మీడియా రంగంలోకి పేటీఎం ఎంటర్ ..?

ఇండియాలో రిలయన్స్ ఎంతగా పాపులర్ అయ్యిందో పేటీఎం కూడా అంతగా ప్రచారం పొందింది. డిజిటల్ చెల్లింపుల్లో ఈ కంపెనీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. స్వాయంగా భారత ప్రధాన మంత్రి సైతం డిజిటల్ చెల్లింపుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు . డెమోనిటరైజేషన్ తర్వాత నగదు బదిలీకి యెనలేని ప్రాధాన్యత పెరిగింది. ప్రతి భారతీయుడు దీనిని వాడేందుకు మొగ్గు చూపిస్తూ ఉండటం కూడా డిజిటల్ చెల్లింపుల రంగం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే పేటీఎం తో పాటు రూపే , పే పల్, భీం , ఫోన్ పే , తేజ్ లతో పాటు ఇంటర్నెట్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన గూగుల్ కంపెనీ కూడా డిజిటల్ చెల్లింపుల్లోకి ఎంటర్ అయ్యింది. అది గూగుల్ పే గా ఏర్పాటు చేసింది.

ప్రతి రోజు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. ఒక్కో కంపెనీకి నగదు లావాదేవీలు జరపడంతో వేలాది రూపాయలు కమీషన్ రూపేణా ఆదాయం లభిస్తోంది. ఒక్కో కంపెనీ కోట్లకు పడగలు ఎత్తింది. ఇప్పటికే పేటీఎం ప్రాఫిట్ 750  కోట్లకు చేరుకుంది. ఒక్కో కంపెనీది ఒక్కో స్టైల్. రోజు రోజుకు దీని ఆదాయం పెరుగుతూ పోతోంది. దీంతో ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతోంది పేటీఎం . నెలవారీగా యాక్టివ్ యూజర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచేందుకు వచ్చే మర్చి నెలాఖరు వరకు భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేటీఎం ప్రకటించింది. ఇన్ బాక్స్ సర్వీస్ వల్ల కొత్తగా రెండు కోట్ల డెబ్భై లక్షల మంది యూజర్లు చేరారని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య ఏడు కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ సర్వీస్ ద్వారా కంటెంట్ సేవలను కూడా అందజేస్తామన్నారు. పేటీఎం కు ప్రస్తుతం 14 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. త్వరలోనే 300 కోట్ల లాగింగ్ సెషన్లు సాధిస్తామన్న నమ్మకం తమకుందని పేటీఎం యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే సదరు కంపెనీలో అలీబాబా , సాఫ్ట్ బ్యాంక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. యూజర్స్ ను ఆకర్షించేందుకు గాను త్వరలో న్యూస్ , షార్ట్ వీడియోస్ , లైవ్ టీవీ వంటి సేవలు వచ్చే ఏడాది నుంచి అంద జేసేందుకు పేటీఎం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం మీడియా రంగంలో పెను సంచలనం కలిగిస్తోంది. 

కామెంట్‌లు