సూసైడ్స్ కు ప్రూఫ్స్ ఉన్నాయా
కోరి తెచ్చుకున్న తెలంగాణాలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోని పరిస్థితి. కార్మికులకు నాయకత్వం వహించిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నట్టుండి సమ్మెను కాలాఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా డిపోల వద్దకు వెళ్లి జాయిన్ కావాలని పిలుపునించారు. తీరా డ్యూటీల కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. చాలా చోట్ల పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చని పోయారని అనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండె పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకున్నారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కార్మికులను డిస్మిస్ చేసినట్టు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్ నోట్లను పిటిషన్ న్యాయస్థానం ముందు ఉంచారు. పిటిషనర్ వాదనపై స్పందించిన హైకోర్టు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులే దీనికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. యూనియన్లు సమ్మెకు పిలుపునిస్తే, కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది.
ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వ లేమని తెలిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. కార్మికులను డిపోల్లోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై రేపు అఫిడవిట్ ఫైల్ చేస్తామని పిటిషనర్ తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి