తగ్గిన రాష్ట్రం ..ఇక నుంచి 28 రాష్ట్రాలు .. 9 కేంద్రపాలిత ప్రాంతాలు
జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో దేశంలో ఒక రాష్ట్రం తగ్గినట్టయింది. ఇక నుంచి ఇండియాలో 28 రాష్ట్రాలు ..9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండనున్నాయి . 370 ఆర్టికల్ రద్దు వెనుక పెద్ద తతంగమే నడిచింది . ఊహించని రీతిలో బీజేపీ సర్కార్ కు ఈ విషయంలో ఆప్ పార్టీ మద్దతు పలకడం ఒకింత విస్తు పోయేలా చేసింది . నిత్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఏదో ఒక రోజు చెక్ పెట్టే రోజు తప్పక వస్తుందని మోదీ చెప్పిన విధంగానే ..చేతల్లో చేసి చూపించారు . తాను తల్చుకుంటే చేయడం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు విపక్షాలకు . ఇన్నాళ్లుగా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది .
దీంతో స్వయం ప్రతిపత్తి హోదా పోయి ..దేశంలోని మిగతా ప్రాంతాల లాగానే జమ్మూ కాశ్మీర్ లోనూ భారత రాజ్యాంగం అమలవుతుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్యన రాష్ట్రపతి 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది . దీంతో విపక్షాలు విస్తు పోయాయి . ఆపరేషన్ ఇంత త్వరగా పూర్తి చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు నేతలు . వారికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మోడీ అండ్ షా . దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి . జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడలేని అధికారాలను గతంలో కట్టబెట్టారు. దేశంలో రాష్ట్రాలకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే , అక్కడ ఆరేళ్లకు ఒకసారి జరుగుతాయి . అక్కడ కేంద్రం ఏదైనా అమలు చేయాలన్నా లేక నిర్ణయం తీసుకోవాలన్నా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం పెట్టాలి ..ఆమోదం కావాలి . దీంతో అన్నీ ఉన్నా అక్కడ ఏమీ చేయలేక చేష్టలుడిగి పోయాయి గత ప్రభుత్వాలు . ఈ ఆర్టికల్ ను అడ్డం పెట్టుకుని మూడు పార్టీలు రాజ్యం చెలాయిస్తున్నాయని బీజేపీ వాదిస్తూ వచ్చింది . ఎన్నికల్లోని మేనిఫెస్టో లో ఆ ఆర్టికల్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది .
ఆ మేరకు తనకు పూర్తి మెజారిటీ దక్కడంతో ఆపరేషన్ ను కూల్ గా ఇంప్లిమెంట్ చేసింది . ఇక నుంచి అసెంబ్లీ లేని ప్రాంతంగా లడఖ్ ఉండబోతోంది . అమిత షా బిల్లును ప్రవేశ పెట్టడంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లింది . ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు . అయితే దీనిని చీకటి రోజుగా కాంగ్రెస్ నేత గులాం నబి ఆజాద్ అన్నారు . మరో వైపు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును తాము ఒప్పుకోమంటూ పాకిస్థాన్ ప్రకటించింది . కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని , దాని హోదాలో ఎలాంటి మార్పులను ఒప్పుకోమని స్పష్టం చేశారు . ఇది వివాదాస్పద ప్రాంతంగా అంతర్జాతీయంగా గుర్తింపు వుంది. మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణ చేశారు . యుఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది ఆ దేశ సర్కార్ . కానీ ఇప్పుడు మోదీ , షా ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు . ఈ రద్దుతో ఆర్టికల్ రద్దు చేయాలని కోరుతూ ఉద్యమించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించినట్టవుతుందని కమలనాథులు పేర్కొంటున్నారు.
దీంతో స్వయం ప్రతిపత్తి హోదా పోయి ..దేశంలోని మిగతా ప్రాంతాల లాగానే జమ్మూ కాశ్మీర్ లోనూ భారత రాజ్యాంగం అమలవుతుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్యన రాష్ట్రపతి 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది . దీంతో విపక్షాలు విస్తు పోయాయి . ఆపరేషన్ ఇంత త్వరగా పూర్తి చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు నేతలు . వారికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మోడీ అండ్ షా . దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి . జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడలేని అధికారాలను గతంలో కట్టబెట్టారు. దేశంలో రాష్ట్రాలకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే , అక్కడ ఆరేళ్లకు ఒకసారి జరుగుతాయి . అక్కడ కేంద్రం ఏదైనా అమలు చేయాలన్నా లేక నిర్ణయం తీసుకోవాలన్నా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం పెట్టాలి ..ఆమోదం కావాలి . దీంతో అన్నీ ఉన్నా అక్కడ ఏమీ చేయలేక చేష్టలుడిగి పోయాయి గత ప్రభుత్వాలు . ఈ ఆర్టికల్ ను అడ్డం పెట్టుకుని మూడు పార్టీలు రాజ్యం చెలాయిస్తున్నాయని బీజేపీ వాదిస్తూ వచ్చింది . ఎన్నికల్లోని మేనిఫెస్టో లో ఆ ఆర్టికల్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది .
ఆ మేరకు తనకు పూర్తి మెజారిటీ దక్కడంతో ఆపరేషన్ ను కూల్ గా ఇంప్లిమెంట్ చేసింది . ఇక నుంచి అసెంబ్లీ లేని ప్రాంతంగా లడఖ్ ఉండబోతోంది . అమిత షా బిల్లును ప్రవేశ పెట్టడంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లింది . ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు . అయితే దీనిని చీకటి రోజుగా కాంగ్రెస్ నేత గులాం నబి ఆజాద్ అన్నారు . మరో వైపు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును తాము ఒప్పుకోమంటూ పాకిస్థాన్ ప్రకటించింది . కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని , దాని హోదాలో ఎలాంటి మార్పులను ఒప్పుకోమని స్పష్టం చేశారు . ఇది వివాదాస్పద ప్రాంతంగా అంతర్జాతీయంగా గుర్తింపు వుంది. మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణ చేశారు . యుఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది ఆ దేశ సర్కార్ . కానీ ఇప్పుడు మోదీ , షా ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు . ఈ రద్దుతో ఆర్టికల్ రద్దు చేయాలని కోరుతూ ఉద్యమించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించినట్టవుతుందని కమలనాథులు పేర్కొంటున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి