పోస్ట్‌లు

రాబోయే కాలం..టీవీల‌దే రాజ్యం..మొబైల్ టీవీల‌దే సామ్రాజ్యం

చిత్రం
టెక్నాల‌జీలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా..రాబోయే కాల‌మంతా టెలివిజ‌న్, మొబైల్ టీవీలకే ఎక్కువ ప్ర‌యారిటీ ల‌భించ‌నుంది. టెలికాం రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం ..ప్ర‌తి ఒక్క‌రు మొబిలిటితో క‌నెక్టివిటీ క‌లిగి ఉండ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌మ్యూనికేష‌న్ కే పెద్ద‌పీట ద‌క్కుతోంది. ఫోన్ టీవీతో పాటు సాధార‌ణ టీవీకి మంచి భ‌విష్య‌త్ ఉందంటూ ప్రైస్ వాట‌ర్ హౌజ్ కూప‌ర్స్ అనే సంస్థ చేసిన స‌ర్వేలో వెల్ల‌డించింది. ఇండియాలో ఫోన్ టీవీ మార్కెట్ 2023 నాటికి మార్కెట్ ప‌రంగా మూడు రెట్లు పెరుగుతుంద‌ని..దాని విలువ అమాంతం 11 వేల 976 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీని విలువ‌ను గుర్తించిన మార్కెట్ వ‌ర్గాలు..ఫోన్ టీవీ ప్రొవైడ‌ర్లు కంటెంట్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంద‌రికీ టెల్కో సేవ‌లు అందుబాటులో ఉండ‌డం, త‌క్కువ ధ‌ర‌కు డేటా ల‌భించ‌డంతో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫోన్ టీవీ ప్రొవైడ‌ర్స్ కు భార‌త్ ఒక బలీయ‌మైన మార్కెట్‌కు అవ‌కాశం ఉంద‌ని గుర్తించాయి. భ‌విష్య‌త్‌లోను కొత్త‌గా మార్పులు చోటు చేసుకున్నా..ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌లిగిన మాధ్య‌మం ఏదైనా ఉందంటే అది ఫోన్ టీవీ మాత్ర‌మేన‌ని సంస్థ పేర్కొ...

పాఠ్యాంశంగా త‌లైవా జీవితం

చిత్రం
కండ‌క్ట‌ర్‌గా జీవితాన్ని ప్రారంభించి..బాల‌చంద‌ర్ పుణ్య‌మా అంటూ సినిమాల్లోకి ప్ర‌వేశించి ..త‌న‌కంటూ ఓ స్ట‌యిల్‌ను ఇమేజ్‌ను ..బ్రాండ్‌ను స్వంతం చేసుకున్న అరుదైన న‌టుడు ర‌జ‌నీకాంత్. త‌మిళ‌నాట ఆయ‌న‌కున్నంత క్రేజ్..ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకెవ్వ‌రికీ లేదు. ఇండియాలో మోస్ట్ పాపుల‌ర్ హీరో. త‌మిళ రాజ‌కీయాల్లో ఆయ‌న‌ది చెర‌గ‌ని ముద్ర‌. ఏది మాట్లాడినా అదో సెన్సేష‌న్. క‌ర్ణాట‌క‌లో జ‌న్మించిన ర‌జ‌నీకాంత్ అస‌లు పేరు శివాజీరావు గైక్వాడ్. అత‌డి పేరును ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ ర‌జ‌నీకాంత్ గా మార్చేశారు. ఏ ముహూర్తంలో పెట్టాడో కానీ అప్ప‌టి నుంచి నేటి దాకా ఆయ‌న ఏది ప‌ట్టుకున్నా బంగార‌మే. కోట్లాది రూపాయ‌లు, లెక్క‌నేన‌న్ని ఆస్తులు సంపాదించినా ర‌జ‌నీకాంత్ సింపుల్‌గా వుంటారు.  ఆయ‌న‌కు భ‌క్తి ఎక్కువ‌. ధ్యానంలో మునిగి పోతారు. హిమాల‌యాల‌కు వెళ‌తారు. మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి అంటే ర‌జ‌నీకి వ‌ల్ల‌మాలిన అభిమానం. ప్ర‌తి ఏటా స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. ఆశీస్సులు పొందుతారు. సాధార‌ణ స్థాయి నుంచి ..అత్యున్న‌తమైన స్థాయిని అందుకున్న ర‌జ‌నీకాంత్ జీవితం ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా వుంటుంద‌ని త‌మిళులు పెద్ద ఎ...

త‌ల‌వంచిన ఆస్ట్రేలియా..నిలిచిన ఇండియా - మెరిసిన ఆట‌గాళ్లు..మురిసిన అభిమానులు..!

చిత్రం
తాజాగా జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో హాట్ ఫెవ‌రేట్ జ‌ట్టుగా భావిస్తున్న ఆస్ట్రేలియా జ‌ట్టు కోహ్లి సేన ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. చివ‌రి వ‌ర‌కు పోరాడినా గెలవ‌లేక చ‌తికిల‌ప‌డ్డారు కంగారూలు. ఇరు జ‌ట్లు స‌మ ఉజ్జీలు కావ‌డంతో మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా జ‌రిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా జ‌ట్టు ఓపెనింగ్ జోడి అద‌ర‌గొట్టింది. ఎలాంటి త‌డ‌బాటుకు లోనుకాకుండా శిఖ‌ర్ ధావ‌న్ , రోహిత్ శ‌ర్మ‌లు ప‌రుగుల వ‌ర‌ద పారించారు. కెప్టెన్ కోహ్లి, ధోనీ, పాండ్య‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే..బౌలింగ్‌లో బుమ్రా, భువి, చాహాల్ మెరిపించారు. దీంతో టార్గెట్ ఛేదించ‌లేక అప‌జ‌యాన్ని మూట‌గట్టుకుంది ఆస్ట్రేలియా. ఇండియా జ‌ట్టుకు ఇది రెండో విజ‌యం కాగా.స‌మిష్టిగా రాణిస్తే ఏ జ‌ట్టు అయినా ఇలాగే గెలుస్తుంద‌ని అనుకోవాలి. ఈసారి ఎలాగైనా ఇండియ‌న్ ఫ్యాన్స్ కు మ‌రిచిపోలేని రీతిలో ప్ర‌పంచ క‌ప్ తీసుకు రావాల‌న్న సంక‌ల్పంతో కెప్టెన్ కోహ్లి క‌ల‌లు కంటున్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తించే రీతిలో ఆడే కంగారు జ‌ట్టు భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు నానా తంటాలు ప‌డింది. ఇండియా 36 ప‌రుగుల తేడాతో ఓడించింది. శిఖ‌ర్ ధావ‌న్ 109 బ...

రోజా సెల్వ‌మ‌ణి ప‌ద‌విపై వీడ‌ని ఉత్కంఠ‌..?

చిత్రం
ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా పేరొందిన రోజా సెల్వ‌మ‌ణికి ఏపీ వైసీపీ సర్కార్‌లో చోటు ద‌క్క‌క పోవ‌డంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. కేబినెట్ లో ఎవ‌రెవ‌రు వుంటార‌నే కొద్ది స‌మ‌యానికి ముందు రోజా మాట్లాడుతూ త‌న‌కు ఏ ప‌ద‌వి ఇచ్చినా చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అంత‌గా అధినేత మీద న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఉన్న‌ట్టుండి 25 మంది జాబితాలో రోజా పేరు లేదు. వైసీపీ శ్రేణులు, సీనియ‌ర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. పార్టీలో మ‌హిళా నాయ‌కురాలిగా..అంత‌కంటే పార్టీకి వాయిస్‌గా ఉన్నారు. అధికార పార్టీని అడుగ‌డుగునా అడ్డుకున్నారు. మాట‌ల‌తో వాళ్ల‌కు చెక్ పెట్టారు. ఓ ర‌కంగా చెప్పాలంటే స్టేట్‌లో ఆమె ప్రాధాన్య‌త అంత‌కంత‌కూ పెరిగి పోయింది. మ‌రో వైపు అంబ‌టి రాంబాబు కూడా చోటు ద‌క్క‌లేదు.  చిత్తూరు జిల్లాలో జ‌న్మించిన రోజా. న‌టిగా రాణించారు. 150 సినిమాలకు పైగా న‌టించారు. 1991 నుండి 2002 దాకా సినిమా రంగంలోనే ఉన్నారు. 10 ఏళ్ల పాటు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం సినిమాల్లో న‌టించారు. ప‌లు అవార్డులతో పాటు పుర‌స్కారాలు అందుకున్నారు. న‌టిమ‌ణిగా, పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా, టీవీ ప్ర‌యోక్త‌గా ఆ...

తెలంగాణ‌లో తీన్మార్..టీఆర్ఎస్ జోర్దార్

చిత్రం
ఎవ‌రైనా ఓట‌మిని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకొంద‌రు నాయ‌కులు అస‌లు అప‌జ‌యాన్ని ఒప్పుకోరు. విజ‌యం సాధించే దాకా నిద్రపోరు. భార‌త‌దేశంలో అలాంటి కోవ‌కు చెందిన అగ్ర‌నేత‌ల్లో వేళ్ల మీద లెక్కించే వారు మాత్ర‌మే ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఒక‌రు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి నేడు రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యేంత దాకా..అడుగుల‌న్నీ గెలుపు వైపే. ఓట‌మి రుచించ‌దు. స‌క్సెస్‌లోని మ‌జాను కేసీఆర్ ఆస్వాదించినంత‌గా ఇంకెవ్వ‌రూ ఆస్వాదించ‌లేరు. ప‌క్కా ప్ర‌ణాళిక‌, పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశ‌నం చేయ‌డం. ద‌గ్గ‌రుండి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం. సీనియ‌ర్ల‌ను పుర‌మాయించ‌డం. కింది స్థాయి నుండి పై స్థాయి వ‌ర‌కు మానిటరింగ్ చేయ‌డం. డిజిట‌ల్ మీడియాతో పాటు సామాజిక మాధ్య‌మాల‌ను వాడుకోవ‌డం. ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఇంకే నేత‌కు తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో.  తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి మింగుడుప‌డ‌ని రీతిలో ఫ‌లితాలు వ‌చ్చాయి. ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామంటూనే..ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో రుచి చూపించాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోయ...

డిడిఎస్ మ‌హిళా రైతుల‌కు అరుదైన పుర‌స్కారం

చిత్రం
తెలంగాణ‌కు చెందిన మ‌హిళా రైతులు తమ శ‌క్తి సామ‌ర్థ్యాలు ఏమిటో ప్ర‌పంచానికి చాటి చెప్పారు. భూమిని న‌మ్ముకుంటే న‌ష్టం వుండ‌ద‌ని, ప‌ర్యావ‌ర‌ణం కోసం పాటు పడాల‌ని ద‌క్క‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీకి చెందిన స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా రైతులు పిలుపునిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండానే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో సాగు చేస్తున్నారు. మ‌నం మ‌రిచి పోయిన పాత కాలం నాటి గింజ‌ల‌న్నీ ఇక్క‌డ ల‌భిస్తాయి. తాజాగా యునైటెడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం ( యుఎన్‌డిపి) అంత‌ర్జాతీయ సంస్థ డిడీఎస్ కు చెందిన మ‌హిళా రైతులు మైస‌న‌గారి ర‌త్న‌మ్మ‌, బ్యాగ‌రి తుల్జ‌మ్మ‌, నాగ్వార్ సునంద‌మ్మ‌, ఎర్రోళ్ల క‌న‌క‌మ్మ‌, అంజ‌మ్మ‌, అనసూయల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈక్వెటార్ ప్రైజ్‌ను 2019 సంవ‌త్స‌రానికి ప్ర‌క‌టించింది. ఇది గ‌త కొన్నేళ్లుగా స‌తీష్ నేతృత్వంలో నిర్వ‌హిస్తున్న డీడీఎస్ సంస్థ‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించాలి. ఆయ‌న ఎన్నో ఏళ్లుగా దీనినే అంటిపెట్టుకుని వున్నారు. వ్య‌వ‌సాయం దండ‌గ కాద‌ని పండ‌గ‌ని నిరూపించారు. వాస్త‌వానికి మ‌నం ఎక్క‌డికి వెళ్లినా నీళ్లుండ‌వు. ఒక‌వేళ వుంటే అదే వ‌రి అవే జొన్న‌లు లేదంటే సాగుకు డ‌బ్బులుండ‌వ...

మోస్ట్ పాపుల‌ర్ బ్రాండ్‌గా రిల‌య‌న్స్ జియో

చిత్రం
ఇండియా అంటే క్రికెట్ ఎలాగా..ఇపుడు భార‌తీయ ఖ్యాతిని ఖండంత‌రాల‌లో వెలిగి పోయేలా చేసిన ఘ‌న‌త ముఖేష్ అంబానీ అండ్ టీందే. ఇండియ‌న్స్ కు ఏమీ చేత కాద‌ని విర్ర‌వీగుతున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది జియో. ప్ర‌పంచ టెలికాం రంగంలో ఇదో అద్భుత‌మైన రికార్డును స్వంతం చేసుకుంది. ప్రారంభించిన కొద్ది కాలంలోనే టెలికాం మార్కెట్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకుంది. ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ..ఇండియా అంత‌టా విస్త‌రించింది. త‌క్కువ ఖ‌ర్చుకే మొబైల్ ఉండాల‌ని, ప్ర‌తి సామాన్యుడి చేతిలో త‌న కంపెనీ లోగోతో పాటు ఫోన్ ఉండాల‌న్న త‌న తండ్రి అంబానీ క‌ల‌ల‌ను కొడుకు సాకారం చేశారు. ఇపుడు ఎక్క‌డ చూసినా..ఎక్క‌డికి వెళ్లినా జియో కంపెనీనే క‌నిపిస్తోంది. ఫోన్ల‌తో పాటు నెట్ క‌నెక్ష‌న్ , వాయిస్ కాల్స్, ఇలా ప్ర‌తి యాక్సెస‌రీని రూపొందించింది ఈ కంపెనీ. మొద‌ట్లో లైట్‌గా తీసుకున్నాయి ప్ర‌త్య‌ర్థి కంపెనీలు. ఇండియ‌న్ టెలికాం ఇండ‌స్ట్రీలో తిరుగులేని ఆధిక్య‌త‌ను క‌లిగి వున్న ఎయిర్ టెల్ కంపెనీకి చుక్క‌లు చూపించింది జియో. ఇప్ప‌టికే 5 కోట్ల మందికి పైగా జియోలో స‌భ్యులై పోయారు. ప్ర‌తి భార‌తీయుడు అ...