పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉద‌య శంక‌రా..మ‌జాకా

చిత్రం
ఎందుకో ఈవేళ మ‌ళ్లీ ఉద‌య్ శంక‌ర్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పాలి. విజ‌యం అంటే ఏమిటో..గెలుపులోని మ‌జా ఏమిటో..అట్ట‌డుగున ఉన్న సంస్థ‌ను అత్యున్న‌త‌మైన స్థాయికి తీసుకు వెళ్ల‌గ‌లిగే ద‌మ్మున్న ఒకే ఒక్క‌డు. ఎంత చెప్పినా త‌క్కువే..ఇంకా ఇంకా ఎంతో చెప్పాల‌న్న క‌సి ఎక్కువ‌వుతోంది. ఎవ‌రీ ఉద‌య్  అనుకుంటున్నారా..ఇంకెవ‌రు..ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ స‌క్సెస్ ఫుల్ సిఇఓ. ఇపుడు స్టార్ టీవీ గ్రూపును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అంతే కాదు స్టార్ టీవీకి కొత్త రూపును ..ఊపును తీసుకు వ‌చ్చాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా స్టార్ మీడియాకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. దీనికి ఓ ఇండియ‌న్ పూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం. దానిని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి తీసుకు  వెళ్లేలా చేయ‌డం ఓ చ‌రిత్ర‌. భార‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా..సాంప్ర‌దాయాలు వెళ్లి విరిసేలా దేశ‌మంత‌టా స్టార్ ను టాప్ పొజిష‌న్‌లో ఉండేలా ప్ర‌య‌త్నం చేశాడు. అందులో ఉద‌య్ శంక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ఈ సిఇఓ ఏది చేసినా అది ఓ సెన్సేష‌న్. భార‌తీయ బుల్లితెర మీద స్టార్ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. మిగ‌తా టీవీ యాజ‌మాన్యాలు అందుకోలేనంత ఎత్తుకు తీసు...

నేనెరిగిన చిన జీయ‌ర్ స్వామీజి

చిత్రం
ఆయ‌నకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అంత‌కంటే ఆయ‌న గురించిన చ‌రిత్ర చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆయ‌న జ‌గ‌మెరిగిన జ‌గ‌త్ గురు. కొంద‌రు పుట్టుక‌తోనే పాపుల‌ర్ అవుతారు. ఇంకొంద‌రు క‌ష్టాలు గ‌ట్టెక్క‌కుండానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ స్వాములు, గురువులు, మార్గ‌నిర్దేశ‌కులు వీళ్లంద‌రు ఎంద‌రో ఈ మ‌ట్టిలో పుట్టారు. వారు త‌మ త‌మ మార్గాల్లో త‌మకు తోచిన రీతిలో కాలం గడుపుతూ జ‌నాన్ని జాగృతం చేసే ప‌నిలో ప‌డ్డారు. ఎవ‌రి ప‌రిమితులు వారికున్నాయి. ఒక్కొక్క‌రిది ఒక్కో స్వ‌భావం. ఒక్కో ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిని కాద‌న‌లేం. కానీ గ‌త కొంత కాలం నుంచి ద‌క్షిణాదిలో ఒకే ఒక్క పేరు నిరంత‌రం త‌చ్చ‌ట్లాడుతూనే ఉన్న‌ది. ప్ర‌జ‌ల్లో నానుతూ ఉన్న‌ది . అదే చిన్న జీయ‌ర్ స్వామి. ఎందుకంటే అత్యంత బ‌ల‌మైన ప్రాంతాలుగా పేరొందిన ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన అధిప‌తులు, పాల‌కులు ఒక‌రి వెంట మ‌రొక‌రు స్వామి ద‌ర్శ‌నం కోసం క్యూ క‌ట్టారు. వీరిలో ప్ర‌స్తుత సీఎం కేసీఆర్ ఏకంగా సాష్టాంగ ప‌డ్డారు కూడా. ఆయ‌న‌తో పాటు జ‌గ‌న్, య‌డ్యూర‌ప్ప ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. త...

శాంసంగ్ వ‌ద్దు..ఆపిల్ ముద్దు

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా పేరొందిన వారెన్ బ‌ఫెట్ ఉన్న‌ట్టుండి విస్మ‌యానికి గురి చేశారు. ఎలా సంపాదించాలో, ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలో, ఎక్క‌డ త‌గ్గాలో, ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ పెట్టాలో నిత్యం సూచించే ఈ ఆర్థిక యోధుడు ఉన్న‌ట్టుండి వైరాగ్యానికి లోన‌య్యారు. ఈ మ‌ధ్య ఇంకెంత కాలం సంపాదించే దానిపై ఎందుకు కాన్‌సెంట్రేష‌న్ చేయాలంటూ ఒక సంద‌ర్భంలో చెప్పారు కూడా. ఇదే స‌మ‌యంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఉన్న‌ట్టుండి బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ ఓ అద్భుతం చేశాడు. ఆపిల్‌ పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్‌ ఐ ఫోన్‌ను తీసేసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్‌ హెవెన్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్‌ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్‌ 11లో ఏ రకం మోడల్‌ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఆపిల్‌ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని వ...

మురిసిన పెద్ద‌న్న‌..మెరిసిన చిన్న‌న్న

చిత్రం
న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అపూర్వ‌మైన రీతిలో స్వాగ‌తం ల‌భించింది. ఇండియాకు వ‌చ్చిన ఈ పెద్ద‌న్న‌ను ఇండియ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీ ఆహ్వానం ప‌లికారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రం ఇపుడు ప్ర‌పంచం త‌న వైపున‌కు చూసుకునేలా చేసుకుంది. విమానాశ్ర‌యంతో పాటు మ‌హాత్మాగాంధీ శ‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మం కూడా వార్త‌ల్లోకి ఎక్కింది. ల‌క్ష‌లాది మంది మోదీకి, ట్రంప్ కు అడుగ‌డుగునా జ‌య‌జ‌య ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ట్రంప్ త‌న‌కు ఆత్మీయ మిత్రుడంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు ట్రంప్‌ను మోదీజి. ఇదే స‌మ‌యంలో ట్రంప్ దంప‌తుల‌తో పాటు కూతురు , అల్లుడు కూడా ఇండియా స‌ర్కార్ ఆతిథ్యానికి ఫిదా అయి పోయారు. వేలాది మంది సెక్యూరిటీలో కీల‌క పాత్ర పోషించారు. అడుగ‌డుగునా మోదీ..ట్రంప్ జ‌యహో అంటూ చ‌ప్ప‌ట్ల‌తో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ స్వాగ‌త స‌త్కార్యాల‌ను చూసి అమెరికా ప్రెసిడెంట్ ప‌రివారం పూర్తిగా సంతోషానికి లోన‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీజీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ట్రంప్. అమెరికాకు అత్యంత న‌మ్మ‌క‌మైన‌, ఆత్మీయ‌మైన దేశం ...

సామాన్యుడిదే విజ‌యం..కేజ్రీదే రాజ్యం

చిత్రం
స‌మాచార హ‌క్కు చ‌ట్టం భార‌త రాజ్యాంగం పౌరుల‌కు క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు. దేశ వ్యాప్తంగా త‌మకంటూ ఎదురే లేకుండా చేసుకుంటూ వ‌స్తున్న మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి దిమ్మ తిరిగేలా చేసిన చ‌రిత్ర ఆమ్ ఆద్మి పార్టీకే ద‌క్కింది. ఎలాంటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌కుండా కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పిస్తూ వ‌చ్చిన ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీకి చెందిన మంత్రులు, ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాతో పాటు ప‌లువురు సీనియ‌ర్ దిగ్గ‌జాలు సైతం ఢిల్లీలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప్ర‌చారం చేప‌ట్టారు. అయినా వీరి పాచిక‌లు పార‌లేదు. వ్యూహాలు ఫ‌లించ‌లేదు. ఢిల్లీ ఓట‌ర్లు మాత్రం మాయ మాట‌లు, హామీలను న‌మ్మ‌లేదు. బీజేపీ మాత్రం ఎలాగైనా స‌రే ఈసారి కేజ్రీవాల్ ను గ‌ద్దె దించాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు సై...

పూజాకు బిగ్ ఛాన్స్

చిత్రం
టాలీవుడ్‌లో ఉన్న‌ట్టుండి టాప్ పొజిష‌న్‌లోకి దూసుకు వ‌చ్చిన న‌టి పూజా హెగ్డేకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. తెలుగు సినిమా రంగంలో పేరున్న న‌టులు మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ , త‌దిత‌రుల‌తో ఆమె న‌టించారు. అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు ఊహించ‌ని రీతిలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాప్ ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో ఆమెకు మ‌రింత డిమాండ్ పెరిగింది. భారీ ఎత్తున అవ‌కాశాలు వ‌చ్చినా ఆమె చాలా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు అద్భుతంగా తెలుగులో పాట‌లు కూడా పాడ‌టం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంచి జోరు మీదుకున్న పూజా హెగ్డే కు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మ‌డు. మ‌రో వైపు ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో  ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో నటిస్తూ మోస్ట్‌ బిజ...

ఆప్‌కే ప‌ట్టం.. సామాన్యుడిదే రాజ్యం

చిత్రం
న‌రేంద్ర మోదీ మంత్రం ఫ‌లించ‌లేదు. ట్ర‌బుల్ షూట‌ర్ పాచిక‌లు పార‌లేదు. కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పించిన ఒకే ఒక్క‌డు ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మ‌రోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోనున్నారు. ముచ్చ‌ట‌గా ఇది మూడోసారి. అనుకోని రీతిలో రాజ‌కీయాల్లోకి ఎంట‌రైన ఈ పరిపాల‌కుడు మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇది నిజంగా విస్మ‌రించ‌లేని చరిత్ర అనే చెప్పుకోవాలి. కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఎలాగైనా స‌రే ఆప్ ను తుడిచి పెట్టాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసింది. అయినా ఆప్ దెబ్బ‌కు బీజేపీ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఇక ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్‌ విక్టరీ సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి బంపర్‌ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్‌ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరను...