పోస్ట్‌లు

ఒప్పుకుంటే ఓకే..లేకపోతే జైలుకే

చిత్రం
ఈ దేశంలో ఒకప్పుడు రాజయాల్లో ఒక వెలుగు వెలిగిన అధినాయకులు నిద్ర పోవడం లేదు. ఎప్పుడు ఐటీ, సిబిఐ దాడులు చేస్తుందోనని భయాందోళనకు లోనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్స్ ను సైతం వదలడం లేదు మోదీ, అమిత్ షాలు. రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీకి ఎదురే లేకుండా చేయాలన్నదే వీరిద్దరి టార్గెట్. అందులో భాగంగానే దేశమంతటా దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు దేశంలో చక్రం తిప్పిన చిదంబరం, కర్ణాటకలో చక్రం తిప్పిన నేతగా పేరున్న డీకే శివకుమార్ లను జైలుకు పంపించారు. ఇవ్వాలో రేపో కాంగ్రెస్ టాపర్స్ అందరినీ బోను ఎక్కించాలని కంకణం కట్టుకున్నారు. ఢిల్లీ హైకోర్టు డీకేకు బెయిలు వెసలుబాటు కల్పించగా చిదంబరం మాత్రం అండమాన్ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. దేశమంతటా ఒకే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మోదీ,షా. ఆయా రాష్ట్రాలలో విపక్షాలు అంటూ లేకుండా చేయడంలో భాగంగా ముఖ్యమైన నేతలను టార్గెట్ చేయడం. వారు పార్టీలో చేరుతారా లేక పాత కేసులు, ఐటి దాడులు, సిబిఐ రంగంలోకి దిగడం మామూలే పోయింది. తాజాగా మరాఠాలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ పై ఇదే ప్రయోగం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోనే అజిత్ బేషరత్తుగ...

యురేనియం ఆందోళనకరం

చిత్రం
యురేనియం త్రవ్వకాలపై దేశమంతటా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎంతగా నిరసన తెలిపినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. చాలా చోట్ల జీవ, మానవ , ప్రకృతి విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. ఆయా ప్రాంతాలలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న డోంట్ కేర్ అంటున్నాయి. ప్రజలతో పాటు ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వాదులు మండి పడుతున్నారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీం కోర్ట్ లను సైతం ఆశ్రయించారు. తాజగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. అదే నల్లమల అడవి. ఇక్కడ అడవి బిడ్డలు తీవ్ర వ్యతిరేకం వ్యక్తమైంది. ఏపీలో సైతం ఇదివరకే కడపలో ఇచ్చిన అనుమతిని అక్కడి సర్కార్ విరమించుకుంది. అక్కడి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా ఇరు రాష్ట్రాల్లో కొన్ని నెలలపాటు యురేనియంపైనే చర్చ జరిగింది. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వ కూడదంటూ ఒక వైపు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని, పర్యావరణానికి పెను ముప్పు అంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే దేశంలోని భూగర్భ జలాల పరిస్థితిని అధ్...

ఎంఎస్‌ఎంఈలకు మహర్దశ

చిత్రం
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా చర్యలు చేపడుతోంది. గ్రామీణ. పట్టణాల్లో స్వంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసింది. ఇందు కోసం కోట్లాది రూపాయలు కేటాయించింది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తోంది. వీటి ద్వారా ఎంఎస్‌ఎంఈలు మరింత ముందడుగు వేస్తున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. పలు రకాల చర్యలు చేపట్టడం తో ఎంఎస్‌ఎంఈలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతోంది. జీఎ్‌సటీ రిజిస్టర్డ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం 2019 బడ్జెట్‌లో ప్రభుత్వం 2 శాతం వడ్డీ రాయితీకి గాను 350 కోట్లు కేటాయించింది. 5,000 కోట్లతో స్ట్రెస్డ్‌ అసెట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎ్‌సఎంఈ రంగం మరింత మెరుగ్గా రుణ సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ఇటీవలే ఆర్‌బీఐ నివేదిక సూచించింది. గత రెండేళ్ల కాలంలో సిబిల్‌ ర్యాంక్‌, ఎంఎస్‌ఎంఈలు తమకున్న రుణ ప్రత్యామ్నాయాలను అర్థం చేసు కోవడానికి, వేగవంతంగా, సులభంగా రుణాలు పొందడానికి దోహద పడుతోంది. సిబిల్‌ ర్యాంకు అనేది కంపెనీ క్రెడిట్‌ రిపోర్టు, గత చెల్లింపుల తీరు ...

ట్రావెలర్స్ కు అరుదైన ఛాన్స్

చిత్రం
ప్రయాణం జీవితంలో భలే జ్ఞాపకాలను మిగిలిస్తుంది. కొత్త ప్రదేశాలు, అరుదైన దేవాలయాలు, పర్యాటక స్థలాలు ఎప్పటికీ పర్యాటకులతో కళకళలాడుతూనే ఉంటాయి. ఇందు కోసం కొందరు బస్సులు, రైళ్లు, విమానాలు ఆశ్రయిస్తే మరికొందరు తమ స్వంత వాహనాల్లో వెళ్లడం పరిపాటి. తాజగా నగర పర్యాటకుల కోసం రైల్వే శాఖ ‘భారత్‌ దర్శన్‌’ పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. అది త్వరలో పట్టా లెక్కనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు వీలుగా ఈ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన పర్యాటక రైలు ఇది. ఈ రైలు పర్యాటక ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌  పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌ పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని టూర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టింది. దశల వారీగా దేశ వ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని తెలిపింది. మన నగరం నుంచి ఏటా 50 వేల మందికి...

మనసే కీలకం..జీవితం ఆనందం

చిత్రం
అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ఆమెకు మంచి స్టార్ డమ్ ను తీసుకు వచ్చింది. మిగతా నటీమణుల్లాగా ఆమె అందాల ప్రదర్శనకు ఒప్పుకోరు. వాటికి చాలా దూరంగా ఉంటారు. పూర్తిగా ఇండిపెండెంట్ మనస్తత్వం కలిగిన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయి. డాక్టరు కావలసింది, అనుకోకుండా యాక్టర్‌ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేసిన ఈ సహజ నటి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌ లలో అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్‌ ఆదరించినంతగా కోలీవుడ్‌ సాయి పల్లవిని అక్కున చేర్చుకోలేక పోయింది. కారణాలేమైనా ఆమె నటించిన మూడు తమిళ సినిమాలు ఆశించిన సక్సెస్ అందు కోలేదు. ధనుష్‌ తో జంటగా నటించిన మారి–2 చిత్రం కాస్త ఆడింది. దయా చిత్రం పూర్తిగా నిరాశ పరచగా, ఇక స్టార్‌ హీరో సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రం సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్‌ అవలేదు. కోలీవుడ్‌లో మరో అవకాశం కూడా రాలేదు. ఇక తెలుగులో హిట్స్‌ ఉన్నాయి, చాన్స్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ అమ్మడికి చాలా పాఠాలు నేర్పాయి. జీవితంలో అనుకున్నది జరగక పో...

అబ్బా అజిత్ దెబ్బ

చిత్రం
పాలిటిక్స్ లో ప్రత్యక్ష పోరాటాలు ఉండవు. వెన్ను పోట్లు తప్ప దాడులంటూ చూసేందుకు వుండవు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే సన్నివేశాలు అటు సినిమాల్లో ఇటు చదరంగం ఆటలో మాత్రమే అగుపిస్తాయి. ఈ దేశంలో ఇలాంటి డిఫెరెంట్ ఈక్వేషన్స్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు దేశవ్యాప్తంగా చోటు చేసు కుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో కొత్తదనం చోటు చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్దంగా మోడీ, అమిత్ చంద్ర షా ల ద్వయం పావులు కదుపుతూ వస్తోంది. నిన్నటి దాకా కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ సర్కారుకు కమలం కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మరాఠా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాక పోవడంతో గవర్నర్ పాలన విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు నిన్నటి దాకా బద్ద శత్రువులైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో శివసేన చేతులు కలిపింది. సర్కార్ ఏర్పాటుకు సై అంది. ఇండియాలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కు దిమ్మ తిరిగేలా ఝలక్ ఇచ్చారు. బీజేపీతో ఎన్సీపీ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యే...

గెలుపు ముంగిట టీమిండియా

చిత్రం
మొదటిసారిగా గులాబీ బంతితో ఈడెన్ గార్డెన్లో ప్రారంభమైన రెండో టెస్టు లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో మరో రికార్డుకు చేరువలో ఉంది. సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు ఇంకా నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆరో వికెట్‌గా తైజుల్‌ ఇస్లామ్‌ ఔటైన తర్వాత ఆటను ముగించారు. ఇంకా బంగ్లాదేశ్‌ 89 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్‌కు మరో ఇన్నింగ్స్‌ విజయం ఖాయంగానే కనబడుతోంది. ఈ జట్టులో ముష్పికర్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మహ్మదుల్లా, మెహిదీ హసన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన ముష్పికర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత్‌పై మంచి రికార్డు ఉన్న ముష్పికర్‌ అదే ఆటను కొనసాగించాడు. కాకపోతే అతనికి మిగతా వారి నుంచి ఆశించిన సహకారం అందలేదు. ముష్పికర్‌, మహ్మదుల్లాలు క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో బంగ్లాకు షాక్‌ తగిలింది. మహ్మదుల్లా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్ట్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో మెహిదీ హసన్‌ కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినా ఎక...