పంచాయితీలలో పడకేసిన పాలన..?
ఎన్నికలు ముగిసి పదవుల్లో కొలువు తీరినా తెలంగాణలోని గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది. గ్రామాల అభివృద్హి గూర్చి పట్టించు కోవాల్సిన కొత్తగా ఎన్నికైన సర్పంచులు రోడ్డెక్కారు . ఇక నూతనంగా కొలువుల్లోకి వచ్చి చేరిన విలేజ్ సెక్రెటరీలు ఈ పాలన వద్దంటూ లోలోపట బాధ పడుతున్నారు. ప్రతి ఒక్కరు తమనే టార్గెట్ చేస్తుండడంతో చాలా మంది ఈ జాబ్ కంటే వేరే జాబ్ చూసు కోవడం వేటర్ అనే స్థాయికి చేరుకున్నారు. ఇక భాద్యతగా ఉండాల్సిన గ్రామాల ప్రధమ పౌరులు రాస్తారోకోలు , ఆందోళనలు , ధర్నాల బాట పట్టారు . తమకు మాత్రమే చెక్ పవర్ ఉండాలని , ఉప సర్పంచ్ కు ఉండొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు . ఈ విషయం పై సర్పంచుల సంఘం ఈ మేరకు విన్నవించింది.
కొత్తగా ఎన్నికైన వీరంతా భారీ ఎత్తున గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టారు . చేసిన ఖర్చులు గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది . సిబ్బంది ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తుడడంతో సమస్యలు తీరడం లేదు . అయితే గ్రామాలకు నిధులు విడుదల చేయక పోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని వారంటున్నారు . దీంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్ సర్పంచులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు . పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది . అంతే కాకుండా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోక పోతే సర్పంచులు , మున్సిపల్ చైర్మన్లు తొలగించేందుకు సైతం వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు .
పని చేయక పోతే పదవుల నుండి దింపేస్తాం . భయపడితే ఇలాగే వ్యవహరిస్తారు. చట్టాలు చేసినం . ఎలాంటి మార్పులు చేసే ప్రశక్తే లేదు . తెగే దాకా లాగితే నష్ట పోయేది మీరేనని తేల్చి చెప్పారు . బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు రెవెన్యూ యాక్ట్ తీసుకు వస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు . ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గవర్నర్ కోరిన సవరణలు పెద్దవేమీ కావన్నారు . ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు . ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎవరికి నష్టం . వాళ్ళకు అధికారం పోతుంది . ఇక మిగిలేది ఉప సర్పంచ్ లకు పవర్ దక్కుతుంది . వాళ్ళే గ్రామ పంచాయతీలకు దిక్కుగా ఉంటారు. ఉద్యోగ సంఘాలు తమ పరిమితుల్లో వుంటే మంచిది. బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించమని..హెచ్చరించారు. దారికొస్తే సరేసరి లేకపోతే అంతే అంటూ హెచ్చరించడంతో సంఘాల నేతలు మిన్నకుండి పోయారు
కొత్తగా ఎన్నికైన వీరంతా భారీ ఎత్తున గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టారు . చేసిన ఖర్చులు గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది . సిబ్బంది ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తుడడంతో సమస్యలు తీరడం లేదు . అయితే గ్రామాలకు నిధులు విడుదల చేయక పోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని వారంటున్నారు . దీంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్ సర్పంచులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు . పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది . అంతే కాకుండా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోక పోతే సర్పంచులు , మున్సిపల్ చైర్మన్లు తొలగించేందుకు సైతం వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు .
పని చేయక పోతే పదవుల నుండి దింపేస్తాం . భయపడితే ఇలాగే వ్యవహరిస్తారు. చట్టాలు చేసినం . ఎలాంటి మార్పులు చేసే ప్రశక్తే లేదు . తెగే దాకా లాగితే నష్ట పోయేది మీరేనని తేల్చి చెప్పారు . బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు రెవెన్యూ యాక్ట్ తీసుకు వస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు . ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గవర్నర్ కోరిన సవరణలు పెద్దవేమీ కావన్నారు . ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు . ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎవరికి నష్టం . వాళ్ళకు అధికారం పోతుంది . ఇక మిగిలేది ఉప సర్పంచ్ లకు పవర్ దక్కుతుంది . వాళ్ళే గ్రామ పంచాయతీలకు దిక్కుగా ఉంటారు. ఉద్యోగ సంఘాలు తమ పరిమితుల్లో వుంటే మంచిది. బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించమని..హెచ్చరించారు. దారికొస్తే సరేసరి లేకపోతే అంతే అంటూ హెచ్చరించడంతో సంఘాల నేతలు మిన్నకుండి పోయారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి