ఆరోగ్యానికి బలం..తల్లి పాలు శ్రేయస్కరం
ఎల్లలంటూ ఎరుగరు. వాన కురిసినా..ఆకాశంలో నక్షత్రాలు మెరిసినా ..అవి తమ కోసమే అని ఆనందపడుతూ ..ఎలాంటి మాయా మర్మం ఎరుగని పిల్లలంటే ఎంతో ఇష్టపడతాం. ప్రేమిస్తాం. గుండెల్లో హత్తుకుంటాం. మానవ జీవితంలో అరుదైన సన్నివేశం బాల్యం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు సంతోషం వెళ్లి విరుస్తుంది. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కావాల్సింది తల్లి ప్రేమ ఒక్కటే కాదు..అంతకంటే పిల్లలకు పాలు ఇవ్వడం. గతంలో కొన్నేళ్ల పాటు పాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. ఇప్పుడది మారి పోయింది. తమ అందం ఎక్కడ చెడి పోతుందోనన్న ఆందోళనకు లోనవుతున్న తల్లులు పిల్లలను పట్టించు కోవడం లేదని , వైద్యులతో పాటు యుఎన్ఓ ఆవేదన వ్యక్తం చేసింది. పాలివ్వడం అనేది నేరం కాదని, అది బిడ్డకు తల్లికి మధ్య బంధం బాల పడేందుకు దోహదం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం బిడ్డ పుట్టాక ఆరు నెలలపాటు ఇస్తే బావుంటుందని పేర్కొంటున్నారు. ప్రపంచమంతటా తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి రోగాలు రావని, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని ప్రచారం చేయాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది సంస్థ. తల్లి పాలు ఇవ్వని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుత...