ జ‌ట్ట‌యినా ఈజీగా విజ‌యం సాధిస్తుంద‌న‌డానికి విండీస్ తో జ‌రిగిన మ్యాచే. ప్ర‌పంచ కప్ టోర్న‌మెంట్‌లో ఒక్కో విక్ట‌రీ సాధిస్తూ ఇండియా క్రికెట్ జ‌ట్టు త‌న సెమీ ఫైనల్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఇత‌ర జ‌ట్ల‌కు స‌వాల్ విసురుతోంది. అటు బౌలింగ్‌లోను, ఇటు బ్యాటింగ్‌లోను రాణిస్తూ వ‌స్తున్న ఈ జ‌ట్టు ..క‌ప్‌పై క‌న్నేసింది కోహ్లి సేన‌.భార‌త బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో విండీస్ ఆట‌గాళ్లు ఏ మాత్రం పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక పోయారు. కేవ‌లం 143 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యారు. దీంతో ఇండియా జ‌ట్టు నాకౌట్‌కు మ‌రింత చేరువైంది. క‌రేబియ‌న్ల జ‌ట్టులో పంచ్ హిట్ట‌ర్స్ గా పేరున్న క్రిస్ గేల్, సై హోప్, హెట్మ‌య‌ర్ , బ్రాత్ వైట్ ల‌లో ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డినా ఇండియా నిర్దేశించిన టార్గెట్ అంత పెద్ద‌దేమీ కాదు.  బౌల‌ర్లు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. వీరి బంతులను ఎదుర్కోవ‌డానికి, ప‌రుగులు చేసేందుకు విండీస్ బ్యాట్స్ మెన్స్ ఇబ్బందులు ప‌డ్డారు. స్కోర్ పెంచడం కంటే డిఫెన్స్ ఆడ‌డం మొద‌లు పెట్టారు. బ్యాటింగ్ క‌ఠినంగా సాగిన ఈ మైదానంపై మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు జ‌ట్టును నిల‌బెట్టారు. ఈ గెలుపుతో సెమీ...

ప్ర‌పంచాన్ని ప్రభావితం చేసే 100 పుస్త‌కాలు ఇవే..!

చిత్రం
పుస్త‌కాలు జీవితాన్ని ప్ర‌భావితం చేస్తాయి. జీవితం ప‌ట్ల‌, స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఎరుక క‌లిగి వుండేలా ..మ‌నుషులు చెడిపోకుండా ఉండేలా చేస్తాయి. భోజ‌నం చేయ‌కుండా , దుస్తులు లేకుండా ఉండ‌గ‌ల‌ను కానీ పుస్త‌కాలు చ‌ద‌వ‌కుండా నేనుండ‌లేనంటాడు ఓ సంద‌ర్భంలో ర‌ష్య‌న్ మ‌హా ర‌చ‌యిత మాగ్జిం గోర్కీ. తాజాగా బుక్ వ‌ర‌ల్డ్ కు సంపాద‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్టెఫ‌నీ మెర్రీ వ‌య‌స్సుల వారీగా అత్యుత్త‌మ‌మైన ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన గొప్ప‌నైన పుస్త‌కాల జాబితాను ప్ర‌క‌టించారు. పుస్త‌క ప్రియుల కోసం , చ‌దువ‌రుల కోసం ఆ పుస్త‌కాలేమిటో తెలుసుకుందాం. మొద‌టి ఏడాదిలో ఎరిక్ కార్లే రాసిన ద వెరీ హంగ్రీ క్యాట‌ర్ పిల్ల‌ర్ పుస్త‌కం మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించింది. రెండు నుంచి 100 దాకా చూస్తే , అన్నా డేవ్డిన్నీ రాసిన లామా లామా రెడ్ ప‌జామా రెండో స్థానాన్ని చేజిక్కించుకుంది. మౌరైజ్ సెండాక్ రాసిన వేర్ ద వైల్డ్ థింగ్స్ ఆర్ పుస్త‌కం మూడో స్థానం పొందింది. ఇక నాల్గో స్థానంలో క్రిష్ ర‌చ్‌కా రాసిన చార్లీ పార్క‌ర్ ప్లేయ్డ్ బి బాప్ పుస్త‌కం, ఐదో స్థానంలో షెల్ సిల్వ‌ర్‌స్టెన్ రాసిన ద గివింగ్ ట్రీ, ఆరో స్థా...

సెమీస్ ఆశ‌లు స‌జీవం - పాకిస్తాన్ ఘ‌న విజ‌యం

చిత్రం
ఇండియాతో ఓట‌మి త‌ర్వాత పాకిస్తాన్ తీవ్ర‌మైన ఒత్తిడికి లోనైంది. ఆ దేశ క్రికెట్ అభిమానులు త‌మ జ‌ట్టు ఓడిపోవ‌డంతో తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుండి తిరిగి వ‌చ్చేయ‌మంటూ నెటిజ‌న్లు పిలుపునిచ్చారు. జ‌ట్టు ప‌రంగా ఏమైనా కామెంట్స్ చేయండి కానీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌వ‌ద్ద‌ని, త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామంటూ పాక్ క్రికెట‌ర్లు సామాజిక మాధ్య‌మాల సాక్షిగా కోరారు. వారు చెప్పిన విధంగానే దెబ్బ‌తిన్న పులుల్లా తిరిగి త‌మ స‌త్తా ఏమిటో రుచి చూపించారు. న్యూజిలాండ్ తో జ‌రిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో స‌మిష్టిగా ఆడి పాకిస్తాన్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. టోర్నీలో సెమీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎడ్జ్ బాస్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టుకు చెందిన బాబ‌ర్ అజామ్ అజేయ‌మైన సెంచ‌రీతో జ‌ట్టును గ‌ట్టెక్కించాడు. 127 బంతులు ఎదుర్కొన్న ఈ  క్రికెట‌ర్ 101 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లున్నాయి. బాబ‌ర్‌కు తోడుగా సోహైల్ 76 బంతులు ఆడి 68 విలువైన ప‌రుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 భారీ సిక్స‌ర్లు ఉన్నా...

ఇన్వెస్ట‌ర్స్‌తో రిల‌య‌న్స్ బిగ్ డీల్

చిత్రం
టెలికాం రంగంలో ఇప్ప‌టికే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ తాజాగా బ్రాడ్ బాండ్, ఈ కామ‌ర్స్‌ల‌ను విస్త‌రించేందుకు గాను విదేశీ సంస్థ‌ల నుంచి రుణాల‌ను స్వీక‌రించే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు ఫారిన్ లెండింగ్ ఇన్వెస్ట‌ర్స్ నుండి ఏకంగా 185 కోట్ల డాల‌ర్ల‌కు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్ప‌టికే ఎంఓయులు కూడా పూర్త‌యిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ డాల‌ర్ల విలువ ఇండియ‌న్ రూపీస్‌లో అయితే ..12 వేల 900 కోట్ల‌కు పై మాటే. ఇండియ‌న్ టెలికాం మార్కెట్ రంగంలో ఇది ఓ రికార్డుగానే ప‌రిగ‌ణించాల్సి వుంటుంది. రిల‌య‌న్స్ జియో దెబ్బ‌కు మిగ‌తా ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు. ఎప్ప‌టికప్పుడు మార్కెట్ స్ట్రాట‌జీని ఫాలో అవుతూ, ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు కంటి మీద కునుకే లేకుండా చేస్తోంది ఈ కంపెనీ. భ‌విష్య‌త్‌లో పెట్టుబ‌డి అవ‌స‌రాల కోసం ఈ మేర‌కు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. ఆర్ఐఎల్ ఇప్ప‌టికే త‌న జియో కంపెనీలో 20 వేల కోట్లు పెట్టుబ‌డిగా పెట్టింది. ఇందు కోసం ప్ర‌ణాళిక‌లు కూడా రూపొందించారు. 4జి సేవ‌లు క‌ల్పిస్తుండ‌గా రాబోయే కాలంలో 5జి సేవ‌ల‌పై క‌న్నేసి...

చైత‌న్యానికి ప్ర‌తీక‌..పోరాటానికి క‌ర‌దీపిక - జాషువా ..వారెవ్వా..!

చిత్రం
ఒకే ఒక్క‌డు. చూస్తే చిన్నోడు. పెద్ద‌య్యాక నువ్వేమవుతావు అంటే మ‌న‌వాళ్లు అమెరికా వెళ‌తా..ల‌క్ష‌లు సంపాదిస్తానంటారు. కానీ అత‌డు మాత్రం ప్ర‌జ‌ల వైపు నిలిచాడు. నూటికో కోటికో ఒక్క‌రు ఎక్క‌డో ఒక చోట పుడ‌తారు. అలాంటి వారిలో ఈ యువ కెర‌టం ..సునామీలా దూసుకు వ‌చ్చింది. అత‌డి వ‌య‌సు ప‌ట్టుమ‌ని 22 ఏళ్లు. కానీ ల‌క్ష‌లాది జ‌నాన్ని క‌దిలించాడు. కాజ్ కోసం నిల‌బ‌డ్డాడు. రండి ..పోయేది ఏముంది..బానిస సంకెళ్లు త‌ప్ప‌. ఇపుడు కాక పోతే ఇంకెప్పుడూ పోరాడ‌లేం అని పిలుపునిచ్చాడు. వాంగ్ దెబ్బ‌కు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ బేష‌ర‌త్‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇది జాషువా సాధించిన ఘ‌న‌త‌. ప్ర‌జాగ్ర‌హానికి కార‌ణ‌మైన నేర‌స్థుల అప్ప‌గింత బిల్లు విష‌యంలో భారీ ఎత్తున పోరాటం న‌డిచింది. చైనాకు నేర‌స్థుల‌ను అప్ప‌గించే ఒప్పందం మేర‌కు ప్ర‌తిపాదించిన 'ఎక్స్ట్రడిషన్ బిల్'ను ప్రజలు నిర్ద్వందంగా తిర‌స్క‌రించారు. ఈ బిల్లు కోసం జ‌నం రోడ్డెక్కారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చారు. ర‌హ‌దారుల‌ను దిగ్బంధంనం చేశారు. జ‌నం సంద్ర‌మై ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకు పుట్టించారు. జ‌నం చైత‌న్య‌వంత‌మైతే, క‌లిసిక‌ట్టుగా ...

ఇండియాలో టాప్ రెవిన్యూ కంపెనీలివే

చిత్రం
భార‌త్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కంపెనీలు ఏవేవో వాటి ఆదాయం, క‌ల్పించిన ఉపాధి , గ‌త ఏడాదిలో ట‌ర్నోవ‌ర్ త‌దిత‌ర వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జాతీయ స్థాయిలో రేటింగ్ ప్ర‌క‌టించింది ..పార్ఛూన్ ఇండియా. మొత్తం 500 కంపెనీలు చోటు ద‌క్కించు కోగా, మొద‌టి 10 స్థానాలలో ఏయే కంపెనీలు చోటు ద‌క్కించుకున్నాయో చూడొచ్చు. ప్ర‌క‌టించిన కంపెనీల ప‌రంగా చూస్తే ఇటు ప్ర‌భుత్వ రంగ కంపెనీల‌తో పాటు ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో రెవిన్యూ ప‌రంగా దూసుకెళుతున్న కంపెనీల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. మొద‌టి స్థానాన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌, న‌వ‌రత్న కంపెనీగా పేరొందిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ చేజిక్కించుకుంది. రెండ‌వ స్థానాన్ని ముఖేష్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ పొందింది. మూడో స్థానంలో ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ నిలిచింది. ఇక నాల్గ‌వ స్థానంలో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా పేరొందిన‌..భార‌తీయ స్టేట్ బ్యాంక్ పొంద‌గా, అయిదో స్థానంలో టాటా మోటార్స్, ఆర‌వ స్థానంలో భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్, ఏడ‌వ స్థానంలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్, ఎనిమిదో స్థానంలో రాజేష్ ఎక్స్‌...