పోస్ట్‌లు

గూగుల్ సెన్సేషనల్

చిత్రం
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మరోసారి జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎక్కువ శాతం గూగుల్ క్రియేట్ చేసిన క్రోమ్ ను వాడుతున్నారు. లక్షల్లో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏకంగా ప్రతి రోజు ట్రిలియన్స్ లలో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఐటీ కంపెనీ తాజాగా గూగుల్‌ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్‌ ను ప్రవేశ పెట్టింది. ఇక నుంచి గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ అందరికీ  అందుబాటులో రానుంది. ఈ రియల్‌ టైమ్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్‌ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతో హెల్ప్‌ ఫుల్‌గా ఉండ నుంది. ఈ ఏడాది కన్జుమర్‌ ఎలక్ట్రానిక్‌ షో లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ గురిం...

మదుపరులకు భలే లాభం

చిత్రం
భారతీయ మార్కెట్ లో మదుపరులకు భలే ఛాన్స్ దక్కనుంది. ఏ మేరకు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ను స్టార్ట్ చేసింది. కానీ కొద్దీ కాలం పాటే ఈ అవకాశం అందుబాటులో ఉండడం మాత్రం ఇబ్బందికరం. ఎలాంటి రిస్క్‌ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఈ ఇష్యూను పరిశీలించొచ్చు. దీని ద్వారా కనీసం  7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇండియాలో ఇదే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌   అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ డెట్‌ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్‌ ఈటీఎఫ్‌ను అందించడం. ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఈటీఎఫ్‌లు పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌   2023 - 2030 సూచీలను ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసింది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూ...

ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు

చిత్రం
తాను దమ్మున్న నాయకుడినని ప్రూవ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. గత కొన్నేళ్లుగా వెట్టి చాకిరీ చేస్తూ, ఉద్యోగ భద్రత అంటూ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు కొండంత భరోసా ఇచ్చారు. అంతే కాదు మీకందరికీ తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని వంద శాతం నెరవేర్చాడు. ఇక ఏపీఎస్ ఆర్టీసీ లో పని చేస్తున్న 52 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. జగన్ జగ మొండి..తాను మాట ఇచ్చాడంటే చాలు ఇక వెనుదిరిగి తీసుకోవడం అంటూ జరగదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళ్లడమే. ఏకంగా అసెంబ్లీలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి సభ సాక్షిగా ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఇక నుంచి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ. ఇందులో పని చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులే. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మీరంతా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం కావాలి. ఆర్టీసీని ఆదాయం గడించే సంస్థగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు....

కళ తప్పిన వజ్రాలు..కార్మికులకు కష్టాలు

చిత్రం
ప్రపంచంలో బంగారం, వెండి, వజ్రాలకు ఉన్న డిమాండ్ ఇంకే వస్తువులకు లేదు. దీంతో తళుక్కుమనే వజ్రాలు మెరవడం మానేశాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కళ తప్పాయి. వరల్డ్ డైమండ్ మార్కెట్ లో అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ హబ్ అయిన సూరత్‌ లో.. లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇండియన్ ఎకానమీలో ప్రధాన భూమిక పోషించే జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. డైమండ్ మొఘల్‌ గా పేరున్న నీరవ్‌ మోడీ 14 వేల కోట్ల స్కామ్ తర్వాత ఈ ఇండస్ట్రీ పూర్తిగా పడి పోయింది. ఇక అప్పుడు మొదలైన పతనం, స్లోడౌన్ ఎఫెక్ట్‌‌తో మరింత కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ మైనప్పటి నుంచి, తొలి ఏడు నెలల కాలంలో ఇండియాకు దిగుమతి అవుతోన్న ముడి సరుకు వజ్రాలు 22 శాతం వరకు తగ్గి పోయాయి. పాలిష్డ్‌‌  డైమండ్ ఎగుమతులు 18 శాతం వరకు తగ్గినట్టు జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డేటా పేర్కొంది. సూరత్‌లో జెమ్స్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న ఉద్యోగులు తగ్గి పోయారు. ప్రతిభా వంతులైన కళాకారులకూ ఆదాయాలు 70 శాతానికి పైగా తగ్గిపోయినట్టు లోకల్ ఇండస్ట్రీ ఛాంబర్స్ ప్రకటించాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీలో 50 లక్...

కార్ల లవర్స్ కు లక్కీ ఛాన్స్

చిత్రం
కార్ల ప్రేమికులకు భలే గిరాకీ ఉంటోంది. ఈ మేరకు కార్ల తయారీ కంపెనీలు బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మారుతి  బెస్ట్​ ఆఫర్ ఆఫ్ది ఇయర్ అంటుంటే, టాటా మోటర్స్ బెస్ట్ ఇన్​డికేడ్ , హ్యుండయ్ ఇండియా డిసెంబర్ డిలైట్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా ఇండియాలో అమ్ముడు పోకుండా పేరుకు పోయిన ఆయా కంపెనీలు తమ వాహనాలను ఎలాగైనా అమ్మేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే ఆర్ధిక మందగమనం మరింత కొనుగోలు శక్తిని ఖీణించేలా చేస్తోంది. ఇదిలా ఉండగా మిగిలిపోయిన స్టాకులను తొందరగా వదిలించు కునేందుకు ఈ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్ల రేంజ్ 5 శాతం నుంచి 15 శాతంగా ఉంటోంది. వచ్చే జనవరి నుంచి ధరలు మరింతగా పెంచనున్నట్లు ప్రధాన ఆటోమొబైల్‌‌ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, కార్లను కొనడానికి ఇదే మంచి టైమని పరిశ్రమ వర్గాలు ఊరిస్తున్నాయి. సుమారుగా మా బీఎస్​4 కార్లన్నింటిని అమ్మేశాం. కొన్ని మోడల్స్‌‌పై డిస్కౌంట్‌‌లు అధికంగా ఇస్తున్నాం. ఈ డిస్కౌంట్లు తక్కువ కాలమే ఉంటాయి. సేఫ్టీ, ఎమిషన్‌ నిబంధనలు, కరెన్సీ కదలిక వంటి అంశాల వలన వచ్చే జనవరి నుంచి ధరలు అధికంగా ఉంటాయి అని మారుతి సుజ...

పేటీఎం పంట పండింది

చిత్రం
డిజిటల్ చెల్లింపుల్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న పేటీఎం నిషుల సమీకరణలో సైతం తన హవాను కొనసాగిస్తోంది. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేరెంట్ వన్‌‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఏకంగా 4,724 కోట్ల నిధులు సేకరించింది. అలీ పే సింగపూర్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌‌వీఎఫ్‌‌ పాంథర్ లిమిటెడ్, టీ రో ప్రైస్ గ్రోత్ స్టాక్ ఫండ్ ఇంక్ వంటి వాటి నుంచి ఈ పెట్టుబడులు వచ్చినట్టు పేటీఎం పేర్కొంది. ఒక్కో షేరును 254.58 డాలర్ల రేటుతో 26 లక్షల ఈక్విటీ షేర్లను అలాట్‌‌ చేసేందుకు వన్‌‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవల ఆమోదం తెలిపారు. అలీపే సింగపూర్‌‌‌‌ ఈ కామర్స్ 1,433 కోట్లను, ఎస్‌‌వీఎఫ్‌‌ పాంథర్‌‌‌‌  1,430 కోట్లను, టీ రో ప్రైస్ గ్రోత్ స్టాక్ ఫండ్  704 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. గత నెలలోనూ పేటీఎం 100 కోట్ల డాలర్ల ఫండ్‌‌ను సేకరించింది. పాత ఇన్వెస్టర్లు ఆంట్‌‌ ఫైనాన్సియల్, సాఫ్ట్‌‌బ్యాంక్ విజన్ ఫండ్, కొత్త ఇన్వెస్టర్లు టీ రో ప్రైస్ అసోసియేట్స్ ఇంక్ వంటివి అప్పట్లో ఫండ్ ఇచ్చాయి. ఈ నిధుల సేకరణతో వన్ 97 కమ్యూనికేషన్స్ వాల్యుయేషన్ 16 బిలియన్ డాలర్లకు అంటే దాదా...

కార్గోపై కన్నేసిన ఆర్టీసీ

చిత్రం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే ప్రయాణీకులపై మోయలేని భారాన్ని మోపింది. తాజాగా సరుకు రవాణా చేసే పనిలో పెద్దది. పెద్ద మొత్తంలో సరుకు రవాణా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 1,209 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రతిపాదిస్తూ ఆర్టీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయం ఆలశ్యంగా వెలుగు చూసింది. కార్గో సేవలను మెరుగు పరిచేందుకు ఆసక్తి ఉన్న కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించేలా రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్లు.. డిపో మేనేజర్లకు సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసి ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపాలని సూచించారు. గుర్తించిన కండక్టర్లు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటర్వ్యూకు రావాలని కోరారు. ఈ వింగ్​లో నలుగురు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...