మోదీతో బాలీవుడ్ నటుల భేటీ
మహాత్మా గాంధీ జయంత్యుత్సవాల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తన అధికార నివాసంలో ప్రముఖ బాలీవుడ్ నటులు, నిర్మాతలతో భేటీ అయ్యారు. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పైనా చర్చించారు. ‘గాంధీ ఎట్ 150’ ఇతి వృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు.1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం,1947–2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తీసేలా సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని కోరారు.
కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించాలని అన్నారు. మీరెంతో అద్భుతంగా పని చేస్తున్నారు. కళాకారులుగా మీ ప్రతిభ ప్రపంచమంతటికీ సుపరిచితం. మీ క్రియేటివిటీని మరింత విస్తరింప జేయడానికి ప్రభుత్వ పరంగా చేతనైనంత సహాయం అందజేస్తామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మామల్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను జరిపిన సమావేశం కారణంగా ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగిందని తమిళనాడు సీఎం తెలిపారని ప్రధాని వారికి వివరించారు.
ఇదిలా ఉండగా ప్రధాని భేటీ అయిన విషయం గురించి బాలీవుడ్ నటులు ట్విట్టర్ లో తెలియ చేశారు.కళాకారులుగా దేశానికి మేం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రధాని మోదీ కూడా ఎన్నో పనులు చేస్తున్నారు అని అమీర్ ఖాన్ అన్నారు. గాంధీజీని మరో మారు దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. సినీ రంగానికి ప్రతినిధులుగా భావిస్తున్న మమ్మల్ని గాంధీజీ ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చేందుకు ప్రధాని భాగస్వాములుగా చేయడం ద్వారా మాపి మరింత బాధ్యత పెరిగిందన్నారు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి