పోస్ట్‌లు

చనిపోయేంత కష్టాలకు లభించిన బహుమతి Tollywood | Prasanna Kumar Bezawada Wr...

చిత్రం

Successful Business చేయడానికి మీరు ఈ Struggles ను అధిగమించాలి | lakshm...

చిత్రం

అంత‌టా ప‌వ‌నిజం..అదే అత‌డి డైన‌మిజం

చిత్రం
  పార్టీ న‌డ‌పాలంటే పైస‌లు అక్క‌ర్లేదు. కావాల్సంద‌ల్లా ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం..ఇంత స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. ఆర‌డుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాట‌లతో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గ‌ల‌డు. చూపుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. ల‌క్ష‌లాది అడుగుల‌ను త‌న ఆశ‌య సాధ‌న కోసం..స‌మున్న‌త స‌మాజం కోసం న‌డిచేలా చేయ‌గ‌ల‌డు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్య‌క్తిత్వ ప‌రంగా అంత‌ర్ముఖుడైన ఈ ప‌వ‌ర్ స్టార్ గురించే ఇపుడంతా చ‌ర్చ‌. ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానులున్నారు. త‌మ‌కు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయ‌న‌కు ఉన్న అతి పెద్ద అస్సెట్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎవ్వ‌రిపైనా చేయ‌రు. కాక‌పోతే త‌న జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువ‌గా మాట్లాడ‌రు. కానీ మాట్లాడితే అవ‌త‌లి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాట‌తో శాసించ‌గ‌ల‌రు. న‌డిపించ‌గ‌ల‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ఏ రాజ‌కీయ పార్టీని, న...

మామూలుగా బతకలేమా ?

చిత్రం
  డబ్బులు పోగేసు కోవడం ..ధనవంతులుగా చెలామణి కావాలని అనుకోవడం మామూలే. సాఫ్ట్ వేర్ రంగం వచ్చాక అవకాశాలు అపారంగా పెరిగాయి . మీసాలు రాణి వాళ్ళు సైతం డాలర్లు సంపాదిస్తున్నారు . లెక్కలేనంత సొమ్ము చేసుకుంటున్నారు . నిత్యం డబ్బు మాయలో పడి కొట్టుకు చేస్తున్నారు . బంగ్లాలు ..భవంతులు ..కార్లు ..షికార్లు ..వస్తువులు ..స్టేటస్ సింబల్ గా మారాయి . ఆధునికత తెచ్చిన తంటా ఇది . వైన్ వాళ్ళు లేరు . చెప్పే వాళ్ళు ఉన్నా వారి గురించి మాట్లాడే సమయం ఉండటం లేదు . స్మార్ట్ ఫోన్లలో బతుకుతున్నారు..కానీ జీవించడం లేదు . ఒకరితో మరొకరు పోల్చుకోవడం తోనే కాలమంతా సరి పోతోంది . ఇక పక్క వాళ్ళతో మాట్లాడే ఓపిక ఎక్కడిది . కోట్లు వెనకేసుకున్నా..తరగని సంపద సమకూరినా కావాల్సింది మానసిక పరమైన సంతృప్తి. ఇదేదీ ఇప్పటి జనాలకు ఉండటం లేదు . అంతటా టెన్షన్ ..అంతులేని వత్తిడి . దీనిని తట్టుకోలేక ఇంకొన్ని వ్యసనాలకు బానిసై పోతున్నారు . బాంధవ్యాలు మరిచి ..వావి వరుసలు లేకుండానే సంబంధాలను కలిపేసుకుంటున్నారు . తల్లిదండ్రులంటే గౌరవం లేదు ..పెద్ద వాళ్ళు చెబితే చెవికెక్కదు . ఎంత సంపాదించినా కాపాడు కోవడం చేత కాదు. పొద్దున్న లేస్తే ..పడుకునే దాకా ...

నిన్నటి పోలేపల్లి ..నేటి నిజామాబాద్ కు ప్రేరణ

చిత్రం
  మట్టి ఎక్కడైనా మట్టే. కాకపోతే దానికి అందమైన ముసుగులు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో రైతుల నుండి తక్కువకు భూములు లాగేసుకోవడం . తిరిగి వాటిని ప్రభుత్వమే వేలానికి పెట్టడం . మార్కెట్లో బహిరంగంగా అమ్మేయడం . ఇక్కడ పాలకులకు ఎవరైతే దగ్గరగా ఉంటారో ..ఎవ్వరైతే పెట్టుబడులతో పాటు తాయిలాలు అందిస్తారో వారికే విలువైన భూములు దక్కుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం . ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి బతికే హక్కుతో పాటు భూమిని పొందటం కూడా ఓ హక్కే. కానీ రాను రాను భూమి కనిపించడం లేదు . కంపెనీలు ..ప్రమాదకరమైన పరిశ్రమలు ..వాటి చుట్టూ బడా బాబులు ..పాలకులు ..అధికారులు కాపలాగా ఉంటారు . పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి . లెక్కలేనన్ని వనరులు సమకూర్చి పెడుతున్నాయి . నీళ్లు, కరెంట్ ..అనుమతి ..అవసరమీయతే రాయితీలు ఇస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నాయి . తమకు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు వద్దంటూ అప్పట్లో పాలమూరు జిల్లా పోలేపల్లి గ్రామస్థులు అలుపెరుగని పోరాటం చేశారు . తమ నిరసనను ప్రకటించారు . దాదాపు తమ భూములు కోల్పోయిన భాదితులు 48 దాకా ప్రాణాలు...

అంతటా శ్రీమన్నారాయణ ..స్వామి కృప కోసం నిరీక్షణ

చిత్రం
  ఏపీలో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది . ఉద్యోగులు ..నిరుద్యోగులు తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు . భారీ ఎత్తున వేతనాలు ఉన్నా ఎక్కువగా అక్రమాలకు పాల్పడటం ..అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం ..అందులో రెవెన్యూ శాఖకే చెందిన ఉద్యోగులు ఉండడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖాను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు . ఈ విషయాన్ని లోక్ సభ ఎన్నికల సందర్బంగా తెలంగాణాలో జరిగిన సమావేశాల్లో స్పష్టం చేశారు . రెండు నెలలు ఓపిక పట్టండి ..నన్ను నమ్మండి ..అందరికి ఆమోదయోగ్యమైన కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తున్నామని వెల్లడించారు . ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు గాను ధరణిని రూపొందిస్తున్నామని చెప్పారు . ఎన్నికల సభ సందర్బంగా ఓ రైతు తాను ఎలా రెవెన్యూ అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సీఎం కు ఫిర్యాదు చేశారు . ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు . తాము లేకపోతే ప్రభుత్వం నడవదని..పరిపాలన అంతా తమ చేతుల్లో ఉంటుందని ..నిన్నటి దాకా అటు పాలకులకు ..ఇటు ప్రజలకు చుక్కలు చూపించిన రెవెన్యూ శాఖకు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్ ....

అవినీతికి అంతం ఎప్పుడు ..?

చిత్రం
  ఐటీ రంగంలో దేశంలోనే టాప్ రేంజ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు ఆన‌కొండ‌లా పేరుకు పోయిన అవినీతిని నిర్మూలించ‌లేక పోతోంది. ఏ శాఖ‌కు వెళ్లినా ఉద్యోగులు లంచాలు ఇవ్వ‌నిదే ..చేతులు త‌డ‌ప‌నిదే ప‌నులు చేయ‌డం లేదు. ఓ వైపు ఉద్యోగుల‌కు భారీ ఎత్తున వేత‌నాలు అంద‌జేస్తున్నా ..లంచావ‌తారాలు మాత్రం మార‌డం లేదు. పూర్తి స్థాయిలో అవినీతి నిరోధ‌క శాఖ దాడులు చేస్తున్నా , నేరుగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేసినా ఆయా శాఖ‌ల సిబ్బందిలో ఎలాంటి బెదురు క‌నిపించ‌డం లేదు. ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ..క‌ట్ చేసి మ‌ళ్లీ బాజాప్తాగా డ‌బ్బులు ఇవ్వాల్సందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి వ‌చ్చాక ఎవ‌రైనా త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌క పోతే నేరుగా ఫోన్ చేయొచ్చంటూ ఓ నెంబ‌ర్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుండి లెక్క‌కు మించి ఫోన్లు వెళ్లాయి. ఎక్కువ‌గా రెవిన్యూ, మున్సిప‌ల్ , ఎక్సైజ్ , త‌దిత‌ర శాఖ‌ల‌పైనే బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకంగా అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన రెవిన్యూ శాఖ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తే కానీ దారికి రార‌న్న సంగ...