ఐటీలో బెంగళూరు నెంబర్ వన్


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఇండియాలో బెంగళూర్ మళ్ళీ టాప్ పొజిషన్ లో నిలిచింది. సిటీ సిలికాన్ నగరంగా పిలుచుకునే ఈ నగరం ఇప్పుడు మరోసారి తన ప్లేస్ ను కాపాడుకుంటూ వస్తోంది. అంతే కాదు దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్సే అందుకుంటున్నారు. ఇందులో ఐటీ సీటీ బెంగళూర్‌ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందని రాండ్‌ స్టడ్‌ నివేదిక వెల్లడించింది. ఈ నగరంలో ఐటీ కంపెనీల్లో ఆయా లెవల్లో పని చేస్తున్న వారిలో జూనియర్‌ లెవెల్‌ టెకీకే సగటు వేతనం 5.27 లక్షలు కాగా, మధ్యస్ధాయి ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు 16.45 లక్షలు, సీనియర్‌ లెవల్‌ టెకీకి 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని తెలిపింది.

ఈ సంస్థ 2017, 2018లో వెల్లడించిన శాలరీ ట్రెండ్స్‌ నివేదికలోనూ బెంగళూర్‌ అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఎంట్రీలెవల్‌ టెకీకి అత్యధిక వేతనాల్లో హైదరాబాద్‌ 5 లక్షలు ఇస్తుంటే, ముంబై 4.59 లక్షలు ఇస్తూ వరుసగా టాప్‌ టూ, టాప్‌ త్రీ స్ధానాల్లో నిలిచాయి. ఇక మధ్యస్ధాయి ఐటీ సిబ్బందికి వేతనాల విషయంలో ముంబై 15.07 లక్షలు ఇస్తుంటే , ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 14.5 లక్షలు ఇస్తూ ముందుండగా, సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో ముంబై 33.95 లక్షలు, పూణే 32.68  లక్షలు, బెంగళూర్‌ తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. అత్యధిక సగటు వార్షిక వేతనం విషయంలో కూడా ఐటీ రంగమే అగ్రభాగాన నిలిచిందని వెల్లడించింది.

ఇక సీనియర్‌ ప్రొఫెషనల్స్‌లో 35.65 లక్షల వార్షిక వేతనంతో డిజిటల్‌ మార్కెటర్లు అత్యధిక వేతనం అందుకుంటున్నారని తెలిపింది. క్లౌడ్‌, ఏఐ, ఆటోమేషన్‌, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి నూతన టెక్నాలజీలతో ఈ ఏడాది ఐటీ రంగం మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. జీఎస్టీ రాకతో ఈ రంగంలో నిపుణులు, అకౌంటెంట్లు, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లు, న్యాయవాదులకు డిమాండ్‌ పెరగడంతో వృత్తి నిపుణుల సేవల రంగం రెండో అతిపెద్ద వేతన చెల్లింపు రంగంగా నిలిచింది. ఎనిమిది నగరాల్లో విస్తరించిన 15 పరిశ్రమ విభాగాల్లో లక్ష ఉద్యోగాలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!