పోస్ట్‌లు

అంత‌టా ప‌వ‌నిజం..అదే అత‌డి డైన‌మిజం

చిత్రం
పార్టీ న‌డ‌పాలంటే పైస‌లు అక్క‌ర్లేదు. కావాల్సంద‌ల్లా ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం..ఇంత స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. ఆర‌డుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాట‌లతో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గ‌ల‌డు. చూపుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. ల‌క్ష‌లాది అడుగుల‌ను త‌న ఆశ‌య సాధ‌న కోసం..స‌మున్న‌త స‌మాజం కోసం న‌డిచేలా చేయ‌గ‌ల‌డు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్య‌క్తిత్వ ప‌రంగా అంత‌ర్ముఖుడైన ఈ ప‌వ‌ర్ స్టార్ గురించే ఇపుడంతా చ‌ర్చ‌. ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానులున్నారు. త‌మ‌కు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయ‌న‌కు ఉన్న అతి పెద్ద అస్సెట్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎవ్వ‌రిపైనా చేయ‌రు. కాక‌పోతే త‌న జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువ‌గా మాట్లాడ‌రు. కానీ మాట్లాడితే అవ‌త‌లి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాట‌తో శాసించ‌గ‌ల‌రు. న‌డిపించ‌గ‌ల‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ఏ రాజ‌కీయ పార్...

సివిల్స్‌లో మెరిసిన మ‌ట్టి బిడ్డ‌లు - స‌త్తా చాటిన ప‌ల్లె ప‌రిమ‌ళాలు - సివిల్స్ ట్రైనింగ్ హ‌బ్‌గా హైద‌రాబాద్

చిత్రం
దేశంలో అత్యుత్త‌మ‌మైన స‌ర్వీసుగా భావించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో పేదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తా చాటారు. తెలుగు వారు మ‌రోసారి మెరిశారు. జాతీయ స్థాయిలో యూనియ‌న్ స‌ర్వీస్ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని మిర్యాల‌గూడ‌కు చెందిన వ‌రుణ్ రెడ్డి ఏకంగా ఏడ‌వ ర్యాంకు సాధించి ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు. టాప్ ప‌రంగా 100 ర్యాంకుల‌ను ప్ర‌క‌టిస్తే అందులో తెలుగు వారు ఆరు మంది ఉండ‌డం విశేషం. గ్రామీణ నేప‌థ్యం నుండి వ‌చ్చిన వారే త‌మ స‌త్తా ఏమిటో ప్ర‌ద‌ర్శించారు. సివిల్ స‌ర్వీసెస్ లో అత్యుత్త‌మ‌మైన ఫ‌లితాలు ఇక్క‌డి వారే పొందుతున్నారు. సివిల్స్ కోచింగ్ సెంట‌ర్ల‌కు కేంద్రంగా హైద‌రాబాద్ మారింది. 2018లో నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌కు సంబంధించి సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో ఇంట‌ర్వ్యూలు చేప‌ట్టింది. ఫైన‌ల్ మెరిట్ లిస్టు ప్ర‌క‌టించింది. మొత్తంగా చూస్తే 759 మంది ఈ స‌ర్వీసుకు ఎంపిక చేసింది యుపీఎస్సీ. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 361 మంది, ఓబీసీ కేట‌గిరిలో 209 మంది, ఎస్సీ కేట‌గిరిలో 128 మంది, ఎస్టీ కేట‌గిరిలో ...

జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం - ప‌వర్ స్టార్

చిత్రం
త‌రాలు గ‌డిచినా ఇంకా ల‌క్షలాది ప్ర‌జ‌లు ఆక‌లితో ఉండ‌డం న‌న్ను బాధించింది. లెక్క‌లేనంత సంప‌ద‌..అపార‌మైన వ‌న‌రులు క‌లిగి ఉన్నా ఎందుక‌ని కొంద‌రి చేతుల్లోనే ఈ స‌మాజం బందీ అయింది. ఈ ప్రాంతంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కుంది. గౌర‌వ ప్ర‌దంగా జీవించే సౌలభ్యం ఉంది. ఎవ‌రితో పేచీ లేదు. ఇంకెవ్వ‌రితో గొడ‌వ‌లు లేవు. నా ముందున్న ఒకే ఒక్క ల‌క్ష్యం. అంత‌రాలు లేని స‌మాజం. దాని కోసం నా జీవితాన్ని అంకితం చేశా. కోట్లాది ఆస్తులున్నా నాకు సంతృప్తిని ఇవ్వ‌వు. కానీ ల‌క్ష‌లాది అభిమానుల ఆద‌ర‌ణే నాకు కొండంత అండ‌. అందుకే నాకు ప్ర‌జ‌లు అంటే ప్రాణం. వారు బాగుండాల‌ని ..త‌ల ఎత్తుకుని బ‌త‌కాల‌న్న స‌దాశ‌యంతో తుచ్ఛ‌మైన రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. న‌న్ను త‌క్కువ అంచ‌నా వేసిన వారే ఇపుడు నాతో క‌లిసి న‌డిచేందుకు వ‌స్తున్నారు. మార్పు అన్న‌ది త్వ‌ర‌గా రాదు..కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. అంద‌రు ఒక్క‌డే అన్నారు. గేలి చేశారు. వేధింపుల పాలు చేశారు. కేసులు న‌మోదు చేశారు. కానీ ఆ ఒక్క‌రే దేశానికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించారు. ఆంగ్లేయుల గుండెల్లో నిదుర పోయారు. అత‌నే మ‌హాత్మాగాంధీ. జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం. ఇదే నా ఆశ‌యం. ప్ర...

ప‌వ‌న్ ఎంట‌రైతే వార్ వ‌న్ సైడే

చిత్రం
కోట్లాది అభిమానుల‌ను క‌లిగిన కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఇపుడు దేశంలోనే సంచ‌ల‌నం రేపుతోంది. ఆహార్యంలోను..ఆలోచ‌నా విధానంలోను ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన వ్య‌క్తిగా ఈ ప‌వ‌ర్ స్టార్‌కు ఉన్న‌ది. అటు ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఈ హీరోకు లెక్క‌లేనంత ..లెక్కించ‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. చిటికె వేస్తే చాలు ఏ త్యాగానికి సిద్ధంగా ఉన్న బ‌లగం ఆయ‌న‌కు ఉన్న‌ది. స‌మ‌స్త ప్ర‌జ‌ల ప‌ట్ల అచంచ‌ల‌మైన న‌మ్మ‌కం..స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను న‌టుడి స్థాయి నుండి నాయ‌కుడిగా మారేందుకు దోహ‌ద ప‌డింది. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ స్థాయిలో ఉన్నా ప్ర‌తి ఒక్క‌రిని ఈ హీరో ఆప్యాయంగా పల‌క‌రిస్తారు. జ‌న సంక్షేమ‌మే ధ్యేయంగా.. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లే ఎజెండాగా దూసుకెళుతున్నారు. రేయింబ‌వ‌ళ్లు పేద‌ల‌కు ఏదో ఒక‌టి చేయాల‌న్న క‌సి..సంక‌ల్పం ఆయ‌న‌లోని మాన‌వ‌త్వ‌పు కోణాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క పోయినా త‌న అడుగులు మాత్రం ముందుకు క‌దులుతూనే ఉన్నాయి. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. ఆయ‌న‌ను త‌మ ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. స్వంత మ‌నిషిలాగా..త‌మ కుటుంబంలోని వ్య...

విధ్వంస‌క‌ర విన్యాసం..ర‌స్సెల్ సంచ‌ల‌నం - ఓట‌మి పాలైన కోహ్లి సేన

చిత్రం
కోల్‌క‌తా జ‌ట్టు ఏ ముహూర్తాన అండ్రూ ర‌స్సెల్‌ను వేలం పాట‌లో ప‌నిగ‌ట్టుకుని కొనుగోలు చేసిందో కానీ ప్ర‌తి మ్యాచ్‌లో ఏదో ఒక మ్యాజిక్‌తో గ‌ట్టెక్కిస్తున్నాడు. విజ‌య‌పు అంచుల‌కు చేరుస్తున్నాడు. బంతుల‌ను అల‌వోక‌గా ..రాకెట్ కంటే వేగంగా..తూటాల‌కంటే బ‌లంగా ప‌రుగులు సాధిస్తున్నాడు ఈ ఆఫ్రిక‌న్ ఆట‌గాడు. ఎక్క‌డా తొట్రుపాటు కానీ..ఆందోళ‌న‌కానీ చెంద‌కుండా..జ‌స్ట్ కూల్‌గా ఆడుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో టీ-20 మ్యాచ్ ఫార్మాట్‌ల‌లో ర‌స్సెల్ సిట్యూయేష‌న్‌కు త‌గ్గ‌ట్టు ఆడ‌టం లేదు. ఎంత టార్గెట్ ఉన్నా..జ‌ట్టు క్లిష్ట ప‌రిస్థితుల్లో ఎలాంటి అంచ‌నాలు లేని స‌మ‌యాల్లో ఆప‌ద్బాంధ‌వుడి అవ‌తారం ఎత్తుతున్నాడు. మైదానంలో ఒక్క‌సారి స్టిక్ అయిపోతే చాలు బంతుల్ని పెవీలియ‌న్ బాట ప‌ట్టిస్తున్నాడు. ఈ టోర్నీలో అండ్రూ సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా మారాడు. ఎవ‌రి బౌలింగ్‌లోనైనా బంతుల‌ను ఫోర్లు లేదా సిక్స‌ర్లు వ‌చ్చేలా చేస్తున్నాడు. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ర‌స్సెల్ వుంటే చాలు అనుకుంటోంది మేనేజ్‌మెంట్. ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ..మోస్ట్ వాంటెడ్ ప్లేయ‌ర్‌గా పాపుల‌ర్ అయిన విరాట్ కోహ్లి ప్రాతినిథ్యం వ‌హిస...

ఏపీ పీఠం ఎవ్వ‌రిదో - యుద్ధ రంగాన్ని త‌ల‌పిస్తున్న ప్ర‌చారం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం యుద్ధాన్ని త‌లపింప చేస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. స‌వాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ల‌తో చుట్టి వ‌స్తే..జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోడ్ షోలు ..స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని..ప‌వ‌ర్‌లోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న వైసీపీని ..బాబు, జ‌గ‌న్‌ల‌ను టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న వారు వైసీపీలోకు జంప్ అవ‌గా..వైసీపీలో ఉన్న మ‌రికొంద‌రు ప‌సుపు కండువా కప్పుకుంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఫ‌రూక్ అబ్దుల్లా, అర‌వింద్ కేజ్రీవాల్, మాయావ‌తి, మ‌మ‌తా బెన‌ర్జీలు చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా ఏపీలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేశారు. దేశాన్ని వందేళ్లు వెన‌క్కి తీసుకు వెళుతున్నారని, ప్ర‌భుత్వ రంగంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని..త‌న‌ను వ్య‌తిరేకించే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌...

పాల‌కుల పాపాలు..లెక్క‌లేన‌న్ని కోట్లు

చిత్రం
దేశానికి విముక్తి ల‌భించి 70 ఏళ్లు గ‌డిచినా అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న‌ది. ప్ర‌పంచంలో జ‌నాభా ప‌రంగా రెండ‌వ స్థానంలో ఉన్నా ..త‌రాలు గ‌డిచినా స‌గానికి పైగా జ‌నం ఆక‌లి కేక‌ల‌తో అల్లాడుతున్నారు. తాగేందుకు, సాగు చేసేందుకు నీళ్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ల‌క్ష‌లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా..నేటికీ భ‌ర్తీ చేయలేక పోయాయి. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక కాలం దేశాన్ని ఏలింది. జ‌న‌తా పార్టీ, యుపీఏ, ఎన్టీఏ సంకీర్ణ ప్ర‌భుత్వాలు పాలించినా పాల‌న‌లో మార్పు రాలేదు. పాల‌కులు కాసుల‌ను కొల్ల‌గొట్ట‌డంలో ముందంజ‌లో ఉన్నారు. లెక్క‌లేన‌న్ని స్కాంలు, ప్ర‌భుత్వ బ్యాంకులు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్య‌మై పోయాయి. బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. పాల‌కుల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన న్యాయ వ్య‌వ‌స్థ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఓటు బ్యాంకుగా మార్చ‌డంతో రాజ‌కీయ నాయ‌కుల ఆట‌లు సాగుతున్నాయి. ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప్ర‌తిసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవాల‌ని కోట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఎన్నిక‌లై పోయాక జ‌న...