పోస్ట్‌లు

ఏప్రిల్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సంతాపం స‌రే..ప‌రిహారం మాటేమిటి..?

చిత్రం
ఇంట‌ర్ బోర్డులో నెల‌కొన్న గంద‌ర‌గోళం కంటిన్యూ అవుతూనే వుంది. సింపుల్‌గా సంతాపం ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. 20 మందికి పైగా పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే..ప‌రిహారం ఊసెత్త‌లేదు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఒక్క ప‌రీక్ష‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించిన పాపాన పోలేదు. విద్యా వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింది. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో తెలియ‌డం లేదు. ఉన్న‌తాధికారులు బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన స్టూడెంట్స్, పేరెంట్స్ ప‌ట్ల పోలీసుల అనుస‌రించిన తీరు గ‌ర్హ‌నీయం. ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్, విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డిలు పిల్ల‌ల ప‌ట్ల నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఎలాంటి అనుభవం లేనటువంటి గ్లోబ‌రినా సంస్థ‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అప్ప‌గించ‌డం వెనుక ఎంత మంది చేతులు మారాయో బ‌య‌ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. వంద‌లాది మంది విద్యార్థులు బాగా చ‌దివినా మార్కులు పొంద‌లేక పోయారు. దీనిని సీరియ‌స్‌గా ప్ర‌భుత్వం తీసుకోక పోవ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఫెయిల్ అయిన విద్యార్...

అవెంజ‌ర్స్ అదుర్స్ - రికార్డు స్థాయిలో భారీ వ‌సూళ్లు

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేస్తూ విడుద‌లైన అవెంజ‌ర్స్ ..ఊహించ‌ని దానికంటే ఎక్కువ‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. విడుద‌లైన మొద‌టి రోజే రికార్డు స్థాయిలో 1500 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఇదివ‌ర‌కు ఉన్న వ‌సూళ్ల రికార్డుల‌ను అధిగ‌మిస్తోంది. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌ల‌ను దాటేసిన ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. విడుద‌లైన ప్ర‌తి చోటా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. వ‌ర‌ల్డ వైడ్‌గా చూస్తే 21.66 కోట్ల డాల‌ర్లు వ‌సూల‌య్యాయి. అంటే ఇండియ‌న్ రూపీస్‌లోకి చూసుకుంటే... 1512 కోట్ల‌కు పై మాటే. ఇది కూడా ఒక రికార్డే. ఒక్క‌రోజులో ఇన్ని డ‌బ్బులు పోగేసు కోవ‌డం ఈ సినిమాకే చెల్లింది. ఇదంతా అవెంజ‌ర్స్ డైరెక్ట‌ర్ సాధించిన స‌క్సెస్. ఒక్క చైనాలోనే ప్రివ్యూలు ప్ర‌ద‌ర్శించ‌గా వ‌చ్చిన డ‌బ్బులు చూస్తే..క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే. వ‌సూలైన మొత్తం డ‌బ్బులు 750 కోట్లు సాధించింద‌ని ఫోర్బ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే ..బాహుబ‌లి సినిమా వ‌సూళ్ల‌ను అవెంజ‌ర్స్ దాటేస్తుంద‌ని సినీ పండితుల విశ్లేషిణ‌. ఉత్త‌ర అమెరికాలో విడుద‌ల కావ‌డంతో అక్క‌డ 28 కోట్ల...

స్టార్ట‌ప్ సిటీస్‌లో సిటీనే టాప్

చిత్రం
మ‌హాన‌గ‌రంగా వినుతికెక్కిన తెలంగాణ రాష్ట్ర కేపిట‌ల్ సిటీ ..భాగ్య‌న‌గ‌రం స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అత్యుత్త‌మైన వేదిక‌గా ఎంపికైంది. న‌గ‌రం కీర్తి సిగ‌లో మ‌రో క‌లికితురాయిగా పేర్కొన‌వ‌చ్చు. ప్ర‌పంచ స్టార్ట‌ప్ న‌గ‌రాల జాబితాల ఎంపిక‌లో హైద‌రాబాద్ 75వ స్థానంలో నిలిచింది. అపార‌మైన వ‌న‌రులు, అవ‌కాశాలతో పాటు ప్ర‌భుత్వ సానుకూల దృక్ప‌థం కూడా ఇందుకు దోహ‌ద ప‌డింద‌నే చెప్పాలి. చారిత్ర‌క హైద‌రాబాద్..అధునాత‌న అభివృద్ధి ..ఐటీ కేంద్రంగానే కాకుండా స‌రికొత్త డిస్క‌వ‌రీస్‌కు కేంద్రంగా ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల‌ను ఆక‌ర్చింది..స‌త్తా చాటింది. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స్టార్ట‌ప్ బ్లింక్ అనే స్వ‌యం నియంత్ర‌ణ అనే సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించే న‌గ‌రాల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తుంది. అందులో భాగంగా ఈసారి ప్ర‌క‌టించిన న‌గ‌రాల జాబితాలో ఏకంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌ను తోసిరాజంటూ హైద‌రాబాద్ మెరుగైన స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్ర‌తి న‌గ‌రానికి వ‌చ్చిన పాయింట్ల ఆధారంగా సిటీస్‌ను ఎంపిక చేస్తుంది సంస్థ‌. 8.541 పాయింట్ల‌తో హైద‌రాబాద్ జాబితాలోకి చేరింది. చెన్నై 74వ స్థాన‌లో నిచింది. 262...

ఆర్బీఐకి ఝ‌ల‌క్ ఇచ్చిన సుప్రీంకోర్టు - స‌మాచారం ఇవ్వాల్సిందే

చిత్రం
దొంగ‌లెవ‌రో తేల్చండి. ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన వారి వివ‌రాలు వెల్ల‌డించడంలో మీరెందుకు వెన‌క్కి త‌గ్గారు. దీని వెనుక ఏమైనా మ‌త‌ల‌బు దాగి ఉన్న‌దా. బ్యాంకులు స‌మాజంలో భాగం కావా. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వాటిని నియంత్రించే అధికారం రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఉంది. కాద‌న‌లేం. కానీ ఎవ‌రు రుణాలు తీసుకున్నారు..ఎవ‌రు రుణాలు చెల్లించ‌డం లేదో ..ఆ వివ‌రాల‌ను ఎందుకు వెల్లించ‌డం లేదు. ఏ వ్య‌వ‌స్థ అయినా స‌మాచార హ‌క్కు చ‌ట్ట ప‌రిధిలోకి వ‌స్తుంద‌న్న విష‌యం గుర్తుంచు కోవాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. త‌మ‌కు సంబంధం లేదంటూ పేర్కొంటే..తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు, బ్యాంకుల‌కు క‌స్టోడియ‌న్‌గా ఉన్న ఆర్బీఐ స్వతంత్ర వ్య‌వ‌స్థ‌లో లేద‌ని తెలిపింది. ఆర్టీఐ కింద బ్యాంకుల వార్షిక త‌నిఖీల నివేదిక‌కు సంబంధించిన స‌మాచారాన్ని వెల్ల‌డి చేయాల్సిందేనంటూ మ‌రోసారి హెచ్చ‌రించింది. ఇందుకు సంబంధించిన ఆర్బీఐ త‌న విధి విధానాల‌ను పునః స‌మీక్షించు కోవాల‌ని జ‌స్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. చ‌ట్ట ప్ర‌కారం ఆ వివ‌రాల‌ను...

ముంబై భ‌ళా..చెన్నై విల విల

చిత్రం
ఐపీఎల్ -12 టోర్న‌మెంట్ ఛాంపియ‌న్‌గా భావిస్తున్న చెన్నై క్రికెట్ జ‌ట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్ క్రికెట్ జ‌ట్టు దెబ్బ‌కు విల‌విల లాడి పోయింది. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసుకుంటూ దుమ్ము రేపుతున్న చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముంబై బౌల‌ర్ల తాకిడికి ప‌రుగులు చేసేందుకు నానా ఇబ్బందులు ప‌డ్డారు. స్వంత గ‌డ్డ‌పై తొలి సారిగా ఓట‌మి పాలైంది చెన్నై. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఆశించినంత మేర ప‌రుగులు చేయ‌లేక పోయినా..ఆ జ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. చెన్నైని క‌ట్ట‌డి చేసింది. వీరంతా స‌మిష్టిగా రాణించ‌డంతో విజ‌యం సాధించ‌డం సుల‌భ‌మైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు జ‌ట్టు ఆట‌గాళ్లు అండ‌గా నిలిచారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై ప‌రుగుల ప‌రంగా రెండో అతి పెద్ద అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. 46 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రోహిత్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 67 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో తొలిసారిగా అర్ధ స...

హ‌క్కుల క‌మిష‌న్ ఆగ్ర‌హం - టీఎస్ స‌ర్కార్‌పై సీరియ‌స్

చిత్రం
బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వం, ఉన్న‌తాధికారులు ప్ర‌జ‌ల సొమ్ముతో సౌక‌ర్యాల‌ను అనుభవిస్తూ ..పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతుంటే క‌నీస స్పంద‌న అంటూ ఉండ‌దా అని జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తెలంగాణ స‌ర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇంత మంది ఇంట‌ర్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటే మీకు క‌ళ్లు లేవా అని ప్ర‌శ్నించింది. అస‌లు ప్ర‌భుత్వం ఉందా ఈ రాష్ట్రంలో అని అనుమానం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే చోటు చేసుకున్న ప‌రిణామాలు, సంఘ‌ట‌న‌ల‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక స‌మ‌ర్పించాల‌ని స‌ర్కార్‌ను ఆదేశించింది. ఆ వార్త‌లు వాస్త‌వ‌మైతే అధికారులు బాధ్యులేనంటూ వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుభ‌వం లేని గ్లోబ‌రినా సంస్థ‌కు ఇంత పెద్ద స్థాయిలో జ‌రిగే ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను ఏ ర‌కంగా అప్ప‌గిస్తారంటూ నిల‌దీసింది. మ‌రో వైపు పునః మూల్యాంక‌నం చేసేందుకు ఇంట‌ర్ బోర్డును ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు ఒక్క‌రొక్క‌రుగా సూసైడ్ చేసుకోవ‌డంపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ( ఎన్‌హెచ్ఆర్‌సీ) స్పందించింది. మూ...

అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ - ఇంగ్లీష్ కౌంటీకి మ‌నోడు

చిత్రం
భార‌తీయ క్రికెట్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా కొన‌సాగుతున్న అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. ఇంగ్లీష్ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడేందుకు ఆహ్వానం అందింది. హాంప్ షైర్ క్రికెట్ జ‌ట్టు త‌ర‌పున రెహానే ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ -12 టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అటు టెస్ట్ క్రికెట‌ర్‌గా, ఇటు వ‌న్డే క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎడ‌మ చేతితో బ్యాటింగ్ చేసే ఈ క్రికెట‌ర్ ఫోర్లు, సిక్స‌ర్ల‌ను అల‌వోక‌గా కొడ‌తాడు. ఏ బౌల‌ర్ అయినా స‌రే..క్రీజులో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ స్కోర్ ఇత‌డి స్వంతం. 6 జూన్ 1988లో పుట్టాడు. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ గా ఇపుడు ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టులో సేవ‌లందిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ను 2007-2008లో ముంబ‌యి జ‌ట్టుతో స్టార్ట్ చేశాడు. 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెహానే బ్యాటింగ్ యావ‌రేజ్ 62.04 శాతం. మొద‌టి అయిదు క్రికెట్ సీజ‌న్స్‌లలో వ‌రుస‌గా వెయ్యి ప‌రుగులు సాధించాడు. ఇదో రికార్డు. టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. మాంచెస్ట‌ర్‌లో...

ఆదాయంలో టాప్ - ఐటీలో ఎంఎస్ బెట‌ర్

చిత్రం
ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జాల స‌ర‌స‌న మైక్రోసాఫ్ట్ కంపెనీ త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. స‌త్య సార‌థ్యంలోని ఈ కంపెనీ మ‌రో రికార్డును స్వంతం చేసుకుంది. ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ మార్కెట్ విలువ ఒక్క‌సారిగా పెరిగి పోయింది. దీంతో దానిలో భాగ‌స్వాములైన వారి ఆదాయం గ‌ణ‌నీయంగా ..ఉన్న‌ప‌ళంగా పెరిగింది. మొట్ట‌మొద‌టి సారిగా ల‌క్ష కోట్ల డాలర్ల‌ను దాటింది. భార‌తీయ రూపాయ‌ల ప‌రంగా చూస్తే దాని విలువ 70 ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ఈ ఘ‌న‌త సాధించిన మూడో టెక్నాల‌జీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర న‌మోదు చేసింది. ఈ కంపెనీ ఆర్థిక ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్ వ‌ర్గాల‌లో ఉత్సాహం చోటు చేసుకుంది. మ‌రో వైపు స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. ప్రారంభంలోనే ట్రేడింగ్‌లో కంపెనీకి చెందిన షేర్లు 5 శాతం పెరిగాయి. ఒక్కో షేరు విలుల 130. 59 డాల‌ర్ల‌కు చేరుకుంది. మిగ‌తా ఐటీ కంపెనీల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. ఎంఎస్ తో పాటు మిగ‌తా కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. రోజు రోజుకు టెక్నాల‌జీ మారుతోంది. దానికి అనుగుణంగా కంపెనీలు త‌మ ప‌నులు మ‌రింత సుల‌భ‌త‌రం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ కొత్త‌గా టెక్నాల‌జీని రూ...

ప్రేమా క‌వ్వించ‌నీ..మ‌న‌సా ర‌వ‌ళించ‌నీ

చిత్రం
తెర మీద పాత్ర‌లు మార్చినంత ఈజీగా ప్రేమికులు మారిపోతున్నారు. ప్రేమంటే రెండు గుండెల చ‌ప్పుడు. రెండు మ‌న‌సుల మౌనం. ఒక‌రి క‌ళ్ల‌ళ్ల‌లోకి ఇంకొక‌రు చూసుకుంటూ ..లోకానికి ఆవ‌ల హృద‌యాల‌తో మాట్లాడుకోవ‌డం. ప్రేమంటే ఏమిటంటే ..ప్రేమించాక తెలిసే అంటూ సినీ క‌వి రాసినా..ప్రేమ ఒక మధుర‌మైన భావ‌న‌. అనిత‌ర సాధ్య‌మైన ఆలోచ‌న‌. అదొక్క‌టే మ‌న‌లోకి చేరిపోతే..జీవితం కొత్త‌గా అనిపిస్తుంది. గుండెల్లో ఏదో కెలుతున్న‌ట్లు..గాల్లో తేలిపోతున్న‌ట్లు..మ‌న‌సంతా దూది పింజెల్లా మారిపోతున్న‌ట్లు..ప‌క్షుల్లా గాల్లో ఎగురుతున్న‌ట్లు అనిపిస్తుంటంది. ఇది స‌హ‌జాతి స‌హ‌జం కూడా. సామాన్యుల నుండి కోట్లున్న సంప‌న్నుల దాకా అంద‌రూ జీవితంలో ఎప్పుడో ఒక‌ప్పుడు ప్రేమ‌లో ప‌డ్డ వారే..ప‌డిపోయిన వారే. ప్రేమ‌కున్న శ‌క్తి అలాంటిది. ప్రేమ అన్న‌ది ఓ దీపం లాంటిది. దానికి ఎప్ప‌టిక‌ప్పుడు ఆత్మీయ‌త అనే నూనె పోస్తూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉంటుంది. లోకంలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని ఫాంట‌సీస్ వుంటాయి. అవ‌న్నీ జ‌ర‌గాల‌ని లేదు. కొన్నిసార్లు ఈ ఆలోచ‌న‌లు ఇలాగే వుండిపోతే బావుండున‌ని అనిపిస్తుంటుంది. ఏం చేస్తాం. ఇవాళ ప్రేమంటే వ్యాపారం అయి ...

దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌నున్న ఫ్లిప్‌కార్ట్ - 3 వేల కోట్ల పెట్టుబడి

చిత్రం
లాజిస్టిక్ రంగంలో త‌న‌కంటూ ఎదురే లేకుండా దూసుకెళుతున్న ఇండియ‌న్ ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ మ‌రో అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌లే త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్తృతం చేసేందుకు , నూత‌న టెక్నాల‌జీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అమెరికా కంపెనీ అమెజాన్‌కు ధీటుగా ఈ సంస్థ సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం, ఆదాయాన్ని స‌మ‌కూర్చు కోవ‌డం, ఆయా కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకోవ‌డం చేస్తూ వ‌స్తోంది యాజ‌మాన్యం. ఈకామ‌ర్స్ రంగంలో ఇప్ప‌టికే స్నాప్ డీల్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, షాప్ క్లూస్ ,త‌దిత‌ర కంపెనీలు ఎన్నో ఇండియ‌న్స్ ను టార్గెట్ చేశాయి. ఎవ‌రికి వారే బంప‌ర్ ఆఫ‌ర్లు, బొనాంజాలు ప్ర‌క‌టిస్తూ వ‌ల వేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కోట్లాది వ్యాపారం రోజుకు జ‌రుగుతోంది. ల‌క్ష‌లాది మంది త‌మ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు అన్నింటిని కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఎంత డ‌బ్బైనా పెట్టేందుకు వెనుకాడ‌డం లేదు. అందుకే ఈకామ‌ర్స్ కంపెనీల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డ వినియోగ‌దారుల‌కు త‌క్ష‌ణ‌మే బుకింగ్ చేసిన కొద్ది గంట‌ల్లో లేదా ఒకే ఒక్క రో...

భార‌తీయ టీచ‌ర్ల‌కు యుఏఈ బంప‌ర్ ఆఫ‌ర్ - నెల‌కు 3 ల‌క్ష‌ల వేత‌నం

చిత్రం
ఇండియాలో అర‌కొర జీతాల‌తో నెట్టుకు వ‌స్తున్న టీచ‌ర్ల‌కు గుడ న్యూస్. యునైటెడ్ అర‌బ్ ఎమరేట్స్ (యుఏఈ) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఎమ‌రేట్స్‌లోని ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డుస్తున్న స్కూళ్ల‌లో భారీ ఎత్తున మౌళిక స‌దుపాయాలను క‌ల్పించింది ఆ దేశ ప్ర‌భుత్వం. కానీ పిల్ల‌ల‌కు అర్థం చేయించేలా పాఠాలు చెప్ప‌డం అక్క‌డికి వారికి క‌ష్టంగా మారింది. దీంతో ఇండియ‌న్స్ అయితేనే త‌మ వారిని అర్థం చేసుకుంటార‌ని, స్టూడెంట్స్‌కు చ‌దువుతో పాటు ఇత‌ర అంశాల‌లో తీర్చిదిద్దుతార‌ని అక్క‌డి విద్యా శాఖ ఉన్న‌తాధికారులు స‌ర్కార్‌కు సూచించారు. ఇంకేముంది టాక్స్ ఫ్రీ సౌక‌ర్యంతో ఎంచ‌క్కా యుఏఈ భారీ వేత‌నాలు ఇస్తామ‌ని ..త‌క్ష‌ణ‌మే ఇండియాను వ‌దిలేసి రండి అంటూ ఆహ్వానం ప‌లికింది. ఇంగ్లీష్‌, మ్యాథ్స్, సైన్స్, యోగా, త‌దిత‌ర వాటిపై మంచి ప‌ట్టు క‌లిగి ఉన్న టీచ‌ర్లు లెక్క‌లేనంత మంది భార‌త్‌లో ఉన్నారు. వీరికి ఇక్క‌డ 45 వేల నుండి 70 వేల దాకా జీతాలు తీసుకుంటున్నారు. వేత‌నాల‌లో వృత్తి ప‌న్ను కూడా క‌డుతున్నారు. దీనిని గ‌మ‌నించిన యుఏఇ ట్యాక్స్ ఫ్రీ ఇస్తూ నెల‌కు 3 ల‌క్ష‌ల రూపాయ‌ల జీతాన్ని ఇస్తామ‌ని వెల్ల‌డించింది. ఒక‌రు కాదు ఏకంగా 3 వేల ...

రాజ‌స్థాన్ అదుర్స్ .. కోల్‌క‌తా బేవార్స్ - వారెవ్వా ప‌రాగ్

చిత్రం
ఇదీ ఆట అంటే .ఇదీ క్రికెట్‌కు ఉన్న ప‌వ‌ర్ అంటే..ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో హోరా హోరీగా ...నువ్వా నేనా అన్న రీతిలో సాగిన అతి కొద్ది మ్యాచ్‌ల్లో ఇది కూడా ఒక‌టిగా పేర్కొనాలి. న‌రాలు తెగిపోతే బావుణ్ణు అన్నంత‌గా ..ఆఖ‌రు బంతి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ‌కు తెర దించుతూ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట్ జ‌ట్టు రాయ‌ల్‌గా విజ‌యం సాధించింది. టార్గెట్ చేద‌న‌లో ప్రారంభం నుంచే వేగంగా ప‌రుగులు సాధించిన రాజ‌స్థాన్ పీయూస్ చావ్లా స్పిన్ మాయాజాలానికి వెంట వెంట‌నే వికెట్లు పారేసుకున్నారు. ఆ స‌మ‌యంలో బంతులు త‌క్కువ..ప‌రుగులు ఎక్కువ చేయాల్సిన ప‌రిస్థితి. ఈ స్థితిలో క్రీజులోకి వ‌చ్చిన ప‌రాగ్ చిచ్చ‌ర పిడుగులా రెచ్చి పోయాడు. మ‌రో వైపు ఆర్చ‌ర్ కూడా మెరుపులు మెరిపించారు. వీరిద్ద‌రూ ఆడ‌క పోతే..రాజ‌స్థాన్ ప్లే ఆఫ్ పై ఆశ‌లు స‌న్న‌గిల్లేవి. కోల్‌క‌తాకు వ‌రుస‌గా ఇది ఆరో ఓట‌మి. రాజ‌స్థాన్ అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చింది. డైన‌మిక్ గా కుర్రాళ్లు దంచి కొట్టారు. ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌ర‌మైన పోరును కొన‌సాగించాయి ఇరు జ‌ట్లు. ఇరు జ‌ట్ల అభిమానుల‌కు అంతులేని ఆనందాన్ని క‌లుగ‌జేశారు క్రికెట‌ర్లు. మ‌...

బ్యాంకుల‌కు ధీటుగా పోస్టాఫీసులు

చిత్రం
దేశంలోని ప్ర‌జ‌ల‌కు విశిష్ట సేవ‌లందిస్తున్న రంగాల‌లో పోస్ట‌ల్ శాఖ కూడా ఒక‌టి. ప్ర‌తి గ్రామానికి పోస్టాఫీసు విస్త‌రించింది. అత్య‌ధిక వ‌డ్డీని అందిస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది పోస్టాఫీసే. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డుస్తున్న ఈ శాఖ పూర్తిగా నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ప‌నిచేస్తోంది. వేలాది మంది దీనిని న‌మ్ముకుని బతుకున్నారు. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు ఇందులో పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, పెద్ద‌లు అంతా దీనిలోనే దాచుకున్నారు. డ‌బ్బులు జ‌మ చేస్తే ఇందులో పూర్తి భ‌ద్ర‌త ఉంటుంద‌ని న‌మ్మారు. ప్ర‌యోగాత్మ‌కంగా దేశ వ్యాప్తంగా పోస్ట‌ల్ శాఖ‌ల‌ను బ్యాంకులుగా మార్చారు. ఎలాంటి సేవా రుసుములు ఉండ‌వు. ఎడా పెడా స‌ర్వీసు ఛార్జీలు విధించ‌రు. ఎన్నిసార్ల‌యినా డ‌బ్బుల‌ను ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవ‌చ్చు. రోజూ వారీగా బ్యాంకులు ఎలా ఖాతాదారుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పిస్తాయో ..ఇక్క‌డి పోస్ట‌ల్ బ్యాంకుల్లో ల‌భిస్తాయి. 100 రూపాయ‌ల నుండి కోటి రూపాయ‌ల దాకా జ‌మ చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగాను, ఉమ్మ‌డిగాను పోస్ట‌ల్ ఖాతా ప్రారంభించ‌వచ్చు. భారీగా విస్త‌రించిన పోస్ట‌ల్ శాఖ‌ను ఆధునిక‌ర...

చ‌దువులో లాస్ట్ - క్రికెట్‌లో బెస్ట్ - స‌చిన్ బ‌ర్త్ డే

చిత్రం
ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన పేజీని లిఖించుకున్న అరుదైన ఆట‌గాడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. ముంబ‌యికి చెందిన ఈ ఆట‌గాడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రికార్డుల‌ను తిర‌గ రాశాడు. కొత్త రికార్డులు న‌మోదు చేశాడు. క్రికెట్ ఆట‌లో ఉన్న అన్ని ఫార్మాట్‌ల‌లో ఆడిన ఘ‌న‌త ఆయ‌న‌దే. స‌చిన్ వ్య‌క్తి కాదు..ఓ వ్య‌వ‌స్థ‌. ఓ బ్రాండ్. ఓ న‌మ్మ‌కం. ఓ స్ఫూర్తి. ఆద‌ర్శం కూడా. గురువు నేర్పిన పాఠాల‌ను వంట ప‌ట్టించుకుని భారతీయుడిగా ఎన‌లేని ప‌రుగులు సాధించాడు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. కేవలం ప‌ది వ‌ర‌కే పాసైనా..ఇంట‌ర్ పూర్తి చేయ‌లేక పోయినా క్రికెట్‌లో లెజెండ్‌గా పిలిచేలా చేసుకున్నాడు. మోస్ట్ ఫెవ‌ర‌బుల్ క్రికెట‌ర్‌గా స‌చిన్‌కు పేరుంది. 10 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. అటు వ‌న్డేల్లోను..ఇటు టెస్ట్ క్రికెట్‌లోను స‌చిన్ ట‌న్నుల కొద్దీ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. క్రీజులో ఉన్నాడంటే సెంచ‌రీ చేయాల్సిందే . అంత‌గా పాతుకు పోయాడు. మైదానం న‌లుమూల‌లా ఆడడం ఆయ‌న‌కే చెల్లింది. మ‌రో క్రికెట్ దిగ్గ‌జం ..మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలోనే స‌చిన్ మెరిశాడు. ఎక్కువ‌గా...

నీరు గారిన విద్యా హ‌క్కు చ‌ట్టం.. స‌ర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌ల‌వుతోందా..ఈ విష‌యం గురించి ప్ర‌భుత్వానికి ఏమైనా తెలుసా..అంటూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్లో విద్యను అంద‌జేయ‌డం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. దానిని నుంచి త‌ప్పించు కోవాల‌ని చూస్తే ఎలా. కేంద్రం నిధులు ఇవ్వ‌క పోతే ప‌ట్టించుకోరా. అదే మీ పిల్ల‌ల‌ను అయితే ఇలాగే వ‌దిలి వేస్తారా అంటూ ప్ర‌శ్నించింది. సుప్రీంకోర్టును ఎ ందుకు ఆశ్ర‌యించ‌లేదు. అస‌లు రాష్ట్ర వాటానైనా ఖ‌ర్చు చేశారా అంటూ నిల‌దీసింది. విద్యా హ‌క్కు చ‌ట్టం ఆర్టీఇ అమ‌లుపై త‌మ వైఖ‌రి ఏమిటో చెప్పాల‌ని టీఎస్ స‌ర్కార్‌ను డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది. ముందు ప్ర‌భుత్వం త‌న వాటాను ఖ‌ర్చు చేసి..మిగ‌తా వాటా కోసం కేంద్రాన్ని ఎందుకు కోర‌డం లేదంది. మ‌న పిల్ల‌ల‌కు స‌రైన బోధ‌న అంద‌క‌పోతే మ‌ట్టిలో మాణిక్యాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తారు .వారిని కెన్యా, ఉగాండా దేశాల్లోని పిల్ల‌ల్లాగా మార్చాల‌ని అనుకుంటున్నారా అని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్, జ‌స్టిస్ ఎ. రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. ఆర్టీ...

ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ‌కండి..భ‌విష్య‌త్ ఎంతో ఉంది - హీరో రామ్

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఇంట‌ర్ బోర్డు నిర్వాకంపై ప‌లువురు హీరోలు స్పందిస్తున్నారు. వారిలో ఆత్మ స్థ‌యిర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జీవితం ఒక్క‌సారే వ‌స్తుంద‌ని, అన్ని స‌మ‌స్య‌ల‌కు చావు ఒక్క‌టే ప‌రిష్కారం కాద‌ని వారు సూచించారు. నిన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఏది ఏమైనా ..పిల్ల‌లు ప్రాణాలు కోల్పోవ‌డం బాధాకరం. దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాలి. బాధిత కుటుంబాలకు బాస‌ట‌గా నిల‌వాలి. ద‌య‌చేసి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌కండి. ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి మ‌రికొంత మంది ముందుకు వ‌చ్చారు. జూనియ‌ర్ ఆర్టిస్టులు సైతం త‌మ మ‌ద్ధ‌తు తెలిపారు. మాన‌సికంగా కుంగి పోవ‌ద్ద‌ని, అవ‌కాశాలు అనేకం ఉన్నాయ‌ని వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. వీలైతే తామంతా మీ వెన‌కే ఉంటామ‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా స్పందించే అల‌వాటు వున్న హీరో రామ్ . యంగ్ అండ్ ఎన‌ర్జ‌టిక్ గా ఎప్పుడూ న‌వ్వుతూ..న‌వ్విస్తూ వుండే న‌టుడిగా ...